ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రగతి కోసం పట్టుబడుదాం’ అన్న పిలుపుతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారిత ద్వారానే మహిళలు నిజమైన ప్రగతిని సాధించగలరని, ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.