చంద్రబాబు నాయుడిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారని, ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా కూడా చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు యూటర్న్ తీసుకున్నది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నలేవనెత్తారు.