Karnataka Assembly Elections
-
బీజేపీ డబుల్ ఇంజిన్ పై ఏపీ కాంగ్రెస్ పీసీసీ రుద్రరాజు కీలక వ్యాఖ్యలు
-
గెలిచే వరకు పోరాడత.. కర్ణాటక ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న స్వతంత్ర అభ్యర్థి
-
కర్ణాటకలో వచ్చినట్టే తెలంగాణాలో కూడా అధికారంలోకి వస్తాం
-
మేము తగ్గాము అంతే... ఓడిపోలేదు 28 ఎంపీ సీట్లు మావే
-
BJP ఓడిపోవడానికి, కాంగ్రెస్ గెలవడానికి కారణం అదే... నరేంద్ర మోదీ డూప్లికేట్ హిందూ
-
సొంతబలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం...
-
మాట్లాడుతూ ఏడ్చేసిన DK శివకుమార్
-
ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధం-కాంగ్రెస్
ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధం-కాంగ్రెస్ -
కన్నడ ఫలితాలపై కేఎస్ఆర్ కామెంట్
-
కన్నడ ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్, బీజేపీలో నిరాశ
-
లక్ అంటే బీజేపీ అభ్యర్థి రామ్మూర్తిదే..! 16 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపు..
ఎన్నికల్లో ఓట్లే ప్రధానం. ఒక్క ఓటు విజయాన్ని నిర్ణయిస్తుంది. రెండు ఓట్ల మెజారిటీ వచ్చినా, రెండు లక్షలు వచ్చినా విజేతలందరూ వెళ్లేది అసెంబ్లీకే. కానీ మెజారిటీ అనేది నియోజకవర్గంలో ఆ నాయకునికి ఉన్న పట్టుకు పలుకుబడికి నిదర్శనం. ఈ ఎన్నికల్లో కొందరు భారీ మెజారిటీతో గెలిస్తే, కొందరు మాత్రం ఏదో గెలిచామన్నట్లు ఎన్నికయ్యారు. బనశంకరి: ఈ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో జెండా ఎగరేయగా, బీజేపీ ప్రతిపక్షంగా అవతరించింది. ఎన్నికల్లో రాష్ట్రంలో 10 మంది అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో ఎన్నిక కాగా, 8 మంది బొటాబొటీ ఆధిక్యంతో గెలిచినట్లయింది. మెజారిటీ వీరులు వీరే ► కనకపుర నియోజకవర్గంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే అత్యధికం. ► చిక్కోడి సదలగా క్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరి 77,749 ఓట్ల మెజారిటీతో విజయం. ► అథణిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ సవది 75,673 ఓట్లతో గెలుపు. ► బెంగళూరు పులకేశినగరలో కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ శ్రీనివాస్కు 62,062 ఓట్ల మెజారిటీ ► కొళ్లేగాలలో కాంగ్రెస్ అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తికి 59,519 ఓట్ల ఆధిక్యం. యమకనమరడిలో కాంగ్రేస్ అభ్యర్థి సతీశ్ జార్కిహొళికి 57,046 ఓట్లు, బెంగళూరు సర్వజ్ఞనగరలో కాంగ్రెస్ అభ్యర్థి కేజే.జార్జ్ 55,768 మెజారిటీ దక్కింది. ► బెళగావి రూరల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ హెబ్బాళ్కర్కి 55,546 ఓట్ల మెజారిటీ. బెంగళూరులో పద్మనాభనగరలో బీజేపీ అభ్యర్థి ఆర్.అశోక్ 55175 ఓట్ల మెజారిటీ. బసవనగుడిలో బీజేపీ అభ్యర్థి రవి సుబ్రమణ్యకు 54978 ఓట్ల ఆధిక్యం. అత్యల్ప ఆధిక్యంతో ఎన్నిక ≈ బెంగళూరు జయనగర నుంచి బీజేపీ అభ్యర్థి సీకే.రామ్మూర్తి 16 ఓట్ల అత్యంత స్వల్ప మెజారిటీతో ఎన్నికయ్యారు. అలాగే గాంధీనగరలో కాంగ్రెస్ అభ్యర్థి దినేశ్ గుండూరావ్కు వచ్చిన మెజారిటీ 105 ఓట్లు ≈ శృంగేరిలో కాంగ్రెస్ అభ్యర్థి టీడీ రాజేగౌడ ఆధిక్యం 201 ఓట్లు ≈ మాలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేవై నంజేగౌడ ఆధిక్యం 218 ఓట్లు ≈ కుమటాలో బీజేపీ అభ్యర్థి దినకరశెట్టి ఆధిక్యం 673 ఓట్లు ≈ మూడిగెరెలో కాంగ్రెస్ అభ్యర్థిని నయన మోటమ్మ 772 ఓట్ల మెజారిటీతో గెలుపు ≈ చించోళిలో బీజేపీ అభ్యర్థి అవినాశ్ జాదవ్ మెజారిటీ 858 ఓట్లు కాగా, జగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్రప్ప 874 ఓట్లతో గెలిచారు. -
అదే తీరు.. అదే తకరారు!
దక్షిణాదిన కీలక రాష్ట్రం కర్ణాటక బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతిలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో మాత్రం ఇక్కట్లు ఎదుర్కొంటోంది. సీఎం కుర్చీ కోసం ఇద్దరు హేమాహేమీలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఈ పరిణామం చివరకు ఎటు దారి తీస్తుందో తెలియక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో నెగ్గడం కంటే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడమే పెద్ద సవాలుగా మారడం గమనార్హం. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్లో ఇలాంటి విపత్కర పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. సుదీర్ఘ కసరత్తు తర్వాత సీఎంను నియమించినప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో లుకలుకలు కొనసాగడం, అసంతృప్త సెగలు రగలడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రత్యేకత. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటే కాంగ్రెస్కు గ్రహపాటుగా మారుతోంది. సీఎంలను ఎంపిక చేయడంలో తప్పటడుగులు వేయడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరి కావడం ఆ పార్టీలో ఒక ఆనవాయితీగా మారింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అని సరిపెట్టుకోవాలేమో! అశోక్ గహ్లోత్ వర్సెస్ పైలట్ రాజస్తాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. పీసీసీ చీఫ్, యువ నాయకుడు సచిన్ పైలట్ సీఎం పోస్టు ఆశించారు. తన నాయకత్వంలోనే పార్టీ గెలిచినందున పదవి తనకే దక్కుతుందని భావించారు. కానీ సోనియా కుటుంబం మరోలా ఆలోచించింది. కారణాలేమైనా సీనియర్ నేత అశోక్ గహ్లోత్ను సీఎం చేసింది. దాంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది. పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. 2021లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం ప్రయత్నించారు. సమస్య పరిష్కారానికి 2022లో గహ్లోత్ను ఏఐసీసీ అధ్యక్షుడిగా, పైలట్ను సీఎంగా నియమించేందుకు పార్టీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ కుర్చీ వీడేందుకు గహ్లోత్ అంగీకరించలేదు. ఈ విషయమై పెద్ద హైడ్రామానే నడిచింది. చివరికి అధిష్టానమే దిగిరాక తప్పలేదు. పైలట్కు సీఎం కుర్చీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. రాజస్తాన్లో గహ్లోత్ సర్కారుపై పైలట్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండు వర్గాల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదు. అధిష్టానం కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. పంజాబ్లో పరాభవం పంజాబ్లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు కాంగ్రెస్ కొంప ముంచాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సిద్ధూ సీఎం పదవిని కోరుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అధిష్టానం దళిత కార్డు ప్రయోగించింది. చరణ్జిత్ సింగ్ చన్నీని సీఎంగా గద్దెనెక్కించింది. అమరీందర్ సింగ్ సొంత దారి చూసుకున్నారు. ఎన్నికల్లో సిద్ధూ వర్గం సహాయ నిరాకరణ చేసింది. ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం దక్కింది. ఎందుకు ఈ పరిస్థితి? అధికార బీజేపీలో మోదీయే ఏకైక పవర్ సెంటర్. పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. ఎవరిని సీఎంగా నియమించాలన్నా మోదీదే తుది నిర్ణయం. కాంగ్రెస్లో అలా కాదు. సోనియా, రాహుల్, ప్రియాంక రూపంలో మూడు పవర్ సెంటర్లున్నాయంటారు. డీకే శివకుమార్కు సోనియా అండదండలుంటే ప్రియాంక మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గుతుంటే రాహుల్ సైతం ఆమెను సమర్దిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ‘‘రాష్ట్రాల్లో ఎవరో ఒక్కరే శక్తివంతులుగా పెత్తనం చెలాయించడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టముండదు. అభద్రతాభావమే ఇందుకు కారణం. అందుకే పలు పవర్ సెంటర్లను ప్రోత్సహిస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అస్సాం చేజారింది ఈశాన్య భారతదేశంలో కీలక రాష్ట్రం అస్సాం. ఈ రాష్ట్రం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. రాహుల్ గాంధీ వ్యవహార శైలి పట్ల విసుగెత్తిపోయిన హిమంత బిశ్వ శర్మ 2015లో బీజేపీలో చేరారు. తర్వాత ఎన్నికల్లో నెగ్గి ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. అస్సాం బీజేపీ ఖాతాలో చేరింది. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం గాలిలో దీపమే. ఛత్తీస్గఢ్లోనూ... ఛత్తీస్గఢ్లో సైతం కాంగ్రెస్ పరిస్థితి గొప్పగా లేదు. పార్టీలో గ్రూప్లు భగ్గుమంటున్నాయి. తనను ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలపై, సీఎం భూపేష్ భగేల్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మధ్యప్రదేశ్ను వదిలేసుకున్నారు మధ్యప్రదేశ్లోనూ చేతికందిన అధికారం కాంగ్రెస్ తప్పిదంతో చేజారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవి డిమాండ్ చేశారు. సోనియా కుటుంబం కమల్నాథ్ వైపు మొగ్గింది. దాంతో సింధియా 2020లో తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. మెజార్టీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒప్పందంలో భాగంగా జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్కు మిగిలింది గుండు సున్నా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అభివృద్ధి, అభ్యర్థులకే కన్నడ ఓటరు పట్టం
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ గా అవతరించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ శనివారం వెలువడిన ఫలితాలను లోతుగా విశ్లేషిస్తోంది. బీజేపీ ఘోర పరాజయం, కాంగ్రెస్ గెలుపు, భావసారూప్య పార్టీ జేడీఎస్ కొన్ని సీట్లకే పరిమితం కావడం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు, పార్టీలు, అభ్యర్థుల పనితీరు, ఓటర్ల స్పందన వంటి అంశాలపై అధ్యయనం చేస్తోంది. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో అనుసరించే ఎన్నికల వ్యూహం, వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ప్రతివ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ లు, ఎజెండాల కంటే అవినీతి, అభివృద్ధి, అభ్యర్థుల గుణగణాలకే కర్ణాటక ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మసకబారిన మోదీ, షా ప్రాభవం... జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉందని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్... కర్ణాటక ఎన్నికలను కూడా అదే కోణంలో విశ్లేషిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాభవం తగ్గిందనేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిదర్శనమని భావిస్తోంది. కేంద్రంతోపాటు బీజేపీపాలిత రాష్ట్రాల్లో పాలనా వైఫల్యాలు, అవినీతి, బంధుప్రీతి వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా పనిచేసినట్లు బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. బీజేపీ అమలు చేస్తున్న విద్వేష ఎజెండాను కర్ణాటక ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణలోనూ అదే ఎజెండాను తెరపైకి తెచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. బీజేపీ ఎజెండాను గట్టిగా ఎదుర్కొనేందుకు కర్ణాటక ఎన్నికలను ఉదాహరణగా చూపడం ద్వారా దీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వర్గాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ చేసే ప్రయత్నాలకు కర్ణాటక ఫలితాలు కొంతమేర అడ్డుకట్ట వేయగలుగుతాయని బీఆర్ఎస్ భావిస్తోంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే బీజేపీ ప్రభావం కొంత ఉందని అంచనా వేస్తున్న బీఆర్ఎస్... ప్రతిదాడిని పెంచాలని నిర్ణయించింది. కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు వ్యూహం కర్ణాటక ఫలితాల ఉత్సాహంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ దూకుడు పెంచుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారిస్తే అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్ ఇప్పటికే ఓ కార్యాచరణతో సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను అనువుగా మలుచుకున్న కాంగ్రెస్... తెలంగాణలోనూ అదే తరహా వ్యూహాలను అమలు చేసే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ కాంగ్రెస్ దూకుడు పెంచే అవకాశాలున్నందున పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో మరింత వేడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అలాగే భావసారూప్య పార్టీ జేడీఎస్ కర్ణాటక ఎన్నికల్లో సాధించిన ఫలితాలను కూడా బీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. కర్నాటకలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఓటర్లు కోరుకోవడం కూడా జేడీఎస్పై ప్రభావం చూపినట్లు లెక్కలు వేస్తోంది. -
డిసెంబర్లోనే అసెంబ్లీ పోరు.. కర్ణాటక ఫలితాలపై బీఆర్ఎస్లో ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: శనివారం వెలువడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అప్పుడే వేడి పెంచేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడిన కర్ణాటకలో.. కాంగ్రెస్ స్వల్పంగా పైచేయి సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం, అదేమీకాదు బీజేపీ మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాలూ వినిపించడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో కర్ణాటక ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగడంతో.. అక్కడ రాబోయే ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలలో ఏది గెలిచినా.. తెలంగాణలో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయన్న దానిపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అనువుగా ఎలా మలుచుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేయడంపైనా దృష్టి సారించినట్టు తెలిసింది. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన పలు విధానాలు, వ్యవహరించిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బలమున్న బీజేపీ.. ప్రధానంగా హైదరాబాద్ నగరం, శివారు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత బలంగా ఉందని అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా.. కాంగ్రెస్ పార్టీయే ప్రధాన పోటీదారుగా ఉంటుందని బీఆర్ఎస్ సంస్థాగత నివేదికల ఆధారంగా భావిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చి నా.. మేజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చి నా... అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలో దూకుడు పెంచుతుందని అభిప్రాయపడుతోంది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుంటే.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్తోనే ప్రధాన పోటీ.. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉన్నట్టు ఆత్మీయ సమ్మేళనాలకు ఇన్చార్జులుగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్కు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సాధించే ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్కు ఉన్న ఓటు బ్యాంకు ఒక ఏడు శాతం తగ్గితే.. తాము గెలుపు కోసం శ్రమించాల్సి వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. హుజూరాబాద్ తరహాలో గ్రేటర్ పరిధిలో కాంగ్రె స్ నామమాత్ర పోటీకి పరిమితమైతే ఇబ్బంది త ప్పవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశము న్న వర్గాలపై ఫోకస్ పెట్టి.. బీఆర్ఎస్ వైపు తిప్పు కొనేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. -
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్.. కోటి ఆశల్లో కాంగ్రెస్! అక్కడ గెలిస్తే.. ఇక్కడ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో నాలుగైదు నెలలే ఉంది. ఇలాంటి సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే.. రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త బలం వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్లలోకి పార్టీ నుంచి వలసలు తగ్గుతాయి. అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది’’.. రాష్ట్ర కాంగ్రెస్లో వ్యక్తమవుతున్న అభిప్రాయమిది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చనే రాజకీయ అంచనాల నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో ఆ పార్టీలో హుషారు కన్పిస్తోంది. బీజేపీని నిలువరించడం సులువు! రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ నేతలు అంటున్నా.. బీజేపీ పుంజుకుంటున్న తీరు వారిని కలవరపెడుతూనే ఉంది. బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ నుంచి అడపాదడపా బీజేపీలోకి వలసలు జరుగుతుండటం, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైనే దృష్టి సారించనుందనే సంకేతాలు వస్తుండటం.. కాంగ్రెస్లో ఆందోళన పెంచుతోంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. ఈ ఆందోళనకు చెక్పడుతుందని, ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితులు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు కొత్త ఊపు వస్తుందని, అది తెలంగాణలోనూ టానిక్లా పనిచేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి బ్రేక్ పడుతుందని, వలసలు ఆగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్కు దీటుగా నిలిచేలా.. కర్ణాటకలో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పరాజయాలు, రోజురోజుకూ క్షీణించిపోతున్న పార్టీగా ముద్ర పడుతున్న నేపథ్యంలో.. కర్ణాటక గెలుపు ఆ అభిప్రాయాన్ని తొలగిస్తుందని అంటున్నారు. ఈ ఊపుతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎన్నికలను ఎదుర్కొనే ధీమా వస్తుందని వివరిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ఎంచుకున్నట్టే.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్వైపు చూస్తారని అంటున్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎగ్జిట్పోల్స్కు భిన్నంగా కర్ణాటకలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్కు గడ్డుకాలమేనని, మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అంటున్నారు. ‘‘కర్ణాటకలో మేం గెలిస్తే ధైర్యంగా తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొంటాం. అలా కాకుండా కర్ణాటకలో ఓటమి ఎదురయితే ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. దూకుడుగా ఎన్నికలకు వెళ్లకపోతే ఇక్కడా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. అయినా కర్ణాటకలో గెలుస్తామని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకుంది’’అని టీపీసీసీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
అక్కడా, ఇక్కడా మాదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయంటున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కన్నడ ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై బీజేపీలో ఉత్కంఠ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గద్దెనెక్కని సాంప్రదాయం, ఎగ్జిట్పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గడం వంటి అంశాల నేపథ్యంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయినా కర్ణాటకలో బీజేపీ విజయఢంకా మోగించడం తథ్యమని కమల నాథులు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని అంటున్నారు. కర్ణాటకలో గెలిస్తే.. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు, తెలంగాణలో కాషాయజెండా ఎగురవేసేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు. ఎగ్జిట్ పోల్స్తో అంతర్మథనం.. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్పోల్ అంచనాల్లో ఒకట్రెండు మినహా దాదాపు అన్నీ కాంగ్రెస్కు ఆధిక్యం వస్తుందనే పేర్కొన్నాయి. ఇది బీజేపీ వర్గాల్లో కొంత అంతర్మథనానికి దారితీసినా.. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై రాష్ట్ర నేతలు మాత్రం పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎగ్జిట్పోల్స్ అంచనాలు తప్పుతాయని, బీజేపీయే అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. ఇక కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలతోపాటు ఇతర చోట్ల కూడా తెలంగాణ ముఖ్యనేతలు పలువురు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఇతర నేతలు దాదాపు నెలరోజుల పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి తదితరులు మూడు, నాలుగు రోజులపాటు వివిధ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సమన్వయ, ప్రచార బాధ్యతలు నిర్వహించిన చోట్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. మేం పీపుల్ పోల్స్ నమ్ముకున్నాం: కె.లక్ష్మణ్ తాము ఎగ్జిట్ పోల్స్ను తప్పుబట్టడం లేదని, అవి ఎలా ఉన్నా తాము పీపుల్ పోల్స్ను నమ్ముకున్నామని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగ్జిట్పోల్స్ అధికశాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది కదా అన్న మీడియా ప్రశ్నలపై స్పందించారు. కర్ణాటకలో తాను నెలరోజుల పాటు ఉన్నానని, బళ్లారి జిల్లా ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. యడ్యూరప్ప, బసవరాజు బొమ్మై ప్రభుత్వాలు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్ణాటకకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ‘మోదీ ఫాక్టర్’అనేది కచ్చి తంగా ప్రభావం చూపుతుందని తెలిపారు. సామాజిక న్యాయ సాధన దిశలో ఎస్సీ, ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ల పెంపు, అదనంగా లింగాయత్లు, ఒక్కలిగలకు రెండేసి శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలు వంటివి ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కచ్చి తంగా తిరిగి అధికారానికి రావడం ఖాయమన్నారు. -
స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు...
-
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో BJP అనుకూల మరియు ప్రతికూల పాయింట్లు
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత
-
వీడియో: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
-
ఓటు హక్కును వినియోగించుకున్న హెచ్ డీ కుమార స్వామి
-
వీడియో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లైవ్
-
ఫస్ట్ సెమీఫైనల్ గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
-
ఇక నుంచి మీ కలే నా కల
బెంగళూరు: తమ ఓటు ద్వారా భవిష్యత్తు ప్రభుత్వాన్ని కొలువు తీర్చేందుకు సమాయత్తమవుతున్న కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న తన పట్ల ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు అనుపమానమైనవని ఆయన అభివర్ణించారు. లేఖలోని విషయాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్చేస్తూ ట్వీట్లు చేశారు. ‘ కర్ణాటకలోని సోదరసోదరీమణులకు నమస్కారం. రాష్ట్రంలో ప్రచారం వేళ నాపై మీరు చూపిన ఆదరాభిమానాలు సాటిలేనివి. అన్ని రంగాల్లో కర్ణాటకను అగ్రస్థానంలో నిలపాలన్న నా సంకల్పానికి మీ ప్రేమానురాగాలు మరింత శక్తిని అందించాయి. దేశంలో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చే యజ్ఞంలో మీ ఆశీస్సులు నాకు కావాలి. రాష్ట్ర ఉజ్వల భవిత గురించే నా విజ్ఞప్తి. మీ కుటుంబాలు, ముఖ్యంగా యువత భవిష్యత్తు గురించే నా విన్నపం. కన్నడనాట ఈసారి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రావాలి అనే నినాదాలు ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి’ అని పేర్కొన్నారు. నేడు 90 వేల కోట్లు.. నాడు 30 వేల కోట్లే.. ‘‘నేడు మనం అమృతకాలంలో పయనిస్తున్నాం. ‘ఆజాదీ కా అమృత్ కాల్’లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమాన్ని కర్ణాటక ముందుండి నడిపించి ఈ కలకు నిజం చేయాలి. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇకపై మూడో స్థానమే మన లక్ష్యం. ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా కర్ణాటక ఎదిగినప్పుడే ఇది సాధ్యం. ఇక్కడ బీజేపీ హయంలో ఏటా రూ.99వేల కోట్ల విదేశీ పెట్టుబడులొచ్చాయి. గత సర్కార్ల కాలంలో ఇవి కేవలం రూ.30వేల కోట్లే. అత్యంత అనువైన జీవనం, వ్యాపార అనువైన రాష్ట్రంగా కర్ణాటక నంబర్వన్ స్థానంలో నిలిచేలా డబుల్ ఇంజన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. జగత్జ్యోతి బసవేశ్వర, కెంపెగౌడ, శ్రీ కనకదాస వంటి మహానుభావులు చూపిన మార్గంలో నడుస్తూ అభినవ కర్ణాటకను నిర్మించే మహాక్రతువులో బీజేపీ నిమగ్నమైంది. ఇకపై మీ కల నా కల. మీ సంకల్పాన్ని నాదిగా భావిస్తున్నా. ఆలోచనలు కలిసి నిర్దేశించుకున్న మన ఉమ్మడి లక్ష్య సాధనను ప్రపంచంలో మరెవరూ ఆపలేరు’’ అని లేఖలో మోదీ పేర్కొన్నారు. -
నువ్వా-నేనా! రాహుల్ అలా.. మోదీ ఇలా.. ప్రచారంలో ఎవరికి వారే భిన్న శైలి
ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రధాని మోదీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పోస్టర్ బోయ్స్గా మారారు. ఇతర నేతలూ రంగంలో నిలిచి ముమ్మరంగా కలియదిరిగినా మొత్తం భారాన్ని దాదాపుగా వారిద్దరే తమ భుజస్కంధాలపైనే మోశారు. తమ పార్టీల జయాపజయాలకు ప్రధానంగా వారే బాధ్యులు కానున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ మోదీ ఇలా... కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఎన్నికల ప్రచారం భిన్న శైలిలో సాగింది. ముఖ్యంగా రాజధాని బెంగళూరులో ఓటర్లను ఆకర్షించడానికి వారు చెరో మార్గం అనుసరించారు. బీజేపీ, కాంగ్రెస్లకు చావోరేవోగా మారిన ఈ ఎన్నికల్లో ప్రచార గడువు ముగియడానికి మూడు రోజుల ముందు నుంచి వారిద్దరూ రాజధానిపై ప్రధానంగా దృష్టి సారించారు. శని, ఆదివారాల్లో అట్టహాసంగా మోదీ 30 కిలోమీటర్లకు పైగా భారీ రోడ్ షోలు నిర్వహిస్తే, రాహుల్ మాత్రం సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోతూ ప్రచారం చేశారు. మోదీ జేపీ నగర్ నుంచి మల్లేశ్వరం వరకు 26 కి.మీ. పొడవునా, న్యూ తిప్పసంద్ర రోడ్డు నుంచి ట్రినిటి సర్కిల్ దాకా 6.5 కి.మీ. మే చేసిన రోడ్ షోలకు జనం పోటెత్తారు. దారి పొడవునా ఆయనపై పూల వర్షం కురిపించారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ప్రయోజనాలు, బజరంగ్ దళ్ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎండగడుతూ బెంగళూరులో మోదీ ప్రసంగాలు సాగాయి. రాహుల్ అలా... రాహుల్ మాత్రం ఆది, సోమవారాల్లో రాజధాని జనంలో కలిసిపోయి ప్రచారం చేశారు. ఫుడ్ డెలివరీ బోయ్తో పాటు అతని మోటార్ సైకిల్పై ప్రయాణించారు. డెలివరీ యాప్ల బాయ్స్తో మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. దారిన పోయేవారిని పలకరిస్తూ సాగారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి వాటిపై చర్చించారు. సోమవారం కాఫీ డేలో కాఫీ తాగుతూ సందడి చేశారు. బస్టాప్లో ఉన్న వారితో మాట్లాడారు. బస్సెక్కి ప్రయాణికులతో మాటలు కలిపారు. బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇమేజ్నే పెట్టుబడిగా పెట్టి ఎన్నికల్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. రాహులేమో పెరిగిపోతున్న ధరలనే అస్త్రంగా చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. కర్ణాటకలో బీజేపీ ప్రచారం 6 రోడ్ షోలు 19 బహిరంగ సభలు, ర్యాలీలు అమిత్ షా 15 రోడ్ షోలు 16 సభలు జేపీ నడ్డా 16 రోడ్ షోలు 10 సభలు కర్ణాటక విజయం బీజేపీ, కాంగ్రెస్లకు ఎందుకు కీలకమంటే... బీజేపీ ♦ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజయం బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ ఎంతో కీలకం. ♦ అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా దక్షిణాదిన తమ చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారకుండా చూసుకోవడం బీజేపీకి చాలా ముఖ్యం. ♦ కర్ణాటక గెలుపు అజేయుడైన నాయకునిగా మోదీ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. ఆయన కరిష్మాను మరింతగా పెంచుతుంది. ♦ అంతేగాక కీలకమైన 2024 లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక వంటి ప్రధాన రాష్ట్రంలో ఓటమి చవిచూస్తే విపక్షాలు దూకుడు పెంచుతాయి. ♦ గత 38 ఏళ్లలో ఏ పార్టీనీ వరుసగా రెండోసారి గెలిపించని కర్ణాటక ఆనవాయితీని తిరగరాయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ♦ బజరంగ్ దళ్ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ హామీ, ముస్లిం కోటా రద్దుపై ఆ పార్టీ వైఖరి సహా ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారాంశంగా మలచుకుంది. కాంగ్రెస్ ♦ కొన్నేళ్లుగా వరుసగా ఎన్నికల ఓటములతో బాగా డీలా పడి ఉన్న కాంగ్రెస్కు కర్ణాటక గెలుపు ప్రాణావసరమనే చెప్పాలి. ♦ లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి ప్రయత్నాలకు ఊపు తెచ్చేందుకు కూడా ఇది టానిక్లా ఉపయోగపడుతుంది. ♦ జనాకర్షక నేతగా ప్రధాని మోదీకి దీటుగా రాహుల్ ఎదగాలంటే ఈ ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం ఓట్లు రాల్చి పార్టీని గెలిపించడం తప్పనిసరి అవసరం. ♦ ఇక కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయనకూ ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ♦ ప్రచారంలో కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డింది. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా కలియదిరిగారు. ప్రచారం చివరి దశలో సోనియా కూడా ఒక సభలో పాల్గొన్నారు. ♦ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నెన్నో హామీలు గుప్పించింది. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లను ఏకంగా 75 శాతానికి పెంచుతామని కూడా చెప్పింది. ♦ అయితే పోలింగ్ మరో వారం ఉందనగా వేళ మే 2న ఉన్నట్టుండి బజరంగ్ దళ్ను నిషేధిస్తామన్న హామీతో బీజేపీకి చేజేతులా అ్రస్తాన్ని అందించింది. కానీ కోస్తా కర్ణాటక మినహా మిగతా రాష్ట్రమంతటా ఈ హామీ తమకు తప్పకుండా ఓట్లు రాలుస్తుందని కాంగ్రెస్ ఆశపడుతోంది. -
సర్వేలు ఓకే.. ఇక జనం ఓటు వేస్తారో లేదో తెలియాలి..!
సర్వేలు అనుకూలంగా ఓటేశార్సార్.. ఇక జనం వేస్తారో లేదో తెలియాలి..! -
ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల ఎన్నికలపైనా కన్నడ ఫలితాల ప్రభావం
-
సాక్షాత్తు ఆయనే అలా చేయడం "ఆశ్చర్యంగా ఉంది": శరద్ పవార్
సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి.. గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. (చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..) -
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజాసింగ్
-
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటున్న సౌమ్యారెడ్డి
-
Karnataka assembly elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. ఈ సారైనా మేజిక్ ఫిగర్ దాటడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. 1999, 2013లో మినహా గత మూడు దశాబ్దాల ఎన్నికల్లో కన్నడ ఓటరు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టడం లేదు. ఈసారి ఓటర్ల మనోగతం ఎలా ఉందోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన సంగతులు వెలుగు చూస్తాయి. ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఓట్లు తక్కువగా పోలయినా సీట్ల బలంతో అధికార అందలం ఎక్కుతున్నారు. ఈ విచిత్రకరమైన పరిస్థితి గత నాలుగు శాసనసభ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించి అగ్రస్థానంలో ఉంటోంది. కానీ సీట్ల సాధనలో వెనుకబడిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.59% ఓట్లను సాధించి 224 స్థానాలున్న అసెంబ్లీలో 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ఓటు షేర్ 38శాతానికి పెరిగినప్పటికీ కేవలం 78 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ 36శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35.27% ఓట్లు కొల్లగొట్టి 65 స్థానాలు సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువగా 28.3% ఓట్లను గెలుచుకున్న బీజేపీ 79 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా ఒక్క శాతం తగ్గినప్పటికీ 80 స్థానాల్లో గెలుపొందింది. 2013 ఎన్నికలు ప్రత్యేకం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలు జరిగిన ఎన్నికలు ఇవే . 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాటు పాలన సాగించింది. బీజేపీలోని అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఎస్ యడియూరప్ప బీజేపీని వీడి సొంతంగా కేజేపీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. ఆయన సహచరుడు బి.శ్రీరాములు కూడా బీఎస్ఆర్ పార్టీని నెలకొల్పి ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిణామాలతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.6 శాతం ఓట్లను రాబట్టి 112 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీజేపీ 19.9 శాతం ఓట్లతో 40 సీట్లు, జేడీఎస్ పార్టీ 20.2 శాతం ఓట్లతో 40 సీట్లు, యడియూరప్ప కేజేపీ పార్టీ 9.8 శాతం ఓట్లతో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. ఈ దెబ్బతో బీజేపీ యడియూరప్పను బుజ్జగించి పార్టీలోకి తిరిగి చేర్చుకుంది. ఎందుకీ పరిస్థితి..? కర్ణాటక ఓటరు నాడి ఎవరికీ అందకుండా ఉంటుంది. పోలింగ్ బూత్కి వెళ్లేవరకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోలేని ఓటర్లు 20% వరకు ఉంటారని అంచనాలున్నాయి. దీనివల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్లిష్టమైన కులాల చిక్కుముడులు, లింగాయత్లు, వొక్కలిగల జనాభా ఎంత ఉంటుందో స్పష్టమైన గణాంకాలు లేకపోవడం వంటివి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడానికి కారణాలన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ జేడీ(ఎస్) పాత మైసూరుకే పరిమితమైంది.ఆ ప్రాంతంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. దీంతో ఎక్కడైనా రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంటోంది. పాత మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. దీంతో అయితే భారీ మెజార్టీ, లేదంటే అతి స్వల్ప మెజార్టీతో పార్టీలు విజయం సాధిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల ఆ పార్టీ ఓట్ల శాతంలో అగ్రభాగంలో నిలుస్తున్నా అధికారానికి అవసరమైన సీట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. -
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం
-
దక్షిణ కన్నడలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
-
Karnataka assembly elections 2023: 40 శాతం కమీషన్లు కన్పించడం లేదా?
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలు క్రితం అడ్డదారిలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. కర్ణాటకలో విజయపుర జిల్లాలోని ఇండి నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని మోదీ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని అందరూ కొనియాడుతూ ఉంటారని అలాంటప్పుడు ఆయనకు కర్ణాటకలో ప్రభుత్వం ఏం చేస్తోందో తెలీదా అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతీ పనికి 40% కమీషన్లు తీసుకుంటూ ఉంటే కర్ణాకటను అభివృద్ధికే నమూనాగా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంట్రాక్టర్లు, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతితో కంపెనీలు హైదరాబాద్, చైన్నై వైపు వెళుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఓట్ల కోసం తాను రాలేదని, వారి భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసమే వచ్చానంటూ ప్రియాంక భావోద్వేగంతో మాట్లాడారు. -
కన్నడనాట తెలుగువాడి వేడి.. వలస ఏ పార్టీకో! ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు
సాక్షి బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ఒక పార్టీ విజయం సాధించాలంటే కన్నడిగుల ఓట్లు మాత్రం పడితే చాలనుకుంటే పొరపాటు పడ్డట్లే..! దశాబ్దాలుగా కన్నడ నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరే ఇతర రాష్ట్రానికి లేని విదంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఏకంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వలసలు ఎక్కువే. బెంగుళూరు వంటి మహానగరంలో వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో ఉన్నారు. రాష్ట్రంలో 65.45 లక్షల మందివరకు వలసదారులు ఉన్నారు. వీరి ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ సారి ఎన్నికల బరిలో కూడా ఎందరో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు మూలాలున్న వారు 100 మంది, మరాఠా మూలాలున్న వారు 50 మందికి పైగా, తమిళులు 10 మంది వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో ఎవరి జనాభా ఎంత? ► రాజధానిలో 44 శాతం కన్నడిగులు ఉంటే 56 శాతం ఇతర భాషా ప్రజలు ఉన్నారు. తెలుగు వారు అత్యధికంగా 25–30 లక్షల మంది ఉన్నారు. ► తమిళులు 16–17 లక్షల మంది ఉంటే మళయాలీలు 4–5 లక్షలు ఉన్నారు ► ఇక ఉత్తరాది రాష్ట్రాల జనాభా 11–12% ఉన్నారు.రాజస్తాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో జార్ఖండ్, త్రిపుర నుంచి కూడా వలసలు పెరిగాయి. ► రాజస్తాన్కు చెందిన జైన సామాజికవర్గం ప్రజలు బెంగళూరులో చాలా చోట్ల నివసిస్తూ ఎన్నికల్లో నిర్ణయాకత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు వాడి వేడి కర్ణాటకలో దాదాపుగా 40–50 అసెంబ్లీ స్థానాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రంలో సుమారు కోటి మంది వరకు తెలుగు ప్రజలు కర్ణాటకలో నివసిస్తున్నట్లు అనధికారిక సమాచారం. పలు దశాబ్దాలుగా వివిధ కారణాలతో కర్ణాటకకు వచ్చి ఇక్కడి కన్నడిగులతో మిళితమై తెలుగు వారు జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వహిస్తున్న వారిలో అధిక భాగం తెలుగు ప్రాంత ప్రజలే కావడం గమనార్హం. ఒక్క బెంగళూరులోనే సుమారు 25 లక్షలకు పైగా తెలుగు వారు ఉన్నారు. కర్ణాటకలో కన్నడ, ఉర్దూ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. బెంగళూరులోని కేఆర్ పురం, రామ్మూర్తినగర, హెబ్బాళ, మారతహళ్లి, మహదేవపుర, యలహంకా, దేవనహళ్లితో పాటు ఏపీ, తెలంగాణ సరిహద్దు కలిగిన బళ్లారి జిల్లా, బీదర్, కలబురిగి, రాయచూరు, యాదగిరి, బసవకల్యాణ, కోలార, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నారు. 1947లో ఏర్పడిన మైసూరు రాష్ట్రానికి తెలుగు వ్యక్తి క్యాసంబల్లి చెంగరాయరెడ్డి ఎన్నికయ్యారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డాక ఎందరో తెలుగువారు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఓట్ల కోసం వ్యూహాలు కర్ణాటకకు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వలసదారులు గుర్తింపు సమస్యని అధికంగా ఎదుర్కొంటున్నారు. 65 లక్షల మంది వలసదారుల్లో ఎంత మందికి కర్ణాటకలో ఓటు హక్కు ఉందో అన్న దానిపై స్పష్టమైన గణాంకాలేవీ లేవు. కార్మికులుగా పని చేస్తున్న వారికి తాగు నీరు, ఉండడానికి ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటివన్నీ సమస్యలుగానే ఉన్నాయి. టీ, కాఫీ తోటల్లో పని చేస్తున్న కూలీలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అధికార బీజేపీ వీరిని సంప్రదిస్తూ రేషన్ కార్డులు ఇప్పించడం, ప్రభుత్వం పథకాలు వారికి అందేలా చూస్తామని హామీలు ఇస్తోంది. వలసదారుల ఓట్లను రాబట్టేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దింపింది. గుజరాత్కు చెందిన హార్దిక్ పటేల్ సహా వివిధ రాష్ట్రాల యువ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ భాషలకు చెందిన వారి ఓట్లను రాబట్టేందుకు ఆయా రాష్ట్రాల నాయకుల్ని ప్రచార పర్వంలోకి తీసుకువచ్చింది. -
మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు
-
సంయమనం పాటించండి
న్యూఢిల్లీ: విషసర్పం, విషకన్య, పనికిమాలిన కుమారుడు. ఇలా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు శ్రుతి మించుతున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహించింది. పార్టీలు, స్టార్ ప్రచారకులు సంయమనం పాటించాలంటూ హితవు పలికింది. ఆమోదనీయం కాని పదజాలంతో ఎన్నికల వాతావరణాన్ని పాడుచేయొద్దని సూచించింది. కోడ్కు అనుగుణంగా హుందాగా నడచుకోవడం పార్టీ ల విధి అని స్పష్టం చేసింది. మరోవైపు, బీజేపీ స్టార్ ప్రచారకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విద్వేష ప్రసంగాలతో కర్ణాటక ప్రజలను రెచ్చగొట్టజూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రంలో ప్రచారం చేయకుండా వారిపై తక్షణం నిషేధం విధించాలని ఈసీని కోరింది. -
బీజేపీ అడ్డాపై కాంగ్రెస్ కన్ను
ఏడు జిల్లాలు, 50 అసెంబ్లీ స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజేతను తేల్చడంలో కీలకంగా ఉంటోంది. బీజేపీకి ప్రధాన ఓటుబ్యాంకైన లింగాయత్లు అధికంగా ఉండటంతో ఇక్కడ ఆ పార్టీ ఎంతో బలంగా ఉంది. ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జేడీ(ఎస్) ఉనికి ఇక్కడ కూడా నామమాత్రమే.. సాక్షి, బెంగళూరు: బ్రిటిషర్లతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి కిత్తూరు చెన్నమ్మ పేరిట 2021లో ముంబై కర్ణాటక పేరును కిత్తూరు కర్ణాటకగా మార్చారు. ఇక్కడ ఉత్తర కన్నడ మినహాయించి మిగతా ఆరు జిల్లాల్లోనూ లింగాయత్లదే ప్రాబల్యం. దశాబ్దాలుగా వారు బీజేపీకి దన్నుగా నిలుస్తున్నారు. ఆధిక్యం అటూ ఇటూ ♦ ముంబై కర్ణాటక తొలినాళ్లల్లో కాంగ్రెస్ కంచుకోట. 1990 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్ పక్షవాతం బారిన పడటంతో ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన్ను తొలగించారు. దాంతో కాంగ్రెస్పై లింగాయత్లు భగ్గుమన్నారు. తర్వాత బీజేపీ లింగాయత్ నేత బీఎస్ యడియూరప్ప వెనక నడిచారు. ♦ క్రమంగా ఈ ప్రాంతం బీజేపీ కంచుకోటగా మారింది. అలా సాగిన బీజేపీ హవాకు యడియూరప్ప తిరుగుబావుట ఎగరేసి సొంత కుంపటి పెట్టుకోవడంతో 2013లో అడ్డుకట్ట పడింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 30 సీట్లు గెలిచింది. ♦ 2014 లోకసభ ఎన్నికల అనంతరం యడియూరప్ప తిరిగి బీజేపీ గూటికి చేరడంతో ముంబై కర్ణాటక మళ్లీ బీజేపీ పట్టులోకి వెళ్లింది. దాంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30, కాంగ్రెస్ 17 సీట్లు గెలిచాయి. ♦ యడియూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అంతటి లింగాయత్ నేతను బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ♦ అధికార బీజేపీ కూడా సరిగ్గా ఎన్నికలకు నెల ముందు లింగాయత్ల ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు వారి రిజర్వేషన్లను 2 నుంచి 4 శాతానికి పెంచింది. ఇది బాగా కలిసొస్తుందని ఆశిస్తోంది. ♦ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెళగావి, ధారవాడల్లో భారీ సభలు, మెగా రోడ్ షోలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ బెళగావిలో యువ క్రాంతి, యువ సమావేశాలు నిర్వహించారు. బెళగావిలో కీలక పోరు ♦ బెంగళూరు నగరం (28 సీట్లు) తర్వాత అత్యధిక అసెంబ్లీ సీట్లు (18)న్న బెళగావి జిల్లా ముంబై కర్ణాటక ప్రాంతంలోనే ఉంది. ఈ జిల్లా రాజకీయంగానూ చాలా కీలకం. 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 10, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. ♦ రెండు పార్టీల్లోనూ గట్టి రాజకీయ కుటుంబాలున్నాయి. జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు చక్కెర సహకార సంఘాలున్నాయి. నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బెళగావి నుంచే ప్రజాధ్వని యాత్ర పేరిట ఎన్నికల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ♦ ఉమేశ్ కత్తి, సవదత్తి మామని వంటి కీలక నేతల హఠాన్మరణంతో బీజేపీ ఇక్కడ కాస్త బలహీనపడింది. దీనికి తోడు మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది వంటి సీనియర్లు పార్టీని వీడటంతో మరింత డీలా పడింది. శెట్టర్ హుబ్లీ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున బీజేపీకి సవాలు విసురుతున్నారు. ♦ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తున్న శిగ్గావ్ స్థానం ముంబై కర్ణాటక కిందకే వస్తుంది. 2018 నుంచీ ఇక్కడ పలు జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఆ పార్టీకి చెందిన విపక్ష నేత సిద్ధరామయ్య బాగలకోటె జిల్లా బాదామి నుంచి గెలుపొందారు. ♦ విజయపుర జిల్లాలో బీజేపీ సీనియర్ నేత బసవనగౌడ పాటిల్ నోటి దురుసు పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో యడియూరప్పపై బహిరంగంగా విమర్శలతో పార్టీకి నష్టం చేసిన చరిత్ర ఆయనది. ఈసారీ సీఎం అభ్యర్థి తానేనంటూ హల్చల్ చేస్తున్నారు. ♦ ఇక 7 సీట్లున్న ధారవాడ జిల్లా కూడా బీజేపీకి కీలకమే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Karnataka assembly elections 2023: కర్ణాటక ఎన్నికలు మీ కోసం కాదు
తుమకూరు: కాంగ్రెస్ నేతలు తనను 91 పర్యాయాలు దూషించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కర్ణాటక ఎన్నికలు ఆయన కోసం కాదన్న విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. రాహుల్ సోమవారం తురువెకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల ప్రచారం కోసం మీరు కర్ణాటకకు వచ్చారు. గత మూడేళ్లలో మీరు కర్ణాటకకు ఏం చేశారో చెప్పాలి. అలాగే, వచ్చే అయిదేళ్లలో యువత, విద్య, ఆరోగ్యం, అవినీతిపై పోరు వంటి అంశాల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. అయితే, మీరు కర్ణాటక గురించి మాట్లాడటం లేదు. ఇక్కడి నేతలు బొమ్మై, యడ్యూరప్ప గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు. నరేంద్ర మోదీ గురించి మాత్రం చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికలు ఏ ఒక్కరి కోసమో కాదు. మోదీ గురించి కాదని గ్రహించాలి’ అన్నారు. ‘‘కర్ణాటకలో పర్యటనలప్పుడు సిద్దరామయ్య, శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు ప్రజల కోసం ఏం చేశారో నేను చెబుతుంటా. మోదీ కూడా సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప పేర్లను ఒకట్రెండుసార్లు ప్రస్తావిస్తే వారు కూడా సంతోషపడతారు కదా!’’ అని రాహుల్ అన్నారు. బీజేపీకి 40 సీట్లు చాలు కర్ణాటకలో బీజేపీ సర్కారు 40 శాతం పర్సంటేజీలు తీసుకుంటోందని కాబట్టి ఈ ఎన్నికల్లో 40 సీట్లు ఇస్తే చాలని రాహుల్ అన్నారు. ప్రతి పనికీ కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లు తీసుకుంటున్న బీజేపీని ఈసారి 40 సీట్లకే పరిమితం చేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో 150 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లయితే తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోలేదని అన్నారు. బీజేపీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మఠాధిపతుల నుంచీ వసూళ్లు చేసిందన్నారు. -
Karnataka assembly elections 2023: మోదీ ‘అసమర్థుడైన కొడుకు’
బెంగళూరు: ప్రధాని మోదీని విషసర్పమంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై గొడవ కొనసాగుతుండగానే ఆయన కొడుకు ప్రియాంక్ ఖర్గే మరో వివాదానికి తెర తీశారు. కలబురగి జిల్లా చిట్టాపూర్ స్థానం నుంచి మళ్లీ ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్న ఖర్గే తనయుడు ప్రియాంక్ సోమవారం మోదీని అసమర్థుడైన కొడుకుగా అభివర్ణించారు. బంజారా కులంలో పుట్టానంటున్న మోదీ వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ‘‘మీరేం భయపడకండి, మీ కొడుకు ఢిల్లీలో ఉన్నాడని కలబురగి బంజారా ప్రజలకు హామీ ఇచ్చారు. అసమర్థుడైన కొడుకు ఢిల్లీలో ఉంటే ఆ కుటుంబం ఎలా ముందుకెళుతుంది?’’ అని ప్రశ్నించారు. కోలి, కబ్బలిగ, కురుబ వర్గానికి చెందినవాడినని గతంలో చెప్పిన మోదీ, తాజాగా బంజారా వర్గం వాడినని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రియాంక్ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. -
Karnataka assembly elections 2023: 3 ఉచిత సిలిండర్లు
శివాజీనగర: పోలింగ్కు పది రోజులే గడువు ఉందనగా కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే ఏకీకృత పౌర స్మృతి, జాతీయ పౌర పట్టీ అమలుచేస్తామని బీజేపీ ప్రకటించింది. ‘ఏకీకృత పౌరస్మృతి దిశగా మేం నడిచేలా రాజ్యాంగం మాకు దారి చూపింది. ‘అందరికీ న్యాయం. బుజ్జగింపులు లేవిక’ అనేదే మా నినాదం’’ అంటూ ఎన్నికల హామీల చిట్టాను సోమవారం బెంగళూరులో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. ‘ఆరు ‘ఏ’లు అంటే ఏ–అన్న(ఆహార భద్రత), ఏ–అక్షర(నాణ్యమైన విద్య), ఏ–ఆరోగ్య(అందుబాటులో ఆరోగ్యం), ఏ–ఆదాయ(ఆదాయ హామీ), ఏ–అభయ(అందరికీ సామాజిక న్యాయం), ఏ–అభివృద్ధి(డెవలప్మెంట్) ఉండేలా బీజేపీ ప్రజా ప్రణాళికను రూపొందించింది’ అని నడ్డా అన్నారు. మేనిఫెస్టోలో మొత్తంగా 103 వాగ్దానాలు ఉన్నాయి. అభివృద్ధికేంద్రంగా మేనిఫెఫ్టో ఉందంటూ మోదీ కొనియాడారు. మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) అమలు ► దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు. ► ఈ కుటుంబాలకు ‘పోషణి’ పథకం ద్వారా ఉచితంగా రోజుకు అర లీటరు నందిని పాలు. నెలకు ఐదు కేజీల ‘శ్రీ అన్న– సిరి ధాన్య’. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ వార్డులో ‘అటల్ ఆహార కేంద్రం’ను నెలకొల్పుతాం. అత్యంత కనిష్ట ధరకే నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ► మత ప్రాతిపదికన, ఉగ్రవాద వ్యతిరేక కర్ణాటక విభాగం(కే–ఎస్డబ్ల్యూఐఎఫ్టీ) ఏర్పాటు. ► రెవిన్యూ శాఖ గుర్తించిన సొంతిల్లులేని వారికి రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్ల స్థలాలు. ► సామాజిక న్యాయ నిధి పేరిట ఎస్సీ/ఎస్టీ వర్గాల గృహిణులకు గరిష్టంగా రూ.10,000 దాకా ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల అవకాశం. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రముఖ విద్యావేత్తలు, సంస్థల సౌజన్యంలో విశ్వేశ్వర విద్యా యోజన పథకం ► మిషన్ స్వాస్థ్య కర్ణాటక కింద ప్రతీ వార్డులో నమ్మ క్లినిక్(మన క్లినిక్). ► ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకాల ద్వారా మరో 10 లక్షల ఉద్యోగాల కల్పన. ► సివిల్స్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం. ► కర్ణాటకను ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చేందుకు చార్జింగ్ స్టేషన్ల స్థాపన, వేయి అంకుర సంస్థలకు ప్రోత్సాహం. ► అన్ని గ్రామ పంచాయతీల్లో చిన్న ఎయిర్ కండిషన్ సదుపాయాలు. వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాల స్థాపన. ఇందుకోసం రూ.30 వేల కోట్ల అగ్రిఫండ్ ఏర్పాటు. యడియూరప్ప అసంతృప్తి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రసంగించాలని మాజీ సీఎం యడియూరప్పను నేతలు కోరగా.. ప్రణాళికను పూర్తిగా చదవ కుండా ప్రసంగం చేయమంటే ఎలాగని ఆయ న అసంతృప్తిని వ్యక్తంచేశారు. ముందుగానే మేనిఫెస్టో కాపీని ఇవ్వాల్సిందని అనడంతో ఆయనలోని అసంతృప్తి బయటపడింది. అంతా బోగస్: కాంగ్రెస్ విమర్శ ‘అబద్ధపు, లూటీల బీజేపీ మేనిఫెస్టో ఇది. అంతా బోగస్’ అని బీజేపీ హామీల చిట్టాపై కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ‘ మేనిఫెస్టోలో ఉన్న వాటిల్లో 90 శాతం హామీలు 2018లోనే ఇచ్చింది. వీటిని ఇంతవరకు అమలుచేయలేదు. ఇప్పుడు మరో దఫా బోగస్ హామీలిస్తోంది’ అని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా ట్వీట్చేశారు. ‘ నందిని బ్రాండ్ను అమూల్లో కలిపేసి కర్ణాటక ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసింది. పెను విమర్శలతో ముఖం చెల్లని బీజేపీ ఇప్పుడు అర లీటర్ ఉచితమంటూ ముందుకొచ్చింది. ఇందిర క్యాంటీన్లను మూసేసిన ఇదే సర్కార్ ఇప్పుడు పేరుమార్చి మళ్లీ తెరుస్తానంటోంది. బెంగళూరు బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసి ఇప్పుడు ‘స్టేట్ కేపిటల్ రీజియన్’ అంటూ కొత్తరకం ఫ్యాన్సీ పేర్లతో మభ్యపెడుతోంది. యూపీలో రెండు ఉచిత సిలిండర్లు అన్నారు. ఇంతవరకు దిక్కులేదు. కర్ణాటకలో ఏకంగా మూడు ఇస్తామంటున్నారు’ అని మరో నేత జైరాం రమేశ్ ఎద్దేవాచేశారు. 2013–18 కాలంలో కర్ణాటకలో కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ 95 శాతం హామీలను నెరవేర్చిందని గుర్తుచేశారు. -
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు. -
Karnataka assembly elections 2023: అవును, శివుని కంఠంలో సర్పాన్నే!
కోలారు: కాంగ్రెస్, జేడీ(ఎస్) కుటుంబ పాలనే కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు కారణమంటూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అవి అవినీతిని పెంచి పోషించాయని, అస్థిరతను అవకాశంగా తీసుకుని రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చాయని మండిపడ్డారు. లూటీపైనే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. ‘కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు కర్ణాటకలో ప్రత్యర్థులుగా నటిస్తారు. ఢిల్లీలో మాత్రం కలిసే ఉంటారు. పార్లమెంటులో పరస్పరం సహాయం చేసుకుంటారు’’ అన్నారు. మోదీ ఆదివారం రామనగర జిల్లాలో జేడీ(ఎస్) కంచుకోట అయిన చెన్నపట్నలో బహిరంగసభలో ప్రసంగించారు. ‘‘జేడీ(ఎస్)కు పడే ప్రతి ఓటూ కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చి రాష్ట్రాన్ని అస్థిరపరుస్తుంది. ఇక కాంగ్రెస్ది 85 శాతం కమిషన్ సర్కారు. ద్రోహానికి మరోపేరు. 2008లో తప్పుడు రుణమాఫీ తెచ్చింది. కాంగ్రెస్ నేతల సంబంధీకుల, అవినీతిపరుల రుణాలే మాఫీ అయ్యాయి. ఇదీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనను విషసర్పంతో పోల్చినందుకు తనకేమీ బాధ లేదని మోదీ అన్నారు. ‘‘పాము శివుని మెడలో హారం. అవును. నేను ప్రజల మెడలో పామునే. వారిని రక్షిస్తూ ఉంటా’’ అన్నారు. -
కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరు
-
Karnataka assembly election 2023: ‘సార్వత్రిక’ విజయానికి ఈ ఎన్నికలే సింహద్వారం
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ సారథి డీకే శివకుమార్ బల్లగుద్ది చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► నా 35 ఏళ్ల రాజకీయ అనుభవం, సర్వే ఫలితాలను అనుసరించి చెప్తున్నా.. కన్నడ నాట ఈసారి 141 శాసనసభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తాం ► దక్షిణభారతంలో మోదీమేనియా పనిచేయదు. ఇక్కడ స్థానిక, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో కీలకంగా నిలుస్తాయి ► ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల విజయానికి సింహద్వారంగా నిలుస్తుంది ► గెలిచాక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది సిద్దరామయ్యనా లేక నేనా అనేది అనవసర చర్చ. ఇక్కడ బీజేపీని ఓడించడమే అసలైన లక్ష్యం. ► రాష్ట్రం జ్ఞాన రాజధాని. బీజేపీవారు హిజాబ్, హలాల్ వంటి నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో పరిణతి ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటివి కొత్త సమస్యలు తెస్తాయని జనం భయపడుతున్నారు ► బీజేపీ అగ్రనేతల మేజిక్ ఇక్కడ పనిచేయదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లలో మోదీ ఛరిష్మా పనిచేసిందా? ప్రజల కడుపు నింపితేనే, చక్కని పాలన అందిస్తేనే మీ గురించి జనం ఆలోచిస్తారు. ఈసారి ఇక్కడా జరిగేది అదే. -
Karnataka assembly election 2023: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
పాత మైసూరు. కర్ణాటకలో అధికార పీఠానికి రాచమార్గంగా భావించే ప్రాంతం. మెజారిటీ కావాలంటే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుపొందాల్సిందేనని పార్టీలన్నింటికీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఒక్కలిగ సామాజికవర్గం ప్రభావం అధికం. వారిని ప్రసన్నం చేసుకోగలిగే పార్టీదే పాత మైసూరు. అందుకోసమే పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి... సాక్షి బెంగళూరు: కర్ణాటక జనాభాలో ఒక్కలిగ సామాజికవర్గం 15 శాతం ఉంటుందని అంచనా. లింగాయత్ (17 శాతం)ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం వీరే. ఉత్తర కర్ణాటక లింగాయత్ బెల్ట్ కాగా పాత మైసూరు ఒక్కలిగల కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో ఈ వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. వీరు కొన్ని దశాబ్దాలుగా ఒక్కలిగలు జేడీ(ఎస్)నే ఆదరిస్తూ వస్తున్నారు. ఈసారి వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏడుగురు సీఎంలను ఇచ్చిన ప్రాంతం ► రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పాత మైసూరు ప్రాంతంలో 51 సీట్లున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 9 చోట్ల గెలిచాయి. ► కావేరి వివాదం, రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. మేజిక్ నంబర్ సాధించడంలో ఈ ప్రాంతం కీలకం. ► గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన 17 మందిలో ఏకంగా ఏడుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే! ఈ సామాజికవర్గానికి చెందిన హెచ్.డి.దేవెగౌడ ప్రధాని పదవి దాకా ఎదిగారు. ► ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీ(ఎస్) చాలా బలంగా ఉంది. ► మండ్య, హసన్, రామనగర, మైసూరు, చామరాజనగర, కోలార్, తుమకూరు, కొడగు జిల్లాలో ఒక్కలిగలు అధికంగా ఉంటారు. ► ఒక్కలిగల ఓట్లను ఒడిసిపట్టేందుకు అధికార బీజేపీ తాజాగా వారి రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. ► ఇక కాంగ్రెస్ ఒక్కలిగలకు ఎక్కువగా టికెట్లిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ► జేడీ(ఎస్) మాత్రం తన సంప్రదాయ ఓటుబ్యాంకు మళ్లీ చెక్కుచెదరబోదని ధీమాగా ఉంది. కాంగ్రెస్.. గత వైభవమే పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని పార్టీ. దేవెగౌడ రూపంలో బలమైన ఒక్కలిగ నేత రాకతో ఇక్కడ దాని ప్రభ మసకబారింది. ఈ ప్రాంతానికే చెందిన ముఖ్య ఒక్కలిగ నేత పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్పైనే ఈసారి కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీ... ఇక బీజేపీది భిన్నమైన పరిస్థితి! పాత మైసూరులో పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన ఒక్కలిగ నాయకుడు లేడు. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీ(ఎస్)ల తర్వాతి స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. అయితే 2018 ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న నేపథ్యంలో ఈసారీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ బలమైన స్థానిక నేతలను చేర్చుకుని టికెట్లిచ్చింది. ఇంటిపోరు జేడీ(ఎస్)ను ముంచేనా...? దేవెగౌడ కుటుంబంలో వారసత్వ రగడ మొదలైంది. ఆయన కుమారుల్లో జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి రామనగర, మైసూరు, మండ్య జిల్లాల్లో గట్టి నాయకుడు కాగా సోదరుడు హెచ్.డి.రేవణ్ణ హాసన్ జిల్లాలో తిరుగులేని నేత. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. హాసన్ టికెట్ విషయంలో ఇవి రచ్చకెక్కాయి. అక్కడ రేవణ్ణ భార్య భవానీని కాదని అతి సామాన్య కార్యకర్తకు కుమారస్వామి టికెటిచ్చారు. ఈ గొడవ కొంప ముంచుతుందేమోనని జేడీ(ఎస్) వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
కర్నాటక ప్రచారంలో విషాలు చిమ్ముకుంటోన్న కాంగ్రెస్-బీజేపీలు
-
Karnataka assembly election 2023: రాజకీయాల్లో నటీనటులు
సాక్షి, ఎన్నికల డెస్క్: దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాలకు– సినీ తారలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటక ఏది చూసినా సినిమాలు– రాజకీయాలు పెనవేసుకుని కనిపిస్తాయి. కొంతకాలంగా కన్నడ చిత్రసీమ శాండల్వుడ్ నుంచి సినీనటులు రాజకీయ రంగంపై చాలా మంది ఆసక్తి చూపించారు. అయితే ఈ విధానసభ ఎన్నికల్లో ఎందుకనో ఎక్కువమంది తారలు చురుగ్గా పాల్గొనడం లేదు. ఒకరో ఇద్దరో బరిలో ఉండగా, తక్కువమంది మాత్రమే నేతలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రముఖులు కొందరే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సినీ నటీనటులు ఓ మోస్తరుగానే ఉన్నారు. ఎన్నికల బరిలో ప్రముఖ నటులు కూడా లేకపోవడం విశేషం. రాజకీయ నేతలు ఎవరూ కూడా సినీ తారలకు రెడ్ కార్పెడ్ పరిచినట్లు లేదు. జేడీఎస్ తరఫున రామనగర నుంచి వర్ధమాన నటుడు నిఖిల్ పోటీలో ఉన్నారు. బీజేపీకి, సీఎం బొమ్మైకి మద్దతుగా నటుడు కిచ్చా సుదీప్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి పరిమితం అయ్యారు. మరో ప్రముఖ నటుడు దర్శన్దీ అదే తీరు. కేజీఎఫ్ హీరో యశ్ ఎన్నికల ఛాయలకే రాలేదు. గతంలో ప్రజాకీయ పార్టీని పెట్టిన ఉపేంద్ర మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ లీడర్ రమ్య ఎక్కడ? అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యస్పందన తారాజువ్వలా ఎగిశారు. ఆమె తల్లి రజిత కాంగ్రెస్లో చురుగ్గా పని చేశారు. నటి రమ్య 2012లో కాంగ్రెస్లో చేరి మండ్య ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో ఉన్నప్పటికీ కన్నడనాట ప్రచారానికి దూరంగానే ఉండడం చర్చనీయాంశమైంది. అంబరీశ్దే అగ్రస్థానం కన్నడ రెబల్స్టార్ 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత జనతాదళ్లో (1996 – 99) చేరి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. తిరిగి సొంతగూటికి చేరుకుని మరోసారి పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంతి అయ్యారు. అంబరీశ్ సతీమణి సుమలత 2019లో మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె తరఫున నటులు దర్శన్, యశ్ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. రాజకీయాల్లో నటీనటులు ► పోలీసు అధికారిగా పని చేసిన బీసీ పాటిల్ తర్వాత సినీ రంగం వైపు దృష్టి సారించారు. వెండితెరపై రాణిస్తూనే రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖమంత్రిగా కొనసాగుతున్నారు. ► తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన సాయికుమార్ చిక్కబళ్లాపుర బాగేపల్లి నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా అదృష్టం కలిసిరాలేదు. ఆపై రాజకీయాల వైపు చూడలేదు. ► జస్ట్ ఆస్కింగ్ అంటూ 2018 ఎన్నికల్లో కన్నడనాట ఆకర్షించిన వైవిధ్య నటుడు ప్రకాష్రాజ్ ఈ ఎన్నికల్లో కనిపించనేలేదు. ఏ పార్టీకి మద్దతుగా గళమెత్తలేదు. గతంలో ఆయన ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ► రెండు దశాబ్దాల పాటు వెండితెరపై వెలిగిన తార శృతి. బీజేపీలో మహిళా విభాగం నేతగా కొనసాగుతున్నారు. ► సుమారు 300 చిత్రాల్లో నటించిన అనంత్నాగ్ ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ చురుకై న పాత్ర పోషించలేదు. ► కన్నడ చిత్రాల్లో సహాయక నటిగా రాణించిన ఉమాశ్రీ హాస్యం పండించి ఆకట్టుకునేది. 2013లో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు. ► సినిమాల్లో సహాయక నటిగా రాణించిన తార అనురాధ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్గా వ్యవహరించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
Karnataka assembly election 2023: వారికి మతి పోయింది
సాక్షి, బళ్లారి: ప్రధాని మోదీ విషసర్పమన్న ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి, వారి నేతలకు మతి భ్రమించిందనేందుకు రుజువని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. శుక్రవారం కర్ణాటకలో గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఆయన పలు సభలో మాట్లాడారు. ‘‘మోదీని విషసర్పంతో పోల్చడం ఆ పార్టీ ఎంతగా దిగజారిందనేందుకు రుజువు. వారెంతగా విమర్శిస్తే అంతగా ఆయనకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది’’ అన్నారు. ‘తీవ్రవాద భావజాల పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను నిషేధించినందుకు నాపై కేసు పెట్టారు. పీఎఫ్ఐను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంది. దానిపై నిషేధం తర్వాత కర్ణాటక సురక్షితంగా ఉంది’’ అన్నారు. ‘‘సీఎం తానంటే తానని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్య వాదులాడుకుంటున్నారు. అవసరం లేదు. సీఎం బీజేపీ వ్యక్తే అవుతారు. కన్నడ ఓటర్లు బీజేపీనే గెలిపిస్తారు. ఓటర్ల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ వాగ్దానాలను ఎవరు విశ్వసిస్తారు?. కొన్ని విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీని ఖచ్చితంగా నమ్మవచ్చు. అవి.. అబద్దాలు, అవినీతి, కులతత్వం, వంశపాలన, బుజ్జగింపు రాజకీయాలు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. -
రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే అర్బన్ ఓటర్లు కీలకం
-
karnataka assembly election 2023: దేవెగౌడ సుడిగాలి పర్యటనలు
శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా. మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. -
karnataka assembly elections 2023: మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా: రాహుల్
ఉడుపి/మంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ కర్ణాటక మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని, లీటర్ డీజిల్పై రూ.25 చొప్పున రాయితీ ఇస్తామని, రోజుకు 500 లీటర్ల డీజిల్కు ఈ రాయితీ వర్తిస్తుందని, మత్స్యకార మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గురువారం ఉడుపి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు. కేవలం హామీలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కాదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. -
Karnataka assembly elections 2023: కొన్ని పార్టీలకు రాజకీయాలంటే అవినీతి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు కోరుతా.. ‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ షార్ట్కట్లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. -
Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?
కల్యాణ (హైదరాబాద్) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్) ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెబెల్స్ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది... ‘హైదరాబాద్ రాష్ట్రం’లో భాగమే ► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగానే పిలిచేవారు. ► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి. ► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు. ► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది. ► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి. ► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు. ► ఆర్టికల్ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంటోంది! ఖర్గే ఖిల్లా మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. ► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి. ► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి! ► ఈ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది. ► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది. ► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. ► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ► జేడీఎస్ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు జేడీ(ఎస్)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది. ► లింగాయత్లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి. – సాక్షి, బెంగళూరు -
మధ్య కర్ణాటకలో ఆసక్తికర రాజకీయం
-
సిద్ధరామయ్య మా దేవుడు అంటున్న వరుణ ప్రజలు
-
Karnataka Assembly Election 2023: ఎన్నికలు ముగిశాకే సీఎం ఎంపిక: ఖర్గే
శివాజీనగర: కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తరువాతే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి, హైకమాండ్ చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదని చెప్పారు. సోమవారం చిక్కమగళూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్న బీజేపీ సవాల్పై స్పందిస్తూ తమ పార్టీలో కులాల వారీగా సీఎంను ప్రకటించడం లేదన్నారు. బీజేపీలో అవినీతి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు విసుగెత్తారని, అదే ఇతరులపై చిన్న ఆరోపణ వస్తే వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆరోపించారు. -
Karnataka Assembly Election 2023: జేడీ(ఎస్)కు ఓటేస్తే కాంగ్రెస్కు వేసినట్లే
సక్లేశ్పుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్) కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీని బలోపేతం చేయడానికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్)కు ఓటు వేస్తే చివరకు కాంగ్రెస్తో జత కట్టిందని గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా సక్లేశ్పుర సెగ్మెంట్లోని ఆలూరులో సోమవారం భారీ రోడ్డు షోలో అమిత్ షా ప్రసంగించారు.మీ ఓటు వృథా కావొద్దంటే బీజేపీ అభ్యర్థులకు వేయాలని కోరారు. హసన్ జిల్లాలో ఈసారి మరిన్ని సీట్లు సాధించబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కలిగలు, లింగాయత్లకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. -
Karnataka assembly elections 2023: వాగ్దానాల నుంచి కోటా దాకా... కీలకాంశాలివే...!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి... – సాక్షి, బెంగళూరు వాగ్దానాలు, తాయిలాలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది. కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది. పాల ప్యాకెట్లో తుఫాన్ స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది. ‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ‘కోటా’తో బీజేపీ ఆట ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి. కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్) 2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్మేకర్గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది. గుండెల్లో రె‘బెల్స్’ ► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు. ► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు. ► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది. ► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. -
25 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తాం : గాలి జనార్ధన్
-
Karnataka: నేత మారితే ఓటు నష్టం!
బనశంకరి: సిద్ధాంతాలు, విశ్వాసాలు తరువాతి సంగతి. మనకు టికెట్ రాకపోతే పార్టీ మారిపోదాం అనే ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో సీనియర్లు సైతం ఇట్టే పార్టీలను మార్చడం ఈ ఎన్నికల్లో ద్యోతకమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపుల్లో అసమ్మతి చెలరేగి సీనియర్ నాయకులు అనూహ్యంగా పార్టీలు మారడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్రతి ఎన్నికల సమయంలో వలసలు మామూలే. కానీ మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలోని జగదీశ్ షెట్టర్ వంటి నాయకులు జెండాలను మార్చుకోవడం సంచలనం రేపింది. కాంగ్రెస్, బీజేపీలో ప్రయోగాలకు పూనుకోవడంతో అనేకమందికి టికెట్లు దక్కకపోగా కొత్తముఖాలకు టిక్కెట్లు కేటాయించారు. ఫలితంగా సాగిన వలసల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయోనన్నది పార్టీలతో పాటు సామాన్యులకూ ఉత్కంఠ కలిగిస్తోంది. ఓటుబ్యాంకు చీలే అవకాశం వలసల వల్ల ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీయస్లలో ఓటుబ్యాంక్ చీలుతుందనే భయం నెలకొంది. టికెట్లు దక్కని నేతలు నియోజకవర్గాల్లో వారి ప్రభావంతో ఓట్లను చీల్చవచ్చనే భయం అభ్యర్థుల్లో ఉంది. అసమ్మతితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలను అగ్రనేతలు ముమ్మరం చేశారు. అధికార బీజేపీలో అసమ్మతీయులు పెద్దసంఖ్యలో ఉన్నారు. గతంలోనే కొందరు నేతలు ప్రతిపక్షాలలోకి చేరారు. బీజేపీలో లింగాయతులకు అన్యాయం జరుగుతోందని షెట్టర్ ఆరోపించడం, ఎలాంటి అన్యాయం జరగలేదని వేదికలపై సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి బీజేపీకి రావడం గమనార్హం. వలసల వల్ల జేడీఎస్ లాభపడితే, కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ నష్టమైతే జరగలేదని అంచనా. బలమైన నాయకులు వెళ్లిపోవడం వల్ల ఎంతమాత్రం ఓట్లు నష్టపోవచ్చనే లెక్కలు తేల్చడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి. పార్టీలు మారిన నేతలు ఎందరో జగదీశ్ షెట్టర్, లక్ష్మణసవది, పుట్టణ్ణ, బాబూరావ్ చించినసూర్, వీఎస్.పాటిల్, యుబీ.బణకార్, ఎన్వై.గోపాలకృష్ణ నేతలు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బీఎస్.యడియూరప్ప అనుచరుడు ఎన్ఆర్.సంతోష్ జేడీయస్ పార్టీలోకి వెళ్లారు. ఎస్ఆర్.శ్రీనివాస్, కేఎం.శివలింగేగౌడ అనే ఇద్దరు జేడీయస్ ఎమ్మెల్యేలు కాంగ్రేస్ పార్టీలోకి దూకారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగరాజచబ్బి, బీవీ.నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీలోని ఆయనూరు మంజునాథ్, ఎంపీ కుమారస్వామి, సూర్యకాంతనాగమారపల్లి జేడీయస్ పార్టీలో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలామంది నాయకులు చేరుతారు. -
బళ్లారి కోటపై విజయకేతనం ఎవరిదో?
సాక్షి,బళ్లారి: రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనం చోటు చేసుకున్నా దాని మూలాలు బళ్లారిలోనే ఉంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలందరూ బళ్లారిపైనే దృష్టి పెడుతుంటారు. ఈసారి బళ్లారి నగర అసెంబ్లీ ఎన్నికల పోరులో చతుర్ముఖపోటీ నెలకొంది. అయితే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, కేఆర్పీపీల మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బళ్లారి కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ తరఫున నారాభరత్రెడ్డి, కేఆర్పీపీ తరఫున గాలి లక్ష్మీ అరుణ బరిలో ఉన్నారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడి భంగపడిన అనిల్లాడ్ జేడీఎస్లో చేరి ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. మహిళా ఓటర్లే ఎక్కువ బళ్లారి సిటీ నియోజకవర్గంలో 2,58,588 ఓటర్లు ఉండగా 1,32,780 మంది మహిళలు, 1,25,779 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో విజేతలు ఎవరనేది మహిళలే నిర్ణయించనున్నారు. బళ్లారి సిటీలో 39 వార్డులు ఉండగా, సిటీ నియోజకవర్గం పరిధిలోకి 26 వార్డులు వస్తాయి. తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ బళ్లారిలో తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఇక్కడే స్థిరపడి వ్యవసాయం, సివిల్ కాంట్రాక్టు పనులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. బళ్లారి అసెంబ్లీ పోరులో తలపడుతున్న అభ్యర్థులు బళ్లారిలోనే పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ వీరి పూర్వికులు ఏపీవారే. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, కేఆర్పీపీ తరఫున బరిలో ఉన్నది ఒకే సామాజికవర్గానికి చెందినవారే. వీరంతా ఆర్థికంగా స్థితిమంతులు. పైగా బీజేపీ తరఫున బరిలో ఉన్న గాలి సోమశేఖరరెడ్డి, కేఆర్పీపీ తరఫున పోటీలో ఉన్న గాలి లక్ష్మీ అరుణలు స్వయానా బావ,మరదులు కావడం విశేషం. దీంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎవరి ధీమా వారిదే కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్రెడ్డి, గాలి జనార్దనరెడ్డి సతీమణీ గాలి లక్ష్మీ అరుణ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టి బళ్లారి ప్రజల వాణి వినిపించేందుకు హోరా–హోరీగా తలపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖరరెడ్డి మూడో పర్యాయం విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బళ్లారి నగరంలో తాను చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి కారణమవుతాయని గాలిసోమశేఖరరెడ్డి ధీమాతో ఉన్నారు. ఈమేరకు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందువల్ల ప్రజలు బీజేపీని వీడి తమను గెలిపిస్తారని, కాంగ్రెస్, కేఆర్పీపీ అభ్యర్థులు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. జేడీఎస్ అభ్యర్థి అనిల్ లాడ్ విషయానికొస్తే 2008లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గాలి సోమశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం యత్నించి విఫలమై జేడీఎస్ తీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలో తలపడుతున్నారు. -
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో మాదే విజయం
సాక్షి, బళ్లారి/విజయపుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని, 224 స్థానాలకు గాను 150 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని విజయపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శివాజీ సర్కిల్ నుంచి కనకదాస సర్కిల్ వరకూ జరిగిన భారీ రోడ్డు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘40 పర్సెంట్ బీజేపీ సర్కారు’కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నాయకులు 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవణ్ణ బోధనల గురించి మాట్లాడుతున్నారు గానీ వాటిని ఏమాత్రం ఆచరించడం లేదని రాహుల్ ఆక్షేపించారు. బసవేశ్వరుడికి రాహుల్ నివాళులు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలోని కూడల సంగమంలోని బసవణ్ణ సమాధిని దర్శించుకున్నారు. నివాళులర్పించారు. కూడల సంగమంలో సంగమనాథ దేవాలయాన్ని దర్శించుకుని విశేష పూజలు చేశారు. నుదుటిన విభూతి ధరించారు. విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి పడ్డారని, ఆనాడే చట్టసభ ద్వారా అన్ని వర్గాల ప్రజలను అందలమెక్కించాలని తపనపడ్డారని రాహుల్ కొనియాడారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి బసవణ్ణ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి కాంగ్రెస్ నేతలతో రాహుల్ చర్చించారు. హుబ్లీకి వెళ్లి ఇటీవల కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్తో మాట్లాడారు. -
పోలింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హీటెక్కుతున్న రాజకీయం
-
మోడీ తడిసాడు..అభిమాని తుడిచాడు
-
Karnataka Assembly election 2023: కర్నాటకలో మెజార్టీకి మించి...
బెంగళూరు: కర్ణాటకలో అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ‘‘మెజార్టీ కంటే 15 నుంచి 20 సీట్లు ఎక్కువే గెలుస్తాం. కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయిలో మద్దతు ఏమాత్రం తగ్గలేదు. చరిత్ర చూసినా బీజేపీ రెబెల్స్ గెలిచిన సందర్భాలు లేవు. ఈసారీ అదే నిరూపితమవనుంది’’ అని శనివారం ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటుపడటంపై బీజేపీని కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ దేశంలో ఏ కుటుంబం కూడా చట్టం కంటే గొప్పదికాదు. అన్నింటికంటే చట్టమే అత్యున్నతమైంది’ అని వ్యాఖ్యానించారు. ఎంపీ బంగ్లా ఖాళీచేస్తూ ఈ ఉదంతంలో బాధితుడినయ్యానని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందించారు. ‘ ఓబీసీలను కించపరిచేలా మాట్లాడాలని రాహుల్ను మేం అడగలేదు. ఇప్పుడు క్షమాపణ చెప్పకూడదని నిర్ణయించుకుంది కూడా ఆయనే. ఏ చట్టం కింద అయితే ఆయన దోషిగా తేలారో ఆ చట్టం కాంగ్రెస్ హయాంలో రూపొందిందే. ఆ చట్టాన్ని ఉపసంహరించేందుకు నాటి ప్రధాని మన్మోహన్ ప్రయత్నిస్తే ఆర్డినెన్స్ పత్రాలు చించి రాహులే అడ్డుకున్నారు. ఇప్పుడు ‘బాధితుడిని’ అంటూ నాటకాలు ఆడొద్దు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ మోదీని విమర్శించారనే జమ్మూకశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సీబీఐ సమన్లు జారీచేసిందనేది అబద్ధం. గతంలోనూ ప్రశ్నించేందుకు ఆయనను సీబీఐ పిలిచింది’ అని గుర్తుచేశారు. ఏటీఎంలా వాడుకున్న కాంగ్రెస్ ‘‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇంతవరకూ ఏ కోర్టులోనూ నిరూపణకాలేదు. ఇవన్నీ కాంగ్రెస్ కట్టుకథలు’’ అని అమిత్ షా అన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెసే రాష్ట్రాన్ని ‘ఏటీఎం’లా వాడుకుందని ఆరోపించారు. ‘‘యూపీఏ హయాంలో 2009–19లో కర్ణాటకకు కేవలం రూ.94 వేల కోట్ల నిధులొచ్చాయి. మా హయాంలో 2014–19లో ఏకంగా రూ.2.26 లక్షల కోట్ల నిధులు ఇచ్చి ఆదుకున్నాం. వాళ్లు పన్నులు, గ్రాంట్–ఎయిడ్ కింద రూ.22 వేల కోట్లు ఇస్తే మేం రూ.75 వేల కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
ఆ 84 సీట్లు కీలకం.. గతంలో 56 బీజేపీకే.. మరి ఇప్పుడు.. స్వింగ్ ఎటో?
కిత్తూరు కర్ణాటకలో (గతంలో ముంబై కర్ణాటక) రాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1957 సంవత్సరం నుంచి రాన్ నియోజకవర్గం ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇలా ఓటరు తీర్పు తిరగరాసే నియోజకవర్గాలు రాన్తో సహా 84 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తుందని, అందుకే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవడం కష్టంగా మారిందని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎ. నారాయణ అభిప్రాయపడ్డారు. 2018 : స్వింగ్ స్థానాల్లో బీజేపీ స్వీప్ ► లింగాయత్లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది ► సెంట్రల్ కర్ణాటకలో 20 స్వింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్, వొక్కలిగలు పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో నెగ్గింది. ► బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా కర్ణాటకలో అత్యధిక స్థానాలు స్వింగ్ సీట్లుగా పేరొందాయి. ఈ ప్రాంతంలో 19 స్థానాలకు గానే 10 స్వింగ్ సీట్లుగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అన్ని స్వింగ్ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. 20% మంది ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంలో విభజన రాజకీయాలే కీలకం. ► హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12 స్వింగ్ సీట్లు బీజేపీ ౖMðవశం చేసుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ► దక్షిణ కర్ణాటకలో మొత్తం స్థానాలు 46 కాగా అందులో స్వింగ్ సీట్లు 14 ఉన్నాయి. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ (ఎస్) సగం స్వింగ్ స్థానాలైన ఏడింటిలో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ► బెంగళూరు నగరంలో రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. స్వింగ్ స్థానాల్లో పట్టుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు లింగాయత్లకు పట్టున్న స్థానాలు, మత విభజన రాజకీయాలకు కేంద్రమైన కోస్తా కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ స్వింగ్ స్థానాలన్నింటినీ స్వీప్ చేసింది. మొత్తం 84 స్వింగ్ స్థానాలకు గాను బీజేపీ ఖాతాలో 56 ఉన్నాయి. దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానాల్లో బీజేపీ నెగ్గే అవకాశాలు లేవు. అందుకే బీజేపీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచి ఈ స్థానాలపై దృష్టి సారించింది. వీటిలో 30 స్థానాల్లో లింగాయత్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. లింగాయత్లు బీజేపీ వైపు నిలుస్తూ ఉండడంతో ఆ స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలమన్న కమలదళం ధీమాగా ఉంది. అధికార వ్యతిరేకత, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ముస్లింలకు 4 శాతం కోటాలో కోత, పెరిగిపోతున్న ధరలు వంటివన్నీ బీజేపీకి మైనస్గా మారాయి. వీటన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్తో కప్పిపుచ్చే వ్యూహాలు రచిస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. తద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించవచ్చునని వ్యూహరచన చేసింది. అయితే మోదీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఎంతో ఆకర్షణ ఉన్నప్పటికీ ఆయనను స్థానికుడిగా చూడలేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇమేజ్ పని చేస్తుందే తప్ప శాసనసభ ఎన్నికల్లో పని చేసే అవకాశం లేదు’’ అని ఎన్నికల విశ్లేషకుడు చేతన్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాకతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చునన్న ఆశగా ఉంది. ఇక బసవరాజ్ బొమ్మై అవినీతి, ముస్లిం కోటా రద్దుని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్గా మారింది. ఫలితంగా ఈ 84 సీట్లలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. ఇక 224 స్థానాలకు గాను 60 సీట్లు సేఫ్ సీట్లుగా ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఒకే పార్టీ గెలుస్తూ వచ్చింది. ఈ సేఫ్ సీట్లు కాంగ్రెస్కి 27, బీజేపీకి 23, జేడీ(ఎస్)కి 10 ఉన్నాయి. ఈ సీట్లను కాపాడుకోవడానికి కూడా రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ గెలుపు సంకేతాలు చాలా ఉన్నాయి : భరత్ రెడ్డి
-
కర్నాటకలో హోరెత్తిన ప్రచార పర్వం
-
రసకందాయంలో కర్నాటకం.. పార్టీలు చిన్నవి.. ప్రభావం పెద్దది
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని చీలుస్తాయన్న చర్చ మొదలైంది. చిన్న పార్టీలకు సొంతంగా విజయం సాధించే బలం లేకపోయినప్పటికీ జయాపజయాలను మార్చే సత్తా కలిగి ఉన్నాయి. ఇంతకీ ఈ చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతాయి? ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయ పార్టీల ప్రచార హోరు తీవ్రతరమైంది. గత ఎన్నికల్లో కీలక స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీయే లభించడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చిన్న పార్టీలు, ఎన్నికల బరిలో దిగిన కొత్త పార్టీలు ప్రధానపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత ఎన్నికల్లో బెంగుళూరులోని 18 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు ఆప్ పరిస్థితి వేరు. ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉండడంతోపాటు జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. కర్ణాటక ఓటరు మొదట్నుంచి ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. కేజ్రివాల్ ఢిల్లీ మోడల్ పాలన పట్ల యువత, మహిళల్లో విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే ఈ సారి ఆప్ను కూడా ప్రధాన పార్టీలు ముప్పుగానే పరిగణిస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కోస్తా కర్ణాటకలో గట్టి పట్టుంది. అధికార వ్యతిరేకతకు చిన్న పార్టీలతో చెక్! కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. 40% కమీషన్ల సీఎంగా పేరు పడడం, యడ్డీయూరప్ప స్థానంలో వచ్చి ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, హిందూత్వ కార్డుతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ చిన్న పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తమ విజయావకాశాలను పెంచుతాయని ఆశల పల్లకిలో విహరిస్తోంది. గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కూడా అదే పునరావృతమై బహుముఖ పోటీ జరుగుతుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడ ప్రజలు జాతీయ పార్టీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. లేదంటే అతి పెద్ద ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 6% వరకు మాత్రమే ఓట్లను సంపాదించాయి. పార్టీ అనుసరించే సిద్ధాంతాలే ముఖ్యమైనవని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అవినీతిని అంతమొందిస్తామంటూ రొటీన్ హామీలిస్తే ప్రజల నుంచి స్పందన కరువై చిన్న పార్టీలు మనుగడ సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో దిగామని చెబుతోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 వేల మంది ఆర్థిక సాయం చేసి పార్టీలో సభ్యులుగా చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ రెడ్డి తెలిపారు. 50 స్థానాల్లో ప్రభావం కర్ణాటకలో చిన్న పార్టీలు ఏకంగా 50 సీట్లలో ప్రభావం చూపించనున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ), కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్), నటుడు ఉపేంద్రకు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)లతో పాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం గట్టి ప్రభావాన్ని చూపిస్తాయనే అంచనాలున్నాయి. 69 గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ రావడం, చిన్న పార్టీల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్నాటక ఎన్నికలు: బీజేపీ బిగ్ ప్లాన్
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, పార్టీలు తమకు సీటు ఇవ్వకపోవడంతో పలువురు సీనియర్లు, నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇక, నేటితో(ఏప్రిల్ 20)తో కర్నాటకలో నామినేషన్ల పర్వం ముగిసింది. కాగా, ఎన్నికల ప్రచారంలో ఓటర్లును ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉండగా.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార బీజేపీ పార్టీ బిగ్ ప్లాన్స్ చేస్తోంది. మళ్లీ అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగింది. అందుకు తగిన ప్రణాళిక అమలు చేస్తుంది. ఇక, బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటకకు రానున్నారు. ఏకంగా 10 రోజుల పాటు మోదీ కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సమయంలో దాదాపు 20 ర్యాలీల్లో, భారీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెనర్ల జాబితాను సైతం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా వివధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, సెలబ్రెటీల పేర్లు ఉన్నాయి. ఇక, కర్నాటక బీజేపీ.. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్ని ఆరు రిజియన్లుగా విభజించింది. కాగా, బెలగావి, హుబ్బల్లి నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక, జేపీ నడ్డా దాదాపు 25 ర్యాల్లీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా, కర్నాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
కర్ణాటకలో మళ్లీ బీజేపీదే విజయం: యడియూరప్ప
-
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్నాటక: బీజేపీకి ఊహించని షాక్.. మరో సీనియర్ నేత గుడ్బై
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జేడీఎస్లో చేరారు. దీంతో, బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆధ్వర్యంతో జేడీఎస్లో చేరారు. ఈ క్రమంలోనే తాను శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 20న ఒక పార్టీ తరఫున తాను నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే తాను బీజేపీని వీడుతున్నట్టు వెల్లడించారు. అలాగే, తన నియోజకవర్గ ప్రజలు, నాయకుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. In another setback to ruling BJP, party MLC from Shivamogga #AyanurManjunath quit the party and joined JD(S)#KarnatakaElection2023 pic.twitter.com/BoJ69ySKBN — TOI Bengaluru (@TOIBengaluru) April 19, 2023 కాగా, బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అయనూర్ మంజునాథ్ పేరు లేదు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 222 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే శివమొగ్గ, మాన్వి స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన సమయం నుంచి బీజేపీకి వరుసగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కమలం పార్టీకి ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు లక్ష్మణ్ సవదితోపాటు పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరి ప్రభావం బీజేపీపై ఎంతమేర పడనుందో ఎన్నికల ఫలితాల అనంతరం తెలుస్తుంది. I will resign from both, the Legislative Council membership and the primary membership of the BJP. I will file my nomination papers today to contest the elections from the Shivamogga Assembly constituency: Ayanur Manjunath, Member of the Legislative Council pic.twitter.com/eGT8FAsYT7 — ANI (@ANI) April 19, 2023 ఇది కూడా చదవండి: మమతా బెనర్జీకి మరో షాక్ -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీకి రాజీనామా.. బీఎల్ సంతోషే కారణం: జగదీష్ శెట్టర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి రగడ తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించడంతో.. ఈ పార్టీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్లో చేరారు. బెంగుళూరు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో జగదీష్ శెట్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు రావడం వెనక బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్యే కారణమని ధ్వజమెత్తారు. బీఎల్ సంతోష్కు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని శెట్టర్ విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ రాకుండా చేసి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. బొమ్మై కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని తెలిపారు. తన స్థానంలో మహేష్ తెంగినాకైకు టికెట్ ఇవ్వడం కోసం బీఎల్ సంతోష్ తన మీద కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇలా చేశారని ధ్వజమెత్తారు. చదవండి: Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..? అదే విధంగా మైసూరు జిల్లా కృష్ణరాజ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ఎ రామదాస్ను కాదని కొత్త ముఖమైన శ్రీవాత్సకు బీజేపీ టికెట్ ఇచ్చారు. దీనిపై కూడా శెట్టర్ ఘాటుగా స్పందించారు. ‘రామదాస్ పరిస్థితి ఏమైందో చూడండి.. బీఎల్ సంతోష్ విధేయుడు కాదనే కారణంతో ఆయన్ను పక్కకు పెట్టేశారు. తన మాట వినే శ్రీవాస్తకు టిక్కెట్ ఇచ్చారు’ అని దుయ్యబట్టారు. బీఎల్ సంతోష్ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా నిమమించిన విఫలమయ్యారని శెట్టర్ విమర్శించారు. అయినా బీజేపీ అగ్ర నాయకులు ఆయన్ను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదన్నారు. సంతోష్కు పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యమని, ఇది బీజేపీ పరువును దిగజార్చుతుందని అన్నారు. ‘బీఎల్ సంతోష్ను కేరళ ఇన్ఛార్జ్గా నియమించినా రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తమిళనాడు ఇన్ఛార్జ్గా చేసినా కొన్ని సీట్లు మాత్రమే గెలిచింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన వ్యక్తి పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ(ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా) స్థానంలో ఉన్న వారికి సలహాలు ఇస్తున్నాడు.’ అని శెట్టర్ దుయ్యబట్టారు. కాగా గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, స్పీకర్గా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన జగదీష్ శెట్టర్కు పార్టీ నుంచి టిక్కెట్ దక్కలేదు. ఈసారి శెట్టర్ను కాదని మహేష్ తెంగినాకైను హుబ్లి-ధార్వాడ్ స్థానం నుంచి బరిలో దింపింది. దీంతో బీజేపీకి గుడ్బై చెప్పి.. అదే హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరిద్దరిలో గెలుపెవరిదో తేలాలంటే మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు ఎదురుచూడాల్సిందే. చదవండి: బీజేపీ మూడో జాబితా విడుదల.. -
Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..?
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని తెలిపారు. అలాగే తనకు రూ.263 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 2018తో పోల్చితే ఈసారి ఆస్తుల విలువ 67 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. తన వద్ద ఓ కారు, రెండు ఖరీదైన వాచ్లు, 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్లు కన్నడ పీసీసీ చీఫ్ వెల్లడించారు. అలాగే తనపై 19 కేసులు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. వీటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షాజియా తర్రానుమ్ తన ఆస్తుల విలువ రూ.1,629 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో బీజేపీ నేత ఎంటీబీ నాగరాజ్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.1,607 కోట్లు అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. చదవండి: లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు.