సాహస వలంటీర్‌కు నగదు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సాహస వలంటీర్‌కు నగదు పురస్కారం

Published Tue, Aug 1 2023 1:12 AM | Last Updated on Tue, Aug 1 2023 7:44 AM

- - Sakshi

వైఎస్సార్: రైల్వేకోడూరు మండలం ఓ.కొత్తపల్లెలో శనివారం రాత్రి పీర్ల చావిడి వద్ద ఏర్పాటు చేసిన గుండంలో కల్లూరి బాషా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోగా వలంటీర్‌ చాపల సురేష్‌ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వవిప్‌ కొరముట్ల శ్రీనివాసులు సోమవారం వలంటీర్‌ ఇంటికి వెళ్లి సన్మానించి నగదు పురస్కారం అందజేశారు.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందనేందుకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. కాగా పీర్లగుండంలో పడి తీవ్రగాయాలైన బాషాకు మెరుగైన వైద్యం అందించాలని రుయా ఆసుపత్రిలోని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌రాజు, ప్రముఖ న్యాయవాది ఆర్‌సీ సురేష్‌బాబు, ఎంపీటీసీ జనార్దన్‌రాజు, ప్రతాప్‌రెడ్డి, సుంకేసుల బాషా, తొండం రాజేంద్ర, ధనుంజయ, శ్రీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement