టీచర్ మందలింపు నలుగురు విద్యార్థినుల ప్రాణం తీసింది. మార్కులు తక్కువ వచ్చాయని వారి తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకురావాలని ఆ విద్యార్థినులను ఇంటికి పంపారు. ఈ విషయం కన్నవారికి చెప్పలేక టీచర్ పోరు పడలేక భయంతో ఆ విద్యార్థినులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తమ బిడ్డలు పాఠశాలకు వెళ్లారనుకున్న ఆ తల్లిదండ్రులకు శోకం మిగిల్చారు. ఈ విషాద ఘటన అరక్కోణంలో చోటుచేసుకుంది.