ప్రముఖ హీరో రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ కొనసాగుతుండగానే ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో శుక్రవారం ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. కాగా, పెరియార్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని రజనీకాంత్ ఇప్పటికే ప్రకటించారు. రజనీకాంత్పై పలు పోలీస్స్టేషన్లలో పెరియార్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు.