ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు పసిడి పతకం అందించిన పదహారేళ్ల షూటర్ మను భాకర్కు అవమానం జరిగింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రదర్శనతో పిన్న వయసులోనే స్వర్ణం సాధించిన ఆమెకు సొంతూరిలోనే ఈ చేదు అనుభవం ఎదురైంది. ఛార్కీ దాద్రీ పట్టణంలో ఫోగట్ కాప్ పంచాయతీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్వాహకులు పూలమాలలతో ఆమెను సత్కరించిన అనంతరం భాకర్ వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నారు. అయితే కొంత మంది వీవీఐపీలు రావడంతో ఆమె తన కుర్చీలో నుంచి లేవాల్సి వచ్చింది.