ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ కూళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. అప్పుడే రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత వస్తాయి. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి.