Sandeep
-
నీ ఫ్యూచర్ ఏంటో ముందే తెలిస్తే?.. ఆసక్తిగా ట్రైలర్
ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డ్రీమ్ క్యాచర్. ఈ సినిమాకు సందీప్ కాకుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సియల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 3న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా డ్రీమ్ క్యాచర్ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మన జీవితంలో జరగబోయేది ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రోహన్ శెట్టి సంగీతమందిస్తున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ..' సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ మూవీ మొదలైంది. ఇన్సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఆదర్శంగా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నా. సినిమా మొత్తం హైదరాబాద్లోనే చేశాం. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో ఉన్న ఈ సినిమాలో ఎలాంటి పాటలు, ఫైట్స్ ఉండవు. కేవలం కథ మీదనే మూవీ నడుస్తుంది. నా టీమ్ అంతా ఎంతో బాగా సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేస్తున్నాం' అని అన్నారు. -
గిరిజన.. సందీపం
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. రుతుస్రావం సమయంలో హైజీనిటీ.. బాల్య వివాహాలు.. గృహ హింస.. ఇలా ఎన్నో అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. వీటి గురించి కనీసం బయట మాట్లాడటానికే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం వీటి గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. గ్రామగ్రామానికీ, ఇంటింటికీ, ప్రతి స్కూల్కీ తిరుగుతూ వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. డిగ్రీ కుర్రాడు ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అందరిలా కురోళ్లలా ఫోన్లు, గేమ్స్ ఆడుకుంటూ ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేయకుండా సామాజిక స్పృహతో సమస్యలపై అవగాహన పెంచుతూ.. పోరాడుతూ ముందుకు సాగుతున్నాడు ఓ డిగ్రీ కుర్రాడు. అతడే నిజామ్ కాలేజీలో బీఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న సందీప్ నాయక్. అతడు చేస్తున్న పనిని మెచ్చి వందలాది మంది సందీప్ వెనుక నడుస్తున్నారు. 15 ఏళ్ల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు సమీపంలోని జైతారం తండాలో జన్మించిన సందీప్.. 15 ఏళ్ల వయసు నుంచే సమాజంలోని సమస్యల గురించి తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలను సందర్శించేవాడు. ఎన్నో సవాళ్లతో, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సందీప్.. వాటిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా పాఠశాలల నుంచి పిల్లల డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయని గర్తించాడు. ఈ సమస్యకు వెనుక ఉన్న కారణాల అన్వేషణలో పడ్డాడు. బాల్య వివాహాలు, బాల కారి్మక వ్యవస్థ, లింగ అసమానతలు, గృహ హింస, రుతుస్రావం సమయంలో పరిశుభ్రత, ప్యాడ్స్ వినియోగం లేకపోవడం వంటి సమస్యలు కారణమని గుర్తించాడు. వీటన్నింటినీ రూపుమాపేందుకు, వాటిపై సమాజంలో అవగాహన పెంచేందుకు గొంతెత్తాలని నడుం బిగించాడు. అనుకున్నదే తడవుగా ‘వాయిస్ ఫర్ వెల్ఫేర్’ పేరుతో ఓ ఎన్జీవో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా పలు సమస్యలపై పోరాడుతున్నాడు.మహిళల గొంతుకగా.. సంస్థ ద్వారా చిన్నారులు, మహిళల గొంతుకగా నిలిచేందుకు కృషి చేస్తున్నాడు. నిజామ్ కాలేజీలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న సందీప్ కార్యకలాపాలకు మెచ్చి తోటి విద్యార్థులతో పాటు తెలిసిన వాళ్లు అతడి వెనుక నడుస్తున్నారు. మారుమూల గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లి అక్కడి మహిళలు, చిన్నారులకు ఎన్నో విషయాలపై అవగాహన కలి్పస్తున్నాడు. పాఠశాలలకు వెళ్లి.. చిన్నారులకు చదువు చెబుతున్నాడు. సమాజంలో అసమానతలు తగ్గాలంటే చదువు ఒక్కటే మార్గమని సందీప్ చెబుతున్నాడు. -
టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్.. సుమ తనయుడు రోషన్, హర్ష చెముడు సందడి
-
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్హౌజ్లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
ఆరోపణ రుజువైతే సందీప్ ఘోష్కు మరణశిక్ష!
కోల్కతా ఆర్జీ కర్ ఘటనలో.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు భారీ షాకిచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం గనుక రుజువైతే మరణశిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఆగష్టు 9వ తేదీన ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని సందీప్ ఘోష్పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి అభిజిత్ మోందాల్పై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఘటన వెలుగుచూసిన అనంతరం ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ వెల్లడించింది. ఇద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం, కప్పి పుచ్చేందుకు యత్నించడం వంటివి చేశారని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరూ బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని(సీల్దా కోర్టు కాంప్లెక్స్) ఆశ్రయించారు. కేసులో తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. తప్పుడు ఉద్దేశంతో ఈ కేసులో ఇరికించారని ఘోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థతను తోసిపుచ్చింది. ‘‘సందీప్ ఘోష్పై ఉన్న నేరారోపణ తీవ్రమైంది. ఈ కేసులో ఆయన్ని బెయిల్పై విడుదల చేయడం న్యాయపరంగా వీలు కాదు. ఒకవేళ ఆయనపై ఆరోపణ రుజువైతే గనుక.. అత్యంత అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాల్సి వస్తుంది’’ అని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వ్యాఖ్యానించారు. అలాగే.. అభిజిత్ మోందాల్ బెయిల్ పిటిషన్ను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితుల కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీదాకా కస్టడీకి అనుమతించింది కోర్టు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టయ్యాక మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటంతో పాటు.. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. మరోపక్క, ఘోష్.. పాలిగ్రాఫ్ పరీక్ష, లేయర్డ్ వాయిస్ అనాలసిస్లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL).. ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. ఇక..ఆయనపై నమోదైన నేరారోపణల దృష్ట్యా.. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది.కోల్కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్రాయ్ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. -
Kolkata Horror: సందీప్ ఘోష్పై సీబీఐ సంచలన ఆరోపణలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వైద్యురాలిపై హత్యచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో అభిజిత్ మండల్లను మూడు రోజుల(సెప్టెంబర్ 17) వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఇద్దరిని ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ.. సందీప్ ఘోష్పై తీవ్ర ఆరోపణలు చేసింది. వైద్యురాలిపై హత్యాచారం ఘటనను ఆత్మహత్యగా చూపించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఇది నేరాన్ని తక్కువ చేసి చూపడంతోపాటు సాక్ష్యాలను నాశనం చేయడానికి దారి తీసిందని తెలిపింది.కాగా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవలకు సంబంధించి ఈనెల 2న సందీప్ ఘోష్ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలను ఆ తర్వాత ఆయనపై నమోదు చేసింది. ఈ కేసులో తలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి అభిజిత్ మోండల్ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మహిళా వైద్యురాలిపై హత్యాచారం విషయంపై ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు సందీప్ఘోష్కు సమాచారం అందింది. అయితే ఆయన వెంటనే ఆసుపత్రిని సందర్శించలేదు. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అదే విధంగా కేసు విచారణలో సందీప్ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది.ఆయనకు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిన్ నిర్వహించగా.. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈ టెస్టుల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు మోసపూరితమైనవని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు.బాధితురాలి ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ.. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా వచ్చిందని వైద్యుల తల్లిదండ్రులు తెలిపినట్లు చెప్పింది. ఈ ఘటన వెలుగుచూసిన అనంతరం ఘోష్, అభిజిత్ మోండల్తోపాటు ఓ లాయర్తో టచ్లో ఉన్నారని తెలిపింది.బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా మాజీ ప్రిన్సిపాల్ వారిని కలవలేదని, ఘటన అనంతరం వైద్యపరమైన విధివిధానాలను సకాలంలో పూర్తి చేయడంలో డాక్టర్ ఘోష్ విఫలమయ్యారని తెలిపింది. వెంటనే మృతదేహాన్ని మార్చురీకి పంపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించినట్లు సీబీఐ కోర్టుకు పేర్కొంది. అంతేకాక ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ తెలిపింది. ఘోష్, మండల్లు కలిసి నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొంది. -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
సుప్రీంకోర్టులో సందీప్ ఘోష్కు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేత
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సమయంలో.. నిందితుడు సంజయ్ రాయ్తోపాటు ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.అయితే వైద్యురాలి కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్కత్తా హైకోర్టు.. ఘోష్పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు(శుక్రవారం) ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య దర్శాసనం.. తన పదవీకాలంలో ఆర్జీకర్ ఇన్స్టిట్యూట్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లో భాగస్వామిగా చేర్చుకోవాలన్న సందీప్ ఘోష్ విజ్ఞప్తిని తిరస్కరించింది.‘ఒక కేసులో నిందితుడిగా ఉన్న మీరు.. కలకత్తా హైకోర్టు విచారిస్తున్న పిటిషన్లో జోక్యం చేసుకునే హక్కు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచారంతో.. అవినీతి ఆరోపణలను అనుసంధానిస్తూ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించేందుకు కూడా అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.ఇదిలా ఉండగా.. 2021 నుంచి సందీప్ ఘోష్ ఆర్జీ ఆసుపత్రి ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయన హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే..ఇక వైద్యురాలి కేసులో సందీప్ ఘోష్ను రెండు వారాలుగా విచారించిన అనంతరం సోమవారం సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ నివాసంపై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఘోష్, అతడి సహచరులకు సంబంధించిన వివిధ ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. -
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
రూ. 20 కోట్ల బడ్జెట్తో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా!
మొన్నటి వరకు వరస సినిమాలతో అలరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇటీవల చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట.ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. -
జేఎన్యూ నుంచి రాజకీయాల్లోకి.. ఈ ముగ్గురూ ఎంపీలు కాగలరా?
దేశ రాజకీయాల్లో ప్రమేయం కలిగిన విశ్వవిద్యాలయాల జాబితాలో జేఎన్యూ అగ్రస్థానంలో ఉంది. గత 50 ఏళ్లలో జెఎన్యూ పలువురు విద్యార్థి నేతలకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించింది. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా లోక్సభకు చేరుకోలేకపోయారు. ఇప్పుడు తొలిసారిగా ముగ్గురు జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్నయ్య కుమార్, నలంద నుంచి సందీప్ సౌరభ్, సెరంపూర్ నుంచి దీప్సితా ధర్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఇండియా అలయెన్స్ అభ్యర్థులే కావడం విశేషం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ హస్తం గుర్తుపై ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కన్నయ్య 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కన్హయ్య ప్రస్తుతం కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. బీహార్లోని బెగుసరాయ్ నివాసి కన్హయ్యపై 2016లో దేశద్రోహం ఆరోపణలు రావడంతో అతను హెడ్లైన్స్లో నిలిచారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్పై కన్నయ్య ఉన్నారు. 2015-16లో జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేసిన కన్హయ్య కుమార్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై పోటీ చేస్తున్నారు. తివారీ 2014 నుంచి ఈ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. కన్హయ్యకు ఇక్కడ విజయం అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్కు కేవలం 28 శాతం ఓట్లు రాగా, బీజేపీకి చెందిన మనోజ్ తివారీకి దాదాపు 54 శాతం ఓట్లు వచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి సందీప్ సౌరభ్ బీహార్లోని నలంద సీటు నుంచి ఇండియా అలయన్స్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీహార్లో నలంద జేడీయూకి కంచు కోట అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి జేడీయూకు చెందిన కౌశలేంద్ర కుమార్ ఎంపీగా ఉన్నారు. పార్టీ ఈసారి కూడా ఆయననే బరిలోకి దింపింది. సందీప్ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతకుముందు సందీప్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పాలిగంజ్ స్థానం నుండి పోటీ చేసి, విజయం సాధించారు. జేఎన్యూలో పీహెచ్డీ చేసిన సందీప్ 2013లో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే నలంద సీటు నుంచి గెలవడం సందీప్కు అంత సులువు కాదు. 1996 నుంచి ఈ సీటు సమతా పార్టీ-జేడీయూలో గుప్పిట్లో ఉంది. 2019లో జేడీయూ ఈ స్థానాన్ని రెండు లక్షల 56 వేల ఓట్లతో గెలుచుకుంది. జేఎన్యూ ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షురాలు దీప్సితా ధర్ పశ్చిమ బెంగాల్లోని సెరంపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటు తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటగా పేరొందింది. కళ్యాణ్ బెనర్జీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీప్సీత పోటీ చేశారు. సీపీఎం ఆమెను బాలి స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఆమె అక్కడ మూడో స్థానంలో నిలిచారు... ఇలా లోక్సభ ఎన్నికల బరిలో దిగిన ఈ ముగ్గురు పూర్వ విద్యార్థి నేతలు ఎంపీ స్థాయికి చేరుకుంటారో లేదో వేచిచూడాల్సిందే. -
టీమిండియా క్రికెటర్కు లక్కీ ఛాన్స్.. ఏకంగా షమీ స్ధానంలోనే?
ఐపీఎల్-2024 సీజన్కు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. షమీ ఇటీవలే తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. షమీ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో షమీ స్ధానాన్ని తమిళనాడు పేసర్ సందీప్ వారియర్తో గుజరాత్ టైటాన్స్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. సందీప్ను కనీస ధర రూ.50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. సందీప్ వారియర్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున 2019 - 2021 మధ్య 5 మ్యాచ్లు ఆడాడు. ఈ ఐదు మ్యాచ్ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా వారియర్ టీమిండియా తరపున కేవలం ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్తో వారియర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో వారియర్ విఫలమకావడంతో తర్వాత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్స్టర్, రివాల్వర్ రాణి
న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరో గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్హాల్ను బుక్చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్ను బుక్చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు. నాలుగు అంచెల రక్షణ ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్హాల్ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు. పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్పై బయట ఉన్నంతసేపు సందీప్పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్వార్ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు. -
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
-
నలుగురు స్నేహితుల కథ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విక్రమ్ రెడి మాట్లాడుతూ– ‘‘నలుగురు స్నేహితుల కథే ‘రోటి కపడా రొమాన్స్’. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
బిగ్బాస్ ఫేమ్ సందీప్ హీరోగా ‘షార్ట్ కట్’
కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ హీరోగా నటించిన చిత్రం ‘షార్ట్ కట్’. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్లైన్. రామకృష్ణ కంచి దర్శకత్వంలో షర్మిల కంచి సమర్పణలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించారు. హైదరాబాద్లో ఈ చిత్రం పోస్టర్ విడుదల, షో రీల్ వేడుక జరిగింది. రామకృష్ణ కంచి మాట్లాడుతూ– ‘‘25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ చాలా శాఖల్లో పని చేశాను. ఆ అనుభవంతో ‘షార్ట్ కట్’ తీశా. ప్రస్తుతం యువత డ్రగ్స్కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు ‘ఆట’ సందీప్. ‘‘ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని నిర్మించాం’’ అన్నారు తోట రంగారావు. ‘ నామీద మీరు చూపించే అభిమానం సందీప్ అన్న సినిమా ‘షార్ట్ కట్’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు ‘బిగ్ బాస్ 7’ విజేత పల్లవి ప్రశాంత్. -
స్నేహితుల కథ
హర్షా నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూత్పుల్ ఎంటర్టైనర్ మూవీ ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్తో కలిసి సృజన్ కుమార్ బొజ్జం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ డోస్ అంటూ ఈ సినిమా పబ్లిసిటీ వీడియోను శనివారం విడుదల చేశారు మేకర్స్. ‘‘నలుగురు స్నేహితుల కథే ఈ చిత్రం. వారి స్నేహం, ప్రేమ, వారి లైఫ్ జర్నీ ఈ సినిమాలో ఉంటుంది. యూత్కు ఈ సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్–ఆర్ఆర్ ధ్రువన్–వసంత్ .జి, కెమెరా: సంతోష్ రెడ్డి. -
గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తి
సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భారత నౌకాదళం ముఖ్య భూమిక పోషిస్తోంది. గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తిని సాధించింది. విశాఖలోని ఇండియన్ నేవీ నేవల్ బేస్ ఐఎన్ఎస్ ఏకశిలలో ఈ సాంకేతికత అభివృద్ధి జరిగింది. గ్యాస్ టర్బైన్ కంప్రెసర్ బ్లేడ్ల తయారీ ఇకపై మేడ్ ఇన్ ఇండియాగా రానున్నట్లు ఇండియన్ నేవీ చీఫ్ మెటీరియల్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నత్వానీ తెలిపారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావుతో కలిసి సందీప్ నత్వానీ ఐఎన్ఎస్ ఏకశిలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జీటీసీ బ్లేడ్ల తయారీకి సంబంధించిన డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఇకపై ఇతర ప్రాంతాలకు జీటీసీ బ్లేడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతులు రాబోతున్నాయని వైస్ అడ్మిరల్ నత్వానీ తెలిపారు. -
పవన్ ని నమ్ముకొని గల్లీ లీడర్ని కూడా కాలేకపోయా
-
పవన్ను నమ్మితే నట్టేట ముంచుతాడు
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ను నమ్ముకుంటే తమలాగే అందరినీ నట్టేట ముంచి, రోడ్డున పడేస్తారని జనసేన పార్టీలో కీలక నేతలు పసుపులేటి సందీప్, ఆయన తల్లి పసుపులేటి పద్మావతి చెప్పారు. పవన్కు సందీప్ పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. పద్మావతి ఆ పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్తగా ఎనలేని సేవలందించారు. వారు బుధవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ మాటల మాయలో పడి ఆయన కోసం, జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి సీఎం జగన్ ఎంత మేలు చేస్తున్నారో అర్థమైందని అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు పేద, బడుగు వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిçÜ్తున్నాయని, అందుకే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. తల్లిదండ్రులు ఎవరూ వారి పిల్లలను పవన్ వెంట పంపవద్దని సూచించారు. అన్యాయాన్ని ప్రశి్నస్తానని, రాజకీయాల్లో మార్పు తేస్తానని చెప్పే పవన్లో నిలకడలేదన్నారు. ధైర్యం ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలతో మభ్యపెడతారని సందీప్ చెప్పారు. ఆయన్ని నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న తాను గల్లీకి కూడా కాకుండా పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కోట రుక్మిణి అనే మహిళ మాట మీద తనను, అమ్మ (పద్మావతి)ని పవన్ రోడ్డుకీడ్చారని చెప్పారు. పవన్కు రుక్మిణి అంటే భయమని తెలిపారు. నాదెండ్ల మనోహర్కు చిత్తశుద్ధి లేదన్నారు. పవన్ అహంకారి అని, ఆయన లేకుండా నాదెండ్ల మనోహర్ కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటారని అన్నారు. నాదెండ్ల మనోహర్ హవాలా డబ్బును పార్టీ ఆఫీసుకు పంపి మారుస్తారని చెప్పారు. హైదరాబాదులో భూ కబ్జాలో ఏ 1 గా ఉన్న వ్యక్తిని పార్టీ కమిటీలో పెట్టారన్నారు. పవన్ టీడీపీ కోసమే పని చేస్తున్నారని, ఏపీ రాజకీయాల్లో మాట తప్పారని చెప్పారు. టీడీపీ పంచన చేరి కేడర్ని మోసం చేశారని తెలిపారు. పవన్ రాయలసీమలో బలిజల్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు. మహిళా నేతలకు గౌరవం లేదు: పద్మావతి గతంలో జనసేన పార్టీ రాయలసీమ కన్వినర్గా పనిచేసిన పసుపులేటి పద్మావతి మాట్లాడుతూ.. చిరంజీవి అభిమానిగా ప్రజారాజ్యంతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని, 2014లో జనసేనకు అండగా నిలబడ్డానని చెప్పారు. మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదన్నారు. ఈ అంశంపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. పవన్ నిలకడలేని మనిషి అని, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలియదని తెలిపారు. టీడీపీ – జనసేన కలిసి పనిచేయడాన్ని ప్రజలు ముఖ్యంగా జన సైనికులు ఎవ్వరూ అంగీకరించడంలేదని చెప్పారు. టీడీపీ నేతలు కూడా జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ విజయం సాధించే ప్రసక్తేలేదని, వాటికి ఓటమి తప్పదని అన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించడం ఖాయమని చెప్పారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన జనసేన కేంద్ర కార్యాలయ ఇంచార్జి పసుపులేటి సందీప్
-
పవన్ నువ్వెంత నీ బతుకెంత..ఒక ఆడదాని కోసం..!
-
నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన నాశనం
-
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ నేతకు బిగ్ షాక్
జైపూర్: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సందర్బంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రచారంలో హద్దులు మీరడంతో పార్టీలు వారిపై చర్యలకు దిగుతున్నాయి. తాజాగా రాజస్థాన్కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సందీప్ దయమాపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సందీప్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించింది. అయితే, రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన ర్యాలీలో పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. Sandeep Dayma, BJP leader who called for destroying Masjids& Gurdwaras, has been expelled Reflects 'tushtikaran' of Sikhs, but not of Muslims BJP will become a national party only when it stops 'tushtikaran' of Hindus, Buddhists, Jains and Sikhs and treats everyone equally pic.twitter.com/WnGgT3Fezk — Ashok Singh (@AshokSGarcha) November 5, 2023 కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సందీప్ దయమా ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, గురుద్వారాలను ఉద్దేశించి సందీప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకుంది. మరోవైపు.. సందీప్ వ్యాఖ్యలపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్సింగ్, ఇతర పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సందీప్ దయమాను పార్టీ నుంచి బహిష్కరిస్తూ రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ నిర్ణయం తీసుకున్నారు. -
యూత్ఫుల్ ఎంటర్టైనర్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ టైటిల్ లోగో రిలీజ్ చేసిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నాను. కొత్త కంటెంట్ ఉన్న చిత్రాలను మన ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పక్కా యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు వేణుగోపాల్, విక్రమ్. -
జనసేన పార్టీ బాధ్యతలు రుక్మిణి కోటకి అప్పగించడానికి అసలు కారణం..!
-
రుక్మిణి కోట చేసిన పనికి నాకు అన్నం కూడా పెట్టలేదు..
-
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
నేల విడిచి సాగు
సేద్యం సరికొత్త పుంతలు తొక్కుతోంది. పగలనక, రేయనక.. ఎండనక, వాననక.. అరక పట్టి.. మెరక దున్ని.. పంట చేతికి వచ్చే వరకు మట్టిలో కష్టపడే రోజులకు స్వస్తి పలికే విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మట్టి లేకుండా.. నీటితో, గాలితో.. నిలువుగా.. అతి తక్కువ ప్రదేశంలోనే ఎక్కువ పంటలు పండించవచ్చు. హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్, ఆక్వాపోనిక్స్.. వర్టికల్ ఫార్మింగ్ తదితర సాగు విధానాలు మొదలయ్యాయి. వీటి ద్వారా అవసరమైన పంటలు ఒకేచోట సాగు చేసుకోవచ్చు. సాధారణ వ్యవసాయానికి ఎక్కువ నీళ్లు అవసరమైతే.. ఈ సేద్యానికి అతి తక్కువ నీళ్లు సరిపోతాయి. తెగుళ్ల సమస్య తక్కువ. వివిధ దేశాల్లో ఈ సేద్యం మొదలుపెట్టి.. బోలెడు లాభాలు ఆర్జిస్తున్నవారు కూడా ఉన్నారు. భారత్లోనూ ఇవి క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇతని పేరు సందీప్ కన్నన్. వ్యవసాయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తిరుపతికి సమీపంలోని తనపల్లి వద్ద 2 ఎకరాల భూమి లీజుకు తీసుకొని.. రూ.70 లక్షల వ్యయంతో ‘వ్యవసాయి భూమి’ పేరుతో మూడేళ్ల క్రితం హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ప్రారంభించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పాలీహౌస్ కోసం రూ.8 లక్షల సబ్సిడీ వచ్చింది. దాదాపు 17 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల రకాలను సాగు చేస్తున్నాడు. 8125813507 నంబర్తో పాటు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో గ్రూప్లు ఏర్పాటు చేసి.. తిరుపతి, విజయవాడలోని 400కు పైగా కుటుంబాలకు రోజూ తాజా ఆకుకూరలు, కూరగాయలను సరఫరా చేస్తున్నాడు. ‘ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ మందికి నాణ్యమైన కూరగాయలను అందిస్తా’ అని సందీప్ చెప్పాడు. అతి తక్కువ నీటితో అధిక దిగుబడి.. మట్టి అనేదే లేకుండా సూక్ష్మ పోషకాలతో కూడిన నీటితో సాగు చేసే విధానమే హైడ్రోపోనిక్స్ వ్యవసాయం. 4 ఎకరాల్లో పండించే పంటలను.. ఎకరంలోపు స్థలంలోనే సాగు చేయవచ్చు. ఇళ్ల వద్ద అతికొద్ది స్థలంలో కూడా పండించవచ్చు. సాధారణ సేద్యంతో పోలి్చతే దీనికి 20 శాతం కంటే తక్కువ నీళ్లు చాలు. ఏడాది పొడవునా ఒకేసారి విభిన్న పంటలు సాగు చేయవచ్చు. హైడ్రోపోనిక్స్ వ్యవసాయాన్ని ఎక్కువగా ఎన్ఎఫ్టీ(న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్) విధానంలో చేస్తుంటారు. ఈ పద్ధతిలో ముందుగా ఫాలీహౌస్ లేదా షేడ్నెట్ నిర్మించుకోవాలి. తర్వాత ఎన్ఎఫ్టీ పైపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ పైపులలోని రంధ్రాల్లో చిన్న నెట్ కప్లు ఉంచాలి. ఆ కప్లలో కొబ్బరి పీచు పొడి వేసి మధ్యలో మొక్కలు పెట్టాలి. చిన్నచిన్న ట్యాంక్ల నుంచి ఎన్ఎఫ్టీ పైప్లలోని మొక్కలకు సూక్ష్మ పోషకాలతో కూడిన నీళ్లు అందిస్తుండాలి. పాలీహౌస్లలో ఉష్ణోగ్రత 18 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్లుగా ఉండాలి. నిపుణుల సిఫార్సు మేరకు సూక్ష్మ పోషకాలను ఆర్వో వాటర్లో కలిపి మొక్కలకు అందించాల్సి ఉంటుంది. ఈ విధానంలో దేశీయ, విదేశీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు పండించవచ్చు. గాలిలో పెరిగే బంగాళాదుంపలు.. సాధారణంగా దుంపలు మట్టిలో పెరుగుతాయి. కానీ ఇప్పుడు కేవలం గాలిని ఉపయోగించే బంగాళాదుంపలను పండిస్తున్నారు. మట్టి లేకుండా.. సూక్ష్మపోషకాలతో కూడిన గాలితో సాగు చేసే విధానమే ఏరోఫోనిక్స్ వ్యవసాయం. సాధారణ వ్యవసాయంతో పోల్చితే దీనికి 10 శాతం కంటే తక్కువ నీళ్లు చాలు. ఈ విధానంలో ముందుగా పాలీహౌస్ లేదా, షేడ్నెట్లు నిర్మించుకోవాలి. అందులో ఇనుప స్టాండ్ల మీద రంధ్రాలతో కూడిన ధర్మాకోల్ షీట్లు ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో మొక్కలతో కూడిన చిన్న నెట్ కప్లు పెట్టుకోవాలి. వాటి వేర్లకు పైపుల ద్వారా సూక్ష్మ పోషకాలతో కూడిన నీటిని గాలి లేదా పొగ మంచురూపంలో ‘స్ప్రే’ల ద్వారా అందించాలి. మొక్కల వేర్లు ఎప్పుడూ బయటకు వేలాడుతూనే ఉంటాయి. ఉపయోగాలు.. ♦ నీటి వృథా ఉండదు. పెద్ద మొత్తంలో నీటిని ఆదా చేయొచ్చు. ♦ ఒక కిలో టమాటాలు పండించాలంటే సాధారణ పద్ధతుల్లో సుమారు 214 లీటర్ల నీళ్లు అవసరం. అదే హైడ్రోపోనిక్స్ విధానంలో 70 లీటర్లు,ఏరోపోనిక్స్లో విధానంలో కేవలం 20 లీటర్లు చాలు. ♦ నీటి వినియోగం 80 నుంచి 90 శాతం వరకు, ఎరువులవినియోగం 60 శాతానికి పైగా, పురుగుమందుల వాడకం100 శాతం తగ్గుతుందని నాసా పేర్కొంది. ♦ బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాదిపొడవునా పంటలు పండించవచ్చు. ♦ మట్టిలో లభించే సూక్ష్మపోషకాలు.. ఈ విధానాల్లో నీటి ద్వారా అందుతాయి కనుక ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ♦ ఇంటి వద్దే ఈ విధానాల్లో సేద్యం చేస్తూ నెలకురూ.20 వేలకు పైగా ఆదాయం గడించవచ్చు. జాగ్రత్తలు.. ♦ ఈ విధానాలను అనుసరించాలనుకునేవారు ముందు తక్కువ స్థలంలో మొదలుపెట్టడం ఉత్తమం. తగిన అనుభవం వచ్చిన తర్వాత విస్తరించాలి. ఎలాంటి అనుభవం లేకుండా ముందే ఎక్కువ పెట్టుబడి పెట్టినష్టపోవద్దు. ♦ అర ఎకరంలో సాగు చేయాలంటే మొదటిసారి రూ.20 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పాలీహౌస్కు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ♦ తీగ జాతి మొక్కల పెంపకం వైపు వెళ్లకపోవడం మంచిది. ♦ విద్యుత్ కోసం సోలార్ పెట్టుకుంటే కొంత మొత్తం ఆదా చేసుకోవచ్చు. నిట్టనిలువుగా.. బోలెడు మొక్కలు ఏరోపోనిక్స్ విధానాన్ని వర్టిల్(నిలువు)గా టవర్ పద్ధతిలోనూచేయవచ్చు. రకాలు, టవర్ ఎత్తును బట్టి 45కు పైగా మొక్కలు పెంచవచ్చు. ఏరోపోనిక్స్ టవర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.నిలువుగా ఉండే పైపుల రంధ్రాలలో మొక్కలతో కూడిన నెట్ కప్లుపెట్టాలి. పైప్కు కింద చిన్న మోటర్తో కూడిన టబ్ ఉంటుంది. అందులో సూక్ష్మపోషకాలతో కూడిన నీళ్లు పోయాలి. ఆ టబ్ నుంచి నీళ్లు స్ప్రేల ద్వారా మొక్కల వేర్లకు గాలి, పొగ మంచు రూపంలో అందుతాయి. ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 24 డిగ్రీలు ఉండాలి. నిపుణుల సూచన మేరకు సూక్ష్మపోషకాలు అందించాలి. ఏరోపోనిక్స్ విధానంలో దుంప రకాలు, దేశీయ, విదేశీ ఆకుకూరలు, ఉల్లిపాయలు, టమాటా తదితరాలు సాగు చేయవచ్చు. చేప, మొక్క.. చేదోడుగా.. నీటి సాయంతో ఒకేసారి చేపలు, కూరగాయలను ఉత్పత్తి చేసే విధానమే ఆక్వాపోనిక్స్ వ్యవసాయం. ఇళ్ల వద్ద లేదా కాస్త ఎక్కువ స్థలంలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని సాగు చేయవచ్చు. ఆక్వాపోనిక్స్ విధానంలో ముందుగా చేపల ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. దాని పక్కన బయోఫిల్టర్.. అనుబంధంగా ఎన్ఎఫ్టీ పైపులు ఏర్పా టు చేసుకోవాలి. చేపల ట్యాంక్ నుంచి వచ్చే అమ్మోనియా నీటిని బయోఫిల్టర్.. నైట్రేట్స్గా మార్చి ఎన్ఎఫ్టీ పైపులలోని మొక్కల వేర్లకు అందిస్తుంది. మొక్కలు ఆ నైట్రేట్స్తో పాటు ఇతర సూక్ష్మ పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయి. మొక్కల ద్వారా ఫిల్టర్ అయిన నీళ్లు మళ్లీ చేపల ట్యాంక్లోకి చేరుతాయి. ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉండాలి. దేశీయ, విదేశీ ఆకుకూరలు, కూరగాయలు, చేపలను ఉత్పత్తి చేసుకోవచ్చు. తిలాపియా వంటి చేపలు పెంచవచ్చు. -
హల్దీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లి.. ఆపై ఏం జరగనట్టుగా..
సంగారెడ్డి: ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒకరు నీటమునిగి మృతిచెందారు. మిగతా ఇద్దరు అసలు ఏం జరగనట్టు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గొర్రెల కాపారుల ద్వారా తెలుసుకున్న సర్పంచ్ నిలదీయడంతో సమాచారం బయటికొచ్చింది. ఈ ఘటన వెల్దుర్తిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మధుసూదన్ గౌడ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం బొమ్మారానికి చెందిన మెట్టెల నాగరాజు, మెట్టెల శ్రీకాంత్, మెట్టెల సందీప్ ముగ్గురు స్నేహితులు. హకింపేట శివారులోని హల్దీ ప్రాజెక్ట్లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్ళారు. నదిలో దిగిన క్రమంలో నీటి ప్రవాహానికి సందీప్(16) గల్లంతయ్యాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి మిగతా ఇద్దరు తమకేమీ తెలియదు అన్నట్లుగా అక్కడి నుంచి గట్టుపై ఉన్న సందీప్ దుస్తులు తీసుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. రాత్రి పది గంటల సమయంలో కొప్పులపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపారుల ఇచ్చిన సమాచారంతో బొమ్మారం సర్పంచ్ శంకర్ వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పారు. గట్టి నిలదీయగా అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో సోమవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు హల్దీ ప్రాజెక్ట్లో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
మార్పు మన నుంచే ప్రారంభం కావాలి
హిమాయత్నగర్: మార్పు మనఇంట్లో నుంచి..అంటే వ్యక్తి నుంచే ప్రారంభమైతే దేశం ప్రగతిపథంలో ముందుకెళుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. నేటితరం పిల్లలు ఏసీ లేకపోయినా, చెమట పట్టినా భరించలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారన్నారు. దేశ రక్షణ, భావితరాల భవిష్యత్కు సరిహద్దుల్లో మన సైనికులు రక్తం కారుస్తూ, చెమటోడుస్తూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ప్రాణాలను అడ్డేస్తున్నారని చెప్పారు. 24వ కార్గిల్ దివస్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లోని కేఎంఐటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ దేశంకోసం త్యాగం చేస్తున్న సైనికులను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం వారు సినిమా హీరోలు, క్రీడాకారులను మాత్రమే గుర్తించగలుగుతున్నారని, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, వారిత్యాగాల గురించి ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినవారి కుటుంబీకులకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్, మేజర్ జనరల్ వీకే పురోహిత్, జమ్మూకశ్మీర్కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లే
ముంబై: వ్యాపార ఒప్పందాల విషయంలో జాప్యం జరుగుతోందని మధ్య స్థాయి ఐటీ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తెలిపింది. రాబోయే ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లు ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కల్రా శుక్రవారం తెలిపారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను కంపెనీ చవిచూసిందని అన్నారు. ‘ప్రస్తుతం ఒప్పందాల ముగింపునకు ఎక్కువ సమయం పడుతోంది. సగటు సమయం సుమారు మూడు నెలల నుండి 4–6 నెలలకు చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.2,050 కోట్ల నుంచి రూ.1,943 కోట్లకు పడిపోయింది. అయితే ఒప్పందాల విషయమై పలు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 3 శాతం క్షీణించి రూ.2,321 కోట్లకు పడిపోయింది. నిర్ణీత సమయాల్లో మొత్తం 800 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. మార్చితో పోలిస్తే జూన్ క్వార్టరులో ప్రాఫిట్ మార్జిన్ 0.5 తగ్గి 14.9 శాతంగా ఉంది. నికరలాభం 8.1 శాతం ఎగసి రూ.229 కోట్లను తాకింది. కొత్తగా 240 మంది చేరికతో మొత్తం సిబ్బంది సంఖ్య జూన్ చివరినాటికి 23,130కి చేరింది. కోల్కత, కొచి్చలో నూతనంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని సందీప్ వెల్లడించారు. -
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మరో సినిమా రిలీజ్.. ఈసారి రూ.39కే
కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే కూర్చొని చూసే ఛాన్స్ 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్' రీసెంట్ గానే ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి ఇదివరకే చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో 'లవ్ యూ టూ' చిత్ర బృందంతో కలిసి గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. మరో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా ఇప్పటికే 'నిరీక్షణ' అనే చిత్రాన్ని రూ.99కి విడుదల చేశాం. రెండో సినిమాగా 'లవ్ యూ టూ' చిత్రాన్ని కేవలం రూ.39కే జూన్ 16 నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఏపీ ఫైబర్నెట్ ద్వారా చూసే ఛాన్స్ కల్పిస్తాం. త్వరలో మూరుమూల ప్రాంతాలకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు విస్తరిస్తాం. ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్, థియేటర్లకు పోటీ కాదు' అని గౌతంరెడ్డి చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!) -
దళిత నేత సందీప్ ను దూషించిన టీడీపీ నేత గడ్డం వెంకటేశ్వరరావు
-
చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా బాణాసంచా కాల్చే క్రమంలో సిలిండర్ పేలిన ఘటనలో మృతులసంఖ్య నాలుగుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మృతి చెందగా, రెండుకాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన చిందివారి సందీప్(36) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతడికి భార్య మమత అలియాస్ మొమీన్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేయి తాలూకా మింగరి గ్రామానికి చెందిన చిందివారి సందీప్ బతుకుదెరువు కోసం పదిహేనేళ్ల క్రితం తెలంగాణకు వచ్చాడు. తల్లిదండ్రులు, సోదరి పోషణ బాధ్యతలు సందీప్ చూసు కుంటున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సందీప్ సుతారీ పనులు చేసే క్రమంలో ఒడిశా ప్రాంతానికి చెంది మొమీన్ పరిచయం కావటంతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కృష్ణ ఉన్నాడు. ఏడాది క్రితం పొట్ట చేతపట్టుకొని కారేపల్లి మండలం చీమలపాడుకు సందీప్, మొమీన్ వచ్చారు. భార్య గ్రామంలో వ్యవసాయకూలీ పనులకు వెళ్తుండగా, సందీ ప్ సుతారీ పనులు చేసేవాడు. ఈ నెల 12న మొమీన్ మిర్చి తోటలో పనికి వెళ్లగా, గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి సందీప్ హాజరయ్యాడు. ఆరోజు గుడిసె కాలి పోతుండటంతో అందరితోపాటు మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్ శకలాలు దూసుకురావడంతో సందీప్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తొలుత ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రికి, తర్వాత నిమ్స్కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. ఊరుగాని ఊరిలో భర్తను కోల్పోయిన మొమీన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
‘అమెజాన్’ లో ఆకట్టుకుంటున్న గంధర్వ
ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో తనదంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న చిత్రం గంధర్వ . ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై దర్శకుడు అప్సర్ ని పరిచయం చేస్తూ సందీప్ మాధవ్ , గాయత్రీ ఆర్ సురేష్ జంటగా నటించిన చిత్రం గంధర్వ. ఈ చిత్రంలో సాయి కుమార్ , సురేష్ బాబు , బాబు మోహన్ , పోసాని , సమ్మెట గాంధీ , టెంపర్ వంశీ , సూర్య , పాల్ , జయరాం తదితరులు నటించారు. యాంటి ఏజింగ్ కాన్సెప్ట్ పై చేసిన కొత్త ప్రయోగం విమర్శకులను సైతం మెప్పించింది . ఒక సంఘటనలో ఆక్సిజన్ చాంబర్ లో ఇరుక్కు పోయిన కథా నాయకుడికి కళ్ళు తెరిచే సరికి యాభై ఏళ్ళు గడిచి పోతాయి . కాని అతని వయసు మాత్రం మారాదు . తిరిగి ఇంటికి చేరుకున్న హీరో కి తన భార్య డెబ్భై ఏళ్ల ముసలావిడ గా కొడుకు యాభై ఏళ్ల వ్యక్తిగా కలుస్తారు. అసలు అతనికి జరిగిన సంఘటన ఏంటీ , ఆక్సిజన్ చాంబర్ కథ ఎలా సాగింది, పాతికేళ్ళ తండ్రికి యాభై ఏళ్ల కొడుకుకి మధ్య జరిగిన యుద్ధం ఏమిటీ , అసలు ప్రపంచం ఎలా నమ్మింది అనే కథాంశంతో దర్శకుడు అప్సర్ తన తొలి ప్రయత్నం లోనే భారి స్పాన్ ఉన్న కథ ఎంచుకున్నాడు. జూలై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన గంధర్వ మంచి మార్కులే కొట్టేసింది . అయితే తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సైతం తన హవా కొనసాగిస్తుంది . అది చూసిన నిర్మాణ సంస్థ వెంటనే ఈ చిత్రాన్ని అటు తమిళ్ , మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ నెల ఆఖరున రిలీజ్ చేసే పనుల్లో పడ్డారు. ఏది ఏమైనా కొత్త కథ తో అందర్నీ ఆకట్టుకున్న దర్శకుడు అప్సర్ , ప్రస్తుతం ఒక పెద్ద నిర్మాణ సంస్థ కోసం కథ రెడి చేస్తున్నట్టు సమాచారం. -
నటుడు సింహా ప్రధాన పాత్రలో ‘రావణ కల్యాణం’
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రావణ కల్యాణం’. ఆలూరి సురేష్, సింహా సమర్పణలో జేవీ మధుకిరణ్ దర్శకత్వంలో అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం ఆరంభమైంది. తొలి సీన్కి యాక్టర్ సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సింహా మాట్లాడుతూ.. ‘‘రావణ కల్యాణం’ కథ విన్నప్పుడు నేనెంత ఎగై్జట్ అయ్యానో, థియేటర్స్లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు అంతే ఎగై్జట్ అవుతారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సందీప్ మాధవ్, రాజేంద్రప్రసాద్, శత్రు, శరత్ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. రధన్ సంగీతం, మనోహర్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్. -
కుటుంబమంతా చూసేలా ఉంటుంది
‘‘గంధర్వ’ యూత్ఫుల్ సినిమా కాదు. కుటుంబమంతా కలిసి చూసే చిత్రం. శ్రీకాంత్, జగపతిబాబుగార్లు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు చేశారు. ఈ జనరేష¯Œ లో ‘గంధర్వ’ ద్వారా నాకు మంచి అవకాశం వచ్చింది’’ అని హీరో సందీప్ మాధవ్ అన్నారు. అప్సర్ దర్శకత్వంలో సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. సుభాని నిర్మించిన ఈ సినిమా ఎస్కే ఫిల్మ్స్ ద్వారా జూలై 1న రిలీజ్ కానుంది. సందీప్ మాధవ్ మాట్లాడుతూ–‘‘గంధర్వ’ కథని లాక్డౌన్లో విన్నాను. మిలటరీ వ్యక్తి కుటుంబంలో వాతావరణం ఎలా ఉంటుంది? పెళ్లి అయిన మరుసటిరోజే యుద్ధానికి వెళ్లాల్సివస్తే పరిస్థితి ఏంటి? వంటి అంశాలున్నాయి. ఈ కథ 1971లో మొదలై 2021 వరకు రన్ అవుతుంది. దర్శకుడు అప్సర్ సోదరుడే నిర్మాత సుభానిగారు.. ఎక్కడా రాజీ పడలేదు. ఎస్.కె. ఫిలిమ్స్ ద్వారా సురేష్ కొండేటిగారు మా సినిమాని విడుదల చేస్తుండటంతో జనాలకు బాగా రీచ్ అవుతోంది. రామ్గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్గార్లకు 24 గంటలు సినిమానే ప్రపంచం.. వారితో పనిచేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రస్తుతం ‘మాస్ మహారాజ్’ అనే సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
టీనా డిప్రెషన్లో ఉన్నానని చెప్పింది : ఆట సందీప్
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్ విన్నర్ టీనా సాధు మరణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఫిట్గా ఉండే టీనా 38ఏళ్ల వయసులోనే మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీనా మరణంపై ఆట సందీప్ అనుమానం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. 'టీనా లేదన్న విషయం ఇంకా నమ్మబుద్ది కావట్లేదు. 5రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చి ఎంతో సరదాగా గడిపిన టీనాకు అంత సడెన్గా హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఆమె చాలా ఫిట్గా ఉంటుంది. ఇది గుండెపోటు అయ్యిండదనిపిస్తుంది. నాతో మాట్లాడినప్పుడు డిప్రెషన్లో ఉన్నాను. పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పింది. కలిసినప్పుడు వీటిపై మాట్లాడతానని చెప్పింది. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. చాలా షాకింగ్గా అనిపిస్తుంది' అని పేర్కొన్నారు. దీంతో టీనా మృతిపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఆట సీజన్-1లో సందీప్-టీనాల జోడి టైటిల్ విన్నర్గా గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత చదవండి: డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్ ఎక్కువవడం వల్లే.. -
'ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత
ఓంకార్ యాంకర్గా బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షో మొదటి సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది. ఈ విషయాన్ని ఆట సందీప్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. టీనా సాధు మరణవార్త తెలిసి షాక్ అయ్యాను. ఆట సీజన్లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఆట సందీప్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు టీనా మరణవార్త తెలిసి షాక్ అవుతున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆట సీజన్-1విన్నర్గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్-4కి జడ్జిగా వ్యవహరించారు. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హఠాన్మరణం చెందడం షాకింగ్గా అనిపిస్తుంది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
వారు కూడా నా కుటుంబమే:అడవి శేష్
-
భారీ యాక్షన్ సీక్వెన్స్తో ‘జార్జి రెడ్డి’ నటుడి కొత్త మూవీ
‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ హీరోయిన్స్గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఎం.ఎన్.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కుమార్, సురేష్, బాబుమోహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు రాని ఓ డిఫరెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని మూవీ టీం వెల్లడించింది. ఇటీవల షూటింగ్ జరిగిన ఓ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు ముఖ్యనటులతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నరన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు వెండి నాణాలను బహుకరించి అభినందించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. చదవండి: నాకు చుక్కలు చూపించేవాడు.. ఆనంద్కే ముందు పెళ్లి: విజయ్ దేవరకొండ -
‘‘గంధర్వ’’ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
వంగవీటి, 'జార్జిరెడ్డి' ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గంధర్వ. గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ కథనాయికలు. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కథాంశంతో దర్శకుడు అప్సర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇప్పటి వరకు నటించని ఓ డిఫరెంట్ రోల్లో సందీప్ మాధవ్ కనిపించనున్నారు. ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను గమనిస్తే హీరో సందీప్ మాధవ్ రౌడీలను చితక్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి కట్టేసి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే గంధర్వ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని తెలుస్తుంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజన్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. -
ఆట సందీప్కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్- జ్యోతీ రాజ్ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్ పంపించారు. 'మీ థ్యాంక్యూ మెసేజ్ నాకు అందింది. అమ్మ మాటలు, ఆమె దీవెనలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. మీరు ఇద్దరు చేసే డ్యాన్స్ బిట్స్ అప్పుడప్పుడు నా దృష్టికి వస్తుంటాయి. మీ కపుల్స్ చాలా లవ్లీ డ్యాన్సర్స్. మీ క్రేజ్ నన్ను బాగా ఆకటుకుంటుంది. భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద కొరియోగ్రాఫర్గా రాణించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను' అని స్వయంగా చిరంజీవి పంపిన వాయిస్ మెసేజ్ను ఆట సందీప్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో చిరంజీవి ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఆట సందీప్ తల్లికి కూడా వ్యాక్సిన్ వేయించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ వల్ల ఎంతోమంది డ్యాన్సర్లు కూడా పని లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ, గత కొన్ని రోజులుగా డ్యాన్సర్లకు సందీప్ దంపతులు నిత్యవసర వస్తువులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. వాళ్లను ఆదుకునేందుకు ఆట సందీప్ దంపతులు తమవంతు సహాయం చేస్తున్నారు. మరోవైపు సందీప్కు మరింత సహకారం అందించేందుకు చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు స్వయంగా చిరంజీవి నుంచి వాయిస్ మెసేజ్ అందడంతో ఆట సందీప్ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నోటి నుంచి తమ పేరు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆట సందీప్ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరంజీవి నుంచి మెసేజ్ రావడం నిజంగా సూపర్ అంటూ అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి : సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్ : చిరంజీవి 'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే! -
IPL 2021: ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్ వాయిదా!
-
IPL 2021: ఇద్దరు ప్లేయర్లకు కరోనా, మ్యాచ్ వాయిదా!
న్యూఢిల్లీ: ఐపీఎల్కు కరోనా సెగ తగిలింది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్ను వాయిదా వేశారు. కాగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్కు వైరస్ సోకినట్లు తేలింది. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో, టీం మొత్తం ఐసోలేషన్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్ను వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు ఏఎన్ఐతో వ్యాఖ్యానించారు. కాగా భారత్లో రోజువారీ కరోనా కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు బయో బబుల్లో ఉండలేక లీగ్ నుంచి వైదొలిగారు. ఇక అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. చదవండి: వార్నర్ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా పంజాబ్ కింగ్స్కు షాక్: రాహుల్ ఔట్! -
చెక్ మేట్.. సూటిగా సొల్లు లేకుండా!
సందీప్ బొలినేని, విష్ణుప్రియ, దీక్షా పంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్ మేట్’. ‘సూటిగా సొల్లు లేకుండా’ అన్నది ఉపశీర్షిక. చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వేలంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రసాద్ వేలంపల్లి మాట్లాడుతూ– ‘‘కొత్త రకం ప్రేమకథగా రూపొందిన చిత్రం ‘చెక్ మేట్. మామూలుగా ప్రతి ప్రేమకథలో వారి కుటుంబ సభ్యుల నుండి సమస్యలు వస్తాయి.. అయితే ఈ సినిమాలో తమ ప్రేమకు క్లోజ్ ఫ్రెండ్ వల్లే సమస్య ఏర్పడితే జరిగే పరిణామాలేంటి? స్నేహితురాలి నుండి తన ప్రేమికుడిని ఎలా కాపాడుకుని తన ప్రేమని గెలిపించుకుంది? అనేది కథాంశం. బలమైన పాత్ర కావడంతో తెలుగమ్మాయి చేస్తే బాగుంటుందని విష్ణు ప్రియని సెలక్ట్ చేశాం. తన ఫ్రెండ్గా దీక్షా పంత్ నటించారు’’ అన్నారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, కృష్ణ భగవాన్, సంపూర్ణేష్ బాబు, షకలక శంకర్, సుధీర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: అంజి (‘గరుడవేగ’ ఫేమ్), నేపథ్య సంగీతం: సాగర్ మహతి, సంగీతం–నిర్మాత–దర్శకత్వం: ప్రసాద్ వేలంపల్లి. -
టాలీవుడ్లో తీవ్ర విషాదం..
సాక్షి, బాపట్ల టౌన్: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. రౌడీ ఫెలో, స్వామిరారా, వీడు తేడా.. సినిమాల నిర్మాత కొరటాల సందీప్ ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం పూండ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పలువురు టాలీవుడ్ ప్రముఖులు సందీప్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నా ప్రియ స్నేహితుడు సందీప్ మరణించాడన్న వార్త నన్ను తీవ్రంగా బాధించింది. స్వామి రారా సినిమాకు నువ్వు అందించిన సాయం మరువలేనిది. నీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిస్ యూ.." అని దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా సందీప్తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశాడు. Very sadden to hear the demise of my dearest friend #SundeepKoritala. Can never forget ur support in the making of #SwamyRaRa . Rest in peace brother we miss u pic.twitter.com/M6le6c089x — sudheer varma (@sudheerkvarma) February 28, 2021 నా రౌడీ ఫెల్లో ఇక లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ హీరో నారా రోహిత్.. సందీప్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ రోజు ఇంత భయంకరంగా మొదలవుతుందని ఊహించలేదు అని బాధపడ్డాడు Saddened to learn that my #RowdyFellow co-producer & my well wisher Sandeep Koritala is no more. This was such a terrible start for the day. ఓం శాంతి !! pic.twitter.com/3UC4IP5mfz — Rohith Nara (@IamRohithNara) February 28, 2021 సందీప్ కొరటాల మమ్మల్ని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త షాక్కు గురి చేసింది. ఆయన చిరునవ్వుతో సవాళ్లను ఎదిరించేవాడు. స్వామి రారా, వీడు తేడా సినిమాలకు పిల్లర్లా నిలబడ్డాడు. పలు సినిమాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించాడు.ఆయనెప్పటికీ మా గుండెల్లో సజీవంగా ఉంటాడు అని హీరో నిఖిల్ నివాళులు అర్పించాడు. Sandeep Koritala .... it is shocking that you have left us brother... He was a lion hearted guy who would tackle challenges with a Smile and was the pillar of strength for my movies SwamyRara ,VeeduTheda & CoProduced so many more films U will forever live in all our hearts🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/0L8DtoAF6W — Nikhil Siddhartha (@actor_Nikhil) March 1, 2021 -
Hyderabad Bike Racer: రికార్డులే రికార్డులు
సాక్షి, బంజారాహిల్స్: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 600 మంది బైక్ రేసర్లలో అత్యుత్తమ ప్రతిభ చాటిన నగర యువకుడు నాలుగు విభాగాల్లో ముందుండి నాలుగు ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు. పూణేలోని లోనావాలాలో జరిగిన డ్రాగ్ రన్లో పాల్గొన్న కూకట్పల్లికి చెందిన బైక్ రేసర్ సందీప్ నడింపల్లి ఎం–9 కేటగిరిలో మొదటి స్థానం, ఓ–2 కేటగిరిలో మూడో స్థానంతో పాటు ఫాస్టెస్ట్ బైక్ ఆఫ్ ద ఈవెంట్, ఫాస్టెస్ట్ టైమ్ ఆఫ్ద ఈవెంట్ పతకాలను గెలుచుకున్నాడు. తొమ్మిది సెకండ్లలో 400 మీటర్ల దూరాన్ని చేరుకొని ఈ రికార్డు సృష్టించాడు. అయిదేళ్లుగా రేసర్గా రాణిస్తున్న సందీప్ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 50 పతకాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నేషనల్ చాంపియన్గా నిలిచిన ఆయన పాత రికార్డులను బద్దలుకొట్టి నాలుగు సరికొత్త రికార్డులను నమోదు చేశారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఇతను కాలేజీ స్థాయిలోనే జాతీయ స్థాయి టైటిల్స్ సాధించాడు. మూడేళ్లలో ఆరు నేషనల్ టైటిల్స్, 45 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మరింత రాణించి భారత కీర్తి పతాకాలను ప్రపంచ స్థాయిలో చాటాలన్నదే తన లక్ష్యమని ఆ మేరకు శ్రమిస్తానని సందీప్ తెలిపారు. ఈ పతకాలు రావడంపట్ల తనకెంతో ఆనందంగా ఉందన్నాడు. -
నటుడి ఆత్మహత్య: భార్య, అత్తపై ఎఫ్ఐఆర్
ముంబై: బాలీవుడ్ చిత్రం ‘ఎంఎస్ ధోని’ నటుడు సందీప్ నహార్(32) నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ముంబైలోని అతడి నివాసంలో సందీప్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాలీవుడ్లో కలకం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు అతడు ఫేస్బుక్లో పోస్టు చేసిన సూసైడ్ నోట్లో అతడి భార్య కాంచన, ఆమె తల్లి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే భార్య కాంచనపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని కూడా నోట్లో రాసుకొచ్చాడు. కానీ బుధవారం పోలీసులు అతడి భార్య, అత్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ... సందీప్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడి భార్య కాంచన శర్మ, ఆమె తల్లి విను శర్మలపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు వారిని అరెస్టు చేయడం లేదా విచారించడం కానీ చేయలేదన్నారు. అయితే సందీప్ సూసైడ్ నోట్లో భార్యపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని రాశాడు కదా అని అడిగిన ప్రశ్నను పోలీసులు కొట్టిపారేశారు. కాగా సందీప్ మంగళవారం ఉదయం గోరెగావ్లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సందీప్ సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు గల కారణాలను పేర్కొంటూ ఓ వీడియోతో పాటు సూసైడ్ నోట్ను కూడా పోస్టు చేశాడు. ‘నా భార్య కాంచనతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో సంతోషాలను, దు:ఖాలను, కష్టాలను చూశాను. అయితే వాటిన్నంటిని ఎదుర్కొన్నాను. ఇక నావల్ల కాదు. మరణించే సమయం వచ్చింది. ఇక నాకు బతకాలన్న ఆశ లేదు. ఎన్ని రోజులని చివాట్లు, ఆసహ్యానలను భరించాలి. నాకంటూ సెల్ఫ్రెస్పెక్ట్ ఉంటుంది. నా భార్య చాలా కోపిష్టి. తన స్వభావమే అంతా. రోజు పొద్దున్నే సాయంత్రం, రాత్రిళ్లు తనతో వాదించే శక్తి ఇక నాకు లేదు’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘బాలీవుడ్ సినీ పరిశ్రమలో రాజకీయాలతో అసంతృప్తికి గురయ్యా. రాజకీయాల కారణంగా చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో దూరమయ్యాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: భార్య వేధింపులు.. బాలీవుడ్ నటుడు ఆత్మహత్య) -
‘రాత’ మార్చిన రాంగోపాల్ వర్మ..
సాక్షి, హైదరాబాద్: అడుగు పెట్టిన స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీ రాసుకున్న యువ హీరో సందీప్ మాధవ్. ఏ కొత్త నటుడికీ రాని విధంగా వరుస బయోపిక్స్లో నటించిన ఘనత ఈ యువ నటుడికే దక్కింది. నిజ జీవిత పాత్రలను తెరపై పండించడం, ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులువైన పనికాదు. వంగవీటి, జార్జ్రెడ్డి సినిమాల ద్వారా దాన్ని సుసాధ్యం చేసిన సందీప్ (సాండీ) బయోపిక్స్ రూపొందించాలనుకుంటున్న పలువురు నిర్మాతలకు ఆశాదీపంగా మారాడు.. ‘సాక్షి’తో తన మనోభావాలను సందీప్ ఇలా పంచుకున్నాడు.. ఆ విశేషాలు తన మాటల్లోనే.. సినిమా కుటుంబంలో ఒక భాగం అవ్వాలనే ఆశతో, ఆశయంతో వచ్చిన సగటు సినిమా ప్రేమికుడ్ని నేను. పుట్టింది ఎక్కడైనా, పెరిగిందంతా.. చదువంతా ఈ సిటీలోనే. చదువైన తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్గా జాబ్ చేస్తున్నా కానీ మనసంతా సినిమానే. స్టేజ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి కల కావడంతో సినిమా ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చా. అందులో భాగంగానే పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా ఆడిషన్స్లో అవకాశం వచ్చింది. అప్పటికే ఒక సినిమాలో చేసినప్పటికీ నా సినిమా ఆశలకు కొత్త ఊపిరి వచ్చింది అక్కడే.. లీడ్రోల్ చేసే అవకాశం పూరి దగ్గరకు రాకపోకలు సాగిస్తున్న సమయంలోనే నన్ను చూసిన రామ్గోపాల్ వర్మకి తానెప్పటి నుంచో తీయాలనుకుంటున్న వంగవీటి సినిమాలో వంగవీటి రంగా పాత్రధారి నాలో కనపడ్డాడు. దాంతో ఆ సినిమాలో లీడ్రోల్ చేసే అవకాశం వచ్చింది. సుప్రసిద్ధ రామ్గోపాల్ వర్మ దర్శకుడు, అందులోనూ నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న పవర్ఫుల్ స్టోరీ కాబట్టి సినిమాలో నేను కాకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా ఆహార్యం, హావభావాలను కనపడేందుకు బాగా కష్టపడి ప్రాక్టీస్ చేశా. దానికి తగిన ఫలితం విమర్శకుల ప్రశంసల రూపంలో దక్కింది. చార్జ్ చేసిన జార్జ్.. వంగవీటి ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మరింత మంచి పాత్రలు చేయాలనే ఆసక్తి ఏర్పడింది. వంగవీటి తర్వాత దాదాపు 50 కథల వరకు విన్నాను. ఆ సమయంలోనే జార్జిరెడ్డి కథ విన్న వెంటనే ఓకే చేశాను.. నన్ను అత్యంత ప్రభావితం చేసిన బయోపిక్ అది. పైగా ఛాలెంజింగ్ రోల్, జార్జిరెడ్డి అనేది ఈ తరానికి తెలియని రియల్ హీరో చరిత్ర. దాన్ని తెరపైకి తీసుకురావాలంటే గట్స్ ఉండాలి. అవన్నీ నాకు దర్శకుడిలో కనిపించాయి. కథని ఎంత నమ్ముతానో కథని సినిమాగా మలిచే దర్శకుడిని అంతకన్నా ఎక్కువ నమ్ముతా. దాన్ని ప్రజెంట్ చేయడంలో మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు తను. గతం మరిచిన కథని తట్టిలేపుతున్నామని కాస్త ఆలోచన వచ్చినా ప్రేక్షకులు ‘సినిమాని సినిమాగానే చూస్తారన్న’ ప్రగాఢ నమ్మకం నాది. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం నన్ను గెలిపించింది. కొత్త సాండీని చూస్తారిక.. చేసిన రెండు సినిమాలు వివాదాస్పద కథలే అయినప్పటికీ వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ఇవి నా నటనలోని మరో కోణాన్ని చూపించడానికి ఎంచుకున్న సినిమాలు. ఒకటి కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్తో అందరినీ అలరిస్తుంది. మరోటి పవర్ఫుల్ ఆర్మీ క్యారెక్టర్. నాకెప్పుడూ సమాజంపై అభిమానం, ఆరాధనా భావం ఉంటుంది. ఎలాంటి సినిమా చేసినా సమాజ శ్రేయస్సుకు దోహద పడే అంశం దానిలో ఉండేలా చూసుకుంటా. నేనెప్పుడూ స్టార్గా ఫీలవ్వను. కమర్షియల్ సినిమాలు చేస్తూనే తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు, సైంటిఫిక్ కథాంశంతో కూడిన సినిమాల్లో చేయాలనుంది. ఏలియన్స్, గెలాక్సి తదితర ఆసక్తికర అంశాలతో ఉన్న సినిమాలంటే ఇష్టం. కరోనాపై పరిశ్రమ గెలిచింది.. కళపై ఆసక్తి ప్రతిభ ఉండాలే కానీ అవకాశాలకు కొదువ లేదు మన దగ్గర. కరోనా ఇండస్ట్రీని దెబ్బతీసినా కొత్త అవకావాలను సృష్టించుకోవడంలో సినిమా ఇండస్ట్రీనే గెలిచింది. నిజానికి ఇప్పుడు ఎవరూ ఖాళీ లేరు. ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చాక చాలా ప్రాజెక్ట్లు పెరిగాయి, పని పెరిగింది. కష్టాల్లో ఉన్న సినిమా కార్మికులకు ఇది కల్పతరువుగా మారింది. దీనికి స్టార్డమ్తో పనిలేదు కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతివారికీ అవకాశాలు దక్కుతాయి. -
126 ఏళ్ల బాటా చరిత్రలో తొలిసారి..
ముంబై, సాక్షి: ఫుట్వేర్ దిగ్గజం బాటా గ్రూప్ గ్లోబల్ సీఈవోగా తొలిసారి ఒక భారతీయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బాటా ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సందీప్ కటారియా ఇందుకు ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు బాటా గ్రూప్నకు సేవలందించిన చీఫ్ అలెగ్జిస్ నసార్డ్ నుంచి బాటా గ్లోబల్ పగ్గాలను సందీప్ అందుకోనున్నారు. తద్వారా 126 ఏళ్ల చరిత్ర కలిగిన బాటా గ్రూప్ను నడిపించనున్న తొలి భారత సీఈవోగా నిలవనున్నారు. వెరసి దిగ్గజ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న సుప్రసిద్ధ దేశీ సీఈవోల సరసన సందీప్ చోటు సాధించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు సత్య నాదెళ్ల, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్కు సుందర్ పిచాయ్, మాస్టర్కార్డ్కు అజయ్ బంగా, ఐబీఎంకు అరవింద్ కృష్ణ, ఎఫ్ఎంసీజీ కంపెనీ రెకిట్ బెంకిసర్కు లక్ష్మణ్ నారాయణ్, నోవర్తిస్కు వసంత్ నారాయణ్ సేవలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు. బ్యాక్గ్రౌండ్ బాటా గ్లోబల్కు సీఈవోగా ఎంపికైన 49ఏళ్ల సందీప్ ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. 1993 పీజీడీబీఎం బ్యాచ్లో గోల్డ్మెడలిస్ట్గా నిలిచారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్, యుమ్ బ్రాండ్స్, కేఎఫ్సీ, పిజ్జా హట్, టేకో బెల్, వొడాఫోన్ కంపెనీలలో 24 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ దేశీ యూనిట్ బాటా ఇండియాకు 2017లో సీఈవోగా చేరారు. స్విట్జర్లాండ్ కేంద్రంగా ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు కలిగిన బాటా గ్లోబల్కు దేశీ మార్కెట్ అత్యంత కీలకంగా నిలుస్తోంది. సందీప్ నేతృత్వంలో బాటా ఇండియా అమ్మకాలు రెండంకెల్లో వృద్ధి చూపగా.. నికర లాభాలు రెట్టింపయ్యాయి. యువతపై దృష్టిపెట్టడం, బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడం వంటి కార్యక్రమాల ద్వారా అమ్మకాలు పెంచుతూ వచ్చారు. గతేడాది బాటా ఇండియా అమ్మకాలు రూ. 3,053 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 327 కోట్లను తాకింది. గత కొన్నేళ్లుగా తీవ్ర పోటీలోనూ బాటా ఇండియా అత్యున్నత ఫలితాలను సాధించినట్లు కంపెనీ చైర్మన్ అశ్వని విండ్లేస్ పేర్కొన్నారు. సందీప్ కార్యాచరణలో బాటా గ్రూప్, బాటా ఇండియా ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడినట్లు తెలియజేశారు. 1934లో దేశీయంగా ఏర్పాటైన బాటా ఇండియా(బాటా షూ కంపెనీ) మధ్యతరగతి ప్రజల జీవనంలో భాగమైన బ్రాండుగా గుర్తింపును పొందినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. బాటా గ్రూప్ 1894లో టొమస్ బాటా అధ్యక్షతన స్విట్జర్లాండ్లో ఆవిర్భవించిన బాటా గ్రూప్ అమ్మకాల పరిమాణంరీత్యా ప్రపంచంలోని టాప్ కంపెనీగా నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వార్షికంగా 5,800 స్టోర్ల ద్వారా 18 కోట్ల బూట్ల జతలను విక్రయిస్తోంది. ఐదు ఖండాలలో 22 సొంత తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకుంది. 35,000 మందికిపైగా సిబ్బందిని కలిగి ఉంది. -
సన్రైజర్స్ జట్టులో హైదరాబాదీ
సాక్షి, ముషీరాబాద్: లక్షలాది మంది హైదరాబాద్ క్రికెట్ అభిమానుల ఆకాంక్షలను మూటగట్టుకొని ఐపీఎల్లోఆడేందుకు శుక్రవారం (ఈ నెల 21న)బయలుదేరి వెళ్తున్నాడు రాంనగర్ కుర్రోడు భావనక సందీప్. ఐపీఎల్ మ్యాచ్లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన వేలంపాటలో సందీప్ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. హైదరాబాద్ నుంచి మొదట ముంబై వెళ్లి ఈ నెల 23న మిగతా సన్రైజర్స్ జట్టుసభ్యులతో కలిసి యూఏఈకి ప్రత్యేక చాపర్లో వెళ్లనున్నాడు. యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న అనంతరం జట్టు సభ్యులు నెట్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. సన్రైజర్స్ జట్టులో హైదరాబాద్ నుంచిప్రాతినిధ్యం వహిస్తోంది భావనక సందీప్ ఒక్కడే కావడం గమనార్హం. ఈ సందర్భంగా సందీప్ ఏం చెప్పారంటే.. ‘సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నేనొక్కడినే హైదరాబాద్కు చెందినవాడిని ఉండడంతో సహజంగానే తనపై హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను, ఆకాంక్షలను నేనుతప్పకుండా హైదరాబాద్ క్రికెట్ అభిమానుల మద్దతుతో నెరవేర్చడానికి కృషి చేస్తా. ఇప్పటివరకు రంజీ, దేశవాలీ క్రికెట్ మాత్రమే ఆడాను. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లతో ఐపీఎల్లో ఆడబోతున్నాను. ఈ అవకాశం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏబీ డివిల్లియర్స్కు బౌలింగ్ చేయడం నా చిరకాల వాంఛ. భారత జట్టులో స్థానం సంపాదించేందుకు ఇక్కడే పునాదులు వేసుకుంటాను. అవకాశం కల్పించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి, వీవీఎస్ లక్ష్మణ్కు, అంబటి రాయుడుకి, కోచ్లు జాన్, శ్రీధర్లకు, ఫిట్నెస్ సాధించేందుకు గంటల తరబడి నాకు బౌలింగ్ చేసిన మణితేజ, మధుసూదన్రెడ్డిలకు, చిన్నప్పటి నుంచే నాలోని క్రికెట్ను తట్టిలేపిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను’. సందీప్ రికార్డులివీ.. 2010లో 18 ఏళ్ల వయసులో రంజీతో రంగప్రవేశం చేసిన సందీప్ మొదటి మ్యాచ్లోనే ఝార్ఖండ్పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్మన్గా సందీప్ నిలిచాడు. ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచ్లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ టీమ్కు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఇతను లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా. విజయ్ హజారే 50 ఓవర్ల టోర్నమెంట్లో హైదరాబాద్ నుంచి 14 వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రతిభను చాటాడు. బీటెక్ పూర్తిచేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించిన సందీప్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో తన నైపుణ్యాన్ని చాటుతూ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్లో స్థానం దక్కించుకున్నాడు. -
నువ్వు నేను ఒక్కటైతే
ఆలం సందీప్, ప్రమీల జంటగా సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు నేను ఒక్కటైతే’. బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో ఏవీ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏవీ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టు విభిన్నమైన కథతో మంచి సినిమాని నిర్మించాం. మంచి సందేశాత్మక చిత్రం నిర్మించామని సెన్సార్ సభ్యులు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. థియేటర్స్ ప్రారంభం కాగానే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘విభిన్న కథా కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో అనుకున్న సమయానికి పూర్తి చేశాం. నేను ఏది అడిగితే అది ఇచ్చి నాకు పూర్తి సహకారం ఇచ్చారు నిర్మాత. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ చిత్రంలోని పాటలు సందర్భానికి తగ్గట్టు ఉంటాయి. త్వరలోనే మా సినిమా ట్రైలర్ విడుదల చేస్తాం’’ అని బొంతు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శూలం ప్రసాద్, సంగీతం: చిన్నికృష్ణ. -
బెజవాడ గ్యాంగ్వార్ : పండు అరెస్ట్
సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విజయవాడ్ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారు. గొడవలో గాయాలు అవ్వడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీస్ ప్రొటక్షన్ మధ్య అతడికి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి కుదటపడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పండు వద్ద నుంచి తోట సందీప్ హత్యకు వినియోగించిన రెండు కత్తులు, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. (చదవండి : బెజవాడలో అలజడి) కాగా ఇప్పటికే ఈకేసులో ఇరు వర్గాలకు చెందిన 33 మందిని పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో పదిహేను మంది కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితులపై రౌడీ షీట్లు తెరవనున్నారు. నేరచరిత్ర ఎక్కువగా ఉన్నవారిని నగరబహిష్కరణ చెయ్యాలని నిర్ణయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. (చదవండి : పండు.. మామూలోడు కాదు!) -
బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. మరో ముందడుగు
సాక్షి, కృష్ణా: జెజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. పోలీసులు మరో తొమ్మిది మంది వీధి రౌడీలను బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో పండు గ్యాంగ్కి చెందినవారు ఐదుగురు, సందీప్ బ్యాచ్కి చెందినవారు నలుగురు ఉన్నారు. ఇప్పటికే రెండు గ్యాంగ్లకు చెందిన 24 మందిని పోలీసులు రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు పోలీసు బృందాలు కేసు మూలాలను అన్వేషిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే గ్యాంగ్ లీడర్ పండుని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. పండు విచారణలో సందీప్ హత్య వెనక ఉన్న కారణాలను పోలీసులు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. సందీప్ కుటుంబసభ్యుల ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సీన్ రీ కన్స్ట్రక్షన్లో కీలక విషయాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నగర సీపీ ద్వారకా తిరుమలరావు వీధి రౌడీలకు నగర బహిష్కరణ విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
సన్రైజర్స్లో రాంనగర్ కుర్రోడు
గల్లీ చిన్నోడు బావనక సందీప్ దశ తిరగనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అద్భుత అవకాశం మనోడికి దక్కింది. దేశవాళీ టోర్నీల్లో మెరిపించిన ఈ భాగ్యనగరం కుర్రోడిపై గురువారం కనక వర్షం కురిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో సన్రైజర్స్ ఫ్రాంచైజీ సందీప్ను సొంతం చేసుకుంది. వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ లాంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రోత్సాహంతో సందీప్ ప్రొఫెషనల్ కెరీర్ మరింత ఉజ్వలంగా మారనుంది. బేస్ ప్రైజ్కే (ప్రాథమిక ధర) ‘సన్’ చెంత చేరిన ఈ హైదరాబాదీ సొంత ప్రేక్షకుల మద్దతుతో ఐపీఎల్లోచెలరేగాలని ఉత్సాహంగాఎదురుచూస్తున్నాడు. ముషీరాబాద్: తండ్రి త్యాగానికి ఆ కుర్రాడు న్యాయం చేశాడు. రాంనగర్ గల్లీల్లో బ్యాట్ పట్టుకు తిరిగిన ‘బావనక సందీప్’ ఐపీఎల్కు ఎంపికై మధ్య తరగతి కుటుంబం నుంచి మరో కలికితురాయిగా నిలిచాడు. గత ఐపీఎల్ సీజన్లో జరిగిన వేలంలో నగరం నుంచి సిరాజ్ స్థానం సంపాదించుకోగా.. ఈ సీజన్లో సందీప్ చోటు దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోల్కతాలో గురువారం ఐపీఎల్–2020 సీజన్కు జరిగిన క్రికెట్ క్రీడాకారుల వేలంలో సందీప్ను రూ.20 లక్షల బేస్ ప్రైజ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం దక్కించుకుంది. ప్రస్తుతం సందీప్ పంజాబ్లో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. తమ ప్రాంతం కుర్రాడికి ఐపీఎల్లో అవకాశం దక్కడంతో రాంనగర్లోని వైఎస్సార్ పార్కు సమీపంలోని సందీప్ నివాసం స్థానికులు, అభిమానుల కోలాహలంగా మారిపోయింది. కాగా, సందీప్ 2010లో తన 18 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్లో రంగప్రవేశం చేసి తన మొదటి మ్యాచ్లోనే జార్ఖండ్పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్మెన్గా నిలిచాడు. 54 రంజీ మ్యాచ్లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. అతడి కెరీర్లో మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో జమచేసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అయిన సందీప్ ప్రస్తుతం హైదరాబాద్ రంజీ టీమ్కు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఇతడు బీటెక్ పూర్తిచేసి స్పోర్ట్స్ కోటాలో ఇన్కం ట్యాక్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సంపాదించాడు. కలిసొచ్చిన అవకాశం ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ఆలిండియా టీ–20 టోర్నమెంట్లో సందీప్ తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ మంత్రముగ్ధులను చేసి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో ఇతడు 7 ఇన్నింగ్స్ ఆడి 261 పరుగులు సాధించగా, అందులో 4 ఇన్సింగ్స్లో నాటౌట్గా నిలవడం గమనార్హం. ఐపీఎల్ మ్యాచ్లలో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా అందుకు తగ్గట్టుగానే ముస్తాక్ అలీ టోర్నమెంట్లో తన ఆటతీరు ప్రదర్శించాడు. అందులో 43 బంతుల్లో 74 పరుగులు (నాటౌట్), 31 బంతుల్లో 51 పరుగులు (నాటౌట్), 27 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్), 16 బంతుల్లో 41 పరుగులు(నాటౌట్)గా నిలిచి సత్తాచాటాడు. ఇదే మ్యాచ్లో మొత్తం 14 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి ‘ఔరా’ అనిపించాడు. ఈ లీగ్ గ్రూప్లో ఆలిండియా స్థాయిలో పరుగుల్లో, సిక్సర్లలో రెండో స్థానంలో నిలవడం అతని ప్రతిభకు నిదర్శనం. ఈ మ్యాచ్లో సందీప్ ప్రదర్శన చూసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయిన ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ సందీప్ను ట్రయల్స్కు పిలవడం గమనార్హం. కొడుకు కోసం తండ్రి సర్వీస్ త్యాగం రాంనగర్లోని వైఎస్సార్ పార్కు సమీపంలో నివసించే బావనక పరమేశ్వర్ తన 19వ ఏటనే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో టెక్నీషియన్గా ఉద్యోగంలో చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే బీడీఎల్ తరఫున 1978 నుంచి 1990 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో లీగ్ మ్యాచ్లను ఆడారు. 1990 నుంచి 2000 వరకు హెచ్సీఏ తరఫున క్రికెట్ మ్యాచ్లకు అంపైరింగ్ చేశారు. తన కుమారుడిని కూడా క్రికెటర్గా చూడాలని ఆశపడ్డ పరమేశ్వర్ కొడుకుకు ఐదేళ్ల వయసు నుంచే తానే గురువుగా క్రికెట్ ఓనమాలను దిద్దించాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి పక్కనే ఉన్న గ్రౌండ్లో రోజూ క్రికెట్లో కొడుకు సందీప్కు మెళకువలు నేర్పేవారు. అయితే, ఈ సమయం సరిపోదని, తన బిడ్డ పూర్తిస్థాయి క్రికెటర్ కావాలంటే మరింత సమయాన్ని వెచ్చించాలని భావించారు. ఒకటి సాధించాలంటే మరొకటి వదులుకోవాలి. దీంతో తన కొడుకును ఉన్నతమైన క్రికెటర్గా చూడాలని నిర్ణయించుకున్న పరమేశ్వర్ తన ఎనిమిదేళ్ల సర్వీసును వదులుకున్నారు. ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు వ్యతిరేకించినా వినకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటి నుంచి పూర్తి సమయాన్ని సందీప్ శిక్షణ కోసమే వెచ్చించారు. వివిధ ప్రాంతాలలో జరిగే క్రికెట్ పోటీలకు కొడుకును తీసుకెళ్లడం, కోచింగ్ ఇప్పించడం, పక్కనే ఉంటూ మెళకువలు చెప్పడం, తప్పొప్పులను సరిదిద్దడం చేశారు. ముఖ్యంగా బేసిక్గా రైట్ హ్యాండెడ్ అయిన సందీప్ను లెఫ్ట్ హ్యాండర్గా తీర్చిదిద్దారు పరమేశ్వర్. దాంతోపాటు బ్యాటింగ్కే పరిమితం కాకుండా బౌలింగ్లోనూ తర్ఫీదునిచ్చారు. ఎంతో శ్రమకోర్చి ఆస్ట్రేలియా, ఇంగ్లడ్ కౌంటీల్లో ఆడేందుకు పంపించారు. ప్రతిభను గుర్తించిన కోచ్ జాన్ మనోజ్ కొడుకును క్రికెటర్ చేయాలనే లక్ష్యంతో తండ్రి పరమేశ్వర్ నాలుగో తరగతి చదువుతున్న సందీప్ను ఈస్ట్ మారేడ్పల్లిలోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఈ సెంటర్లోనే సందీప్కు కోచ్ జాన్ మనోజ్ క్రికెట్ నేర్పిస్తున్నారు. ఏడేళ్ల వయసులో ఉన్న సందీప్ క్రికెట్ ప్రతిభను గుర్తించిన కోచ్ ఈ అకాడమీకే చెందిన పాఠశాల సెయింట్ ఆండ్రూస్లో స్పోర్ట్స్ కోటాలో ప్రవేశం కల్పించాలని ప్రిన్సిపల్కు సిఫారసు చేశారు. అందుకు ప్రిన్సిపల్ నిరాకరించడంతో ఈ బుడతడు భవిష్యత్లో రాష్ట్ర, దేశస్థాయిలో క్రికెట్ ఆడే సత్తా ఉందని, నా మీద నమ్మకంతో అడ్మిషన్ ఇవ్వాలని గట్టిగా కోరడంతో ప్రిన్సిపల్ అంగీకరించి 10వ తరగతి వరకు రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉచిత విద్యనందించారు. గురువారం సందీప్ ఐపీఎల్కు సెలక్ట్ కావడం పట్ల కోచ్ జాన్ మనోజ్ హర్షం వ్యక్తం చేస్తూ సందీప్లో క్రమశిక్షణ, పట్టుదల మెండుగా ఉన్నాయని, అతడికి బ్యాటింగ్, బౌలింగ్లో మంచి ప్రతిభ ఉందని, అతన్ని బెంచ్కే పరిమితం చేయకుండా అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. తండ్రి త్యాగానికి కొడుకు గుర్తింపు రంజీల్లో 2010లో జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగులకే హైదరాబాద్ ఆటగాళ్లంతా ఔటవడంతో సెలక్టర్ల దృష్టి యువ క్రిడాకారులపై పడింది. అపుడప్పుడే తండ్రి శిక్షణలో రాటుదేలుతున్న సందీప్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో 2010లో 18 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్కు ఎంపికై మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి సెలక్టర్ల ఎంపిక సరైందేనని నిరూపించాడు. 75 సంవత్సరాల హైదరాబాద్ క్రికెట్ చరిత్రలో మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసిన 5వ ప్లేయర్గా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఐపీఎల్ వేలంలో కూడా సందీప్ పేరున్నా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. అయితే, ఈ రాంనగర్ కుర్రాడు నిరాశ చెందక తన ఆటను మరింత మెరుగుపరుచుకుని 2020 ఐపీఎల్లో స్థానం దక్కించుకోవడంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వన్ డే, ఐపీఎల్లో ఏనాటికైనా సెలెక్ట్ కాకపోతాడా..! తన కల నెరవేరకపోతుందా..! తన కృషికి తగిన ఫలితం లభించకపోతుందా..!! అనుకున్న తండ్రి పరమేశ్వర్ స్వప్నాన్ని కొడుకు సందీప్ నిజం చేశాడు. ఆనందంగా ఉంది నేను ఏం కోరుకున్నానో నా బిడ్డ అదిసాధించాడు. చాలా ఆనందంగా ఉంది. సందీప్ను క్రికెటర్గా చూడాలని నాసర్వీసును కూడా వదులుకున్నాను.నా పదేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందనుకుంటున్నా. నా బిడ్డకు ఆల్ రౌండర్గా ప్రతిభ ఉంది. భారత జట్టులో ఆడే అవకాశం దక్కాలని కోరుకుంటున్నా.– పరమేశ్వర్, ఉమారాణి(సందీప్ తల్లిదండ్రులు) సందీప్ @బీటెక్ సందీప్ మూడో తరగతి వరకు రాంనగర్లోని మదర్స్ హైస్కూల్లో చదువుకున్నాడు. 4నుంచి 10వ తరగతి వరకు ఈస్ట్ మారేడ్పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్లో, ఇంటర్ అదే ప్రాంతంలోని సెయింట్ జాన్స్ జూనియర్ కళాశాలలో, బీటెక్ తీగల కృష్ణారెడ్డిఇంజినీరింగ్కళాశాలలోపూర్తిచేశాడు. అద్భుత అవకాశం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపికకావడం చాలా ఆనందంగా ఉంది. 60 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నమెంట్లో వార్నర్,విలియమ్సన్, వీవీఎస్ లక్ష్మణ్తో పాటుహేమాహేమీలతో కలిసుండే అద్భుత అవకాశం దక్కింది. ఈ ప్రయాణంలో వారి అనుభవాలను తెలుసుకునే అవకాశముంది. ఆల్రౌండర్ని అయినప్పటికీ ప్రధానంగా బ్యాటింగ్ మీదే దృష్టి పెడతా. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ–20 టోర్నమెంట్లో నా ఆటతీరుతోనే ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు అంబటి రాయుడు ఎంతో సహాయం చేసి ఆటలో మెళకువలను నేర్పించాడు. అతడికి, నన్నుసన్రైజర్స్కు ఎంపిక చేసిన లక్ష్మణ్కు కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి క్రికెట్లో ఓనమాలు నేర్పించిన మా నాన్నకు, కోచ్ జాన్ మనోజ్కుఎల్లవేళలా రుణపడి ఉంటాను.– బావనక సందీప్ -
సందీప్కు అవకాశం
వేలంలో హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి ఒక్క ఆటగాడికే అవకాశం దక్కింది. హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్, ఆల్రౌండర్ బావనక సందీప్ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని కనీస విలువ రూ. 20 లక్షలకు తీసుకుంది. గతంలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్, యెర్రా పృథీ్వరాజ్లపై ఈసారి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఎడంచేతి వాటం బ్యాట్స్మన్ అయిన సందీప్ 38 టి20ల్లో 126.77 స్ట్రైక్రేట్తో 734 పరుగులు చేశాడు. వేలంలో కాకుండా ఇప్పటికే హైదరాబాద్ నుంచి మొహమ్మద్ సిరాజ్ బెంగళూరు తరఫున... అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. సిరాజ్ను బెంగళూరు రూ. 2 కోట్ల 60 లక్షలకు... రాయుడిని చెన్నై రూ. 2 కోట్ల 20 లక్షలకు అట్టి పెట్టుకున్నాయి. -
వరుడి సూసైడ్ : వారిపైనే అనుమానం
దుండిగల్: తన కుమారుడి ఆత్మహత్యకు బంధువులే కారణమని మృతుడి తండ్రి శ్రీనివాసా చారి ఆరోపిస్తున్నాడు. ఆదివారం కొంపల్లి టీ–జంక్షన్లోని శ్రీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో పెళ్లి కొడుకు సందీప్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ అతను పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్ చిన్నమ్మలు మాధవి, శారదలతో పాటు సందీప్ బాబాయ్ నాగరాజు, సందీప్కు సోదరుడి వరసైన శశాంక్లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై సీఐ మహేశ్ స్పందిస్తూ సందీప్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, అతని ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్నారు. అప్పటి వరకు ఏ విషయాన్ని నిర్ధారించలేమన్నారు. (చదవండి : పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య) -
సంగీతంలో సస్పెన్స్
సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్ కల్లె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాహుల్, పరిటాల. -
అఖండ సం‘దీపం’
ఆ గుండె పదిలం.. విధాత తలపునే మార్చిన మానవత్వం.. 15 నెలల పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని, అతడి వైద్యానికి దాతలు ఆదుకోవాలని ‘సాక్షి’ కథనం ప్రచురించిన మరుక్షణం పిల్లల నుంచి పెద్దల వరకు స్పందించారు.. అతి సామాన్యుల నుంచి మహేష్బాబు వంటి సూపర్స్టార్ల వరకు సాయమందించారు.. అందరి ఆశీస్సులతో ఆ బాలుడికి విజయవాడలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. చంద్రబాబు హయాంలో తిరస్కరించినా ఆరోగ్యశ్రీ సైతం వర్తింపజేస్తామని అధికారులు తెలిపారు. టెక్కలి రూరల్: నెలల వయసున్న పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని తెలుకుని ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులకు ఎట్టకేలకు ఊరట లభించింది. దాతల సాయంతో శస్త్రచికిత్స జరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన లఖినాన త్రినాథరావు, సుజాత దంపతుల కుమారుడు సందీప్(15నెలలు)కు గుండెలో రంధ్రం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆపరేషన్కు లక్షలు రూపాయలు ఖర్చవుతాయని తెలిసి, అంత డబ్బులు వెచ్చించే స్థోమత లేక కుమిలిపోయారు. ఈ విషయమై గత నెల 25న ‘సాక్షి’లో ‘ఆ గుండెను కాపాడండి’ పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై సినీ నటుడు మహేష్బాబు జిల్లా ఫ్యాన్స్, సేవాసమితి అధ్యక్షుడు వంకెల శ్రీనివాస్ స్పందించి మహేష్బాబు దృష్టికి విషయం తీసుకువెళ్లారు. అనంతరం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో బాలుడికి మంగళవారం శస్త్రచికిత్స చేయించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు గురువారం ప్రకటించారు. మహేష్బాబు సేవా సమితితో పాటు మరికొందరు దాతలు, స్వచ్ఛంద సంఘాలు, ఉపాధ్యాయులు సైతం స్పందించి సందీప్కు చేయూతను అందించారు. ఎట్టకేలకు తమ కుమారుడికి సాంత్వన చేకూరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సైతం వర్తింపు.. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా సందీప్కు గుండె శస్త్రచికిత్స చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించగా, అప్పటి ప్రభుత్వ తీరు కారణంగా ఆమోదం రాలేదు. తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో మరిన్ని వ్యాధులు చేర్చడం, సందీప్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో సంబంధిత అధికారులు స్పందించి తక్షణం ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. మహేష్బాబు సహకారంతో శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు మంజూరైతే ఆ మొత్తాన్ని చిన్నారి మందుల కోసం వెచ్చించే అవకాశముందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
కండక్టర్ ఆత్మహత్యాయత్నం..
-
బ్లేడ్తో కోసుకున్న కండక్టర్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. పదో రోజు కూడా కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉద్యోగ భద్రతపై ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా హెచ్సీయూ డిపో వద్ద సందీప్ అనే కండక్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో సందీప్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. బ్లేడ్తో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు అతడిని కొండాపూర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సందీప్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఖమ్మం డిపోకు చెందిన శ్రీనివాస్రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతడి అంత్యక్రియలు సోమవారం ఖమ్మంలో నిర్వహించారు. -
వైరల్ ట్రైలర్స్
‘‘ప్రైవేటైజేషన్ ఈజ్ టేకింగోవర్. పూర్ స్టేయింగ్ పూర్ అండ్ రిచ్ బికమింగ్ రిచర్’’.జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు.‘‘.. బీయింగ్ అగైనెస్ట్ దిస్, వి హ్యావ్ రైజ్డ్ అవర్ వాయిస్ టు ప్రొటెస్ట్.. బట్ అవర్ ప్రొటెస్ట్ హ్యాజ్ రిమెయిన్డ్ అన్హర్డ్..’’(పేదోడు పేదోడిగానే ఉండిపోతున్నాడు. ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. దీనిపై మేము గళం విప్పాం. పిడికిలి బిగించాం). ఉస్మానియా విశ్వవిద్యాలయం 1967. హాస్టల్ డైనింగ్ హాల్. ‘‘మనం తిన్న ప్లేట్లల్ల ఉప్పేసి కడుగుతరు ఈ నా కొడుకులు. తినండ్రా మీరు తిన్నంక అదే ప్లేట్లల్లో ఉచ్చ పోసి కడుగుత..’’అన్నం పరబ్రహ్మ స్వరూపం. వర్ణం? మనుధర్మ వికృతరూపం. తింటున్న ప్లేట్లు గాల్లోకి లేచాయి. ‘‘రేయ్.. ఏం కూశావ్రా’’ అగ్రవర్ణం పైకి లేచింది. జార్జిరెడ్డి కూడా పైకి లేచాడు. తనది ఏ వర్ణమో అతడు చూసుకోలేదు. ‘ఉచ్చపోసి కడుగుతా’ అని అరిచిన ‘అధమ’ వర్ణం వైపు నిలబడ్డాడు! ‘అర్జున్రెడ్డి’ సినిమాలో అమిత్గాడి హాస్టల్కి వెళ్లి మరీ వాడి ముక్కూమూతి పగలగొట్టినట్లు.. ‘ఏం కూశావ్రా..’ అని అధమ వర్ణంపైకి లేచిన అగ్రవర్ణం ముక్కు బద్దలు కొట్టాడు జార్జిరెడ్డి.‘‘ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం కోసం పోరాడుతున్న విద్యార్థులారా.. యుద్ధానికి సిద్ధం కండి. భారత్ మాతాకీ జై.’’క్యాంపస్లోకి అవుట్ సైడర్స్! టార్గెట్ జార్జిరెడ్డి!‘‘ఎవరు వాడు?’’.. పొలీస్ ఇన్స్పెక్టర్ అడిగాడు.‘‘ఎవడో కొత్త కుర్రోడు సార్. పేరు జార్జిరెడ్డి’’.. ముఖం పచ్చడైన భరతమాత ముద్దుబిడ్డ ఒకడు చేతులు కట్టుకుని చెబుతున్నాడు.‘‘ఎనీ బడి కెన్ సాల్వ్ దిస్?’’.. ఫిజిక్స్ క్లాస్ రూమ్లో లెక్చరర్ అడిగాడు. జార్జిరెడ్డి చెయ్యెత్తాడు. క్లాసయ్యాక క్లాస్మేట్ అడిగాడు.. ‘‘నిజం చెప్పు డబుల్ ఎమ్మెస్సీ కదా!’’ జార్జిరెడ్డి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు చూశాడు. క్యాంపస్లోకి మళ్లీ ఔట్ సైడర్స్. మళ్లీ జార్జిరెడ్డే టార్గెట్. వీడిని ఇలాగే వదిలేస్తే క్యాంపస్ చేజారిపోతుంది. ‘‘పోతేపోయింది.. ఆ నా కొడుకుల చేతిలోకి పోతుంది’’. కత్తులు, కర్రలు.. ఉస్మానియాలో ఉద్రిక్తత. కారణం.. మళ్లీ జార్జిరెడ్డి! ‘‘వన్ ఇయర్ రస్టికేట్ లెటర్ టైప్ చెయ్యండి’’.. వైస్ చాన్స్లర్ ఆర్డర్. ఇంటికొచ్చాడు జార్జిరెడ్డి. ‘‘నేను అనుకున్న క్యాంపస్ ఇది కాదమ్మా..’’ తల్లితో అన్నాడు. కానీ క్యాంపస్ అనుకున్న హీరో మాత్రం జార్జిరెడ్డే. రష్యన్ రివల్యూషన్ పుస్తకాన్ని కొడుకు చేతికిచ్చింది తల్లి. జార్జిరెడ్డి రీచార్జ్రెడ్డి అయ్యాడు. ‘‘జార్జిరెడ్డి దాదా అయిండన్నా.. ఔటర్స్ లోపలికి రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు.. అప్పర్ క్యాస్ట్ అంటే.. అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు’’ ‘‘అసలు ఈడెవడు భయ్యా. నిన్నగాక మొన్నొచ్చాడు’’ వచ్చింది నిన్నగాక మొన్ననే. ఉండబోతున్నది ఉస్మానియా క్యాంపస్ ఉన్నంతకాలం. ‘‘స్కాలర్షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే.. గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్’’.. జార్జిరెడ్డి స్పీచ్కి క్యాంపస్లోని చెట్టు కూడా తలలు ఊపుతున్నాయి. ‘‘ఈ కాలేజేమైనా వాళ్ల అయ్యదా? తాతదా? ఎవరికి ఆయాసమొచ్చినా ఉరికొస్తుండు’’ ‘‘ఎవరో కనుక్కోండి’’ జార్జిరెడ్డి. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ‘‘టుడే వాట్ వియ్ లెఫ్ట్ విత్ అజ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ మీట్ వయొలెన్స్ విత్ వయొలెన్స్’’ జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు. ‘‘రైజ్ యువర్ వాయిస్. బిఫోర్ ద ట్రూత్ డైస్’’. జార్జిరెడ్డి కొట్లాడుతున్నాడు. ‘‘జీనా హైతో మర్నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీకో’’. బతకాలంటే చావడం ఎలాగో నేర్చుకో. ప్రతి అడుగులోనూ పోరాడటం నేర్చుకో. రెండేళ్ల క్రితం ‘అర్జున్రెడ్డి’ సినిమా ట్రైలర్ ఎంత వైరల్ అయిందో.. ఇప్పుడు ‘జార్జిరెడి’్డ ట్రైలర్ అలాగే యూత్ని ఊపేస్తోంది. అర్జున్రెడ్డి లవ్ స్టోరీ. జార్జిరెడ్డి వార్ స్టోరీ. పేదరికంపై వార్. ప్రైవేటీకరణపై వార్. అగ్రవర్ణ ఆధిపత్యంపై వార్. ఉత్తమాటలపై వార్. చెత్త రాజకీయాలపై వార్. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జీవించి, పోరాడి, అమరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డిపై ఈ సినిమాను తీస్తున్నది జీవన్రెడ్డి (‘దళం’ఫేమ్). జార్జిరెడ్డిగా నటిస్తున్నది సందీప్ మాధవ్ (‘వంగవీటి’ ఫేమ్). ఇది హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కొట్టాలి. విద్యార్థి ఉద్యమ నిర్మాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ క్రమంలోనే 1972లో 25 ఏళ్ల వయసులో క్యాంపస్లోని ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ బయట ప్రత్యర్థి శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది. -
దూకుతా.. దూకుతా..
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకుంటానంటూ 10 అంతస్తుల భవనంపైకి ఎక్కిన ఓ వ్యక్తి పోలీసులు, అధికారులను 17 గంటలపాటు హైరానా పెట్టించాడు. చివరికి అతడిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. అయితే, బాలికపై వేధింపుల కేసులో నిందితుడంటూ అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో జరిగింది. ఢిల్లీకి చెందిన సందీప్ అలియాస్ అర్మాన్ మాలిక్(31) భార్య క్రితికా బసేరాతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హరినగర్లోని ఓ హోటల్కు వెళ్లాడు. అక్కడ ఆ దంపతుల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో చచ్చిపోతానంటూ భార్యను బెదిరించి సాయంత్రం 4 గంటల సమయంలో పదో అంతస్తుపైకి ఎక్కాడు. భార్య సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వాహనాలతో సహా అక్కడికి చేరుకుని అతడిని ఒప్పించి కిందికి దించేందుకు రాత్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అతడి కోరిక మేరకు పండ్లు, బిస్కెట్లతోపాటు తన డిమాండ్లను పెద్దగా వినిపించేందుకు లౌడ్స్పీకర్నుపంపారు. చివరికి సోమవారం ఉదయం కిందికి దిగి రావడంతో ఉత్కంఠకు తెరపడింది. -
తెలుగు సినీ మహోత్సవం
-
అక్షర క్రీడలో అజేయుడు
ఆంగ్ల మాధ్యమంలో విద్య అభ్యసించాడు... ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశాడు... మరోవైపు తెలుగు అక్షర వ్యవసాయం చేస్తున్నాడు... పిన్నవయసులోనే 32 అష్టావధానాలు చేశాడు... అనేక పురస్కారాలు అందుకున్నాడు... శతావధానానికి సన్నద్ధుడవుతున్నాడు. పాతికేళ్ళ లేత ప్రాయంలోనే ఎన్నో విజయాలు సాధించిన రాజమండ్రి వాస్తవ్యుడు తాతా సందీప్ అవధాన ప్రయాణం ఇలా సాగుతోంది... వారసత్వంగా... తాతా పార్వతమ్మ హైస్కూలులో తెలుగు పండితురాలు. ఆవిడకు పద్యమంటే ప్రీతి. పదవీ విరమణ అయ్యాక, కంటిచూపు మందగించడంతో, మనుమడు సందీప్ను పిలిచి భాగవతంలోని గజేంద్రమోక్షం పద్యాలు చదివి వినిపించమన్నారు. అప్పటికి సందీప్కి 12 సంవత్సరాలు. పద్యం చదవడం సరిగా రాకున్నా, నాయనమ్మ కోర్కెను కాదనలేక, పద్యాలు చదివి వినిపించాడు. యథాలాపంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ అతని జీవితాన్ని మార్చడానికి నాంది పలికింది. నూనూగు మీసాల ప్రాయంలో తొలి అష్టావధానం చేసిన సందీప్, పాతికేళ్ళ ప్రాయంలోపే 32 అష్టావధానాలు పూర్తిచేసి, ఇప్పుడు శతావధానానికి సై అంటున్నాడు. ప్రస్తుతం ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసి డాక్టరేట్కు సిద్ధమవుతున్న సందీప్ అటు ఆధునిక చదువులతో పాటు, ఇటు తెలుగు పద్యాన్ని, తెలుగువారికే సొంతమైన అవధానాన్ని తన జీవితంలో ఒక భాగంగా మలుచుకున్నాడు. ఇంతింతై వటుడింతౖయె... నాయనమ్మ ఆశీస్సులతో పద్యం పట్ల మక్కువ పెంచుకున్న సందీప్, తెలుగుసాహిత్యానికి పుట్టినిల్లయిన రాజమహేంద్రవరంలో 1994లో పుట్టాడు. తండ్రి వరప్రసాద్ ఒక ప్రైవేటు సంస్థలో చిరుద్యోగి, తల్లి విజయలక్ష్మి గృహిణి. నాయనమ్మ కోరిక మీద గజేంద్రమోక్షంలోని పద్యాలు వినిపించడం ప్రారంభమైన సందీప్ క్రమేపీ ఆ పద్యాల ‘రుచి’ మరిగాడు. సందీప్లో ఉన్న ఆసక్తిని గమనించిన తెలుగుమాస్టారు సందీప్ను పద్యాలు రాయమన్నారు. తల్లిదండ్రులు విజయలక్ష్మి,వరప్రసాద్లతో.. అవధాన ప్రస్థానం అవధానానికి ధారణాశక్తి, ఏకాగ్రత కావాలి. అప్పటికే గోదావరీ తీరాన ఉన్న ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలలో రీడరుగా సేవలు అందించిన ధూళిపాళ మహాదేవమణి వద్ద శిష్యరికం చేశారు. అటు చదువు, ఇటు అవధానాలలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. బిరుదులు... సత్కారాలు అవధాన చింతామణి, అవధాన యువరాట్, ఘంటావధాన ధురీణ బిరుదులతో పాటు, నోరి నరసింహశాస్త్రి స్మారక పురస్కారం, ఉషశ్రీ సంస్కృతి సత్కారం, ఉగాది పురస్కారాలను అందుకున్నాడు. అవధాన దిగ్గజాల సరసన సంస్కృతాంధ్రభాషల్లో అవధానాలు అలవోకగా చేసిన డాక్టర్ చిర్రావూరి శ్రీరామ శర్మ, సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్, శతావధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్, అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు వంటి ఉద్దండ పండితులతో పాటు అవధాని సమ్మేళనంలో పాల్గొన్న తాతా సందీప్ వంటివారిని చూస్తుంటే, తెలుగు అంతరించిపోతున్న భాష అనే ఆవేదన మననుండి–తాత్కాలికంగానయినా, దూరం కాకతప్పదు. – వారణాసి సుబ్రహ్మణ్యం,సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్– ఫొటోలు: గరగ ప్రసాద్ -
నీట్లో సత్తా చాటిన సందీప్
సాక్షి, పాతగుంటూరు: గుంటూరు అరండల్పేటకు చెందిన డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ నీట్ సూపర్ స్పెషాలిటీ విభాగం ఎండోక్రెనాలజీ కోర్సులో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈ పరీక్ష ఫలితాలు జూలై16న విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 1,513 మంది వైద్యులు పరీక్షలు రాయగా, 340 మార్కులతో సందీప్ మూడో ర్యాంకు సాధించారు. 2007లో ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందారు. ఆప్తమాలజీ, సర్జరీ విభాగాలలో మెరిట్ సర్టిఫికెట్లు పొందారు. 2014లో పీజీ ఎంట్రన్స్లో తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి ఎండీ జనరల్ మెడిసిన్ను ఎంచుకున్నారు. పీజీ అనంతరం 2017, 2018లో జరిగిన నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ తాను కోరుకున్న ఎండోక్రెనాలజీ అంశంలో కశ్మీర్ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అదే లక్ష్యంతో పరీక్ష రాసిన సందీప్ ఈసారి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. -
గ్యాంగ్ వార్
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు రామ్గోపాల్ వర్మ ముంబైలో ఆవిష్కరించారు. ఆర్.ఎస్. సురేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ల మధ్య జరిగే గ్యాంగ్స్టర్ కథాంశమిది. ఇందులోని 5 ఫైట్స్ చాలా బాగుంటాయి. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాల సంగీత దర్శకుడు రవిశంకర్ అందించిన ఆర్ఆర్ మా సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ అంశాలున్న చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్గా నిర్మించాం. జూలైలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
హైదరాబాదీ ఒమన్ క్రికెటర్
ఆ కుర్రాడి కల టీమిండియాకు ఆడటం... ఆ లక్ష్యానికి తగ్గట్లుగానే అడుగులు వేశాడు... ఆ దిశగా ఒక్కో మెట్టు ఎక్కాడు... అవకాశం దొరికినప్పుడల్లా రాణించాడు... కానీ, తాను ఊహించినంతగా ముందుకు వెళ్లలేకపోయాడు... ఈలోగా తండ్రి మరణం రూపంలో వ్యక్తిగత జీవితంలో విషాదం ఎదురైంది... నిరాశ చుట్టుముట్టిన వేళ అనుకోని వరంలా ఓ పిలుపు తలుపు తట్టింది... ఏదైనా మన మంచికే అని దానిని అందిపుచ్చుకున్నాడు...! వెనక్కుతిరిగి చూసుకుంటే ఇప్పుడు అతడు తమ జట్టుకు కీలక సమయంలో విజయం అందించిన ‘ఓ జాతీయ క్రికెటర్’...! అతడే... హైదరాబాదీ ఆల్ రౌండర్, ఒమన్ దేశ క్రికెటర్ శ్రీమంతుల సందీప్ గౌడ్! మన తెలుగువాడు కావడం ఏమిటి? ఎక్కడో గల్ఫ్లోని దేశానికి ప్రాతినిధ్యం ఏమిటి? ఈ ఆసక్తికర కథనం మీరే చదవండి...! మనదగ్గరి చాలామంది యువకుల్లాగే సందీప్ గౌడ్ కూడా క్రికెట్ అంటే ప్రాణమిచ్చే రకం. దీనికితోడు హైదరాబాద్ నేపథ్యం. పైగా దిగ్గజ బ్యాట్స్మన్, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ చదివిన ఆల్ సెయింట్స్ హైస్కూల్ విద్యార్థి. అతడితోపాటు మరో మేటి ఆటగాడైన వీవీఎస్ లక్ష్మణ్ను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రాణిస్తూ ఆల్రౌండర్గా ఎదిగాడు. అడుగులు ఇలా... స్కూల్ స్థాయిలో ప్రతిభ చాటాక సందీప్ చిక్కడపల్లిలోని అరోరా కళాశాలలో బీకామ్ చదువుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యాడు. 2009–10 సీజన్లో అండర్–22 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ నెగ్గిన హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గానూ నిలిచాడు. ఇదే సీజన్లో అండర్–19 కూచ్ బెహార్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీల్లో హైదరాబాద్కు ఆడాడు. 2010–11లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ టోర్నీలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మధ్యలో హెచ్సీఏ ‘ఎ’ డివిజన్ లీగ్ చాంపియన్షిప్స్లో దక్కన్ క్రానికల్, న్యూ బ్లూస్, ఎవర్ గ్రీన్ క్లబ్లకు ఆడాడు. ఇలా వివిధ స్థాయిల్లో ప్రతిభ చాటుతూ 2013 నుంచి రంజీ ట్రోఫీ అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. 2016లో చాన్స్ దొరుకుతుందని భావించినా ఆ ఆశ నెరవేరలేదు. తండ్రి ఆకస్మిక మరణంతో... ఇదే సమయంలో తండ్రి రవీందర్ గౌడ్ ఆకస్మిక మృతి సందీప్ను మరింత ఒంటరి చేసింది. అయితే, అనుకోని విధంగా తనతో కలిసి ఆడిన స్నేహితుడు వంశీ నుంచి సందీప్కు ఒమన్ అవకాశం గురించి తెలిసింది. తొలుత తటపటాయించినా, వయసు, ఇతర పరిమితులు సడలిస్తూ ఒమన్ అధికారులు సైతం ఆహ్వానించడంతో ఓ ప్రయత్నం చేద్దామని నిర్ణయానికొచ్చాడు. మరోవైపు ఒమన్లోని ఖిమ్జి రామ్దాస్ కంపెనీ సందీప్కు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్గా ఉద్యోగం ఇచ్చింది. ఆ కల ఇలా తీరింది... ఒమన్ డెవలప్మెంట్ ఎలెవెన్ తరఫున ఐర్లాండ్పై ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించడంతో (55 నాటౌట్) సందీప్ ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. నెదర్లాండ్స్తో అరంగేట్ర మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టిన అతడు రెండో మ్యాచ్లో స్కాట్లాండ్పై 19 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2లో గత బుధవారం నమీబియాతో మ్యాచ్లో కీలక సమయంలో అజేయ అర్ధ సెంచరీతో రాణించి తమ జట్టుకు ఐసీసీ వన్డే హోదా దక్కేలా చేశాడు. ఈ ప్రతిభతో సందీప్ త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ టి20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లోనూ ఒమన్ జట్టుకు ఆడటం ఖాయం చేసుకున్నాడు. ‘సందీప్ బంతితో, బ్యాట్తో నిలకడైన ప్రదర్శన చేస్తాడు. దురదృష్టం కొద్దీ ఇక్కడ అవకాశం దొరకలేదు. అతడు ఒమన్కు ఆడుతుండటాన్నీ నేను సంతోషంగానే స్వీకరిస్తున్నా’ అని ఆల్ సెయింట్స్ కోచ్ డెంజిల్ బామ్ అన్నాడు. ‘ఇక్కడి టోర్నీల్లో తన ప్రదర్శనతో మా సోదరుడు మంచి భవిష్యత్తు ఊహించుకున్నాడు. కానీ, అవకాశం దక్కలేదు’ అని సందీప్ సోదరి శ్రావణి పేర్కొంది. – సాక్షి క్రీడా విభాగం -
భార్య, కూతుర్ని రైల్వేస్టేషన్లో వదిలేశాడు..
సాక్షి, విశాఖపట్నం : తాళికట్టిన భార్యను, రక్తం పంచుకుపుట్టిన బిడ్డను ఓ ప్రబుద్ధుడు రైల్వేస్టేషన్లో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఆ బాధితురాలు శనివారం విశాఖ మహారాణిపేటలో భర్త ఇంటి వద్ద ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్లోని బచేలిలో రైల్వేశాఖలో పని చేస్తున్న సందీప్కి ఏలూరు శాంతినగర్కు చెందిన జానకితో 2008లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా పెళ్లి సమయంలో జానకి తల్లిదండ్రులు భారీగా కట్నం కూడా ముట్టచెప్పారు. రైల్వే ఉద్యోగి అయిన సందీప్ విధుల్లో అలసత్వం కారణంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు..జానకిని కొట్టడం, మానసికంగా హింసించడంతో ఆమె తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోయింది. కుటుంబ కలహాలపై ఏలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం... ఆ తర్వాత ఇరు కుటుంబాలు కాంప్రమైజ్ కావడంతో గొడవలు సద్దుమణిగాయి. ఇటీవలే సందీప్ తిరిగి విధుల్లోకి చేరడంతో పాటు వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో జానకిని ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం.. భర్త వద్ద వదిలి వెళ్లారు. అయితే బచేలి నుంచి శుక్రవారం భార్య, కుమార్తెతో సహా విశాఖకు వచ్చిన సందీప్.. వారిని రైల్వేస్టేషన్లోనే వదిలి వెళ్లిపోయాడు. భర్త కోసం ఎంతసేపు చూసినా రాకపోవడంతో కుతూరితో కలిసి జానకి అత్తవారింటికి వెళ్లింది. అయితే ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా, ముఖం చాటేయడంతో ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, తనను పట్టించుకోవడం లేదంటూ... తనకు న్యాయం చేయాలంటూ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
సంగీతం నేపథ్యంలో...
సుదీప్, సుస్మిత, సందీప్, రాజ్సింగ్ ముఖ్య తారలుగా ఆర్.ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగ్రహం’. ఎస్.ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేసి, చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. సురేష్ మాట్లాడుతూ– ‘‘సంగీతానికి ప్రాధాన్యం ఉన్న విభిన్న కథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే ఆఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం. మా సినిమా మోషన్ పోస్టర్ని విడుదల చేసిన పూరి జగన్నాథ్గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.కె, సంగీతం: ఆర్.ఆర్.రవిశంకర్. -
రాజకీయ నేపథ్యంలో...
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఆర్.ఎస్.సురేష్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ల మధ్య జరిగే కథాంశమిది. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాలకు సంగీతం అందించిన రవిశంకర్ ఆర్.ఆర్ స్వరాలు మా సినిమాకి ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాలు మరో హైలైట్’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్గా తెరకెక్కించాం. ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
ఆంధ్ర పరాజయం
సాక్షి, విజయవాడ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి పరాజయం చవిచూసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కేరళతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కేరళ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ విష్ణు వినోద్ (61 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, ఇస్మాయిల్లకు ఒక్కో వికెట్ లభించింది. నాగాలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 179 పరుగుల తేడాతో గెలిచి టి20 చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆంధ్ర... కేరళపై 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. విజయానికి చివరి ఓవర్లో ఆంధ్ర జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా... కేరళ పేసర్ సందీప్ వారియర్ ‘హ్యాట్రిక్’తో ఆంధ్రను దెబ్బ తీశాడు. తొలి బంతికి పరుగు ఇవ్వని సందీప్ వారియర్ ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో శశికాంత్, కరణ్ శర్మ, ఇస్మాయిల్లను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకోవడంతోపాటు కేరళను గెలిపించాడు. దాంతో ఆంధ్ర జట్టు 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర జట్టులో ప్రశాంత్ కుమార్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. -
ఎంపీ యోధపై హరియాణా గెలుపు
లుథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో యువ రెజ్లర్ రవికుమార్... సందీప్ కుమార్కు షాకిచ్చాడు. దీంతో శనివారం జరిగిన మ్యాచ్లో హరియాణా హ్యామర్స్ 4–3తో ఎంపీ యోధపై గెలుపొందింది. 86 కేజీల పురుషుల బౌట్లో అలీ షబనోవ్ 8–0తో దీపక్ (ఎంపీ యోధ)పై గెలుపొందగా, మహిళల 76 కేజీల విభాగంలో కిరణ్ 0–6తో అండ్రియా కరోలినా (ఎంపీ యోధ) చేతిలో కంగుతింది. పురుషుల 65 కేజీల కేటగిరీలో రజనీశ్ 0–5తో హాజి అలియెవ్ (ఎంపీ యోధ) చేతిలో కంగుతినడంతో హరియాణా 1–2తో వెనుకబడింది. ఈ దశలో హ్యామర్స్కు తయన ఒమెల్చెంకో (మహిళల 62 కేజీలు) 6–0తో ఎలైస్ మనొలొవ (ఎంపీ యోధ)పై గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. పురుషుల 74 కేజీల్లో ప్రవీణ్ రాణా 0–7తో వసిల్ మిఖాయిలొవ్ (ఎంపీ యోధ) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల 57 కేజీల విభాగంలో నిచిత 8–0తో పూజ ధండ (ఎంపీ యోధ)పై నెగ్గింది. స్కోరు 3–3తో సమమైన దశలో నిర్ణాయక పురుషుల 57 కేజీల విభాగంలో రవి 10–0తో సందీప్ తోమర్ (ఎంపీ యోధ)ను కంగుతినిపించడంతో లీగ్లో హ్యామర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. -
31 నుంచి ఆక్వా ఎక్స్పో–2019
హైదరాబాద్: ఆక్వా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆక్వా ఎక్స్పో–2019 జరగనుంది. ఈ మేరకు గురువారం మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా ఎక్స్పో బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులనూ, కొనుగోలుదారులనూ, సరఫరా దారులనూ, పరిశ్రమ నిపుణులనూ ఒక గొడుగు కిందకు తీసుకురావడమే ఎక్స్పో ఉద్దేశమని పేర్కొన్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్స్పో జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఒక సంఘంగా ఏర్పాటైతే వారికి కావలసిన పరికరాలు అందిస్తామని సుల్తానియా చెప్పారు. కార్యక్రమంలో జాతీయ మత్య్సశాఖ అభివృద్ధి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణి కుముదిని, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీ‹ -
అదరగొట్టిన అక్షత్ రెడ్డి
తిరునల్వేలి: హైదరాబాద్ ఓపెనర్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డి రంజీ మ్యాచ్లో రెండో రోజు కూడా తన జోరు కొనసాగించాడు. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్లో అక్షత్ (477 బంతుల్లో 248 బ్యాటింగ్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతని కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా రెండో రోజు మంగళవారం ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 523 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అక్షత్కు అండగా నిలిచిన బావనక సందీప్ (221 బంతుల్లో 130; 15 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అక్షత్తో పాటు సీవీ మిలింద్ (9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్, మొహమ్మద్, రాహిల్ షా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్నైట్ స్కోరు 249/3తో ఆట కొనసాగించిన హైదరాబాద్ను తమిళనాడు బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా 174 బంతుల్లో సందీప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 316 బంతుల్లో అక్షత్ 150 పరుగుల మైలురాయిని దాటాడు. చివరకు లంచ్కు ముందు సందీప్ను మొహమ్మద్ ఔట్ చేయడంతో 246 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెర పడింది. కొల్లా సుమంత్ (5), ఆకాశ్ భండారి (17) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే సాకేత్ సాయిరామ్ (42) కెప్టెన్కు సహకరించాడు. టీ విరామ సమయానికి 199 పరుగుల వద్ద ఉన్న అక్షత్... చివరి సెషన్ ఆరంభం కాగానే ఫోర్ కొట్టి 413 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. అక్షత్, సాయిరామ్ ఏడో వికెట్కు 109 పరుగులు జత చేశారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా హైదరాబాద్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువ. -
చంద్రబాబూ ..రాజధానికి భూములెవరిచ్చారు
-
యాంకర్ రవిపై కేసు నమోదు
ప్రముఖ టెలివిజన్ యాంకర్ రవిపై ఎస్ఆర్ నగర్ పోలిస్స్టేషన్లో కేసు నమోదైంది. ఫోన్లో బెదిరించటంతో పాటు రౌడీలతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ సందీప్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. రవి నుంచి 15 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు సందీప్. ఆ డబ్బును తిరిగి వసూళు చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రవిని స్టేషన్కు పిలిపించి విచారించిన పోలీసులు కేసు విషయంలో అవసరమైనప్పుడు విచారణకు హజరు కావాలన్నారు.