చైనా ఇంటర్నెట్ దిగ్గజం బైడు సీఈవో రాబిన్ లీకి చేదు అనుభవం ఎదురైంది. బైడు సంస్థ వార్షిక సదస్సులో భాగంగా ఆయన వేదిక మీద మాట్లాడుతుండగా.. ఒక వ్యక్తి ఆకస్మికంగా వేదిక మీదకు వచ్చి.. బాటిల్లోని నీళ్లను ఆయన నెత్తిమీద గుమ్మరించాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న రాబిన్ లీ.. ‘నీ సమస్య ఏందోయ్’ అంటూ ఆ వ్యక్తి మీద కేకలు వేశారు.