ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. పదో రోజు కూడా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉద్యోగ భద్రతపై ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా హెచ్సీయూ డిపో వద్ద సందీప్ అనే కండక్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో సందీప్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు.