మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూత | Former Union minister George Fernandes dies at 88 | Sakshi
Sakshi News home page

మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూత

Jan 29 2019 10:37 AM | Updated on Mar 22 2024 11:23 AM

మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆయన స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఫెర్నాండెజ్‌ మంచానికే పరిమితమయ్యారు. 1930 జూన్‌ 3న మంగుళూరులో జన్మించిన జార్జి మ్యాథ్యూ ఫెర్నాండెజ్‌ 1967లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణ మంత్రిగా పనిచేసిన ఫెర్నాండెజ్‌ సమాచార శాఖ, రైల్వే, పరిశ్రమలు వంటి పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement