రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్సైట్ను హ్యాక్ చేసినట్టు విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సీఐడీ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ప్రభుత్వ వెబ్ పోర్టల్ను బ్లాక్ చేసి కృత్రిమంగా ఇసుక కొరత సృష్టిస్తున్నట్లు బ్లూ ఫ్రాగ్పై గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి.