దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌ | Transstroy in the loss | Sakshi
Sakshi News home page

దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌

Dec 30 2017 7:13 AM | Updated on Mar 22 2024 11:25 AM

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ తమ వద్ద రుణంగా తీసుకున్న రూ.725 కోట్లు తిరిగి చెల్లించడం లేదని కెనరా బ్యాంకు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్రాన్స్‌ట్రాయ్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement