ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. షిర్డీ ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.