కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనను సస్పండ్ చేసే అధికారం పీసీసీలో ఎవ్వరికీ లేదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గతంతో కేంద్రమంత్రిగా వ్యవహరించానని, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీకి విధేయుడినని సర్వే అన్నారు. ఉత్తమ్, కుంతియా వల్లనే పార్టీ ఓడిపోయిందని, ఓటమికి కారణమైనవాళ్లే సమీక్ష చేయడమేంటని ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు.