Suresh
-
చెట్ల అక్రమ రవాణాను ఎవరూ అడ్డుకోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
-
టీడీపీలో అసమ్మతి.. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించేసిన పచ్చ నేతలు
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. అసమ్మతి నేతలు టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించివేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, సదరు ఎమ్మెల్యే.. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలే ఇందుకు కారణమని అసమ్మతి వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పీక్ స్టేజ్ చేరుకుంది. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు చించివేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం టీడీపీ నేతలు చించేయడంతో రాజకీయం వేడెక్కింది. అంతకుముందు.. జలదంకి, వరికుంటపాడుతో పాటు తాజాగా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.అయితే, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలోనే ఇలా అసమ్మతి నేతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సురేష్కు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. -
సురేష్.. పదేళ్ల ప్రేమకు ఫలితం ఇదేనా..!
కె.కోటపాడు: ప్రేమించి పెళ్లి(Love marriage) చేసుకున్న తరువాత తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న నెపంతో ముఖం చాటేసిన భర్త గుదే సురేష్ వైఖరికి నిరసనగా స్వాతి(Swathi) అత్తవారింటి వద్ద మౌన పోరాటానికి దిగింది. పదేళ్ల ప్రేమకు ఫలితం ఇదేనా అని ఆమె భర్తను ఆవేదనగా ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ.. మధురవాడ ప్రాంతానికి చెందిన తాను, రొంగలినాయుడుపాలెం గ్రామానికి చెందిన సురేష్ విశాఖపట్నం కృష్ణా కళాశాలలో కలిసి చదువుకున్నామని, 2013 నుంచి తమకు పరిచయం ఉందని తెలిపింది. తనను ప్రేమిస్తున్నట్లు సురేష్ తెలపడంతో ఇద్దరం ఇష్టపడినట్లు పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 9న మధురవాడలో రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నామని, అదే ప్రాంతంలో అద్దె ఇంటిలో కాపురం సాగించామని ఆమె తెలిపింది. తన తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదంటూ సురేష్ తమ ఇంటికి గత ఏడాది డిసెంబర్ నుంచి రావడం లేదని ఆమె పేర్కొంది. దీంతో కె.కోటపాడు మండలం రొంగలినాయుడుపాలెంలో గ్రామ పెద్దలకు సురేష్తో జరిగిన వివాహం గురించి తెలిపి ఇద్దరినీ ఒక్కటి చేయాలని కోరినట్టు స్వాతి తెలిపింది. భర్త నుంచి తనను వేరు చేసి తన జీవితాన్ని అన్యాయం చేయవద్దని ఆమె కోరింది. బాధితురాలికి న్యాయం జ రిగేంత వరకూ పోరాటం చేయనున్నట్లు విశాఖపట్నం, కె.కోటపాడు సీఐటీయూ నాయకులు పి.రాజ్కుమా ర్, ఎర్రా దేముడు, గండి నాయుడుబాబు చెప్పారు.రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం -
ఆ హీరోయిన్ తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
-
ఆ హీరోయిన్తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేశ్(Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక నటుడిగా, విలన్గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్లో దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేశ్ ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేశ్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా(Nadiya) గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్గా ఉన్న నదియాతో సురేశ్ లవ్లో ఉన్నారని వినిపించాయి కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నంచిగా ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!)ఈ విషయంపై సురేశ్ మాట్లాడుతూ..'అలాంటిదేం లేదు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్తోనే ఫోన్ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు. కానీ తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు సిస్టర్తో సమానం. తాను సినిమాలో సాఫ్ఠ్గా ఉన్నప్పటికీ.. నాతో మాత్రం కాస్తా గట్టిగానే మాట్లాడుతుంది. తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది. సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది' అని అన్నారు.తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేశ్ అన్నారు. మా 1980 నటీనటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో రజనీకాంత్ సర్ కూడా ఉన్నారని సురేశ్ వెల్లడించారు.సురేశ్ సినీప్రస్థానం..ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేశ్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్లో పలు చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. తెలుగులో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్ అనే మూవీలో నటించారు. కాగా.. హరితా రెడ్డిని పెళ్లాడిన సురేశ్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత సురేశ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు. -
జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్యలో విస్తుగొలిపే విషయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కక్షగట్టి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ను చంపేసిన ఉదంతంలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. పోస్ట్మార్టమ్ నివేదికలో విస్మయకర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముకేశ్ను చిత్రవధ చేసి అంతంచేశారని, చంపేశాక మృతదేహంపైనా తమ పట్టరాని ఆవేశాన్ని చూపించారని పోస్ట్మార్టమ్ నివేదిక పేర్కొంది. ముకేశ్ మృతదేహాన్ని బీజాపూర్ జిల్లా కేంద్రంలోని చఠాన్పారా బస్తీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడికి చెందిన ఇంటి సెప్టిక్ ట్యాంక్లో కనుగొన్నారు. పోస్ట్మార్టమ్ నివేదిక ప్రకారం హంతకులు మృతదేహం నుంచి గుండెను వేరేచేసి, కాలేయాన్ని నాలుగు ముక్కలుచేశారు. తలలో 15 చోట్ల విరిగిన గుర్తులున్నాయి. మెడ విరిగిపోయింది. ఐదు పక్కటెముకలు, మెడ ఎముకలు విరిగిపోయాయి. చేయి విరిచేశారు. తల, ఛాతి, వీపు, పొట్టపై తీవ్రమైన గాయాలున్నాయి. ఇనుప రాడ్డు వంటి బలమైన ఆయుధంతో కొట్టిన గుర్తులున్నాయి. చేతిపై ఉన్న ఒకే ఒక్క పచ్చబొట్టు సాయంతో మృతదేహం ముకేశ్దే అని గుర్తించగలిగారు. తమ 12 ఏళ్ల పోస్ట్మార్టమ్ కెరీర్లో ఇంతటి దారుణమైన హత్యను చూడలేదని వైద్యులు తెలిపారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కలిసి హత్య చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు రితేశ్ చంద్రకర్, దినేశ్ చంద్రకర్, మహేంద్రలను అరెస్ట్చేశారు. ప్రధాన నిందితుడు సురేశ్ సైతం మృతుడికి దూరపు బంధువుకావడం గమనార్హం. బీజాపూర్ రోడ్డు పనులపై నోరు మెదపకుండా ఉండేందుకు మాట్లాడాలంటూ సురేశ్ సోదరుడు రితేశ్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యాక ముకేశ్ కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ స్విచ్చాఫ్ వస్తోందని ముకేశ్ అన్న యుకేశ్ డిసెంబర్ 25న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేయగా హత్య విషయం బయటికొచ్చింది.ప్రధాన నిందితుడు హైదరాబాద్లో అరెస్ట్వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన సురేశ్ చంద్రకర్ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్చేసింది. హత్య జరిగిన జనవరి ఒకటో తేదీ నుంచి తప్పించుకు తిరుగుతున్న సురేశ్ను అతని డ్రైవర్కు చెందిన ఇంట్లో ఎట్టకేలకు అరెస్ట్చేశామని సిట్ ఇన్చార్జ్ పోలీసు అధికారి మయాంక్ గుర్జార్ సోమవారం వెల్లడించారు. సురేశ్ను బీజాపూర్కు తీసుకొచ్చామని, విచారణ కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ చెప్పారు. నిందితులు రితేశ్, దినేశ్లు హతుడు ముకేశ్కు వరసకు సోదరులుకాగా మహేంద్ర రామ్టెకె సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. రాత్రి భోజనం చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా గొడవపడి ఈ ముగ్గురూ చంపేశారని తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడేసి సిమెంట్తో కప్పేశారు.సొంత యూట్యూబ్ చానల్బీజాపూర్లో దాదాపు రూ.120 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఎన్డీటీవీ టీవీఛానెల్ తరఫున ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా చేసే 33 ఏళ్ల ముకేశ్ సొంతంగా ‘బస్తర్ జంక్షన్’ పేరిట యూట్యూబ్ ఛానల్ను విజయవంతంగా నడుపుతున్నాడు. 2021లో బీజాపూర్లో తకల్గూడలో భద్రతాబలగాలపైకి మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ జవాను, కోబ్రా కమాండర్ అయిన రాకేశ్వర్ సింగ్ మన్హాస్ను బంధించి మావోలు తీసుకెళ్లగా చర్చలు జరిపే ఏప్రిల్లో విడిపించడంలో ముకేశ్ కీలకపాత్ర పోషించారు. ముకేశ్ మరణవార్త తెల్సి మహర్ వర్గీయులు సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళులర్పించారు. నిందితులకు కఠిన శిక్ష అమలుచేయాలని డిమాండ్చేశారు. రాయ్పూర్ ప్రెస్క్లబ్లో వందలాది పాత్రికేయులు ధర్నాచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కేసు వివరాలను నివేదిక ఇవ్వాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పీసీఐ ఛైర్పర్సన్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆదేశించారు. ది ప్రెస్ అసోసియేషన్ అండ్ ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సైతం పారదర్శక దర్యాప్తునకు డిమాండ్చేశాయి. -
రాజకీయ కక్షతోనే YSRCP కార్పొరేటర్ సురేష్ పై రౌడీషీట్
-
అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు..
తడ : వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. అందరూ చూస్తుండగానే సహోద్యోగిని కత్తెరతో విచక్షణ రహితంగా పొడిచేశాడు. తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు ప్రభుత్వ పారిశ్రామిక వాడలోని అపాచీ బూట్ల పరిశ్రమల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు.. చిట్టమూరు మండలం కుమ్మరిపాళేనికి చెందిన వెంకటాద్రి.. అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు వనజ(28)ను ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, బురదగాలి గ్రామానికి చెందిన మీజూరు సురేష్(23) కుమ్మరిపాళేనికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అపాచీలో పనికి వెళ్తున్నాడు. కొంత కాలంగా వనజను వేధించడం మొదలెట్టాడు. ఈ విషయంపై 2019, 2021లో చిట్టుమూరు పోలీస్ట్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనానికి వెళ్లిన వనజను అక్కడ మళ్లీ వేధించాడు. దీంతో ఆమె సురేష్ను తీవ్రంగా మందలించింది. ఆవేశానికి గురైన సురేష్ అక్కడే ఉన్న కత్తెర తీసుకుని వనజ మెడ, శరీరంపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వనజ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ కొండపనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వమా.. కళ్లు మూసుకో!
నూజివీడు: టీడీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార జులుంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజు సోమవారం మద్యం తాగి అదే గ్రామ టీడీపీ అధ్యక్షుడు అన్నే సురేష్కు ఫోన్ చేసి దూషించాడు. దీంతో సురేష్.. మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు పోలవరపు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కారుమంచి కిరణ్లతో కలిసి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా నాగరాజును తాళ్లతో బంధించి.. తీవ్రంగా దుర్భాషలాడుతూ ఈడ్చుకెళుతూ కారులో వేసుకుని రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే నాగరాజును తాళ్లతో నిర్బంధించి ఈడ్చూకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాపశివకిషోర్ దృష్టికెళ్లింది. అమానవీయంగా ప్రవర్తించిన నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్బాబులు నలుగురినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. -
రేపు నందిగం సురేష్ ను పరామర్శించనున్న YS జగన్
-
సురేశ్ జోడీ సంచలనం
నార్త్ కరోలినా: విన్స్టన్–సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ ప్లేయర్ దక్షిణేశ్వర్ సురేశ్ సంచలనం సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో సురేశ్ (భారత్)–లుకా పౌ (బ్రిటన్) ద్వయం 6–4, 5–7, 10–8తో ఆరో సీడ్ బెహర్ (ఉరుగ్వే)–మొల్టెని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో సురేశ్ జోడీ తొమ్మిది ఏస్లు సంధించింది. తమ సర్విస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. ‘సూపర్ టైబ్రేక్’లో సురేశ్–లుకా పౌ ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచిసంచలన విజయాన్ని ఖరారు చేసుకుంది. -
జాతీయ విద్యా విధానానికి అనుకూలమా..? వ్యతిరేకమా..?
-
ప్రేమోన్మాది ఆత్మహత్య
రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు. బెయిల్పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్ఐ ముకుందరావును బుధవారం వీఆర్పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్పీకర్ పదవికి పోటీ.. ఓం బిర్లా x సురేష్
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్సభ స్పీకర్ పదవికి అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా పోటీ అనివార్యమైంది. కీలక నేతలను పాత పదవుల్లో కొనసాగిస్తున్న మోదీ 3.0 సర్కారు దానికి అనుగుణంగానే ఎన్డీఏ అభ్యర్ధిగా ఓం బిర్లాను మంగళవారం స్పీకర్ బరిలో నిలిపింది. ఓం బిర్లా 17వ లోక్సభలో ఐదేళ్లు స్పీకర్గా పనిచేసిన విషయం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి ఆఖరి నిమిషంలో.. కాంగ్రెస్ ఎంపీ కొడైకున్నిల్ సురేశ్ను రంగంలోకి దింపింది. పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరించి విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తే.. ఓం బిర్లాకు మద్దతు ఇస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. అయితే బీజేపీ సీనియర్ నేతలు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుందని, ఆ సందర్భం వచ్చినపుడు చూద్దామని బీజేపీ పేర్కొంది. దీనికి ఇండియా కూటమి నేతలు సమ్మతించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి కేటాయిస్తామని హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా పేరు ఖరారయ్యాక కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. చొరవ తీసుకొని విపక్షాలను సంప్రదించారు. రాజ్నాథ్ ఆఫీసులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టి.ఆర్.బాలు మంగళవారం సమావేశమయ్యారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. కొద్దిసేపట్లోనే ఈ భేటీ ముగిసింది. వేణుగోపాల్, బాలు అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. మూడుసార్లు ఎంపీ అయిన ఓం బిర్లా రాజస్థాన్లోని కోటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓం బిర్లా తరఫున 10కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ (ఆర్) పార్టీలు ఓం బిర్లా తరఫున నామినేషన్లు దాఖలు చేశాయి. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత ఎంపీ కే.సురేష్ ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సురేష్ తరఫున మూడుసెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సంప్రదాయాన్ని పాటించడం లేదు: వేణుగోపాల్ విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదని వేణుగోపాల్ ఆరోపించారు. ఓం బిర్లాపై తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామని ప్రకటించారు. విపక్షం ఒత్తిడి రాజకీయాలకు దిగుతోందని, షరతులు పెడుతోందని కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, లలన్ సింగ్ (జేడీయూ)లు అన్నారు. డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునే సమయం వచ్చినపుడు విపక్షాల డిమాండ్ను పరిశీలిస్తామని సీనియర్ మంత్రులు హామీ ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యం షరతులపై నడవదని పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు పోటీకి అంత సుముఖంగా లేనప్పటికీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడోసారి పోటీ స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగుతుంది. ఒకవేళ పోటీ అనివార్యమైతే.. లోక్సభ చరిత్రలో స్పీకర్ పదవికి పోటీ జరగడం ఇది మూడోసారి అవుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1952, 1967, 1976లలో మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. 1952లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వి.మౌలాంకర్ 394 ఓట్లు సాధించి స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి శాంతారాం మోరేకు కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డితో తెన్నేటి విశ్వనాథం పోటీపడ్డారు. సంజీవరెడ్డికి 278 ఓట్లు రాగా, విశ్వనాథంకు 207 ఓట్లు పడ్డాయి. 1976లో జరిగిన ఎన్నిక పూర్తిస్థాయి స్పీకర్ పదవికి కాదు. 1975లో ఇందిగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఐదో లోక్సభ ఐదో సెషన్ను ఏడాది పాటు పొడిగించారు. అప్పటి స్పీకర్ జి.ఎస్.ధిల్లాన్ రాజీనామా చేయడంతో.. జనవరి 5, 1976న పొడిగించిన ఏడాది కాలానికి స్పీకర్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నాయకుడు బలిరామ్ భగత్ను స్పీకర్ పదవికి ఇందిరా గాంధీ ప్రతిపాదించారు. జనసంఘ్ నాయకుడు జగన్నాథరావు జోషి బరిలో నిలువడంతో ఎన్నిక జరిగింది. బలిరామ్ భగత్కు 344 ఓట్లు రాగా, జోషికి 58 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 18వ లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 233 (రాహుల్ గాంధీ వయనాడ్కు రాజీనామా చేయడంతో విపక్షాల బలం ఒకటి తగ్గింది) ఎంపీలున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమికి ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుంది. సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఓం బిర్లా స్పీకర్గా ఎన్నిక కావడం లాంఛనమే. బుధవారం ఓటింగ్ జరిగితే.. పేపర్ స్లిప్పులనే వాడనున్నారు. నూతన సభ్యులు ఎవరెక్కడ కూర్చోవాలో నిర్ణయించే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైతే.. రెండు పర్యాయాలు స్పీకర్గా పనిచేసిన ఐదోవ్యక్తి అవుతారు. కాకపోతే గతంలో కాంగ్రెస్ నేత బలరాం జాఖడ్ ఒక్కరు మాత్రమే రెండుసార్లు (ఏడు, ఎనిమిదో లోక్సభల్లో) స్పీకర్గా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేశారు. అది మా హక్కు: సురేష్ ‘గెలుస్తామా, ఓడుతామా అన్నది ముఖ్యం కాదు. అధికారపక్షం నుంచి స్పీకర్ ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలనేది సంప్రదాయం. గత రెండు లోక్సభల్లో మాకు పత్రిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు మేము గుర్తింపు పొందిన ప్రతిపక్షం. డిప్యూటీ స్పీకర్ పదవి మా హక్కు. కానీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మంగళవారం 11:50 గంటల దాకా ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూశాం. ఎలాంటి సమాధానం రాలేదు’అని కే.సురేష్ అన్నారు. -
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ను ప్రశంసించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్కు వెళ్తున్న ఓ యువతిని కరెక్ట్ సమయంలో పరీక్షా కేంద్రానికి తరలించినందుకు సీఎం రేవంత్.. సురేష్ను అభినందించారు.కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘వాహనాల నియంత్రణ మాత్రమే…తన డ్యూటీ అనుకోకుండా… సాటి మనిషికి సాయం చేయడం…తన బాధ్యత అని భావించిన…ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు…నా అభినందనలు.సురేష్ సహకారంతో…సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి…యూపీఎస్సీ పరీక్షలో…విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్’ అంటూ కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Crime Control News (@crimecontrolnews)జరిగింది ఇది.. యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ యువతికి ఆలస్యం కావడంతో బైకుపై పరీక్షా సెంటర్ వద్ద దిగబెట్టాడు. మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఉన్న ఓ యువతి.. ఆర్టీసీ బస్సులో మైలార్దేవుపల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగారు. అక్కడి నుంచి పరీక్ష కేంద్రం చాలా దూరంలో ఉండటంతో సమయం మించిపోతుండటంతో ఆమె కంగారు పడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ఆమె ఆందోళనను గుర్తించి ఆమె వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. అనంతరం పోలీసు బైక్పై ఆమెను పరీక్షా కేంద్రం వద్ద దిగబెట్టారు. -
ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 24 ఏళ్లకు బీజేపీ గెలుపు సొంతం చేసుకోవడం తెల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించేదెవరన్న విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. అయితే, సీనియర్ నేత, తాజాగా ఎమ్మెల్యే సురేశ్ పూజారిని పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది. దీంతో, సీఎం పదవి ఆయనకే దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శాసనసభా పక్ష నేత ఎవరనేది అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఇలా ఉండగా, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ దృష్ట్యా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 10కి బదులుగా 12న చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. -
నాడు నాలుగు రూపాయల జీతం.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని!
ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి తాను ఏదో ఒకరోజు 22 రెస్టారెంట్లకు యజమానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు. సురేష్ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు.. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకకపోవడంతో ముంబైకి తరలివచ్చాడు. అప్పట్లో సురేష్కు ముంబై గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్కు నెలకు నాలుగు రూపాయలు అందేది.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు. తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్కు ఓ క్యాంటీన్లో ఉద్యోగం వచ్చింది. జీతం ఆరు రూపాయలకు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిర్గామ్ చౌపటీ సమీపంలో సురేష్ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు. నాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఒకసారి తన సురేష్ దుకాణంలో పావ్ భాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్, సురేష్ పూజారి స్నేహితులు అయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావ్ భాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి. సుఖ్ సాగర్ రెస్టారెంట్ దక్షిణ భారత ఆహారాలకు తోడు పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్క్రీమ్ పార్లర్, షాపింగ్ మాల్, త్రీస్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు రిమాండ్ పొడిగింపు -
హతమార్చి వేములవాడ దర్శనానికి నిందితుడు! చివరికి..
కరీంనగర్: తన భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే నాగెల్లి భూమేశ్.. సురేశ్ అనే యువకుడిని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన హత్య నేరానికి సంబంధించిన వివరాలను సోమవారం రాయికల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్ వరుసకు అన్నదమ్ముల్లు. భూమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో సురేశ్ భూమేశ్ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా సురేశ్ పట్టించుకోలేదు. 2023 అక్టోబర్లో దుబాయ్ నుంచి ఇంటికి వస్తూనే సురేశ్ను చంపాలనే ఉద్దేశంతో వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని గమనించాడు. దీంతో సురేశ్పై పగ పెంచుకుని, ఎలాగైనా చంపాలని అనుకుని ఈనెల 7న ఉదయం పొలం వద్దకు నీరు పెట్టడం కోసం సురేశ్ వెళ్లడాన్ని గమనించాడు. ప్లాన్ ప్రకారం కత్తిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి కొద్దిదూరంలో ఉన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనాన్ని పెట్టాడు. తన పొలానికి నీరు పెట్టేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సురేశ్ను ఆపి తాను పొలానికి వస్తున్నానని చెప్పాడు. పొలం గట్టుదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపగానే భూమేశ్ వెంట తెచ్చుకుని కత్తితో సురేశ్ తల, మెడపై విచక్షణరహితంగా నరికాడు. కిందపడిన సురేశ్ ప్రాణభయంతో బావి వైపు పరుగెత్తుతుండగా మరోసారి నుదుటిపై, తలపై కత్తితో నరికాడు. దీంతో తీవ్రంగా గాయాలైన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్ మృతదేహాన్ని అదేబావిలోకి తోసేశాడు. కత్తిని కూడా అదే బావిలో పడేశాడు. రక్తం మరకలు శుభ్రం చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికొచ్చి స్నానం చేసి అనంతరం వేములవాడ రాజన్న (శివరాత్రి జాతర) దర్శనానికి వెళ్లాడు. సురేశ్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే సురేశ్ బావిలో శవమై కనిపించాడు. హత్య విషయాన్ని తెలుసుకున్న రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎస్సై అజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేశ్ తల్లి నాగేల్లి లక్ష్మి భూమేశ్పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భూమేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన సమాచారం మేరకు బావిలో పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో వినియోగించిన రెండు మొబైల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్న సీఐ, రాయికల్ ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. ఇవి చదవండి: పెళ్లి పేరుతో సీరియల్ నటి మోసం -
నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి, కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ పచౌరీ కూడా కాంగ్రెస్ను వీడారు. సురేష్ పచౌరీ నేడు (శనివారం) భోపాల్లో జరగనున్న ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరబోతున్నారు. 1972లో ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేరి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1983 వరకు ఈ పదవిలో కొనసాగారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ పచౌరీ 1984లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ నేత సురేష్ పచౌరీ 1984,1990, 1996, 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగానూ పనిచేశారు. -
చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
కరీంనగర్: చేపల వేట కు వెళ్లి ఓ యువకుడు కాలువలోపడి మృతి చెందాడు. రామగుండం కార్పొరేషన్లోని ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన పిట్టల సురేశ్(30) ఆదివారం సమీపంలోని ఎన్టీపీసీ వరద కాలువలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవాశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి తల్లి పిట్టల బాయమ్మ తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు గాలింపు చేపట్టి సురేశ్ కాలువలో పడిమృతి చెందాడని గుర్తించారు. ఈమేరకు బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం! -
కాకర్ల ఎలా గెలుస్తారో నేను చూస్తా..
ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సరేష్కు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి బొల్లినేని రామారావు అధిష్టానంపై ఫైర్ అయ్యారు. ‘కాకర్ల ఎలా గెలుస్తారో నేను చూస్తా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నా సత్తా ఏంటో చూపిస్తా.. పన్నెండేళ్లుగా పార్టీ కోసం సర్వం అర్పించా.. ఉదయగిరిలో పార్టీకి దిక్కు లేని సమయంలో పార్టీని, క్యాడర్ను కాపాడుకున్నా.. ఆర్థికంగా ఎంతో నష్టపోయా.. ఇప్పుడు డబ్బు సంచులకు అమ్ముడుపోయి, కనీసం రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఉదయగిరి టికెట్ ఇచ్చి నా గొంతు కోశారు..’ అంటూ తన ఆంతరంగికుల వద్ద బొల్లినేని రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరిలో బొల్లినేని శుక్రవారం టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు తనను మోసం చేయరు అని చెప్పి 12 గంటలు గడవక ముందే నియోజకవర్గ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేరు ప్రకటించడంతో బొల్లినేని షాక్కు గురయ్యారు. నమ్మిన వారిని నట్టేట ముంచే గుణం ఉన్న చంద్రబాబు బొల్లినేని విషయంలో అలాగే చేశారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉదయగిరి నుంచి మా నాయకుడు బొల్లినేని బరిలో ఉంటారు.. ఇక్కడ చంద్రబాబు ఆటలు సాగవు.. కాకర్ల సురేష్ పేరును వెంటనే విత్డ్రా చేసుకుని బొల్లినేనిని అభ్యర్థిగా ప్రకటించాలి.. లేకపోతే మా సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తాం..’ అంటూ బొల్లినేని అనుచర వర్గం తీవ్ర ఆగ్రవేశాలతో రగిలిపోతున్నారు. ఉదయగిరిలో ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఏ పంచాయతీలో టీడీపీ నాయకుడు ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఎలా ప్రకటిస్తారంటూ టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు. ‘లోకేశ్ డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముకున్నారు.. కాకర్లను ఎలా గెలిపిస్తారో చూస్తాం.. మీరేమీ అధైర్యపడొద్దు’ అంటూ బొల్లినేనికి ఆయన అనుచరులు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై ఫైర్ టీడీపీ జాబితా మరో గంటలో ప్రకటించే ముందు చంద్రబాబు బొల్లినేనికి ఫోన్ చేసి.. ‘కాకర్ల సురేష్కు ఉదయగిరి టికెట్ ఇస్తున్నాం.. మీకు రాజ్యసభ సీటు ఇస్తాం’ అని చెప్పబోతుండగా బొల్లినేని తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా తనను వాడుకొని, ఇప్పుడు కరివేపాకులా తీసిపడేయడం ఏంటని గట్టిగా అధినేతపై ఫైర్ అయినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు వారించేందుకు ప్రయత్నించగా.. ఉదయగిరిలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ బొల్లినేని ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. వెంటనే తన అనుచరులతో మాట్లాడుతూ ‘కాకర్లను ఓడించి తీరాలి.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి మన సత్తా చూపిద్దాం..’ అని బొల్లినేని అన్నట్లు తెలిసింది. త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అనుచరులతో అన్నట్లు సమాచారం. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని బొల్లినేని వైఎస్సార్పీపీ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. రాజీనామా బాటలో బొల్లినేని అనుచరులు టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సురేష్కు ప్రకటించడంతో తీవ్రంగా రగిలిపోతున్న బొల్లినేని అనుచరుల్లో కొంతమంది ఆ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ దుత్తలూరు మండల కేంద్రం ఇన్చార్జి కండగుంట్ల వెంకటరెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. పలు మండలాల్లో ఆదివారం సమావేశాలు నిర్వహించి పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు. మొత్తమ్మీద ఉదయగిరి టీడీపీ టికెట్ ప్రకటన కాకర్ల వర్గీయుల్లో ఆనందాన్ని నింపితే.. బొల్లినేని వర్గీయులను నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
Maithili: 'ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్' గా.. వేగాన్ లెదర్!
"ఒక చదరపు మీటరు లెదర్ తయారయ్యే ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఎంతో ఊహించగలరా? అక్షరాలా 17 కిలోలు. లెదర్ బ్యాగ్లు, షూస్, బెల్టులు, పర్సులు, వాచ్ల మీద మనకున్న మక్కువ తక్కువేమీ కాదు. కానీ పర్యావరణానికి ఇంత చేటు చేస్తుందని తెలిసిన తర్వాత వాటి వాడకాన్ని ప్రోత్సహించలేం, మమకారాన్ని చంపుకోలేం. అన్నింటికీ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాం కదా! దీనికి కూడా ఓ మార్గం కనిపించకపోతుందా! సరిగ్గా ఇలాగే ఆలోచించిన మైథిలి పోకచెట్టు బెరడుతో ఓ ప్రత్యామ్నాయాన్ని మన ముందుకు తెచ్చారు. అదే వేగాన్ లెదర్. వేగాన్ లెదర్ని ఎకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్గా పరిచయం చేస్తున్నారు మైథిలి." తిరిగి ఇచ్చేద్దాం! మైథిలిది కర్నాటకలోని శృంగేరి. ఆమె భర్త సురేశ్తో కలిసి ‘భూమి ఆగ్రో వెంచర్స్’ పేరుతో వేగాన్ లెదర్ తయారీ పరిశ్రమను స్థాపించారు. ఈ ప్రయత్నం కేవలం పర్యావరణహితం కోసం, మనుషులను పర్యావరణ హిత జీవనశైలి దిశగా నడిపించడమేనన్నారామె. కంప్యూటర్స్తో మొదలు పెట్టిన కెరీర్ వేగాన్ లెదర్ పరిశ్రమ వైపు మలుపు తీసుకోవడాన్ని వివరించారామె. మాది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలో లక్షలాది ఎకరాల్లో పోక చెట్లను పెంచుతారు. మేము చదువు పూర్తయిన తర్వాత శివమొగ్గలో కంప్యూటర్ సేల్స్, సర్వీసెస్ వ్యాపారం మొదలుపెట్టాం. పాతికేళ్లపాటు విజయవంతంగా నిర్వహించాం. ఇక మా వంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే అభి్రపాయానికి వచ్చాం. అలాంటి సమయంలో ఓ సారి మా సొంతూరికి వచ్చినప్పుడు పోకచెట్టు బెరళ్లను చూసినప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కప్పులే కాదు చెప్పులు కూడా! పర్యావరణ ప్రేమికులు కొందరు పోకచెట్టు బెరడుతో ఫంక్షన్లలో భోజనం వడ్డించే ప్లేట్లు, పాయసం వడ్డించే కప్పుల వంటి వాటిని చేస్తున్నారు. పేపర్ ప్లేట్కు బదులు అరెక్కా (పోకచెట్టు) ప్లేట్ వాడడం వల్ల పేపర్ తయారీ సమయంలో జరిగే నీటికాలుష్యాన్ని నివారించిన వారమవుతాం. అయితే పోకచెట్టును ఇంకా విస్తృతంగా వినియోగంలోకి తీసుకు రాగలిగితే పర్యావరణానికి హానికారకంగా మారుతున్న అనేక పరిశ్రమలకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని ఆలోచించాం. అప్పుడు మాకు మొదటగా తోళ్ల పరిశ్రమ గుర్తువచ్చింది. నెదర్లాండ్స్కు చెందిన త్జీర్డ్ వీన్హోవెన్ కూడా తోళ్లకు ప్రత్యామ్నాయం కోసం మొక్కలపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిసింది. మా పోకచెట్టు బెరడు ఆలోచన వీన్హోవెన్కు కూడా నచ్చింది. ప్రయోగాలు చేయగా చేయగా మా ప్రయత్నం విజయవంతం అయింది. ఇది జంతువులకు ప్రాణహానిని నివారించే లెదర్ కాబట్టి వేగాన్ లెదర్, పామ్ లెదర్ అంటున్నాం. రసాయన రహిత, భూమిలో కలిసిపోయే మెటీరియల్ ఇది. తేలికగా ఉంటుంది కూడా. ఇప్పుడు పెద్ద ఎత్తున వేగాన్ లెదర్ను ఎగుమతి చేస్తున్నాం. వీటితో పెన్హోల్డర్లు, చెప్పులు, పుస్తకాల అట్టలు, వ్యానిటీ బ్యాగ్ తదితరాలు తయారవుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు ఇందులో చక్కటి సేవందిస్తున్నారు. గత ఏడాది మే–జూన్ నెలల్లో జీ 20 సదస్సుల సందర్భంగా స్టాల్ నిర్వహించాం. యానిమల్ లెదర్ తయారీలో కార్బన్ డయాక్సైడ్తోపాటు నీటి కాలుష్యం కూడా ఎక్కువే. యానిమల్ లెదర్ కోసం పాతిక వేల లీటర్ల నీరు అవసరమయ్యే చోట పామ్ లెదర్ తయారీకి నీటి వాడకం ఆరు వందల లీటర్లకు మించదు. పైగా పామ్ లెదర్ తయారీలో వాడిన నీటిని తిరిగి పంటలకు వినియోగించుకోవచ్చు కూడా. మేము సమాజానికి తిరిగి ఇవ్వాలనే ప్రయత్నంతో చేసిన ఆలోచన నుంచి పర్యావరణానికి మా వంతుగా సేవలందించే అవకాశం వచ్చింది. సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు’’ అన్నారు మైథిలి. ఇవి చదవండి: ‘మనకెందుకమ్మా వ్యాపారం.. పెద్ద రిస్క్’ అని అనుకుంటే..!? ఇప్పుడిలా.. -
వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!
సురేశ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు. మొదట్లో హీరోగా, తర్వాత విలన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఇతడు ఈ మధ్య మాత్రం చిత్రాల సంఖ్యను బాగా తగ్గించేశాడు. అరకొర సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు గొంతు అరువిచ్చాడు కూడా! నాతో విడాకులయ్యాక కూడా అదే పేరు.. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నా మొదటి భార్య పేరు హరితా రెడ్డి. తను మొదట్లో ఇండస్ట్రీలోనే ఉండేది. కానీ చదువుకోవాలన్న కోరికతో కెమెరా ముందు నటించడం మానేసింది. నన్ను పెళ్లి చేసుకున్నాక తన పేరును అనితా సురేశ్ అని మార్చుకుంది. మాకు ఓ బాబు కూడా పుట్టాడు. నాతో విడాకులై రెండో పెళ్లి చేసుకున్నాక కూడా అదే పేరు కొనసాగిస్తోంది. ఒకప్పుడు నా భార్య స్థానంలో ఉంది, ఇప్పుడు నా స్నేహితురాలి స్థానంలో ఉంది. వరుస మారిందే కానీ మా మధ్య ఆప్యాయత మారలేదు. చెరి సగం పంచుకున్నాం.. విడిపోవడానికి మా మధ్య ఎటువంటి గొడవలు జరగలేవు. కాకపోతే నాకు 21, ఆమెకు 18 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేశారు. తనకు పెద్ద చదువులు చదవాలని కోరిక! అమెరికాలో సెటిలవ్వాలని ఉండేది. నేను సినిమాల్లో బిజీ అవడంతో తనతో పాటు రానని చెప్పేశాను. అందుకని విడిపోయాం. ఎవరు ఎక్కువ సంపాదించారు? అన్నదాన్ని పక్కనపెట్టి ఉన్న ఆస్తిని ఇద్దరం చెరి సమానంగా పంచుకున్నాం. వాళ్లింట్లోనే ఉంటా.. తను అమెరికా వెళ్లిపోయి అక్కడే చదువుకుంది. రెండో పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైంది. ఆమె భర్త చాలామంచివాడు. నా కొడుకును కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నేను కూడా ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్నాను. దర్శకరచయిత్రి రాశిని పెళ్లాడాను. ఇకపోతే నేను అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లో ఉంటాను. వాళ్లు ఇండియా వస్తే నా ఇంట్లో ఉంటారు. మేమంతా కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాము' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అప్పట్లో రిలేషన్స్.. ఇప్పుడు వాళ్లంతా ఫ్రెండ్స్.. -
స్లిమ్గా మారిన నటుడు సురేష్! డాక్టర్లే అదేం డైట్ అన్నారు? చివరికి..
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్గా పలు విభిన్న పాత్రలతో మెప్పించిన వ్యక్తి. అదీగాక నటుడిగా సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు కూడా. కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత విలన్ పాత్రలు, తండ్రి పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. మొన్నటి వరకు మనం సురేషని పెద్ద తరహాలో లావుగా చూశాం. ఇప్పుడూ కుర్రాడిలా స్లిమ్గా హీరో లుక్లో కనిపిస్తున్నారు. ఇంతలా మారిపోయిన సురేష్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో తాను ఫాలో అయ్యిన డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఏకంగా 15 గంటల వరకు నో ఫుడ్.. ఒకప్పుడు సినిమాల్లో మంచి స్లిమ్గా హీరోలా కనిపించే సురేష్ గత కొద్దికాలం క్రితం బాగా లావయ్యారు. సుమారు 120 కిలోల బరువు ఉండేవారు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి సీరియల్స్లో నటించడంతో అంతా బరువుగా ఉండటం వల్లే సినిమాలు చేయడం లేదని అనుకున్నారు. ఆ మాటాలు సురేష్ చెవిన పడటంతో ఎలాగైనా బరువు తగ్గాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్లుతెలిపారు నటుడు సురేష్. అందుకోసం గత ఐదు నెలలుగా చాలా కఠినమైన డైట్ ఫాలో అయినట్లు చెప్పారు. అందువల్లే ఇంతలా బరువు తగ్గానని అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఫాలో అయిన డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను నిద్ర లేచిన గంట వరకు ఎలాంటి ఫుడ్స్ తీసుకోనని, కేవలం నీళ్లు, గ్రీన్ టీ వంటివే తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఒక గంటకి అరటి పండు లేదంటే ఆపిల్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అదీ కాదంటే టమాట తింటానన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్లోని తెల్ల సొన తింటానన్నారు. ఇక బ్రేక్ ఫాస్ట్గా ఓట్స్ తింటానని, ఎక్కువగా ఉడికించిన కాయగూరలే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. లంచ్లో పుల్కాలు కొద్దిగా రైస్ తీసుకుంటానని చెప్పారు. ఆదివారం వస్తే బిర్యానీ రైస్, గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్, తప్పనసరిగా ఉండాల్సిందే అన్నారు. మధ్యాహ్నం కడుపునిండా ఫుడ్ తీసుకున్నా 15 గంటల వరకు ఏం తిననని చెప్పారు సురేష్. అంటే మధ్యాహ్నాం ఒంటి గంటకు తింటే మరుసటి రోజు ఉదయం వరకు ఏం తినేది ఉండదు. మరీ తట్టుకోలేనంటే ..కొద్దిగా నీళ్లు లేదా మజ్జిగలో కాస్త నిమ్మరసం పిండుకుని తాగడం వంటివి చేస్తానని చెప్పారు. ఆ డైట్ చూసి.. డాక్టర్లే షాకయ్యారు.. తన డైట్ గురించి విని డాక్టర్లు షాకయ్యారని సురేష్ చెప్పారు. గత ఐదు నెలలుగా ఈ డైటే ఫాలో అవుతున్నట్లు తెలిపారు. అలా 21 కేజీల వరకు బరువు తగ్గినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను 88 కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు. ఐతే ఇలా 15 గంటలకు వరకు ఏం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరిగే అవకాశమే ఉండదన్నారు. ఎందుకంటే కాస్త తినడానికి విరామం ఇవ్వడం వల్ల బరువు ఆటోమెటిక్గా తగ్గిపోతాం అని వివరించారు సురేష్. అయితే ఈ డైట్ మొదలు పెట్టే ముందు తాను ఎన్ని రోజుల వరకు తినకుండా ఉండగలనో చెక్ చేసుకున్నట్లు తెలిపారు. తాను మూడు రోజుల కేవలం నిమ్మకాయ నీళ్లతో ఏం తీసుకోకుండా ఉండగలిగానని, అప్పుడే ఏకంగా ఆరు కేజీలు వరకు తగ్గానని అన్నారు. ఈ విషయమే వైద్యులకు చెప్పగా..వాళ్లు కోప్పడి అదేం డైట్? చచ్చిపోతావ్! అని ఫైర్ అయ్యారని అన్నారు. సరైన విధంగా డైట్ ఫాలో అవ్వు అని హెచ్చరించడంతో ఇలా డైట్లో పలు మార్పులు చేసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాను మొదట్లో ఐదు నిమిషాలే వాకింగ్ చేసేవాడినని, ఇప్పుడూ ఏకంగా 18 కిలోమీటర్లు వరకు వాకింగ్ చేస్తున్నట్లు చెప్పారు నటుడు సురేష్. (చదవండి: మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..? ఎందువల్ల వస్తుంది?) -
కోరిక తీర్చాలంటూ వివాహితకు వేధింపులు
ముత్తారం (మంథని): పరుష పదజాలంతో దూషించడంతోపాటు అసభ్య సైగలు చేస్తూ ఓ కామాంధుడు తన కామవాంఛ తీర్చాలని వివాహితను వేధించాడు.. అడ్డుకోబోయిన మరో మహిళపై సైతం దాడిచేశాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆదివారం మధ్యాహ్నం తన బాబును ఇంటి ఎదుట ఆడిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఎర్రం సురేశ్ అక్కడకు చేరుకుని ఆమెను బూతులు తిడుతూ, అసభ్య సైగలతో కామవాంఛ తీర్చాలని వేధించాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన సురేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి రాత్రి సమయంలో తన సహచరుడు రేగల గట్టయ్యతో కలిసి సురేశ్ కారులో మళ్లీ యువతి ఇంటికి చేరుకున్నాడు. సురేశ్, గట్టయ్య కలిసి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డువచ్చిన స్థానికుడు బియ్యని కృష్ణస్వామిపై దాడికి దిగారు. తన భర్తను ఎందుకు కొడుతున్నావని కృష్ణస్వామి భార్య నవలోక దుండగులను ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన సురేశ్ గట్టయ్య సాయంతో కారు డోర్లో నవలోక చెయ్యి ఇరికించి సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు బైక్లతో వెంబడించినా నిందితుల ఆచూకీ లభించలేదు. తీవ్రంగా గాయపడ్డ నవలోకను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వివాహిత, బాధిత మహిళ కుటుంబ సభ్యులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కారు దగ్ధం.. స్థానికులు వెంబడించడంతో నిందితులు తమ కారులో మైదంబండ నుంచి మచ్చుపేట, లక్కారం మీదుగా సర్వారం వెళ్లే రోడ్డు మీదుగా పరారయ్యారు. చివరికి సర్వారంలోని ఓ డ్రైనేజీలో కారు దిగబడి ఆగిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు తప్పించుకుని పారిపోయారు. అయితే, తెల్లవారేసరికి కారు కాలిపోయింది. ప్రమాదవశాత్తు కాలిపోయిందా, లేదా ఎవరైనా కాల్చివేశారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘దొంగ’ నాటకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెర పడింది! వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు మూడింతలు అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్లు వీటిల్లో 80 నుంచి 90 శాతం వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. నాడు సేవామిత్ర.. నేడు మైపార్టీ డ్యాష్ బోర్డ్ గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా మైపార్టీ డ్యాష్ బోర్డ్ డాట్కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్న వారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతోపాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా, స్థానికంగా నివాసం ఉంటున్నా శాశ్వతంగా వలస వెళ్లినట్లు పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని రెండు ప్రదేశాల్లో రెండు ఓట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహం రచించింది. కుప్పలు తెప్పలుగా అందిన ఫారం 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80 శాతం తప్పుడువేనని తేల్చుతూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేకంగా గురి పెట్టి అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది. నెల్లూరులో సింహభాగం నకిలీ ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లు తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోనేరు సురే‹Ùతో కలిసి ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 85 శాతానికి పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే కథ. విజయనగరం 4 నియోజకవర్గాల్లో ♦విజయనగరం జిల్లాలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన 19,407 మంది ఓట్లు తొలగించాలని కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7లను ఎన్నికల సంఘానికి సమర్పించాడు. ♦ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన విజయనగరం జిల్లా కలెక్టర్ 8,318 ఫారం 7లు తప్పుడువని తేల్చుతూ నివేదిక ఇచ్చారు. కర్నూలులో 88 శాతం బోగస్ ♦కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 67,370 ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశాడు. వీటిలో అత్యధికంగా కోడుమూరులో 17,576, ఆదోనిలో 13,968, ఆలూరులో 11,581 బోగస్ దరఖాస్తులున్నాయి. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీటిపై బీఎల్వోలు, డిప్యూటీ తహసిల్దార్లు, తహసిల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా 59,054 ఫారం 7లు బోగస్ అని తేలింది. అంటే 88 శాతం తప్పుడు ఫారం 7లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. 11,935 మంది బతికే ఉన్నా వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అన్నమయ్య.. అక్రమ మార్గంలో ♦ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 40,358 మంది ఓట్లు తొలగించాలంటూ కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి అందచేశాడు. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ 25,097 దరఖాస్తులు నకిలీవని నిర్థారించారు. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి టీడీపీ తప్పుడు దరఖాస్తులు సమర్పించినట్లు బహిర్గతమైంది. -
కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా..
గాంధారి(ఎల్లారెడ్డి): కుటుంబ కలహాలతో తండ్రీకొడుకులు కన్నుమూశారు. తండ్రి కత్తితో పొడవడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. తండాకు చెందిన బాదావత్ వసంత్రావు (48) కుమారుడు బాదావత్ సురేశ్ (27) హైదరాబాద్లో ప్రైవే టు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం తండాకు వ చ్చాడు. బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారు. ఆగ్రహం చెందిన తండ్రి ఇంట్లోని కత్తితో కొడుకు సురేశ్ ఎడమ వైపు ఛాతీపై పొడవగా తీవ్రంగా గాయపడ్డాడు. కు టుంబ సభ్యులు, తండావాసులు చికిత్స ని మిత్తం గాంధారి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సురేశ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఇంటి వద్ద ఉన్న తండ్రి వసంత్ రావు పురుగు మందు తాగా డు. బంధువులు అతడిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. తండ్రీ కొడుకును హత్య చేశాడని ఆగ్రహించిన బంధువులు వసంత్రావు ఇంటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రేమ్దీప్ తెలిపారు. ఇవి కూడా చదవండి: కారు వేగం ధాటికి.. ఇద్దరు యువకుల విషాదం! -
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఎంపీ సురేష్ కామెంట్స్
-
నరసరావుపేటలో బడుగుల వేడుక
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. బడుగు, బలహీన వర్గాలు వేడుక జరుపుకొన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన చేయూతతో రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సగర్వంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సోమవారం సాయంత్రం 4.45 గంటలకు లక్ష్మీతిరుపతమ్మ కాలనీ నుంచి ప్రారంభమైన యాత్ర పల్నాడు బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఈ యాత్రకు వేలాది మంది ప్రజలు.. మహిళలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. గజమాలతో స్వాగతం పలికారు. మత పెద్దలు యాత్ర విజయవంతానికి ప్రార్థనలు చేశారు. పల్నాడు బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో పాల్గొన్న నేతలు ముందుగా జాతీయ నేతలకు నివాళులర్పించారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్ చేసిన మేలును మంత్రులు, నేతలు వివరించారు. ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం: మంత్రి సురేష్ గతంలో రాష్ట్రంలో పెత్తందార్ల పాలన సాగిందని, కానీ సీఎం వైఎస్ జగన్ హయాంలో బడుగువర్గాల ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిజమైన సామాజిక సాధికారత ఫలితాలు ఎలా ఉంటాయో చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. బడుగువర్గాలకు చెందిన తనలాంటి ఎంతో మందిని మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా చేసి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించారన్నారు. గుర్రం జాషువా ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో పెడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారన్నారు. ఇక నుంచి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి వస్తాడని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సామాజిక విప్లవాన్ని ఆచరణలో చూపిన సీఎం జగన్: మంత్రి నాగార్జున దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని, దేశం బాగుపడాలని, పేదవారు బాగుండాలని కోరుకున్నారని, కానీ దాన్ని ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఒక్క సీఎం జగన్ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నో అవమానాలు, దాడులు ఎదుర్కొన్నామని చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా రూ.2.40 లక్షల కోట్లు పేదలకు అందించారని తెలిపారు. పేదల పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందిస్తున్నారని, పేదవాడు ధైర్యంగా బతికేలా చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని 11.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారంటే జీవన ప్రమాణాలు పెరిగాయో, తగ్గాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. జగనన్న చెప్పినవి, చెప్పనివి కూడా చేసి ప్రజల మన్ననలు పొందారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటు వేయని ప్రతిపక్ష పార్టీల అభిమానులకు సైతం మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. సామాజిక సాధికార సభలకు ఇన్ని వేల మంది వస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి పచ్చమీడియా జనం లేరని అసత్య ప్రచారం చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. అదే పవన్ సభకు 10 మంది వస్తే 100 మంది వచ్చారని, చంద్రబాబుకు నలు గురు వస్తే 400 మంది అని చూపుతారని అన్నారు. సీఎం జగన్ పాలనలో పేదలకు సంక్షేమ ప«థకాలతోపాటు విద్య, వైద్యం వంటి రంగాల్లో ఊహించని అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు కుంభా రవి, జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలోనే సాధికారత
తెనాలి (పట్నంబజారు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, ప్రాంత, రాజకీయ పక్షపాతం లేకుండా ప్రతి పేదవాడి ఇంటి ముంగిటకు సంక్షేమాన్ని తీసుకెళ్లారని మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, కేవలం ఒక సామాజిక వర్గం, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారికే పాలన అందించారని మంత్రి సురేష్ తెలిపారు. అణగారిన వర్గాలు, బడుగు, బలహీన వర్గాల పేదలకు పరిపాలనను చేరువ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఎన్ని దాడులు చేసిందో అందరికీ అనుభవమేనన్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి లేని పాలన, సమర్థవంతమైన నాయకత్వం నాలుగు స్థంభాలుగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. 70 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాధికారత కల్పించారని తెలిపారు. సామాజిక సాధికారత కోసం తాము యాత్ర చేస్తుంటే రిమాండ్ ఖైదీ కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పక్షపాత పార్టీ అని మంత్రి జోగి రమేష్ చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో చేసింది చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను చేస్తున్న దమ్మున్న నేత సీఎం జగన్ అని అన్నారు. ఇప్పటివరకు రూ.2.31 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చుపెట్టిన ఘనత సీఎం జగన్దే అని అన్నారు. 2019లో ఓటు వేయని వారు కూడా వైఎస్ జగన్ పరిపాలన చూసి 2024లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లను గెలవబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. సినిమాల్లో హీరోగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో కామెడీ యాక్టర్గా మారిపోయారని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి విమర్శించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ను తట్టుకోలేక టీడీపీ, జనసేన భూస్థాపితం కావడం తథ్యమన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన చేర్చిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జగనన్న రావడానికి ముందు అన్నీ స్కామ్లేనని, జగనన్న వచ్చాక అన్నీ స్కీములేనని, ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. టీడీపీ మైనార్టీలకు చేసింది ఏమిలేదని చెప్పారు. మాయమాటలతో బీసీల ఓట్లు వేయించుకునే రాజకీయాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లు చీటి రాశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి చెప్పారు. జన్మభూమి అనే పనికిమాలిన కమిటీల ద్వారా టీడీపీ సిగ్గుమాలిన పాలన చేసిందని, అందుకు భిన్నంగా పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం జరిగిందని, ఇంకా చేస్తానని ఆయన స్పష్టంగా చెబుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అంబేడ్కర్ భావజాలాన్ని, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. సీఎం జగన్ బీసీ సాధికారతను చేతల్లో చూపించారని మాజీ ఎంపీ బుట్ట రేణుక తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో రూ.1,800 కోట్ల తో సంక్షేమం, అబివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని చెప్పారు. దేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు రోశయ్య, షేక్ మహ్మాద్ ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు. సామాజిక సాధికార రణభేరి ఇది తెనాలి: దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సామా జిక న్యాయాన్ని నెలకొల్పారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తలెత్తుకొని తిరిగేలా చేశారని తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలు, జెండాలు, అజెండాలు లేకుండా అందరం మనసున్న జగనన్న బాటలోనే నడుస్తామని చెప్పారు. ఇది సామాజిక సాధికార రణభేరి అని, సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి జరిగింది కాబట్టే, సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించమని కోరుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైంది. కొలకలూరు బాపయ్యపేట వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడే కుండల తయారీలో ఉన్న శాలివాహనులను పలకరించిన అనంతరం మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వికేంద్రీకరణ మంత్రంతో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 3.5 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు సాధికారత చేకూరిన విధానాన్ని ప్రజలకు వివరించి, వైఎస్ జగన్ను ఆశీర్వదించాలని ప్రజలను ధైర్యంగా కోరతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, ముస్తాఫా, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి పాల్గొన్నారు. -
పెట్టుబడి మోసం కేసులో ఆర్ కే సురేష్కు నోటీసులు?
కొరుక్కుపేట: ఆరుద్రా గోల్డ్ కంపెనీ ప్రధాన కార్యాలయం చైన్నెలో ఉంది. ఈ కంపెనీ నిర్వాహకులపై పెట్టుబడులు 25 నుంచి 30 శాతం వడ్డీ క్లెయిమ్ చేసి దాదాపు లక్ష మంది ఇన్వెస్టర్లను (రూ.2,438 కోట్ల మేర) మోసం చేశారనే ఫిర్యాదు నమోదైంది. దీనికి సంబంధించి, ఆర్థిక నేరాల బ్యూరో, కంపెనీ డైరెక్టర్లు సహా 21 మందిపై కేసు నమోదు చేసింది. అరెస్టయిన వారిని పోలీసులు విచారణ చేశారు. ఇందులో ఆరుద్ర స్కాంలో బీజేపీ నాయకుడు, నటుడు ఆర్కే సురేష్ హస్తం ఉన్నట్లు తేలింది. దీంతో సంబంధిత డాక్యుమెంట్లతో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆర్కేకు ప్రొహిబిషన్ విభాగం సమన్లు జారీ చేసింది. ఆయన హాజరు కాకపోవడంతో నేరాల విభాగం పోలీసులు ఆస్తిని స్తంభింపజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం, అతను దుబాయ్లో ఉన్నందున, పరస్పర చట్టపరమైన చర్యల ద్వారా అతన్ని దేశానికి తీసుకురావడానికి ఆ దేశ ప్రభుత్వాన్ని సంప్రదించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో దుబాయ్లో ఆరుద్ర మోసం కేసులో ఫారెస్ట్ డైరెక్టర్లు రూ.500 కోట్లు దాచుకున్నారని, దుబాయ్లోని ఆస్తులను స్తంభింపజేసేందుకు దుబాయ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు సమాచారం అందించారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో దాన్ని వెంటనే అమలు చేయాలని ఆర్థిక నేరాల విభాగం మళ్లీ ఆదేశాలు పంపింది. ఇప్పటి వరకు కోట్ల విలువైన కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన 127 ఆస్తులు, 60 ఆస్తులను స్తంభింపజేశారు. అలాగే రూ.102 కోట్ల బ్యాంకు ఖాతా స్తంభించగా, రూ.6.5 కోట్లు. కోట్ల విలువైన 6 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దశగా ఇంటర్పోల్ సహాయంతో దుబాయ్లో తలదాచుకున్న డైరెక్టర్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఉత్సాహంగా టిడ్కో గృహ ప్రవేశాలు
కాకినాడ : టీడీపీ పాలనలో జరిగిన అసంపూర్ణ నిర్మాణాలు, లోపాలను సరిచేసి ప్రైవేటు లేఅవుట్లలో ఉండే బహుళ అంతస్తుల భవనాల తరహాలో రూపుదిద్దుకున్న టిడ్కో గృహాలను శుక్రవారం జిల్లా కేంద్రం కాకినాడలో లబ్ధిదారులకు అప్పగించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరై తొలి విడత 1,152 మందికి ఇళ్ల పత్రాలు, తాళాలు అప్పగించారు. సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా నిర్మితమైన ఇళ్లను చూసుకుని లబ్ధిదారులు మురిసిపోయారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీసుకున్న చొరవ వల్ల లబ్ధిదారుల సొంతింటి కల సాకారమైందన్నారు. ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, రూ.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమకూర్చిన రెండు ఉచిత బస్సులను మంత్రి సురేష్ ప్రారంభించారు. అవినీతిపరుడిని వెనుకేసుకొస్తున్న పవన్ టీడీపీ, జనసేన పొత్తుకు ఎలాంటి అజెండా లేదని, అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబును పవన్కళ్యాణ్ వెనకేసుకురావడాన్ని మంత్రి తప్పుబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలిస్తున్నట్టు చెప్పారు. అమ్మఒడి వంటి ప్రయోజనాలు కల్పించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. -
చిన్నారి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'! మంత్రి హరీశ్రావు అభినందన!!
సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన సురేశ్, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది. ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ.. చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ ప్రొసీజర్ను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంది. వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్లైన్ యాప్ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్ బుక్లో చోటు దక్కినట్లు చీఫ్ ఎడిటర్ డాక్టర్ బైస్వారూప్ రాయ్ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్, మెయిల్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు (2023) పుస్తకం, మెడల్, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్కు పోస్ట్ ద్వారా పంపించారు. పెద్ద కూతురు కూడా.. సురేష్, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్, కావ్య దంపతులు, హుస్నాబాద్ మంత్రి హరీశ్రావు అభినందన.. అరుషి గిన్నిస్ బుక్లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్లో ఇంకా ఎన్నో మెడల్స్ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు. -
సురేష్ కాళ్లు పట్టుకుని నదిలో నెట్టేశాడు
తెనాలిరూరల్: తన తల్లిని, చెల్లిని కాళ్లు పట్టుకుని సురేష్ నదిలోకి నెట్టేశాడని మృత్యుంజయురాలు లక్ష్మీసాయికీర్తన తెలిపింది. తెనాలిలోని తన పెద్దమ్మ సంరక్షణలో ఉన్న బాలిక మంగళవారం విలేకర్లతో మాట్లాడింది. షాక్ నుంచి ఇంకా తేరుకోని బాలిక భోరుమంటూనే తన కళ్ల ముందే జరిగిన భయానక దుర్ఘటన గురించి వివరించింది. కారు కొన్నానంటూ సురేష్ తన తల్లి సుహాసినితోపాటు తనను, తన చెల్లి జెర్సీని తీసుకెళ్లాడని, గోదావరి నదిని చూద్దామని, ఫొటోలు దిగుదామని కారు ఆపాడని తెలిపింది. అక్కడ వంతెన రెయిలింగ్ వద్ద నిలబడి ఉండగా తన తల్లి కాళ్లు పట్టుకుని నదిలోకి నెట్టేశాడని, ఏడాది వయసున్న తన చెల్లిని నదిలోకి విసిరేశాడని తెలిపింది. తనను నెట్టేయగా, పైపు ఆసరా దొరకడంతో పట్టుకుని ఉన్నట్టు వెల్లడించింది. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసు అంకుల్ ఫోన్ చేసి మాట్లాడుతూ వంతెన వద్దకు వచ్చారని, హారన్ మోగిస్తూ వినపడుతుందా అని అడుగుతూ, నదిలోకి టార్చిలైటు వేసి కనబడుతుందా అని అడుగుతూ విజిల్ వేసుకుంటూ వచ్చి తన ఆచూకీ గుర్తించి కాపాడారని తెలిపింది. -
నమ్మించి.. నట్టేట్లో తోసేసి..
రావులపాలెం/తాడేపల్లి రూరల్: ఓ బిడ్డతో కలిసి ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో నమ్మించాడు.. మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఓ చిన్నారికి జన్మనిచ్చాడు. అనంతరం వారిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి తల్లీబిడ్డలను గోదావరి బ్రిడ్జి పైకి తీసుకువచ్చి.. నిర్దాక్షిణ్యంగా నదిలోకి తోసేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవ్వగా.. 13 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించారు. వివరాలు.. భర్తతో విభేదాల వల్ల పుప్పాల సుహాసిని(36) కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్లో పనిచేస్తూ కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనతో కలిసి జీవిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్ కూడా తాడేపల్లిలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. సురేశ్కు అప్పటికే వివాహమైంది. అయినా సుహాసినిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఎన్టీఆర్ కరకట్ట మీద ఉన్న ఓ ఇంట్లో మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జెర్సీ(ఏడాది పాప) జన్మించిన తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు. సుహాసిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్రిస్టియన్పేటలో ఉంటోంది. సురేశ్ తరుచూ వచ్చి సుహాసినితో గొడవ పడేవాడు. దీంతో సుహాసిని తన పెద్ద కుమార్తె కీర్తనకు ఫోన్ ఇచ్చి.. ఇంటికి ఎవరైనా వచ్చి బెదిరిస్తే 100కు ఫోన్ చేయాలని ధైర్యం చెప్పి పనికి వెళ్లేది. ఈ నేపథ్యంలో సురేశ్ దుస్తులు కొందామని నమ్మించి సుహాసిని, లక్ష్మీకీర్తన, జెర్సీలను శనివారం రాత్రి కారులో రాజమహేంద్రవరం తీసుకువచ్చాడు. అక్కడి నుంచి రావులపాలెం తెచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గౌతమీ గోదావరి పాత బ్రిడ్జి పైకి కారును తీసుకువచ్చి ఆపాడు. ఆ తర్వాత కొంతసేపటికి సెల్ఫీ తీసుకుందామంటూ సుహాసినిని బ్రిడ్జి గోడపై కూర్చోమని చెప్పి.. సుహాసినితో పాటు జెర్సీని గోదావరిలోకి తోసేశాడు. అనంతరం కారులో కూర్చుని ఫోన్లో పాటలు వింటున్న కీర్తనను కూడా బయటకు తెచ్చి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత సురేశ్ కారులో పరారయ్యాడు. సకాలంలో స్పందించిన పోలీసులు బ్రిడ్జి పై నుంచి పడిపోతున్న సమయంలో కీర్తన బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపును బలంగా పట్టుకుంది. తన వద్ద ఉన్న ఫోన్తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్కు డయల్ చేసింది. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సుహాసిని, కీర్తన ఆచూకీ కోసం పోలీసులు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది. కీర్తన ప్రాణాలను కాపాడిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు. -
మరోసారి గ్రౌండ్లో దిగనున్న మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. రేటు ఎంతంటే..?
-
ఎంపీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదు
కర్ణాటక: కొందరు తాను వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతున్నారని, అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీ డీకే సురేశ్ తెలిపారు, కుణిగల్ తాలూకా గిరగౌడనపాళ్యలో గురువారం ఓటర్లకు అభినందన సమావేశంలో పాల్గొని డీకే సురేశ్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ రాజకీయాలు తనకు అవసరమా వద్దా అనే మీమాంసలో ఉన్నానని, అందుకే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడంపై మీ సలహా అవసరమని, అయితే తన లక్ష్యం మాత్రం ప్రజా సేవనే అని తెలిపారు. కుణిగల్ తాలూకాను ఒక ఆదర్శవంతమైన తాలూకాగా మార్చడమే తన ఆశయమన్నారు. అధికారం దక్కినప్పుడు సాధ్యమైనంత మేర అభివృద్ధి చేయాలన్నారు. -
రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్కు చేరాయి. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా... రవికిశోర్తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. సురేశ్ ద్వారా మొత్తం 14 పేపర్లు చేరినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వీరిలో దళారులతోపాటు అభ్యర్థులూ ఉన్నారు. మరోపక్క రవికిశోర్ ఏఈ సివిల్ పేపర్లను తమ బంధువులకు ఉచితంగా ఇవ్వడంతోపాటు బయటి వారికి అమ్మినట్లు గుర్తించారు. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ను రూ.3 లక్షలకు కొనేందుకు ఒప్పందం చేసుకుని, రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించిన భరత్ నాయక్ను, వరంగల్కు చెందిన బంధువులు పసి కాంతి రోహిత్కుమార్, గాడె సాయి మధులను గురువారం అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాలు సొంతం చేసుకుని రాసిన వారిలో చాలామందికి అత్యధిక మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. -
అంత్యక్రియలకొచ్చి అనంతలోకాలకు.. ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కారు అదుపు తప్పి చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఎరుకల కృష్ణ(47), సంజీవ్(43), సురేష్(38), వాసు(35)లు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుజరాత్లోని సూరత్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం స్వగ్రామంలో చిన్నాన్న ఎరుకుల కనకయ్య మృతి చెందడంతో వారంతా కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. అంత్యక్రియలు పూర్తి కావడంతో మంగళవారం మధ్యాహ్నం నలుగురు అన్నదమ్ములూ భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి, కారులో సూరత్కు బయలుదేరారు.అర్ధరాత్రి దాటిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయా ణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిసేపటికి మరొకరు మృతి చెందారు. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం మే 24న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. -
పర్యావరణమే ప్రాణం!
పర్యావరణ పరిరక్షణ కోసం నల్లగొండ పట్టణానికి చెందిన మిట్టపల్లి సురేశ్ గుప్తా విశేష కృషి చేస్తున్నారు. ఉద్యోగాన్ని వదిలేసి, కుటుంబాన్ని పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి క్షణం పని చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు లేచి, మార్కెట్కు వెళ్లి, అక్కడ ప్లాస్టిక్ కవర్లతో ఎవరు ఎదురుపడినా, వారికి ఓ జూట్ బ్యాగ్/క్లాత్ సంచి ఇవ్వడంతో ఆయన దిన చర్య ప్రారంభం అవుతుంది. ఇక పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వారిని శాలువాతో సత్కరించడం ఆయన ప్రత్యేకత. అంతేకాదు భూగర్భ జలాల పెంపునకు సొంతంగా ఇంకుడు గుంతలు తవ్వించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, చేనేత వస్త్రాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గుప్తా పని చేస్తున్నారు. తాను కూడా చేనేత బనియన్, దోవతి ధరించడం ప్రారంభించారు. ఇవన్నీ చేస్తున్న ఆయనేం కోటీశ్వరుడు కాదు. ఉద్యోగాలు చేయగా వచ్చిన డబ్బునంతా లక్ష్యం కోసమే ఖర్చు చేశారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను భార్యకు అప్పగించి.. దాతలను వెతికి, సమయానికి దొరక్కపోతే అప్పు చేసి మరీ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మలుపు తిప్పిన సంఘటన 2008లో ఒక ఆవు చెత్త కుప్పలో వేసిన ఆహార పదార్థాలతో పాటు ప్లాస్టిక్ కవర్లను తినడం గుప్తా చూశారు. ఆ ఆవుకు ఆపరేషన్ చేసినప్పుడు కడుపు నిండా ప్లాస్టిక్ కవర్లు ఉండటం చూసి చలించిపోయారు. ప్లాస్టిక్ వల్ల జీవరాశికి ప్రమాదం పొంచి ఉందని అప్పుడే గ్రహించారు. దాని వాడకాన్ని తాను నిషేధించలేను కాబట్టి కనీసం వినియోగాన్ని అయినా తగ్గించేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. నాటి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ ఎక్కడ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరిగినా, పండుగలు జరిగినా అక్కడికి వెళ్లి ప్లాస్టిక్ను వాడొద్దని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఉద్యోగాన్ని వదిలేసి.. 1999లో నల్లగొండలో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న సురేశ్ గుప్తా వద్దకు ఏపీఆర్ఎల్పీ ప్రాజెక్టు ఉద్యోగులు వస్తుండేవారు. తర్వాత తమ ప్రాజెక్టులో పని చేసేవారు కావాలని వారు గుప్తాను తీసుకున్నారు. కొన్ని రోజుల అనంతరం హైదరాబాద్కు రావాలని చెప్పడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత నల్లగొండలోనే ఒకటి రెండు ఉద్యోగాలతో పాటు 2013 నుంచి 2017 వరుకునల్లగొండ సుధా బ్యాంకు మేనేజర్గా పని చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తూనే ఈ ఉద్యోగాలన్నీ చేశారు. అయితే తాను చేస్తున్నది సరిపోదని, ఈ దిశగా మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి, పూర్తిగా పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేశారు. నీటి పరిరక్షణపైనా శ్రద్ధ ఓసారి ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన.. వర్షపు నీరు వృథాగా పోతుండటాన్ని గమనించి సొంత డబ్బులతో ఇంకుడు గుంతలను తవ్వించారు. భవిష్యత్ అవసరాలకు నీటిని పరిరక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు జీవనోపాధి కరువైన చేనేత కార్మికులను ఆదుకోవాలని, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో పని చేయడం ప్రారంభించారు. ఇందుకు తానే ఓ బ్రాండ్ అంబాసిడర్గా మారారు. మరోవైపు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ప్లేటు, గ్లాసు సంచిలోనే.. ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతూ పర్యావరణంపై ప్రచారం చేసేందుకు మోటారు సైకిల్ వాడక తప్పడం లేదు. అది వెలువరించే పొగతో వాతావరణం కలుషితం అవుతోంది. అందుకే నాకు నేనే శిక్ష వేసుకున్నా. చెప్పులు లేకుండా తిరగాలని నిర్ణయించుకున్నా. ఇక నేను తినే ప్లేటు, నా గ్లాసు నా సంచిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా నా ప్లేట్లోనే భోజనం చేస్తా. పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పని చేస్తా. – మిట్టపల్లి సురేశ్ గుప్తా షాక్ తగిలినా..కోలుకుని.. సురేశ్ గుప్తా తన కుటుంబ బాధ్యతను పూర్తిగా గెస్ట్ లెక్చరర్గా పనిచేసే తన భార్య కల్పనపైనే మోపారు. ఆ విధంగా దొరుకుతున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, తనకు ఆహ్వానం లేకపోయినా అక్కడికి వెళ్లిపోయేంత ప్రేమికుడిగా మారిపోయారు. అయితే 2018 మే 22వ తేదీన రోజున జరిగిన ఓ సంఘటన తన కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తుతుందని ఆయన ఊహించలేదు. వార్షిక పరీక్షల చివరి రోజు కావడంతో ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కుమారుడు ప్రణీత్ను తీసుకువచ్చేందుకు హైదరాబాద్కు బయలుదేరిన గుప్తా.. అతని వద్దకు వెళ్లకుండా స్థానికంగా వరల్డ్ ఎర్త్ డే కార్యక్రమం వద్దే ఆగిపోయారు. అదే సమయంలో కొడుక్కి యాక్సిడెంట్ అయిందని, చనిపోయాడని ఫోన్ వచ్చింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి గుప్తాతో పాటు కుటుంబానికి చాలా రోజులు పట్టింది. -
ఆరోగ్యాన్నిచ్చే సముద్రపు నాచు.. ఎన్నెన్నో పోషకాలు.. ఏపీకి సదావకాశం
సీవీడ్.. శతాబ్దాలుగా పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన పేరిది. దశాబ్ద కాలంగా దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీని ప్రత్యేకతలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సముద్రపు నాచుగా పిలిచే సీవీడ్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతోపాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ సమ్మేళనాల్లో ఉంటాయి. శతాబ్దాలుగా చైనా, జపాన్, కొరియా, మెక్సికో వంటి కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో సముద్రపు నాచును సంప్రదాయ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఐరోపా వంటకాల్లో సముద్రపు నాచును చేర్చేందుకు ఫ్రాన్స్లో పెద్దఎత్తున ప్రయత్నాలు చేసి కొంతమేర విజయం సాధించారు. జపాన్ దేశీయులు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, హవాయి వంటి ప్రాంతాల్లో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్లలో ఇది సాధారణంగానే కనిపిస్తోంది. వాస్తవానికి ఆస్ట్రియా, జర్మనీలలో సముద్రపు నాచును అత్యంత విలువైన బ్రెడ్–అల్టెన్బ్రోట్ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్లో బారామోర్ లేదా బ్రెడ్ ఆఫ్ సీ తయారీకి ఉపయోగిస్తున్నారు. తృణ ధాన్యాల మిశ్రమం సీవీడ్ తృణధాన్యాల మిశ్రమం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు మానవ వినియోగం కోసం ప్రత్యేకంగా సముద్రపు నాచును పెంచడం ప్రారంభించాయి. ప్రపంచ జనాభా పెరుగుదల, పరిమిత భూమి, విలువైన సహజ వనరుల ప్రాముఖ్యత దీనిపై పరిశోధనలకు కారణమైంది. జపాన్, చైనా వంటి కొన్ని దేశాల్లో వీటి పెంపకం పరిశ్రమ స్థాయికి చేరుకుంది. జపాన్, చైనా, కొరియా, మెక్సికో, అమెరికన్ దేశాల్లో శతాబ్దాలుగా దాదాపు 66 శాతం ఆల్గే (సముద్రపు నాచు) జాతులను రోజువారీ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని గుర్తించారు. ఏపీకి అందివచ్చిన అవకాశం సువిశాల సముద్ర తీరం గల ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ఇప్పుడు మెగా మిషన్ను ప్రారంభించింది. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు శ్రీకాకుళం జిల్లా బారువ, విశాఖపట్నం భీమిలి బీచ్కు వెళ్లే దారిలో మంగమారిపేట, బాపట్ల జిల్లా సూర్యలంక, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పైలట్ ప్రాతిపదికన సీవీడ్ సాగును ప్రారంభించారు. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో 49 ప్రదేశాలు దీని సాగుకు అనువైనవిగా గుర్తించారు. మన దేశంలో సముద్రపు నాచును మందులు, వస్త్రాలు, ఎరువులు, పశువుల దాణా, జీవ ఇంధన పరిశ్రమల్లోనూ వినియోగిస్తున్నారు. సీవీడ్ ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఉంటుంది. అత్యధికంగా సాగు చేస్తున్న సీవీడ్ రకాలు కప్పాఫైకస్ ఆల్వారెజి, గ్రాసిలేరియా, సాచరినా జపోనికా, ఫైరోపియా, సర్గస్సమ్ ప్యూసిఫార్మ్. ప్రభుత్వ ప్రోత్సాహం సీవీడ్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీరప్రాంత రాష్ట్రాలతో కలిసి సాగును ప్రోత్సహిస్తోంది. ఏపీలో 10 వేల సీవీడ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 60–40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. మత్స్యకారులు, మత్స్యకార మహిళా సొసైటీలు, ఎస్సీ, ఎస్టీ కో–ఆపరేటివ్ సొసైటీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకం కింద సాయం పొందేందుకు అర్హులు. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో రూ.1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడిలో 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రానికి ఈ ఏడాది 7,200 యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.12 కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా రూ.74.40 లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ♦ సీవీడ్ సాగుకు అయ్యే వ్యయం అత్యల్పం. శ్రమశక్తి వినియోగం కూడా స్వల్పమే. ♦ ఒకసారి విత్తనాలు కొని తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పునరుత్పత్తి అయ్యే విత్తనాలే వాడుకోవచ్చు. ♦ ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వేయాల్సిన అవసరం లేదు. ♦కొద్దిపాటి శిక్షణతో మహిళలు, నిరక్షరాస్యులు సైతం పెద్దఎత్తున సాగు చేయవచ్చు. ♦రెండు నెలల వ్యవధిలోనే ఉత్పత్తులు చేతికి వచ్చే అవకాశం ఉంది. ♦దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో పాటు ప్రభుత్వమే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. ♦ సముద్రపు నాచులో అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. ♦ రొయ్యలు, చేపల పెంపకంలో నాణ్యమైన ఫీడ్గా, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ♦అధిక పోషకాలు ఉన్నందున ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ♦ నీటిని శుభ్రపరిచే గుణం దీనికి ఉంది. సముద్రంలో చేరే మురుగు, ఇతర వ్యర్థాలను శోషించుకుని నీటిని స్వచ్ఛంగా ఉంచేందుకు నాచు సహాయ పడుతుంది. సాగు ఇలా.. సముద్రంలో అలలు తక్కువగా ఉండే ప్రదేశాలు, బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతాల్లో సీవీడ్ సాగు చేసుకోవచ్చు. అలల ఉధృతి అధికంగా ఉంటే నాచు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదముంది. ఏడాదిలో ఏడెనిమిది నెలలు దీని సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సీవీడ్ విత్తనాలను కిలో రూ.50 చొప్పున తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. అధిక సాంద్రత కలిగిన పాలీవినైల్ పైప్స్ లేదా ట్యూబ్ నెట్ పద్ధతిలో సాగు చేపడుతున్నారు. సీఎంఎఫ్ఆర్ఐ, పీఎంఎంఎస్వై ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తాయి. విత్తనాలను వలల్లో అమర్చి ఆ వలలను కర్రలు లేదా పైపులకు కడతారు. కెరటాల అలజడి లేని తీర ప్రాంతాల్లో వాటిని తెప్పల్లా అమర్చుతారు. 2 రోజులకోసారి వాటిని పరిశీలిస్తుంటారు. 45–60 రోజుల్లో మొక్కలు పెరుగుతాయి. వాటిని ఎండబెట్టి విక్రయిస్తారు. – సురేష్, మత్స్యశాఖ జేడీ, బాపట్ల జిల్లా -
ఇంటి దొంగలు ఎందరు? 42 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ స్కామ్ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇంటి దొంగల్ని కనిపెట్టడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్కుమార్ అరెస్టు కావడం, మాజీ ఉద్యోగి సురేష్ పేరు వెలుగులోకి రావడంతో లోతుగా ఆరా తీస్తోంది. కమిషన్కు చెందిన వివిధ స్థాయిల ఉద్యోగులు 42 మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం ప్రారంభించింది. మరోపక్క తమ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను సిట్ అధికారులు బుధవారం ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వీరి కస్టడీ గడువు గురువారంతో ముగియనుండటంతో విచారణ వేగవంతం చేశారు. బుధవారం కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కూడా నిందితులను ప్రశ్నించింది. ఇక టెక్నికల్ టీమ్ వంతు.. టీఎస్పీఎస్సీలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు భద్రపరిచే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ మొదలుపెట్టి అన్ని విభాగాల్లోనూ కలిపి దాదాపు 150 కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ పని చేస్తుంటుంది. నెట్వర్క్ అడ్మిన్గా ఉండి, లీకేజ్ కేసులో అరెస్టు అయిన రాజశేఖర్ ఈ టీమ్లో కీలకంగా వ్యవహరించాడు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు అంతర్గత లోపాలు గుర్తించడానికి టెక్నికల్ టీమ్ను ప్రశ్నించాలని నిర్ణయించారు. దీంతో పా టు వీరి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు రాశారా? వారికి ఎన్ని మార్కులు వచ్చాయి? గతంలో వారి ప్రతిభ ఎలా ఉంది? తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి కోసం గాలింపు గ్రూప్ –1 ప్రిలిమ్స్ పేపర్ లీక్లో పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో, వారిని నిందితులుగా అనుమానిస్తూ సిట్ గాలింపు చేపట్టింది. వీళ్లు కమిషన్ ఉద్యోగులే అని తెలుస్తోంది. 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పదిమందిలో ఈ ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులుగా ఉన్న 9 మందికి అదనంగా మరికొందరి పేర్లు జోడిస్తూ అధికారులు గురువారం కోర్టుకు సమాచారం ఇవ్వనున్నారు. శంకరలక్ష్మిది నిర్లక్ష్యమే..? లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల పేపర్లను భద్రపరచడంలో శంకరలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ భావిస్తోంది. ఈమెకు నోటీసులు జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పరీక్షకు ముందే ప్రవీణ్, రాజశేఖర్, సురే ష్ లతో పాటు మరెవరికైనా చేరిందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఏఈ పరీక్ష పేపర్ క్రయవిక్రయాల్లో ప్రవీణ్, రేణుక, నీలేశ్, గోపాల్ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ నిపుణుల బృందం కమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న కీలక ఉద్యోగుల సెల్ఫోన్లు, వాట్సాప్ సంప్రదింపులను విశ్లేషించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్–1లో 10 మంది ఉద్యోగులు పాస్ గతేడాది అక్టోబర్లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన కమిషన్ ఉద్యోగుల్లో ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా పది మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరికి ఊహించని విధంగా మార్కులు వచ్చాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే ఈ జాబితాను టీఎస్పీఎస్సీ నుంచి సేకరించిన అధికారులు వారికీ నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధమయ్యారు. కస్టోడియన్గా వ్యవహరిస్తున్న కమిషన్ ఉద్యోగిని శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని ఇప్పటికే నిర్ధారణైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు తనకు ఉన్న పరిజ్ఞానం వినియోగించిన రాజశేఖర్.. శంకరలక్ష్మి కంప్యూటర్లోకి అక్రమంగా చొరబడి ప్రశ్నపత్రాలు సంగ్రహించాడని తేల్చారు. ఈ విధంగా లీకేజ్ వ్యవహారంలో సైబర్ నేరమూ ఉండటంతో ఇన్ఫర్మేషన్ యాక్ట్ను జోడించాలని నిర్ణయించారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచే సమయంలో దీనికి సంబంధించి మెమో దాఖలు చేయనున్నారు. -
ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు.. నేడు అనాథ శవంలా మార్చురీలో
విశాఖపట్నం: జీవితం అంతుచిక్కని మలుపుల వింత ప్రయాణం. ఏ పయనం ఎక్కడ మొదలవుతుందో.. ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో అంచనా వేయడం అసాధ్యం. కొందరికి బతుకు వేడుకైతే.. మరికొందరికి వేదన. కొందరి ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతే.. మరికొందరి బతుకంతా అజ్ఞాతమే.. ఆ అనాథ యువకుడి జీవితం రెండో కోవకే చెందుతుంది. శ్మశానమే సర్వస్వమైన అతడిని.. అక్కడకు చేరువులోనే సంచరించిన మృత్యువు తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. అతను ఎన్నో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. నేడు ఆ యవకుడి మృతదేహం కేజీహెచ్ మార్చురీలో అనాథ శవంలా ఉంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో పోలిపల్లి పైడిరాజు(35) 15 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. నగరానికి చెందిన వాడే అయినా.. ఆలనాపాలనా చూసేవారెవరూ లేకపోవడంతో అక్కడా ఇక్కడా కాలం గడిపి చివరికి శ్మశానానికి చేరుకున్నాడు. పైడిరాజు చిన్న వయసులోనే తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. అన్నయ్య ఉన్నా.. అతడికి దూరంగా ఉంటున్నాడు. శ్మశానంలో పని చేస్తున్న మరికొందరితో కలిసి ఉంటున్నాడు. పైడిరాజు సేవ విలువకట్టలేనిది. అనాథలు.. అభాగ్యులే కాదు. డబ్బున్న వారెందరికో తనే తలకొరివి పెట్టాడు. కుమారులు, కుమార్తెలు విదేశాల్లో ఉండి.. ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఎందరో తల్లులు.. తండ్రులకు తనే కుమారుడిగా తలకొరివి పెట్టిన రోజులెన్నో. గతేడాది సురేష్ అనే కూలీ అనారోగ్యానికి గురయ్యాడు. పనిచేసే ఓపిక నశించడంతో.. గత్యంతరం లేక యాచక వృత్తిలో పడ్డాడు. సురేష్ కు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. అనాథ శవంగా మిగిలిపోయిన సురేకు అతని కుమారుడి చేతుల మీదుగా పైడిరాజు అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అభాగ్యులు.. అనాథలకు అన్నీ తానై అంతిమ సంస్కరణలు నిర్వహించాడు. ఎంతో మందికి పాడి కట్టాడు. నా అనే వారు లేక చనిపోయిన వారిని ఊరేగిస్తున్న క్రమంలో విసిరిన డబ్బులకు పైడిరాజు అలవాటు పడ్డాడు. ఆ వచ్చే డబ్బులతో పూట గడిచేది. అలా శ్మశానవాటికకు చేరువయ్యాడు. ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. -
ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త సురేశ్ బండారి మృతి
హన్మకొండ: హనుమకొండకు చెందిన యువ ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బండారి కోవిడ్ అనంతర సమస్యలతో అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో మృతి చెందారు. 2017 మే నెలలో అమెరికాలోని మిసిసిపి యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ను విజయవంతంగా పూర్తి చేసి అదే యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్ట్ హోదా పొందారు. యూనివర్సిటీ యాజమాన్యం అయన ప్రతిభను గుర్తించి ఒక విభాగానికి అధిపతిగా నియమించింది. అతి తక్కువ సమయంలో అధిపతిగా నియమితులైన పిన్నవయస్కుడిగా డాక్టర్ సురేష్ బండారి పేరుగాంచారు. మొత్తం 110 పబ్లికేషన్స్, 2865 సైటేషన్స్ (అనులేఖనాలు) రూపొందించడంతో పలు పేటెంట్ హక్కులు పొందారు. అంతకుముందు హనుమకొండ విద్యా నగర్లోని సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో మొదటిసారి కోవిడ్కు గురై త్వరగానే కోలుకున్నారు. కోవిడ్ అనంతరం మళ్లీ అస్వస్థతకు గురై అస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు మిసిసిపిలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమా రులు ఉన్నారు. సురేష్ బండారి తండ్రి మొగిలయ్య యోగా గురువుగా హనుమకొండ నగర ప్రజలకు సుపరిచితుడు. (చదవండి: ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ) -
త్వరలో తెలంగాణ రాష్ట్రవ్యాప్త పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: బీసీల రాజ్యాధికార సాధన కోసం రాష్ట్రవ్యాప్త పర్యటనలు నిర్వహిస్తామని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ ప్రకటించారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఇటీవల ఓరుగల్లులో నిర్వహించిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైన సందర్భంగా బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కన్వీనర్ దాసు సురేశ్ నేతృత్వంలో శుక్రవారం కోర్ కమిటీ సమావేశమైంది. క్షేత్రస్థాయిలో బీసీ నేతలు వెలువరించిన అనేక అంశాలపై ముఖ్య నాయకులు దీర్ఘంగా చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికపై అవలంబించాల్సిన వ్యూహరచనపై చర్చించారు. వరంగల్ జిల్లా పర్యటనకు కొనసాగింపుగా ఈ నెల 29న నిజామాబాద్లో ‘మన ఓటు – మన సీటు’ నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని, సెప్టెంబర్ 3న ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్త రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు దాసు సురేశ్ వెల్లడించారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర/నిర్మల్/డిచ్పల్లి: వరుస ఘటనలతో నిత్యం వార్తల్లో ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం మరో విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ (ఈ–1) చదువుతున్న రాథోడ్ సురేశ్(22) గోదావరి హాస్టల్ భవనంలోని తన గదిలో మంగళవారం ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సురేశ్ ఉదయం సహచర విద్యార్థులతో కలిసి బ్రేక్పాస్ట్ చేశాడు. అనంతరం అందరూ తరగతులకు వెళ్లగా, సురేశ్ మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్న భోజనానికి హాస్టల్కు వచ్చిన సహచరులకు సురేశ్ కనిపించకపోవడంతో అతడి గదికి వెళ్లారు. తలుపుతట్టినా లేవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సురేశ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వ్యక్తిగత కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. సురేశ్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి చికిత్స చేశారు... గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ‘పోలీస్ గో బ్యాక్’అంటూ నినదించారు. పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై విద్యార్థులు మంగళవారం రాత్రి ప్రెస్నోట్ విడుదల చేశారు. సురేశ్ మంగళవారం గదిలోనే పడుకున్నాడని, స్నేహితులు మధ్యాహ్నం వచ్చి చూడగా, గదికి గడియపెట్టి ఉందన్నారు. తలుపు తెరిచేసరికి గదిలో ఫ్యాన్కు వేలాడుతున్నాడని, అప్పటికే అతడిలో పల్స్ కూడా లేదని, కానీ అధికారులు డిస్పెన్సరీలో మృతదేహానికి చికిత్స చేశారని ఆరోపించారు. తమనెందుకు మోసం చేశారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి 10 గంటల సమయంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించారు. సురేశ్ మృతికి నిరసనగా అన్ని వర్సిటీలు బుధవారం బంద్కు ట్విట్టర్లో పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఆçస్పత్రిలో సురేశ్ మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవితోపాటు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గంజాయితో సంబంధం లేదంటూ ఆవేదన రాథోడ్ సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండా. రాథోడ్ గంగారాం, సరోజ దంపతులకు సురేశ్తోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో సురేశ్ సైతం పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో క్యాంపస్లో గంజాయి తాగుతున్నారంటూ సురేశ్తోపాటు కొందరు విద్యార్థులను వారం క్రితం పిలిపించి పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వేధింపులతోనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: (డ్యామిట్ కథ అడ్డంతిరిగింది.. రేవంత్కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి) -
రానా, అక్రమ్లు ఎవరు?
‘అక్రమ్’ సురేశ్ హీరోగా రామ్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అక్రమ్’. రాజధాని మూవీస్ పతాకంపై ఎంవీఆర్ అండ్ విసకోటి మార్కండేయులు నిర్మించిన ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ సందర్భంగా అక్రమ్ సురేష్ మాట్లాడుతూ – ‘‘చిన్న సినిమాల్లో కూడా మంచి కంటెంట్ ఉంటుంది. ఈ చిత్రకథ, డైలాగ్స్ నేనే రాశాను. కథలో రానా, అక్రమ్లు ఎవరు? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ కథలో అన్ని కోణాలు ఉన్నాయి. ఇది యాక్షన్, సోషియో ఫ్యాంటసీ మూవీ. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి అభిమానిని. త్వరలో ట్రైలర్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ నిర్వహిస్తాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అతిథిగా నాగార్జునగారు వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. సంగీత దర్శకుడు సాయిదీప్, కెమెరామేన్ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
Hyderabad: నగరంలో వివాహిత అదృశ్యం..
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన సురేష్ అదే ప్రాంతానికి చెందిన అనూషను 6 నెలల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. జీవనోపాధి కోసం కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లోని పద్మావతి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న అనూష తల్లి, పిన్ని వీరి వద్దకు వచ్చి మూడు రోజులు ఉన్నారు. కాగా శనివారం ఉదయం సురేష్ పనిమీద బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య అనూషతో పాటు ఇద్దరు మహిళలు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (బుల్లితెరపై చూద్దామనుకుంటే.. శాశ్వతంగా వెళ్లిపోయింది!) -
గ్యాంగ్స్టర్ పూజారి భారత్కు అప్పగింత
ముంబై: ముంబై, కర్ణాటకలో పలు బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో ప్రధాన నిందితుడు, 15 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్స్టర్ సురేశ్ పూజారిని ఫిలిప్పీన్స్ పోలీసులు అరెస్ట్చేసి భారత్కు అప్పగించారు. అక్టోబర్లో అతడిని ఫిలిప్పీన్స్లో అరెస్ట్చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న అతడిని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సీబీఐ అధికారులు థానెలో నమోదైన కేసు విచారణ నిమిత్తం ముంబైకు తరలించారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్సభ బెదిరింపుల కేసులో అతడిని 25వ తేదీ దాకా మహారాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) కస్టడీకి అప్పగిస్తూ థానెలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజేంద్ర బుధవారం ఉత్తర్వులిచ్చారు. మహారాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు థానెలో నమోదైన 23 కేసులను మహారాష్ట్ర ఏటీఎస్కు బదలాయించారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న పూజారిని అరెస్ట్చేయాలంటూ గతంలో ముంబై, థానె పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేశారు. -
జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా దాసు సురేశ్
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: జాతీయ బీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దాసు సురేశ్ నియమితులయ్యారు. శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై.. సురేశ్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అధికారికంగా ప్రకటించి నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల్లో బీసీలను బలోపేతం చేయడానికి సురేశ్ను నియమించామన్నారు. సురేశ్ మాట్లాడుతూ.. అన్ని బీసీ వర్గాలను బలోపేతం చేసి రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ బీసీ సేనా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి కృష్ణయ్య హాజరయ్యారు. బీసీబంధు పథకం వెంటనే ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెం టౌన్: నిషేధిత మావోయిస్టు పార్టీ ఇద్దరు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలో ఎస్పీ సునీల్దత్ శనివారం వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దమిడిసెలేరుకు చెందిన గట్టుపల్లి సురేశ్, బొడిక భీమయ్య గతంలో మూడేళ్లు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని దళాల్లో పనిచేశారు. ఆ తర్వాత చర్ల ఎల్ఓసీ సభ్యులుగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయితే, మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీలోని కొందరు వేధిస్తుండటంతో భరించలేక పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా గిరిజన మహిళలు, చిన్నారులతో మావోయిస్టులు బలవంతంగా పని చేయించుకుంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్, భీమయ్య తెలిపారు. కాగా, మావోయిస్టులు లొంగిపోతే వారి భవిష్యత్కు అన్నివిధాల అండగా నిలుస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం వారిద్దరికీ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ హరిఓం ఖారే, సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్ పవార్, భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు అరెస్ట్ దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఓ మావోయిస్టును శనివారం అరెస్ట్ చేసినట్టు ఎస్పీ సునీల్శర్మ తెలిపారు. అరెస్టు చేసిన మావోయిస్టు శివయాదవ్పై రూ.లక్ష రివార్డు ఉందని వెల్లడించారు. 2012లో కలెక్టర్ను కిడ్నాప్ చేసిన కేసులో శివయాదవ్ నిందితుడని ఎస్పీ పేర్కొన్నారు. -
క్షణక్షణం.. భయంభయంగా గడిపాం
లక్సెట్టిపేట(మంచిర్యాల): ‘‘తాలిబన్ల చేతిలోకి అఫ్గానిస్తాన్ వెళ్లడంతో అక్కడ ఉంటున్న భారతీయులు చాలా ఇబ్బందులుపడ్డారు. ఇండియన్ ఎంబసీలో కమాండోలుగా ఉన్న మేం కూడా అవస్థలు పడ్డాం. తాలిబన్లకు అధికారం రావడంతో ఇండియన్ ఎంబసీని పట్టించుకునేవారే కరువయ్యారు. చివరి రెండ్రోజులు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. తాగడానికి నీరు, తినడానికి తిండి, ఏ ఇతర సౌకర్యాలనూ తాలిబన్లు కల్పించలేదు’’అంటూ అక్కడి ఇండియన్ ఎంబసీ సెక్యూరిటీ కమాండోగా విధులు నిర్వర్తించిన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ఎంబడి సురేశ్ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించారు. ‘‘నిత్యం అధికారులకు రక్షణ కల్పించడంలో ఇబ్బందులుండేవి. ఎప్పుడేం జరుగుతుందోనని క్షణక్షణం భయంభయంగా గడిపేవాళ్లం. ఎటు నుంచి దాడులు, బాంబులు పడతాయోనని అప్రమత్తంగా ఉండేవాళ్లం. అన్ని దేశాల ఎంబసీలు వెళ్లిపోయిన తర్వాతే, చివరగా ఇండియన్ ఎంబసీ ఇక్కడికి వచ్చేసింది. అప్పటివరకు విధుల్లో నిర్విరామంగా ఉన్నాం. ఇండియన్ ఎంబసీ తీసుకున్న నిర్ణయంతో 130 మంది కమాండోలు, 70 మంది భారతీయులతో సీ–17 బోయింగ్ ఎయిర్ఫోర్స్ యుద్ధ విమానంలో 17న ఢిల్లీకి చేరుకున్నాం’’అని సురేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని హెడ్ ఆఫీస్ క్యాంపు భవ నంలో హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. -
ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు కి. మీ మేర విస్తరణ
-
అచ్చెన్నాయుడి సోదరుడు, అనుచరులపై రౌడీషీట్
టెక్కలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరివరప్రసాద్, ప్రసాద్ కుమారుడు కింజరాపు సురేష్, అనుచరుడు కింజరాపు కృష్ణమూర్తిపై రౌడీషీట్ నమోదు చేసినట్లు టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్లు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులను పలు కేసుల్లో ముద్దాయిలుగా గుర్తించి బైండోవర్ చేసినప్పటికీ.. ఆయా బైండోవర్ కేసులను సైతం ఉల్లంఘించడంతో రౌడీషీట్ తెరిచినట్లు పేర్కొన్నారు. రౌడీషీట్ తెరిచేందుకు పలు ఘటనల్లో నమోదు చేసిన కేసుల వివరాలు తెలియజేశారు. ► 2008లో నిమ్మాడలో కింజరాపు గణేష్ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేస్తుండగా, అప్పటి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్, అనుచరులు కింజరాపు కృష్ణమూరి తదితరులు గణేష్, అతని కుమార్తెపై దాడికి పాల్పడ్డారు. దీనిపై గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 354, 323, 506 సెక్షన్లు, ఐపీసీ 34 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ► 2010లో నిమ్మాడకు చెందిన మెండ పోతయ్య ఉపాధి పనికి వెళ్తుండగా కింజరాపు హరివరప్రసాద్, మెండ బాబురావు తదితరులు పోతయ్యపై దాడికి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు 341, 323, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ► 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడకు చెందిన బమ్మిడి లక్ష్మి అనే మహిళ వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ వేశారు. దీంతో కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బమ్మిడి లక్ష్మిపై బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడ సర్పంచ్గా వైఎస్సార్సీపీ తరఫున కింజరాపు అప్పన్న అప్పట్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన దువ్వాడ శ్రీనివాస్ సాయంతో నామినేషన్ వేసేందుకు వెళ్లగా వారిపై హత్యాప్రయత్నం చేశారు. హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించిన కింజరాపు హరివరప్రసాద్, ఆయన కుమారుడు కింజరాపు సురేష్లపై 307, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► మొత్తం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బైండోవర్ కేసులను సైతం ఉల్లంఘించడమే కాకుండా భవిష్యత్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వారిపై రౌడీషీట్ నమోదు చేసినట్లు సీఐ, ఎస్ఐలు తెలిపారు. -
కోవిడ్ మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్, కోవిడ్ మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లో కోవిడ్పై ఉన్న భయాన్ని తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేసారు. కనకపుర తాలూకా ముళ్లహళ్లి గ్రామానికి చెందిన మాజీ గ్రామపంచాయతీ ఉపాధ్యక్షుడు లోకేశ్కు ఇటీవల కరోనా సోకింది. బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముళ్లహళ్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరపగా ఎంపీ డీకే సురేశ్ కేవలం ఫేస్ షీల్డ్ ధరించి హాజరయ్యారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత రామనగర జిల్లాకు చెందిన సుమారు 200 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న బెంగళూరు ఆర్ఆర్ నగర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ఎంపీ డీకే సురేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి మీడియాకు సమాచారమిచ్చిన ఆయన రామననగర జిల్లా మరో చామరాజనగర్గా మారకముందే ఆక్సిజన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈమేరకు ఆయన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్టు తెలిపారు. -
కాఫీ పొడితో అంబేడ్కర్ అద్భుత చిత్రం
గాజువాక: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రాన్ని కాఫీపొడితో తయారు చేసి ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు విశాఖపట్నం దత్తసాయినగర్కు చెంది న నాయన సురేష్. గాజువాక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న సురేష్ తీరిక సమయంలో వరిగడ్డి, చీపురు పుల్లలు, కాగితాలతో కళాఖండాలు రూపొందిస్తుంటారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తాజాగా కాఫీపొడితో చిత్రాన్ని రూపుదిద్దారు. దీని రూపకల్పనకు రెండు గంటలు పట్టినట్లు సురేష్ తెలిపారు. -
మానవత్వాన్ని చాటుకున్న తోట సురేష్
-
లోక్సభ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధం: శ్రద్ధ
యశవంతపుర/కర్ణాటక: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తమ కుటుంబం బెళగావి లోక్సభ ఉప ఎన్నికలలో పోటీ చేస్తుందని దివంగత కేంద్రమంత్రి సురేశ్ అంగడి కూతురు, మంత్రి జగదీశ్ శెట్టర్ కోడలు శ్రద్ధా శెట్టర్ తెలిపారు. బెళగావి విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. బెళగావిలో పోటీకి మానసికంగా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు. అయితే, పోటీపై బీజేపీ హైకమాండ్ నిర్ణయమే అంతిమం అని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందన్నారు. కాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి(65) గతేడాది సెప్టెంబరులో కన్నుమూసిన విషయం విదితమే. మహమ్మారి కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. కర్ణాటకలోని బెళగావి లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఆయన ప్రాతినిథ్యం వహించారు. సురేష్ అంగడి స్వస్థలం బెళగావి జిల్లాలోని కేకే కొప్పా. సురేశ్ భార్య పేరు మంగల్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శ్రద్ధ ఉన్నారు. ఇక సురేష్ అంగడి మరణంతో బెళగావి లోక్సభకు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో, ఆ స్థానంలో ఆయన కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రద్ధ ఈమేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కూతురు స్ఫూర్తితో సురేష్ అంగడి(ఫైల్ ఫొటో) చదవండి: రాజకీయాలకు రాంరాం: దీప -
‘దుబ్బాకలో ఇంటింటికి పది లక్షలు ఇప్పిస్తాం’
సాక్షి, సిద్ధిపేట: ఏదేమైనా దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో మిరుదొడ్డి మండలం మోతె గ్రామం ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిద్దిపేట సీపీ ప్రవర్తన చూస్తే అమరులైన పోలీసులు, తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత్చారి ఆత్మలు ప్రశాంతంగా ఉండవని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్కు ఈ ఎన్నికలో గుణపాఠం చెబుతామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దొడ్డు వడ్లు పండించి.. రైతులను సన్న వడ్లు పండించమనడం సరైంది కాదన్నారు. దుబ్బాక ప్రజల తీర్పు ముఖ్యమంత్రి అహంకారానికి ప్రతీక కావాలని ఆయన పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చుకుందామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. (చదవండి: బండి సంజయ్ అరెస్ట్; సీఎస్, డీజీపీకి నోటీసులు) రఘునందన్ గెలిచిన వారం రోజుల్లో మల్లన్నసాగర్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మంత్రి పదవి కాపాడుకోడానికే హరీష్ రావు ఓట్లడుగుతున్నారని, కరీంనగర్ తరహాలో యువత ఒక్కటై టీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ... దేశంలో రామరాజ్యం నడిస్తే.. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు కేసీఆర్, హరీష్రావు అహంకార పతనానికి నాంది కావాలన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే అది మురిగిపోయినట్టే.. టీఆర్ఎస్కు పోయినట్టేనని, బీజేపీని గెలిపిస్తే చింతమడక తరహాలో దుబ్బాకలో ఇంటింటికి పది లక్షలు ఇప్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి) దుబ్బాక నుంచే యుద్ధం మొదలు: బండి సంజయ్ దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సీపీ టీఆర్ఎస్ కార్యకర్త. అతడి సంగతి ఎన్నికల తర్వాత చెప్తాం. అందుకే ఇక్కడికి ఎవరిని తేవాలో వారిని తెచ్చాం. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నారా? వార్డ్ మెంబర్ కూడా కాలేరు. మానసిక క్షోభతో రామలింగారెడ్డి చనిపోయారు. రామలింగారెడ్డి కొడుకును ఎందుకు దాచి పెట్టారు? ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు. దుబ్బాక నిర్లక్ష్యానికి ఎందుకు గురి అయింది? టీఆర్ఎస్పై యుద్ధం దుబ్బాక నుంచే మొదలవ్వాల’ని పిలుపునిచ్చారు. (చదవండి: నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం) -
కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన వయసు 65 ఏళ్లు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఎయిమ్స్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈనెల 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. కర్ణాటకలోని బెల్గాం లోక్సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సురేశ్ అంగడి 2000-2004 మధ్య కాలంలో బెల్గాం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. బెల్గాం జిల్లాలోని కేకే కొప్పా ఆయన స్వస్థలం. సురేశ్ తల్లిదండ్రులు సోమవ్వ, చెన్నబసప్ప. సురేశ్ భార్య పేరు మంగల్. ఆయనకు ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు. కర్ణాటకలో కరోనా బారిన పడి మరణించిన బీజేపీ రెండో ఎంపీ సురేష్ అంగడి. రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్ గస్తీ(55) ఈ నెల 17న బెంగళూరులో కన్నుమూశారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు నాయకులు ప్రాణాలు కోల్పోవడం బీజేపీ శ్రేణులను తీవ్ర వేదనకు గురిచేసింది. సురేష్ అంగడి హఠాన్మరణం పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. (కరోనా: బీజేపీ ఎంపీ కన్నుమూత) సురేశ్ మరణం బాధాకరం: ప్రధాని సురేశ్ అంగడి మరణంతో నిబద్ధత కలిగిన కార్యకర్తను పార్టీ కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన చాలా కృషి చేశారని తెలిపారు. ఎంపీగా, మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. సురేశ్ అంగడి మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం జగన్ తీవ్ర సంతాపం కేంద్ర మంత్రి సురేశ్ అంగడి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం-ఢిల్లీ కిసాన్ రైలును ఆయన ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సురేశ్ అంగడి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మర్రిచెట్టు కింద పాట
సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లేవాడు). వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లిరికల్ వీడియోను ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని మర్రిచెట్టు కింద విడుదల చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని ‘ఓడ్కా మీద ఒట్టు...’ అంటూ సాగే మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్లో 20లక్షల వ్యూస్ సాధించింది. రెండో పాటను రామ్గోపాల్వర్మకి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని వెంకట శ్రీనివాస్ బొగ్గరం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
విశాఖ: వ్యాపారి సురేష్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణతలో బాలురకన్నా బాలికలే ఆధిక్యంలో నిలిచారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 10,64,626 మంది (ఫస్టియర్ 5,46,365, సెకండియర్ 5,18,261) ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ జనరల్లో 59 శాతం, ఒకేషనల్లో 41 శాతం, సెకండియర్ జనరల్లో 63 శాతం, ఒకేషనల్లో 52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అన్ని కేటగిరీల్లోనూ బాలికలు పైచేయి సాధించారు. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,57,619 మంది బాలికలు హాజరు కాగా 1,64,365 (64 శాతం), సెకండియర్ పరీక్షలకు 2,22,798 మంది బాలికలు హాజరు కాగా.. 1,49,010 (67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,49,611 మంది హాజరు కాగా.. 1,36,195 (55 శాతం), సెకండియర్లో 2,12,857 మందికి గాను 1,27,379 (60 శాతం) మంది పాసయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లోనూ 75 శాతం ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్లో 65 శాతం, సెకండియర్లో 71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా ఫస్టియర్లో 63 శాతం, సెకండియర్లో 68 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతా శాతంలో వైఎస్సార్ (ఫస్టియర్ 47 శాతం, సెకండియర్ 52 శాతం), శ్రీకాకుళం (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 53 శాతం), కర్నూలు (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 54 శాతం) జిల్లాలు వెనుకబడ్డాయి. -
ఆటోరిక్షా.. హ్యాండ్వాష్
హ్యాండ్వాష్ సదుపాయంతో ఆటోరిక్షా నడుస్తున్నట్లు చూస్తే ఆశ్చర్యపోతారు. తన ప్రయాణికులు వాహనం ఎక్కే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచిస్తున్న ఆటోరిక్షా డ్రైవర్ సురేష్ కుమార్ను కలిస్తే అతని సృజనాత్మక పనికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. కేరళ రాష్ట్రం తిరువంతపురంలోని సురేష్ తన ఆటోకు నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన పొడవాటి పివిసి పైపును అమర్చాడు. దీని ద్వారా ప్రయాణికులు చేతులు కడుక్కోవడానికి వీలుగా ట్యాప్ను సెట్ చేశాడు. వాహనంలో ఎక్కడానికి, దిగడానికి ముందు ఉపయోగించడానికి వీలుగా ఆటోలో హ్యాండ్ శానిటైజర్లు కూడా ఉంచాడు. ప్రయాణికులు మాస్క్లు, గ్లౌజులు ధరించడం వంటి జాగ్రత్తలు కూడా సురేష్ తీసుకుంటున్నాడు. ఆటో డ్రైవర్ల బృందం లాక్డౌన్ సమయంలో రోగుల ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ‘జనమైత్రి ఆటో డ్రైవర్స్’ కూట్టైమా’అనే ట్రస్ట్ కింద 20 మంది తోటి డ్రైవర్లతో పాటు సురేశ్ ఈ సేవను కొనసాగిస్తున్నారు. ఈ బృందం రోజులో ఎప్పుడైనా నగరంలోని రోగుల కోసం హాస్పిటల్స్కు ఉచిత పిక్ అప్, డ్రాపింగ్ సేవలను అందిస్తుంది. ‘నిబంధనల ప్రకారం, ఒకే కుటుంబానికి చెందినవారైతే ముగ్గురు లేదంటే ఒక ప్రయాణికుడిని మాత్రమే తీసుకెళ్లడానికి మాకు అనుమతి ఉంది. ఎక్కువగా నేను హాస్పిటల్ లేదా రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతుంటాను. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ హ్యాండ్ వాష్ సెటప్తో నా ప్రయాణికులను, నన్ను నేను సురక్షితంగా ఉంచాలని అనుకున్నాను. నేను రోజూ ఉదయం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆటో నడుపుతాను. అత్యవసర పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువే ఉంటుంది ‘అని సురేష్ చెప్పారు. జనమైత్రి సమూహంలో భాగమైన డ్రైవర్లు 23 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. కాబట్టి, వారి భద్రతకు భరోసా కూడా అవసరం. భౌతిక దూరంలో భాగంగా సురేష్ తన వాహనాన్ని వైరస్ నుంచి వేరుచేసే కవచాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు. దానిలో భాగంగా పీవీసీ పైపుతో ఓ చిన్న వాటర్ట్యాంక్ను అమర్చి దాని ద్వారా ప్రయాణికులు చేతులు శుభ్రపరుచుకునేలా జాగ్రత్తపడుతున్నాడు. ‘ప్రస్తుతం, నా వాహనానికి మాత్రమే హ్యాండ్ వాషింగ్ సౌకర్యం ఉంది. ఈ సదుపాయాన్ని అన్ని జనమైత్రి ఆటోరిక్షాల్లో అందుబాటులో ఉంచాలనుకుంటున్నాను’ అని చెబుతున్న సురేష్ను చూసి బాగా చదువుకున్న వాళ్లు కూడా ఎంతో నేర్చుకోవాలి. -
ప్రకాశం జిల్లాలో సున్నా వడ్డీ ప్రారంభం
-
యువతుల్ని వేధించిన 'డ్రీమ్ బాయ్'
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ చానళ్లకు పరిమితమైన ప్రాంక్ వీడియోల విష సంస్కృతి యూట్యూబ్ చానళ్ల పుణ్యమా అని నగరానికీ పాకింది. ప్రాంక్ పేరుతో కొందరు హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. ఆడవాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ‘నేను సింగిల్ అండి... నాకు ఓ హగ్ ఇస్తారా? అంటూ ప్రాంక్ పేరిట వీడియో రూపొందించిన ‘డ్రీమ్ బాయ్ జయసూర్య’ అనే యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు రమావత్ సురేష్..తన చానల్లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులుదర్యాప్తు చేపట్టారు. ఈ తరహా కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి. సురేష్ గత కొన్నాళ్లుగా డ్రీమ్ బాయ్ జయసూర్య పేరుతో ఓ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే దీని కేంద్రంగా ఆన్లైన్ గేమ్స్కు సంబంధించిన లింకులు ఏర్పాటు చేయడం, బెట్టింగ్స్కు అవసనరమైన లింకులు పొందుపరచడం, వీటిని వినియోగించుకోవడానికి నిర్ణీత మొత్తం సబ్స్క్రిప్షన్ కట్టించుకోవడం వంటివి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు. దీనికితోడు తన చానల్ పాపులారిటీ పెంచుకోవడానికి ప్రాంక్ వీడియోలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒంటిపై షార్ట్..పైన టవల్ కట్టుకుని ఓ పబ్లిక్ ప్లేసులో సంచరిస్తూ యువతుల్ని వేధించాడు. సినిమా చూస్తారా? అంటూ వారిని ప్రశ్నిస్తూ హఠాత్తుగా తన టవల్ తీసేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా రూపొందించిన ప్రాంక్ వీడియోను గత ఏడాది ద్వితీయార్థంలో తన యూట్యూబ్ చానల్లో పెట్టాడు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సైబర్ స్పేస్ పోలీసింగ్ ద్వారా ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరిలో రమావత్ సురేష్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో ఇతడు రూపొందించిన వీడియో ఇప్పడు కేసు నమోదుకు కారణమైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో సంచరించిన ఇతగాడు నేను సింగిల్ అండి... ఓ హగ్ ఇస్తారా? అంటూ యువతులు, విద్యార్థినుల్ని అడుగుతూ వీడియో రికార్డు చేశాడు. దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్ చానల్ డ్రీమ్బాయ్ జయసూర్యలో పొందుపరిచాడు. ప్రతి సీన్ను వెనుక బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్, మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 12 లక్షల మంది వీక్షించారు. ప్రతి సీన్ ముగిసిన తర్వాత ఇది ప్రాంక్ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి అంటూ సూచించాడు. అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్ చానల్లో ఉన్న ఆ వీడియో ఇటీవల ఈ ఇద్దరు యువతుల దృష్టికి వచ్చింది. తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
వేధింపులపై చిందు ఎత్తిన చైతన్యం
ఓ కాలేజీ అమ్మాయిని కొందరు టీజ్ చేస్తున్నారు. అమ్మాయి బెదిరిపోతున్న కొద్దీ మరింత రెచ్చిపోతున్నారు. చూడగానే తెలిసిపోయే డైరెక్ట్ అటాక్ అది. ఆఫీస్లోని ఓ మేల్ కొలీగ్ హుందాగా.. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నట్టే కనిపిస్తాడు. కానీ... ప్రతి మాట, ప్రతి చేష్ట వెనకాల హెరాస్మెంటే. నిరూపించలేని పరోక్ష దాడి. ఈ డైరెక్ట్ అటాక్లనూ, ఇన్డైరెక్ట్ వేధింపులనూ ఎలా ఎదుర్కోవాలో రంగస్థలం సాక్షిగా ప్రదర్శిస్తున్నారు ఇద్దరు కళాకారులు. ‘ఫోరమ్ థియేటర్’, ‘ప్లే బ్యాక్ థియేటర్’తో యువతలో చైతన్యాన్ని ‘చిందు’ ఎత్తిస్తున్న సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్లది మంచి ప్రయత్నం. హైదరాబాద్... గాంధీ మెడికల్ కాలేజ్ ఆవరణ.. ఒక అమ్మాయిని కొంతమంది అబ్బాయిలు వెంటాడుతున్నారు.. వేధిస్తున్నారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పాపం ఆ అమ్మాయి ఎదిరించలేక ఏడుస్తోంది. ఆమె నిస్సహాయత ఆ అబ్బాయిలు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఇదంతా గమనిస్తూన్న ఓ గుంపులోంచి ఒక విద్యార్థిని ‘నువ్వు రియాక్ట్ కావాలి’ అంటూ ముందుకొచ్చింది. ‘ఎలా రియాక్ట్ కావాలో మీరు చూపించండి మరి’ అడిగారు ఎవరో. అంతే ఆ అమ్మాయి ఆ రౌడీమూక ను చేరి వాళ్ల చేష్టలను నిలువరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ఆకతాయిలు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతివ్యూహాలు పన్నుతూ ఇబ్బంది పెడ్తున్నారు. కాసేపటికి ఇంకో అమ్మాయి వచ్చింది గుంపులోంచి.. తనదైన పద్ధతిలో ఆ అబ్బాయిల ఆట కట్టించేందుకు. ఇలా ఓ గంట గడిచింది. తర్వాత ప్రశంసలు. ఆ పరిస్థితికి తగ్గట్టుగా తమను తాము రక్షించుకున్న ఆ అమ్మాయిల సమయస్ఫూర్తికి... ధైర్యానికి.. తెగువకు. అవును.. ఇది నాటకమే. ఈ విధానాన్ని ‘ఫోరమ్ థియేటర్’ అంటారు. ఒక కాన్ఫరెన్స్ రూమ్... పాతికమంది వరకూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఒక ఉద్యోగిని తను అనుభవించిన వెతను వెళ్లబోసుకుంటోంది. ‘నేను సింగిల్ ఉమన్ను. పెళ్లయిన యేడాదిలోపే విడాకులయ్యాయి. నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొనే స్వాతంత్య్రం కాని, ఆర్థిక స్థోమత కానీ అమ్మానాన్నకు లేవు. దాంతో నా చదువుకి తగ్గ ఉద్యోగాన్ని వెదుక్కుని హైదరాబాద్ వచ్చాను. నా సీనియర్తో హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నాను’ అని ఆగిపోయింది ఆమె. ‘జాయినై ఆఫీస్లోకి ఎంటర్ అవగానే’ అంటూ మళ్లీ మొదలుపెట్టింది.. ‘ముందు నా కాళ్లు చూశారు.. తర్వాత మెడ. మేల్ కొలీగ్స్ దగ్గర్నుంచి హయ్యర్ ఆఫీషియల్స్(పురుషులు)వరకు. దాన్నిబట్టి నా మ్యారిటల్ స్టేటస్ అంచనావేయడం.. మ్యారేజ్ కాలేదని తెలిసాక దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం. అందులో నా సీనియర్ సిద్ధహస్తుడు. అది ఎలా ఉంటుందంటే దాన్ని వేధింపు అని నేను రుజువు చేయలేను. అలాగని భరించనూ లేను. అతని తీరును గమనించిన ఎవరికైనా అది నా పట్ల కన్సర్న్గా.. గౌరవంగానే కనిపిస్తుంది. కాని సదరు మనిషి వ్యక్తిగతంగా నాతో మాట్లాడేటప్పుడు, నా పని గురించి అతనితో చర్చించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతని వెకిలితనాన్ని బయటపెడ్తాడు. దీనివల్ల నేను ఫ్రస్టేట్ అయిపోయి అరిస్తే నన్నో గయ్యాళిగా.. మర్యాద తెలియని మనిషిలా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ సమస్యను ఎవరితో చెప్పుకున్నా నమ్మని పరిస్థితిని క్రియేట్ చేశాడు. భరించలేకపోతున్నా. ఆత్మహత్య ఆలోచనదాకా కూడా వెళ్లా’ అంటూ రెండుచేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేసింది ఆమె. అంతలోనే ఆడ, మగ కలిపి పదిమందిదాక ఉన్న ఓ బృందం పోడియం దగ్గరకు చేరింది. ఆ అమ్మాయి పంచుకున్న విషయాలతో అప్పటికప్పుడు నాటకాన్ని అల్లి ప్రదర్శించడం మొదలుపెట్టారు. తాము విన్న దంతా అలా కళ్లకు కడుతుంటే ఆ సమావేశంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ నాటకాన్ని పది రకాల పరిష్కారాలతో ఎండ్ చేశారు. ఇదే ‘ప్లే బ్యాక్ థియేటర్ ’ విధానం. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రసిద్ధికెక్కుతోంది. ‘ఫోరమ్ థియేటర్’, ‘ప్లే బ్యాక్ థియేటర్’ ఈ రెండు విధానాల ద్వారా మహిళల్లో ఆత్మస్థయిర్యం, ఆత్మరక్షణా మెలకువలను బోధిస్తున్నారు.. సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్లు తమ గ్రూప్లోని దివ్యశ్రీ, తదితర కళాకారులతో కలిసి. ఫోరమ్ థియేటర్లో ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తే, ప్లే బ్యాక్ థియేటర్లో ప్రేక్షకులు మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని కల్పించి.. వాళ్ల బాధకు నాటకరూపమిచ్చి వాళ్లే పరిష్కారం వెదుక్కునేలా చేస్తున్నారు. ‘తమకు జరిగింది బయటకు చెప్పుకుంటే చులకనగా చూస్తారని, తల్లిదండ్రులకు చెబితే చదువు మాన్పిస్తారేమోనని, భర్తకు చెబితే ఉద్యోగం వద్దంటాడేమోననే భయంతో వ్యథను అణచుకుని క్షోభననుభవిస్తుంటారు. రేప్కి కారణం అమ్మాయి వస్త్రధారణను, ప్రవర్తనను తప్పు పట్టే .. వ్యాఖ్యలు చేసే దుస్థితిలో ఉన్నాం. అలాంటి వాళ్లకు ఊరటే కాదు.. జీవితాన్ని నెగ్గే మెలకువలను నేర్పించే మాధ్యమం ఫోరమ్ థియేటర్, ప్లే బ్యాక్ థియేటర్’ అని చెప్పడమే కాదు నిరూపిస్తున్నారు కూడా సబ్రీనా, సురేష్లు. వేధింపులు, వివక్ష, హింసను ఎదుర్కోవడంలో మహిళలను చైతన్యపరిచినట్టే అబ్బాయిలు, తల్లిదండ్రుల్లోనూ జెండర్ ఈక్వాలిటీ పట్ల స్పృహను పెంచుతున్నారు ఈ రెండు నాటక ప్రక్రియలతోనే. గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కాలేజీలు, కార్యలయాలు ఇలా ఎక్కడైనా ప్రభుత్వ సిబ్బంది, ప్రైవేట్ యాజమాన్యాల పిలుపు మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘దీనివల్ల బెరుకు, భయం పోయి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా స్పందించాలో తెలుస్తుంది. తమను తాము కాపాడుకోవడమే కాదు ఇతరులనూ రక్షించే ధైర్యం వస్తుంది’’ అని వివరిస్తారు సబ్రీనా, సురేష్లు. వాళ్లు నేర్చుకున్న, శిక్షణ పొందిన ఈ థియేటర్ ప్రక్రియలను ఇలా జెండర్ సమస్యలను వెలుగులోకి తేవడానికే ఉపయోగిస్తున్నారు. షీటీమ్స్తో కలిసి.. గత మూడేళ్లుగా తెలంగాణ షీటీమ్స్తో కలిసి పనిచేస్తున్నారు. అందులో భాగమే హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్ ప్రదర్శన. షీ టీమ్స్ సారథ్యంలో కాలేజ్లు, హాస్టల్స్లో ఫోరమ్ థియేటర్ మెథడ్లో అమ్మాయిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆత్మరక్షణా నైపుణ్యాన్ని పెంచుకునేలా చేస్తున్నారు. దీంతోపాటు పిల్లలు, మహిళల రక్షణ, సాధికారత మీద ఆడియో ఆల్బమ్లు, డాక్యుమెంటరీలు, షార్ట్ఫిల్మ్స్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా ‘చిందు’ అనే సాంస్కృతిక వ్యక్తిత్వ వికాస కేంద్రం కింద చేస్తున్నారు. దీన్ని ఇరవై ఏళ్ల కిందట స్థాపించారు వీళ్లు. సబ్రీనా, సురేష్ ఇద్దరూ కళాకారులే. డాన్స్, సంగీతం, డ్రామా.. ఈ మూడింటిలో నిపుణులు. ఒక వర్క్షాప్లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులు, లక్ష్యాలు ఒకటే అని అర్థమయ్యాక కలిసి పనిచేస్తే బాగుంటుందని ‘చిందు’ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాలు సహా దేశమంతా ప్రదర్శనలిస్తుంటారు. విదేశీ వేదికల మీదా వీళ్ల ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్లే బ్యాక్ థియేటర్లో పట్టభద్రులైన ఈ ఇద్దరు డ్రామా థెరపి, సైకోడ్రామా, థియేటర్ అప్రెస్డ్ అనే విధానల్లోనూ శిక్షణ పొందారు. అంతేకాదు యూకేలోని టావిస్టాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. జెండర్ సమస్యలు, జెండర్ స్పృహకు సంబంధించి వీరి కళాసహాయం కావాలనుకునే వారు ఈ నంబర్లో సంప్రదించవచ్చు.. 9849091717. -
అసలే పేదరికం.. ఆపై పెద్ద జబ్బు.!
ఇక్కడ కనిపిస్తున్న 23 ఏళ్ల యువకుడి పేరు నందిమండలం సురేష్. పేదరికం అడ్డుతగిలినా..ఎదిరించాడు. కష్టపడి చదివాడు. ఎంబీఏ (ఫైనాన్స్) అకౌంట్స్ చేశాడు. ఈ రంగంలో స్థి్థరపడి పైకెదగాలని కలలు కన్నాడు. ఆ దిశగా అడుగులు వేశాడు. అంతలోనే విధికి కన్నుకుట్టింది. ఇతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అకౌంట్స్ రంగంలో రాణించాలనుకున్న సురేష్ జీవితం ‘లెక్క’ను తారుమారు చేసింది. ఇప్పుడు అతనికి కావలసింది దాతల కరుణ. ఈ యువకుడిపై దయ చూపితే అందరిలా పదికాలాల పాటు జీవిస్తాడు..మనలో ఒకడిలా ఉంటాడు... కడప రూరల్ : నందిమండలం సురేష్ స్వగ్రామం రామాపురం మండలం, కాంపల్లె గ్రామం. కడప నగరం గాంధీనగర్ సున్నపురాళ్లపల్లె వీధిలోని ఇంటి నంబరు 1/152లో ఉంటున్నాడు. సురేష్ అమ్మ రమాదేవి స్ధానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. నెలకు రూ. 5 వేల జీతం వస్తుంది. నాన్న నాగాచారి అనారోగ్యంతో 1998లో మరణించారు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం కాగా ఆఖరి కొడుకు సురేష్. అందరూ రోజు వారీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కాటేసిన క్యాన్సర్... బాగా చదివి ప్రయోజకుడిని కావాలి. నమ్ముకున్న కన్న తల్లికి, సోదరులకు అండగా నిలవాలి. అందరి కష్టాలు తీర్చాలి. ఇవీ సురేష్ ముందున్న లక్ష్యాలు. పేదరికం అడ్డు వచ్చినా వెనకడుగు వేయలేదు. కష్టపడి చదివాడు. కడప నగరంలోని ఒక కాలేజీలో ఎంబీఏ (ఫైనాన్) అకౌంట్స్ చేశాడు. ఏదైనా ఉపాధిని పొంది స్థిరపడుదామని సంకల్పించాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో నోటిలో అల్సర్ వచ్చింది. దీనికి స్ధానికి వైద్యుల వద్ద చికిత్స పొందాడు. తరువాత కడుపు నొప్పి వచ్చింది. వైద్యుల వద్దకు వెళ్లాడు. రక్త పరీక్షలు చేస్తే ‘ప్లేట్ లెట్స్’ తక్కువగా ఉన్నాయని నిర్ధారించారు. చికిత్స కోసం కడప రిమ్స్లో ఒక రోజు ఉన్నాడు. అనంతరం వైద్యుల సూచనల మేరకు తిరుపతి రుయాకు వెళ్లాడు. ఈ తరుణంలో వేడి పాలు తాగాడు. దీంతో నోటిలో అల్సర్ సోకిన ప్రాంతంలో ఉండే చర్మం ఊడొచ్చింది. రక్తస్రావం అధికంగా జరిగింది. ఇది గమనించిన రూయా వైద్యులు అక్కడే ఉన్న స్విమ్స్కు వెళ్లమని సూచించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు. ఈ హాస్పిటల్లోనే నాలుగున్నర నెలల పాటు ‘కీమో థెరపీ’ చికిత్సను పొందాడు. ఈ ఏడాది అక్టోబర్లో సురేష్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. మళ్లీ అతను తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించాడు. వారు సురేష్ను పరీక్షించారు. రక్తంలో ‘ప్లేట్ లెట్స్’ తక్కువగా ఉన్నాయని చెప్పడంతో పాటు ‘బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్’ చేయాలని సూచించారు. అందుకోసం హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్లగా రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బులు వారి వద్ద లేకపోవడంతో తిరిగి కడపకు వచ్చారు. దాతలు కరుణించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం, ఎంపీ సహకారం.. నా పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి అంజద్బాషాకు వివరించాను. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 5 లక్షలు అందజేశారు. తరువాత కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డిని కలిశాను. ఆయన ఎస్ఓసీ కింద రూ. 5 లక్షలు సహాయం చేశారు. ఈ డబ్బు ‘కీమో థెరపీ’కి సరిపోయింది. ఇప్పుడు కేవలం ‘బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్’కు రూ. 20 లక్షలు అవుతుంది. ఈ చికిత్స పొందితే నా ఆరోగ్యం కుదుటపడుతుంది.– నందిమండలం సురేష్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి మాది చాలా పేదరికం. నా బిడ్డలందరూ కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు. నాకు నెలకు రూ. 5 వేలు వస్తుంది. ఈ డబ్బుతో పూట గడవడమే కష్టంగా ఉంది. మమ్మల్ని ఆదుకుంటాడనుకున్న సురేష్ క్యాన్సర్ బారిన పడడం మమ్మల్ని బాధిస్తోంది. నా కొడుకు పడే అవస్థను చూడలేకున్నాను. దాతలు నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టాలి– రమాదేవి, సురేష్ అమ్మ. -
అంతా తూచ్..!
-
తవ్వుతుంటే తప్పు ఒప్పుకున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఠాణాలోనే పోలీసులు నా భార్యపై అత్యాచారయత్నం చేశారు... నా ఎదుటే నా భర్తను విచక్షణా రహితంగా కొట్టారు’... అంటూ బంజారాహిల్స్ పోలీసులపై వీడియోల ద్వారా తీవ్ర ఆరోపణలు చేసిన ‘బాధితులు’ అట్లూరి సురేష్కుమార్, అట్లూరి ప్రవిజ అసలు విషయం బయటపెట్టారు. తాము ఉద్దేశపూర్వకంగానే ఆ ఆరోపణలతో కూడిన వీడియో రూపొందించామని అంగీకరిస్తూ బుధవారం మరో వీడియో విడుదల చేశారు. సురేష్ నేరచరిత్రను హైదరాబాద్ పోలీసులు తవ్వుతున్న నేపథ్యంలోనే వీరు తప్పు ఒప్పుకున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. సురేష్కుమార్ గతంలో విజయవాడలోని పడమట పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉండేవాడు. అప్పట్లో సన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. 2011 నుంచి 2013 మధ్య అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకుని మోసం చేయడంతో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 2007లో ఆయా కేసుల్లో ఇతడికి మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించి బెయిల్ పొందాడు. ఆపై ఇతడిపై అక్కడే అత్త, మరదలు సైతం కేసు పెట్టారు. హైదరాబాద్కు వచ్చిన సురేష్కుమార్ జూబ్లీహిల్స్ పరిధిలో ఓ స్థలం లీజుకు తీసుకుని గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టడంతో గత మార్చిలో జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెం.13లోని అడ్రస్ ఇన్ హోటల్లో రెస్టారెంట్ నిర్వహణ కోసం గతంలో దాని యజమాని వాసుదేవశర్మతో ఒప్పందం చేసుకున్నారు. రెస్టారెంట్, కిచెన్ అభివృద్ధి పేరుతో ఆయన నుంచి రూ.4.72 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో బాధితుడు మే నెల్లో బంజారాహిల్స్ ఠాణాలో చేశారు. దీని పూర్వాపరాలు పరిశీలించిన అధికారులు విషయం కోర్టులోనే తేల్చుకోవాలని ఇరు పార్టీలకు చెప్పి పంపారు. వాసుదేవ శర్మ కోర్టును ఆశ్రయించగా సురేష్కు సమన్లు జారీ అయ్యాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన సురేష్ ఉద్దేశపూర్వకంగా వాసుదేవ శర్మపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. దీన్ని తీసుకోవడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో వారితో దురుసుగా ప్రవర్తించడంతో సురేష్ పైనే కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయిన భార్యభర్తలు బెయిల్పై వచ్చి రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు స్టేషన్లోనే అత్యాచార యత్నం జరిగిందని, తమను దారుణంగా హింసించారని ఇరువురూ దాదాపు 15 నిమిషాల నిడివితో కూడిన వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీయడంతో పాటు సురేష్ గతాన్ని తవ్వితీశారు. దీంతో మెట్టు దిగిన ‘బాధితులు’ అసలు విషయం అంగీకరిస్తూ బుధవారం 1.5 నిడివితో మరో వీడియో విడుదల చేశారు. -
‘రాజధానిని వివాదాస్పదం చేయడం తగదు’
సాక్షి, కడప : మిగతా పార్టీల కన్నా భిన్నంగా బీజేపీ నూతన కార్యవర్గ ఎంపిక జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాజధానిని టీడీపీ వివాదాస్పదం చేయడం తగదని, అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. తానే హైదరాబాద్ను అభివృద్ధి చేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పోలవరం, రాజధాని నిధులను దోచుకుందని, ఇసుక అక్రమ రవాణా నివారించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రజాధనాన్ని లెక్క లేకుండా తెలుగు తమ్ముళ్లకు బాబు దోచిపెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అన్నారు. కేంద్రం కేటాయించిన నిధులను లెక్క చూపి నిధులు రాబట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. -
తహసీల్దార్ హత్య కేసు నిందితుడు మృతి
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్గంజ్: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు కూర సురేశ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ నెల 4న విధినిర్వహణలో ఉన్న తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో నిప్పంటుకుని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్ గుర్నాధం రెండ్రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటు నిందితుడు సురేశ్ కూడా ఘటనలో గాయపడిన విషయం విదితమే. గాయాలతోనే సురేశ్ పోలీస్స్టేషన్కు చేరుకోవడంతో పోలీసులు ఆరోజే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సురేశ్ ఛాతీ, ముఖం, చేతులు.. ఇలా 65 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల్లో చర్మం కాలిపోవడంతో పాటు మంటల వేడికి రక్తనాళాలు దెబ్బతిన్నాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. దీంతో బుధవారం సాయంత్రం సురేశ్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందజేశారు. అయితే గురువారం ఉదయమే ఆయన చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉస్మానియా వైద్యులు సురేశ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. తీరా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. భర్త సురేశ్ మరణవార్తతో భార్య లత అస్వస్థతకు గురైంది. ఆమెను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందజేశారు. పోలీసుల భద్రత మధ్య సురేశ్ మృతదేహాన్ని సొంతూరు గౌరెల్లికి తరలించారు. అక్కడ రాత్రి భారీ బందోబస్తు మధ్య సురేశ్ అంత్యక్రియలు జరిగాయి. నా భర్త అమాయకుడు: లత నా భర్త సురేశ్ అమాయకుడు. ఎవరితో గొడవలకు వెళ్లేవాడు కాదు. ఆయనను ఎవరో పావుగా వాడుకున్నారు. ఎమ్మార్వో హత్య కేసులో వెనుకున్న వారెవరో పోలీసులే బయటకు తీయాలని వేడుకుంటున్నా. -
అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం
పెద్దఅంబర్పేట: ఓ రైతు చేతిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అప్రమత్తంగా ఉంటే కనీసం ప్రాణాలైనా దక్కేవి. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరితో ఆమె అర నిమిషం లేదా నిమిషం పాటు మాట్లాడిన అనంతరం తలదించుకొని తనపని తాను చేసుకుంటూ ఉండేది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. తన చాంబర్ లోపలికి వచ్చే వ్యక్తులను పూర్తిగా గమనించకుండా తన విధుల్లో మునిగిపోయే మనస్తత్వమే ఆమె ప్రాణాలను బలిగొంది. ఆఫీసులోకి వచ్చే వ్యక్తులతో మాట్లాడి వారు వెళ్లిన తర్వాతే వేరే పనులు చేసుకునే అలవాటు ఉంటే సురేష్ పెట్రోల్తో దాడియత్నాన్ని కొంతమేర అయినా అడ్డుకునే అవకాశం ఉండేది. తహసీల్దార్ విజయారెడ్డి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పక్కా ప్రణాళికతోనే ఆమెను అంతమొందించడానికి సురేష్ పూనుకున్నట్లు జరిగిన సంఘటన ఆధారంగా తెలుస్తోంది. అబ్దుల్లాపూర్మెట్లోని కార్యాలయం వద్ద తహసీల్దార్ కారు ఆఫీసు ఎదుటే తహసీల్దార్ కారు... నిత్యం కార్యాలయానికి కారులో వచ్చి వెళ్లే తహసీల్దార్ విజయారెడ్డి సోమవారం కూడా అదే కారులో వచ్చారు. అయితే, అనూహ్యంగా సురేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో లిప్తపాటుకాలంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమెను రక్షించే క్రమంలో కారు డ్రైవర్ గురునాథం కూడా తీవ్రంగా గాయపడి మంగళవారం కన్నుమూసిన విషయం విధితమే. కారు డ్రైవర్ గురునాథం...అందులో రోజూ ప్రయాణించే తహసీల్దార్ విజయారెడ్డి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం ఆ కారు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టు కిందనే ఉంది. రోడ్డుపై ప్రయాణించే వారందరూ తహసీల్దార్ కారును చూస్తూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది. -
జమీన్.. జంగ్!
సాక్షి, హైదరాబాద్/పెద్ద అంబర్పేట: ఆ భూమే వారికి జీవనాధారం. స్వేదం చిందిస్తూ, సేద్యం చేస్తూ హాయిగా జీవితం నెట్టుకొస్తున్న రైతాంగానికి ఆ భూమి తమది కాదని తెలియదు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూమిపై సర్వహక్కులు మావేననే ధీమా వారిలో కనిపించేది. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొందరు రావడం.. ఈ భూమి మాది.. కౌలుదారులమని తేలి్చచెప్పడంతో పేద రైతుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ఇలా అప్పటివరకు సాఫీగా సాగిన వారి వ్యవసాయం కాస్తా చిన్నాభిన్నమైంది. ఈ కథ అంతా ఎక్కడిదో కాదు.. రెండు రోజుల క్రితం అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ హత్యకు కారణంగా భావిస్తున్న భూ వివాదం గురించి. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం గ్రామంలోని ఈ భూవివాదానికి 2004 సంవత్సరంలోనే బీజం పడిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. భూ పోరాటానికి అంకురం ఇక అప్పటి నుంచి మొదలైంది భూ పోరాటం. రైతులు, కౌలుదారుల మధ్య నెలకొన్న ఈ వివాదం రెవెన్యూ, కోర్టుల్లో కొనసాగుతూ వస్తోంది. ప్రతి చోటా రైతులకు వ్యతిరేకంగా, కౌలుదారులకు అనుకూలంగా తీర్పులు రావడంతో భూములు దక్కవేమోననే ఆందోళన రైతాంగంలో మొదలైంది. నగర శివారు కావడం, ఔటర్ రింగ్రోడ్డుకు అనుకుని ఉన్న ఈ భూమికి భారీగా డిమాండ్ ఉండడం కూడా గంపెడాశకు కారణమైంది. ఇదే సర్వేనంబర్లో పలువురికి పట్టాదార్ పాస్పుస్తకాలు జారీ చేసిన రెవెన్యూ యంత్రాంగం.. వివాదాస్పద భూమి పేరిట కొందరికి ఇవ్వకుండా నిలిపివేసింది. బాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 90 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపుగా 412 ఎకరాలు గౌరెల్లి, బాచారం గ్రామాలకు చెందిన 53 మంది యాభై సంవత్సరాల నుంచి సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వంశపారంపర్యంగా వచి్చంది కాదు. ఇందులో 412 ఎకరాలు రాజానందరావుదికాగా, 1980 తర్వాత ఆయన మహారాష్ట్రకు వలస పోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పటికే పొజిషన్లో ఉన్న రైతులు సాదా బైనామా కింద రాజానందరావు నుంచి కొనుగోలు చేశామని, 1998లో 1–బీ రికార్డులో కూడా తమ పేర్లను నమోదు చేయడమేగాకుండా.. ఆర్ఓఆర్ ఇచ్చి పట్టా పాసుబుక్కులు కూడా ఇచ్చారని చెబుతున్నారు. రైతుల గుండెల్లో కుదుపు అప్పటివరకు భూములు సాగు చేసుకుంటున్న రైతాంగానికి 2004లో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఝలక్ ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల భూమిపై తమకు హక్కులున్నాయని కోర్టు మెట్లెక్కారు. ఊరు విడిచి ఎప్పుడో నగరానికి వలస వెళ్లిన వీరికి స్థానికంగా కొందరు రియల్టర్లు తోడయ్యారు. దీనికితోడు అప్పటి రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో ఈ వ్యవహారం ముందుకు సాగింది. ఇదే అదనుగా బడాబాబులు.. భూమి తమ ఆ దీనంలో లేకున్నా డాక్యుమెంట్ల ద్వారా విక్రయిస్తూ వచ్చారు. అప్పటివరకు కౌలుదారులు, రైతులకు మధ్య నడుస్తున్న వివాదాల్లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా రంగప్రవేశం చేయడంతో వివాదం కాస్తా మరింత క్లిష్టంగా తయారైంది. ఈ క్రమంలోనే 2016లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఇచి్చన ఉత్తర్వుల మేరకు వివాదాస్పద 130 ఎకరాల భూమికి సంబంధించిన పాస్పుస్తకాలను కౌలుదారుల నుంచి కొనుగోలు చేసిన వారి పేరిట రెవెన్యూ అధికారులు జారీ చేశారు. పహాణీల్లో కూడా నమోదు చేశారు. దీంతో జేసీ ఉత్తర్వులపై.. తహసీల్దార్ హత్య కేసులో నిందితుడైన సురేశ్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ క్రమంలోనే తమ ఆ«దీనంలో ఉన్న భూమికి పాసుపుస్తకాలు ఎందుకు ఇవ్వరంటూ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సురేశ్, పాస్ పుస్తకాలు రాకపోవడానికి తహసీల్దార్ విజయారెడ్డే కారణమని కక్ష పెంచుకొని ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్య చేయడానికి సురేశ్ను కుటుంబసభ్యులు ఎవరైనా ఉసిగొల్పారా లేదా భూ మాఫియా ప్రేరేపించిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో ఉసిగొల్పారు నా భర్త అమాయకుడు. భూమి ఎక్కడ ఉందో కూడా అతనికి తెలియదు. కూలీనాలి చేసుకుంటున్న ఆయన రెండు నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి పూర్తిగా మారిపోయాడు. మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ తెలియని అమాయకుడు, అంతపెద్ద అధికారిణిని అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఆయనను వెనుక ఉండి ఎవరో రెచ్చగొట్టారు. మేడం లాగే నాకూ పిల్లలు ఉన్నారు. సురేశ్ చేసింది తప్పే. – లత, నిందితుడు సురేశ్ భార్య -
సురేష్ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడయిన సురేష్ ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎమ్మార్వోపై దాడి ఘటనలో సురేష్కు కూడా మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పిరిస్థితి గురించి బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎమ్ఓ డాక్టర్ రఫీ మాట్లాడుతూ.. యాభై శాతం కంటే తక్కువ గాయాలయిన కేసులలో మాత్రమే గ్యారంటీ ఇస్తామని, సురేష్కు 65 శాతం గాయాలయ్యాయని తెలిపారు. ఛాతీ, తల భాగాల్లో మంటలంటుకుపోవడంతో మెదడు, గుండె కూడా కాలిపోయాయని వెల్లడించారు. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ప్రాణాలతో ఉన్నాడు కానీ, పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు వివరించారు. -
ఎమ్మార్వో హత్య: నా భర్త అమాయకుడు
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ భార్య లత ఈ హత్యా ఉదంతంపై స్పందించారు. తన భర్త సురేష్ అమాయకుడని తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మార్వో హత్య చేసేంత దారుణానికి ఒడిగడుతాడని తాను భావించటం లేదని చెప్పారు. దీనివెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేసింది. ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో తన భర్తను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం తన భర్త సురేష్తో ఇప్పటివరకు మాట్లాడలేదన్నారు. హత్య జరిగిన రోజు తనతో భూవివాదం, ఎమ్మార్వో ఆఫీస్కు వెళుతున్నట్లు వంటి ఎలాంటి విషయాలు తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఈ దారుణం వెనక ఉన్న వాళ్లని కూడా బయటికి తీయాలని సురేష్ భార్య లత పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు. -
గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న కరాటపు సురేష్ (38) గత ఏడేళ్లుగా ఓల్డ్ బోయిన్పల్లిలోని ఆర్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. దసరా పండుగ నేపథ్యంలో భార్య, కుమారుడు కాకినాడ వెళ్లడంతో ఇంట్లో అతడు ఒకడే ఉన్నాడు. మంగళవారం రాత్రి సురేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని... సురేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమీర్పేట్లో శాస్త్రవేత్త దారుణహత్య
అమీర్పేట: నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటి బయట తాళం వేసి పరారయ్యారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అమీర్పేట్లో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన శ్రీధరణ్ సురేష్ (56) అమీర్పేట్ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఫ్లాట్ నం ఎస్–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో సురేష్ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్ ఒక్కడే నగరంలో ఉంటున్నాడు. సోమవారం ఆఫీస్కు వెళ్లిన సురేష్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం పనిమనిషి లక్ష్మి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో వెళ్లిపోయింది. సురేష్ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు అతడికి కాల్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అతడి బంధువులకు సమాచారమిచ్చారు. వారు భార్య ఇందిరకు సమాచారం అందించారు. ఆమె కుమార్తెతో కలసి నగరానికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా సురేష్ విగతజీవిగా పడి కనిపించాడు. తల వెనుక, ముఖంపై లోతైన గాయాలు ఉండటాన్ని బట్టి హత్య చేసి.. అనంతరం బయటి నుంచి తాళం వేసి పారిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. పోలీసు జాగిలం అపార్ట్మెంట్పై వరకు వెళ్లి తిరిగి వచ్చింది. శ్రీనివాస్ ఎవరు..? సురేష్ హత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సురేష్ వద్దకు గత 2 నెలల నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కలసి మద్యం సేవిస్తున్నట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్ ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు.