గత కొన్ని రోజులుగా రిసార్టుల్లోనే ఉంటున్న కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. కాగా, బలపరీక్ష నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ అయ్యారు.