Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Air India Flight Black Box Damaged Complete Details Here1
ఎయిరిండియా ఘటన: బ్లాక్‌బాక్స్‌ ఎపిసోడ్‌లో ట్విస్టులు

279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్‌బాక్స్‌(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్‌క్లూజివ్‌గా కథనం ప్రచురించింది.జూన్‌ 12వ తేదీన బోయింగ్‌ సంస్థకు చెందిన డ్రీమ్‌లైనర్‌ విమానం(ఏఐ 171 సర్వీస్‌) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్‌ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్‌ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్‌, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..డిజిటల్‌ ఫ్లైట్‌ డాటా రికార్డర్‌(DFDR), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌(CVR)లను కలిపి బ్లాక్‌బాక్స్‌గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్‌బాక్స్‌ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్‌ ఆరెంజ్‌ కలర్‌లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్‌లు 25 గంటలపాటు కాక్‌పిట్‌ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787 విమానం అంతకు ముందు మోడల్‌​. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్‌.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్‌బాక్స్‌లోని డాటాను ఇంజినీరింగ్‌ ఫార్మట్‌లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్‌ అవుతుంది).AAIB ముందు ఆప్షన్లు ఇవేలక్నోలోని హాల్‌(HAL) సెంటర్‌కు పంపడంఅమెరికాలోని ఎన్‌టీఎస్‌బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడంయూకే లేదంటే సింగపూర్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీకి పంపడంబ్లాక్‌బాక్స్‌లో ఓ పార్ట్‌ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్‌డ్‌ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌బాక్స్‌ ట్విస్ట్‌!

Israelis Serious On Netanyahu Comments Over Wedding Delay2
ప్రధాని నెతన్యాహుకు బిగ్‌ షాక్‌.. ఇజ్రాయెల్‌ ప్రజల కౌంటర్‌

టెలీ అవీవ్‌: ఇరాన్‌తో అమీతుమీ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుకు బిగ్‌ షాక్‌ తగిలింది. నెతన్యాహు తీరుపై ఇజ్రాయెల్‌ ప్రజలు మండిపడుతున్నారు. తన కుమారుడి పెళ్లి వాయిదాను కుటుంబ ‘త్యాగం’ అని నెతన్యాహు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కరే త్యాగం చేయడం లేదు.. దేశ ప్రజలందరూ భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు కారణంగా ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్‌ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్‌కు నష్టం జరుగుతోంది. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రియమైన వారు దూరమై ఎన్నో కుటుంబాలు వేదన అనుభవిస్తున్నాయి. మనలో ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత నష్టం జరిగింది. అందరం త్యాగాలు చేయాల్సి వస్తోంది. నా కుటుంబం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. యుద్ధం కారణంగా నా కుమారుడు అవ్నర్‌ పెళ్లిని రెండోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది అవ్నర్‌ వివాహం చేసుకోబోయే అమ్మాయి, నా భార్య సారాపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకుంటున్న ఆమె ఓ ‘హీరో’. పెళ్లి వాయిదా కుటుంబ ‘త్యాగం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ప్రజలు సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. మీ కుటుంబాన్ని ఒక త్యాగమేనా?. యుద్ధం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం సమయంలో ఎంతోమంది వైద్యులు నిరంతరం పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. వారు నిజమైన హీరోలు. ఈ ఉద్రిక్తతల కారణంగా మేమంతా నరకం అనుభవిస్తుంటే.. మీరు పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా భావిస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు.గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదాస్పదంగా మారింది. గాజాతో యుద్ధం సమయంలో వివాహం జరగాల్సి ఉండగా.. అప్పుడు యుద్ధం కారణంగా మొదటిసారి వాయిదా పడింది. ఇక, రెండో సారి ఇరాన్‌తో యుద్ధం కారణంగా వాయిదా పడింది.

Kuberaa Movie Twitter Review3
'కుబేర' ట్విటర్‌ రివ్యూ.. హైజాక్‌ చేసిన ధనుష్‌

అక్కినేని నాగార్జున, ధనుష్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 20న విడుదలైంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో సినిమాను చూశారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజామున మొదటి ఆట వేశారు. దీంతో సినిమా టాక్‌ ఏంటి అనేది సోషల్‌మీడియా ద్వారా టాక్‌ బయటకు వచ్చేసింది. కుబేరలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌ కీలక పాత్ర పోషించారు. శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ అయింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతిచోట కుబేర హిట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్‌మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ రన్‌ అవుతుంది..? నాగార్జున, ధనుష్ పాత్రలు మెప్పించాయా..? అనేది చూద్దాంశేఖర్ కమ్ముల అండ్ టీం బ్లాక్ బస్టర్‌ని అందించారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఫస్టాప్‌ అదిరిపోయింది అంటూనే సినిమా ప్రాణం, ఆత్మ అంతా సెకండ్ హాఫ్‌లోనే ఉందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్‌ ఎంట్రీ సీన్‌ పట్ల ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు. ధనుష్‌ మాత్రమే చేయగలిగే పాత్ర అంటూ అభినందిస్తున్నారు. కుబేరలో ధనుష్ ఒక చిరస్మరణీయమైన నటనను కనబరిచాడని, అతను బిచ్చగాడి పాత్రలో జీవించాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. కథలో అత్యంత బలంగా ఉన్న పాత్ర నాగార్జునకు దక్కిందని మరికొందరు తెలుపుతున్నారు. ఇందులో రష్మిక కూడా మరో చిరస్మరణీయమైన పాత్రను పోషించిందని కాంప్లీమెంట్స్‌ దక్కుతున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందట. చాలా సీన్లకు ఆయన ప్రాణం పోశారని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల రచన, దర్శకత్వం చాలా బాగా వర్కౌట్ అయ్యాయని ప్రేక్షకులు తెలుపుతున్నారు. మొత్తం మీద, కుబేరుడు సినిమా అంతటా బ్లాక్ బస్టర్‌ అంటూ పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. సినిమా నిడివి మాత్రమే మైనస్‌ అంటూనే ఎక్కడా కూడా బోర్‌ కొట్టదు అంటున్నారు. సినిమా మొత్తం ధనుష్‌ హైజాక్‌ చేశాడని, ఇంత అద్భుతంగా ఎలా నటించావ్‌ బాస్‌ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఏకంగా 9 రేటింగ్‌ ఇస్తున్నారు. కొందరైతే 10 ఇవ్వొచ్చు అంటున్నారు. అంతలా ధనుష్‌ మెప్పించాడని తెలుపుతున్నారు. సినిమా చూసిన ధనుష్‌ అభిమానులైతే చాలా ఎమోషనల్‌ అవుతున్నారు. కన్నీళ్లు తెప్పించే సీన్లు చాలా ఉన్నాయంటూ కుబేరకు నేషనల్‌ అవార్డ్‌ తప్పకుండా వస్తుందని అభిప్రాయపడుతున్నారు.#Kuberaa [4.5/5] : Sekhar Kammula and team delivered a blockbuster. The first half of the film is good but the life and soul of the film is the second half. The emotional scenes in the second half worked out big time. Dhanush delivered a memorable performance. He just lived in…— Ramesh Bala (@rameshlaus) June 20, 2025#Dhanush – What a Phenomenal Actor!🥹Every Expression, Every Emotion… He Lives the Role! Words Fall Short to Describe His Brilliance🙏🔥Truly a Gifted Gem to Indian Cinema🤞❤️#Kuberaa | #Kubera pic.twitter.com/tQSLRZhVhj— Movies4u Official (@Movies4u_Officl) June 20, 2025#Kuberaa #KuberaaReview #Dhanush #Nagarjuna #ShekharKammula pic.twitter.com/2XX4q8bHia— TollywoodBoxoffice.IN (@TBO_Updates) June 20, 2025#Kuberaa wins your heart, powered by Dhanush’s phenomenal, arguably, career-best performance. Despite minor flaws with length, the film delivers plenty of memorable moments, making it a thoroughly enjoyable watch! ❤️❤️❤️❤️ pic.twitter.com/zqDVjS6owv— LetsCinema (@letscinema) June 20, 2025Mentaloda adhem acting ra babu 🥵 🔥🔥💥💥😭😭 @dhanushkrajaBlock buster #Kuberaa 🔥 🔥 A Must Watch Film Worth Watching 💥💥🔥🔥 #Dhanush pic.twitter.com/cB2oSHgfE2— 𝐃𝐞𝐯𝐚 🛐🛐 (@SudheerJalluri1) June 20, 2025#Kuberaa is the BEST movie in recent times🛐A shekhar kammula Film, A Dhanush’s Masterpiece A Nagarjuna’s ViswaroopamA @ThisIsDSP’s ThandavamWorth every penny, okka scene kuda bore kottaledhu🙏❤️‍🔥pic.twitter.com/zT2cD04oFU— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 20, 2025After the blockbuster #LoveStory, director @sekharkammula delivers yet another banger for @SVCLLP with #Kuberaa. 💥🔥This winning combo strikes gold once again with powerful storytelling and impactful cinema. A sure-shot BLOCKBUSTER! 🤘👑#SekharKammulasKuberaa pic.twitter.com/vLYFFiBSLA— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 20, 2025#Kuberaa - A WinnerA good first half followed by an emotionally charged second half made the film a good watch. The film started on a slow note but right from Dhanush’s entry sequence, the pace of the film did not drop until the climax. Dhanush delivered one of the his…— Gulte (@GulteOfficial) June 20, 2025#Kuberaa Full Positive response from Telugu shows 🔥#Dhanush's back to back hits in Telugu 🔥🔥 ( #Sir/#Vaathi & Now Kuberaa) @dhanushkraja pic.twitter.com/PyULPDjDMI— Prakash Mahadevan (@PrakashMahadev) June 20, 2025

Air India To Cut Flights On 16 International Routes And Suspend Ops To 3 Cities4
ఎయిరిండియా కీలక ప్రకటన.. ఆ అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నిలిపివేత

ఢిల్లీ: జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతరాయాలతో సతమతమవుతున్న ఎయిరిండియా.. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది.ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్‌లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.యూరప్‌లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్‌సర్-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్‌హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్‌స్టర్‌డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్‌బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు.ఇదిలా ఉండగా, విమాన సర్వీసుల కుదింపుపై ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. "విమాన ప్రయాణానికి ముందు భద్రతా తనిఖీలను కఠినతరం చేయడం, మధ్యప్రాచ్యంలో గగనతల మార్గాల మూసివేత వల్ల ప్రయాణ సమయం పెరగడం వంటి కారణాలతో ఈ కుదింపులు చేశాం" అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఆయన ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

WI VS AUS 1st Test: Labuschagne Dropped, Smith Out With Injury5
వరుస వైఫల్యాలు.. స్టార్‌ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా

మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. జూన్‌ 25 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్‌ మిడిలార్డర్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌పై వేటు వేసింది. లబూషేన్‌ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఈ కారణంగా అతనికి తొలి టెస్ట్‌ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ జార్జ్‌ బెయిలీ ఓ ప్రకటనలో తెలిపారు. లబూషేన్‌ తమ జట్టులో కీలక​ సభ్యుడని చెబుతూనే అతని రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించాడు. 2023లో 34.91 సగటున పరుగులు చేసిన లబూషేన్‌.. గతేడాది (2024) తన సగటును (30.93) మరింత దిగజార్చుకున్నాడని అన్నాడు. ఈ ఏడాది సైతం లబూషేన్‌ ఫామ్‌ను దొరకబుచ్చుకోలేకపోయాడని తెలిపాడు (4 టెస్ట్‌ల్లో 16 సగటు). చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్‌) ఓపెనర్‌గా అవకాశమిచ్చినా దారుణంగా విఫలమయ్యాడని (17,22) అన్నాడు. తొలి టెస్ట్‌ జట్టు నుంచి తప్పించినా లబూషేన్‌ టాలెంట్‌ను గౌరవిస్తూ మున్ముందు పరిశీలిస్తామని తెలిపాడు.మరోవైపు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు కూడా తొలి టెస్ట్‌ తుది జట్టులో అవకాశం ఇవ్వలేమని బెయిలీ చెప్పాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ సందర్భంగా స్మిత్‌ గాయపడ్డ (చేతి వేలి) విషయాన్ని ధృవీకరించాడు. స్మిత్‌ సర్జరీని తప్పించుకున్నప్పటికీ.. ఎనిమిది వారాలు చేతికి కట్టుతో ఉండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. బ్యాటింగ్‌కు ఇబ్బంది లేకపోతే రెండో టెస్ట్‌లో (జూన్‌ 3) స్మిత్‌ను ఆడించే అవకాశాలున్నాయని అన్నాడు. లబూషేన్‌, స్మిత్‌ స్థానాల్లో సామ్‌ కొన్‌స్టాస్‌, జోస్‌ ఇంగ్లిస్‌లను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్‌స్టాస్‌ గతేడాది భారత్‌తో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆకట్టుకున్నాడు. లబూషేన్‌ స్థానంలో తొలి టెస్ట్‌లో అతను ఉస్మాన్‌ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. స్టీవ్‌ స్మిత్‌ స్థానాన్ని మిడిలార్డర్‌లో ఇంగ్లిస్‌ భర్తీ చేస్తాడు. ఇంగ్లిస్‌ ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో ఆడిన తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో ఇరగదీశాడు. ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో మిగతా స్థానాలపై ఆసీస్‌ ఇంకా ప్రకటన చేయలేదు. జూన్‌ 25 నుంచి బార్బడోస్‌ వేదికగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబూషేన్‌, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు విండీస్‌ జట్టు: కెవ్లాన్‌ ఆండర్సన్‌, బ్రాండన్‌ కింగ్‌, క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, మిఖైల్‌ లూయిస్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, కీసీ కార్టీ, జస్టిన్‌ గ్రీవ్స్‌, రోస్టన్‌ ఛేజ్‌, జోహన్‌ లేన్‌, షాయ్‌ హోప్‌, టెవిన్‌ ఇమ్లాచ్‌, జోమెల్‌ వార్రికన్‌, అల్జరీ జోసఫ్‌, షమార్‌ జోసఫ్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, జేడన్‌ సీల్స్‌

Having siblings leads to better emotions and social bonds6
తోడబుట్టిన బలగం

‘శత్రువులు ఎక్కడో ఉండరు’ అని ఒక సినిమా డైలాగ్‌. ఇంట్లో టీవీ రిమోట్‌ కోసం ఫైటింగ్‌జరిగేది ఆ ‘శత్రువుల’తోనే! ఇంట్లో ప్రతిదానికీ పోటీ ఉండేది ఆ ‘శత్రువుల’ మధ్యనే! ఇంతగా ఫైటింగ్‌ చేస్తారా.. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా జాడీ పగలగొట్టేసినప్పుడు, ఆ విషయాన్ని దాచి పెట్టటానికి తోడుదొంగలయ్యేది మళ్లీ ఆ‘శత్రువులే’! వాళ్లెవరంటారా, ఇంకెవరు? తోబుట్టువులు! కొండంత ధైర్యం.. అమెరికాకు చెందిన బ్రిగమ్‌ యంగ్‌ యూనివర్సిటీ 395 కుటుంబాలను కలిసి చేసిన అధ్యయన ఫలితాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ కరువైనప్పటికీ తోబుట్టువులతో బలమైన బంధాలు ఉంటే, కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఒంటరితనం అనేవి ఆవరించే అవకాశం 60 శాతం వరకు తక్కువగా ఉంటుందట. తోబుట్టువులు ఉన్నవారు మనోవ్యథల నుంచి వేగంగా కోలుకుంటారు. మానసిక అనారోగ్యాలకు భయపడిపోకుండా ధైర్యంగా పోరాడతారు. సామాజికంగానూ మెరుగైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. అసలు తోబుట్టువులంటూ ఉంటే చాలు.. వాళ్ల బంధం గట్టిగా లేకున్నా వాళ్లు ఉన్నారన్న ధైర్యమే భావోద్వేగాల పరంగా ముఖ్యపాత్ర వహిస్తుందట.మైగ్రేన్లు, రక్తపోట్లు రావు.. తోబుట్టువులుంటే ఉండే ఆ ధీమా బాల్యంతోనే ఆగిపోదు. యవ్వనం, వృద్ధాప్యం వరకూ కూడా మన వెంట వస్తుంది. ఇల్లినాయ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం కనీసం ఒక తోబుట్టువైనా ఉన్న వ్యక్తులు సామాజికంగా గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. బయటి పోటీ ప్రపంచంలో బలమైన వ్యక్తుల మధ్య తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. తోబుట్టువులు మాట్లాడుకుంటారు, విభేదిస్తారు. వాదించుకుంటారు, పోటీ పడతారు, రాజీపడతారు.. ఇవన్నీ కూడా వారికి మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. ఈ సందర్భంగా వచ్చే ఆలోచనలు, మానసిక పరిపక్వత వంటివి భవిష్యత్తులో ఉద్యోగం, వివాహం, స్నేహం తదితర సంబంధాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి తెలివిడి కలిగిన మార్గాన్ని ఏర్పరుస్తాయట. బ్రిటన్‌కు చెందిన ‘ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌’ పరిశోధన కూడా.. తోబుట్టువులతో దగ్గరి సంబంధాలు ఉన్న పెద్దలు జీవితంలో సంతృప్తిగా ఉన్నట్లు కనుగొంది. తోబుట్టువులతో దృఢమైన అనుబంధాలు కలిగి ఉన్న పెద్దలు మైగ్రేన్లు, అధిక రక్తపోటుతో సహా, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలకు 20–25 శాతం తక్కువగా గురవుతారని 2019 సైకలాజికల్‌ సైన్స్ అధ్యయనం వెల్లడించింది.మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తోబుట్టువుల బాంధవ్యాలకు ప్రాముఖ్యం ఉంది. జర్మనీలో, మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన సుదీర్ఘ అధ్యయనాలు – కనీసం ఒక తోబుట్టువు ఉన్న వ్యక్తులు పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలను కలిగి ఉండే అవకాశం 45 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాయి. కుటుంబ గౌరవం, పెద్దల సంరక్షణకు పెద్దపీట వేసే జపాన్ లో.. తోబుట్టువులు తరచూ సంరక్షణ పాత్రలను పోషిస్తుంటారు. సాధారణంగా తండ్రి లేదా తల్లి లేని సింగిల్‌ పేరెంట్‌ కుటుంబాల్లో పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ, అమెరికాలో ‘చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ జర్నల్‌’లో వచ్చిన పరిశోధనా వ్యాసం – సింగిల్‌ పేరెంట్‌ కుటుంబాల పిల్లల్లో.. తోబుట్టువులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, తోబుట్టువుల అండే అందుకు కారణమని వెల్లడించింది. తోడున్నవాళ్లూ తోబుట్టువులే!.. ఇదంతా చదివాక, ‘అరే, నాకు తోబుట్టువులు లేరే’ అని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తోబుట్టువులు లేని వాళ్లు కూడా –తోబుట్టువులతో ముడిపడి ఉన్న భావోద్వేగ ప్రయోజనాలను, ముఖ్యంగా మెంటల్‌ సపోర్ట్‌ను.. స్నేహితులు, బంధువులు లేదా దీర్ఘకాలం రూమ్మేట్‌లుగా ఉన్న ‘తోబుట్టువుల లాంటి’ వారి ద్వారా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకే రక్తాన్ని పంచుకుపుట్టకపోవడం అన్నది ప్రతికూలాంశం ఏమీ కాబోదని, జన్యువులతో సంబంధం లేకుండా కూడా తోబుట్టువులు దొరకొచ్చని కూడా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రాణ స్నేహితులు కూడా ఒకరకంగా తోబుట్టువులే.తోబుట్టువులు ఉంటే చాలు..» తోబుట్టువులు ఉన్నవారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు 60 శాతం తక్కువ (బ్రిగమ్‌ యంగ్‌ యూనివర్సిటీ)» తోబుట్టువులు ఉన్నవాళ్లకు రాజీపడటం, దీర్ఘకాల అనుబంధాలను కొనసాగించటం వంటి నైపుణ్యాలు అలవడతాయి. (యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయ్‌)» తోబుట్టువులతో బాల్యంలో చక్కటి సంబంధాలు ఉన్న పెద్దల్లో ఒత్తిడి సంబంధ అనారోగ్యాలు 2025 శాతం వరకు తక్కువ (సైకలాజికల్‌ సైన్స్‌) తాజా పరిశోధన ప్రకారం.. బాల్యంలో ఈ తోబుట్టువులు ఎంత కొట్టుకున్నా... పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటారట. మీకో తోబుట్టువు ఉంటే, మీ లోపల మీకు ఎప్పటికీ ఒక తోడు ఉన్నట్లేనని పరిశోధకులు అంటున్నారు. ఇదెలాగంటే –అక్క అమ్మగా మారిపోయి అక్కునచేర్చుకుంటుంది. తమ్ముడు టెక్నాలజీలో కింగ్‌ అయిపోయి అన్నగారి సందేహాలను తీరుస్తాడు.– సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

International yoga day 2025 Yoga offers  amazing health benefits7
International yoga day 2025 : ఆరోగ్య ‘యోగం’ ఇంతింత కాదయా

వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగపోటీలు, డిజిటల్‌ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. ‘యువత జీవనవిధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్‌లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగ ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది’ అని వివరిస్తారు యోగా ట్రైనర్‌ స్వప్న యోగాన్వేష్‌.‘లండన్‌లో ఎంబీయే చేసి, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి, యోగాతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను’ అని తెలిపిన స్వప్న హైదరాబాద్‌లో ఐదేళ్లుగా యోగా ట్రైన ర్‌గా రాణిస్తున్నారు. ‘‘ఇండియాకు వచ్చి, రిషీకేష్‌ వంటి యోగిక్‌ ప్లేస్‌లన్నీ సందర్శించాను. వారాంతంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణా తరగతులు తీసుకుంటుంటాను. సాధారణంగా యువతలో చాలా మంది జిమ్‌లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరక ఫిట్‌నెస్‌ కోసం ఉపయోగపడుతుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటినీ సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజటల్‌ మీద డిపెండ్‌ అయి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్‌ వచ్చింది. కానీ, చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్‌ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి, వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్‌ అవడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా ప్రాచీన భారత సంప్రదాయంలో భాగంగా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. పతంజలి వంటి ఎంతో మంది రుషులు, యోగులు యోగాను సాధన చేసినట్టుగా ్ర΄ాచీన భారతం మనకు చూపుతుంది. యోగా వల్ల లాభాలేంటి అని ప్రశ్నించే ఈ తరానికి చెప్పలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?తరగని గని యోగా! మనందరిలో ఫిజికల్, సైకలాజికల్‌ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఫుడ్‌ పరంగా ఎక్కడ మిస్టేక్‌ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్‌ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. కపాలబాతి, ప్రాణాయామం.. వంటి శ్వాస వ్యాయామాలు చేయడానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే, యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవడానికి మూడున్నర గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్‌... మనం చేసే పనులలో ఈ ఐదు ఆర్గాన్స్‌ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్‌ మెథడ్స్‌ ఉంటాయి. బ్రీతింగ్‌ టెక్నిక్స్‌ ఉంటాయి. ఇంటర్నల్‌ హీలింగ్‌ ద్వారా వీటిని సాధన చేయచ్చు. – స్వప్న యోగాన్వేషి, యోగా ట్రైనర్, హైదరాబాద్‌ యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్‌ చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలుఇస్తుంది.దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది∙మైండ్‌ఫుల్‌నెస్‌ (సంపూర్ణ శ్రద్ధతో జీవించడం) అభివృద్ధి చెందుతుంది.డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.శ్వాసక్రియ( ప్రాణాయామం) వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.కేటాయించాల్సిన సమయం...యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు యోగాకు కేటాయించాలి యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది ∙సరైన గురువు లేదా యాప్‌ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయడమే ముఖ్యంసోషల్‌ మీడియా డీటాక్స్‌: రోజంతా మొబైల్, స్క్రీన్‌ ముందు గడిపే యువతకు యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్‌ డీటాక్స్‌కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్‌ హీరో -నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Shubhanshu Shukla Space Mission Postponed8
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్‌.. ఆరోసారి వాయిదా

ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా.. యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో ఈ మిషన్‌ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడింది.ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.NASA's Axiom-4 mission with Indian astronaut Shubhanshu Shukla delayed for sixth time pic.twitter.com/TAaXUZpCnv— UPSC Post 📫 (@upscpost) June 20, 2025

Operation Sindoor Pakistan Deputy PM Says India hit our airbases9
భారత్‌ దాడులతో వణికిపోయాం.. పాక్‌ డిప్యూటీ పీఎం షాకింగ్‌ వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ ఎట్టకేలకు భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు పాక్‌ నేతలు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్తాన్‌ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేరిపోయారు. తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌పై ఇషాక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వైమానిక దాడులు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.పాకిస్తాన్‌ డిప్యూటీ పీఎం ఇషాక్‌ దార్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ మాపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని రెండు ముఖ్యమైన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షోర్‌కోట్ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ విరుచుకుపడింది. దీంతో, రెండు ఎయిర్‌బేస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్‌పై పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అందుకే ప్రతి దాడి చేయలేకపోయాం. దాడుల విషయంలో భారత్‌ వేగంగా స్పందించింది. భారత్‌తో యుద్ధం అంత తేలిక కాదు.భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడాలని యువరాజు సూచించారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్‌ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా సైతం భారత్‌ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు.Pakistan Deputy PM Ishaq Dar' openly admits 2 things in this interview 📍India struck the Nir Khan Air base and Shorkot Air base 📍 Ishaq Dar' says Saudi Prince Faisal called him asking "Am I authorised to talk to Jaishankar also and CONVEY ..and you are READY TO TALK"… pic.twitter.com/45TJqnlWKu— OsintTV 📺 (@OsintTV) June 19, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ చేసిన దాడులను పాక్‌ ప్రధాని అంగీకరించారు. బాలిస్టిక్‌ క్షిపణులతో భారత్‌ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్‌ మునీర్‌ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్‌ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్‌ దాడులు చేసిందని మునీర్‌ తనతో చెప్పారన్నారు. ఇక, షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Kadapa Corporation Council Meeting Updates10
కడప కార్పొరేషన్‌లో హైడ్రామా.. తెరుచుకోని తలుపులు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: దాదాపు ఆరు మాసాల తర్వాత ఇవాళ జరుగుతున్న నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు నెలలుగా మీటింగ్ హాలుకు అధికారులు తాళం వేశారు. చివరికి ఇవాళ ఉదయం 11గంటలకు పాలకవర్గ సమావేశం ఉన్నా కానీ తాళం తీయలేదు. కుర్చీ కోసం.. కడప ఎమ్మెల్యే దొడ్డి దారిన కుర్చీ వేయించుకుని, దానికి బోల్టులు కూడా బిగించారనే ఆరోపణలు ఉన్నాయి.మీటింగ్ హాల్ తలుపులు తీస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నేడు మీటింగ్ ఉన్నా ఇంతవరకూ తాళం తీయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నిబంధనలను కాలరాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్‌ హాలులో మేయర్‌తో సమానంగా తనకు వేదికపై కుర్చీ వేయలేదన్న కారణంతో.. గత రెండు సర్వసభ్య సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆర్‌.మాధవిరెడ్డి తన అనుచరులతో ప్రవేశించి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.తనకు లేని కుర్చీ.. మేయర్‌కు కూడా ఉండకూడదని భీష్మించుకుని.. మేయర్‌ సురేష్‌ బాబుపై అనర్హత వేటు వేయించాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురపాలక శాఖ కార్యదర్శి ఏకపక్షంగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. మళ్లీ విచారణ చేసి మేయర్‌ వాదన వినాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పురపాలక అధికారులు పెడచెవిన పెట్టి పాత పద్ధతిలోనే విచారణ చేసి.. ఈనెల 20వ తేదీన సర్వసభ్య సమావేశం కంటే ముందే మళ్లీ అనర్హత వేటు వేయాలని పన్నిన కుయుక్తులు న్యాయస్థానం ముందు ఫలించలేదు.19వ తేదీ వరకూ మేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈనెల 20వ తేదీన మేయర్‌ సురేష్‌బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగడం తథ్యమని తేలిపోయింది. మేయర్‌ కోరినా కౌన్సిల్‌ హాలు తలుపులు ఎందుకు తెరవలేదో.. మేయర్‌ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన కమిషనర్‌.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు మేయర్‌తో సమానంగా వేదికపై కుర్చీలు వేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందుకే కౌన్సిల్‌ హాలు తాళం చెవులను తన వద్ద ఉంచుకొని.. మేయర్‌ స్వయంగా కోరినా తలుపులు తెరవలేదని సమాచారం. దీంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ హాలు తెరిచేలా ఆదేశాలివ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ను కోరడంతోపాటు సమావేశంలోకి ఇతరులను ఎవ్వరినీ అనుమతించవద్దని, పటిష్ట భద్రత కల్పిపంచాలని జిల్లా ఎస్పీని కోరారు.అంతేగాక 39 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించి తమకు భద్రత కల్పించాలని విన్నవించారు. కార్పొరేటర్ల పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నగరపాలక సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశపు హాలులో ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేసి ఉంటే.. మేయర్, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎలా స్పందిస్తారు.. కమిషనర్‌ ఎవరి ఆదేశాలతో.. ఎవరి మెప్పు కోసం ఈ పని చేశారు.. కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు పట్టుబడతారు.. అనే ప్రశ్నలకు నేడు సమాధానం లభించబోతోంది. ఒకవేళ కుర్చీ వేయకపోతే ప్రభుత్వ విప్‌ ఆర్‌.మాధవిరెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏం చేయాలన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే వైఎస్సార్‌సీపీ మేయర్, కార్పొరేటర్ల గోడు విని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా.. వాటిని అమలు చేయాల్సింది మళ్లీ అధికారులే కావడంతో సమస్య మళ్లీ మొదటికొస్తోంది. సభ నిర్వహణకు, సభలో చేసిన తీర్మానాలను మినిట్స్‌ బుక్‌లో రాయించేందుకు, వాటిని అమలు చేసేందుకు, అభివృద్ధి పనులు చేసేందుకు ఇలా ప్రతి దానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, మేయర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గతంలో ఎన్నడూ ప్రతిపక్షంపై అధికార పక్షం ఇంతటి ఘర్షణ పూరిత వాతావరణం తీసుకురాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement