Annamayya District News
-
మాయ మాటలతో బంగారం చోరీ
జమ్మలమడుగు : పట్టణంలో ఎస్సీ కాలనీలో కరపాకుల సుజాత అనే మహిళకు మాయ మాటలు చెప్పి బంగారాన్ని చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం అర్బన్ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల గ్రామానికి చెందిన మురిర్నే కనకమ్మ, ఆమె భర్త శ్రీనివాసులు గత నెల 24వ తేదీన జమ్మలమడుగు ఎస్సీ కాలనీలో ఉన్న సుజాత ఇంటికి వెళ్లి అనారోగ్యం తొలగాలంటే ఇంట్లో పూజలు చేయాలని నమ్మించారు. సుజాత చేత ఆమె ఇంట్లో ఉన్న బంగారం లాంగ్చైన్, రెండు బంగారం కడియాలు, హారం మొత్తం 10 తులాల బంగారాన్ని పెట్టేలో బియ్యం పోసి అందులో పెట్టించారు. పూజలు చేసే సమయంలో పెట్టెలు మార్చేశారు. సాయంత్రం వరకు పెట్టెను తెరవద్దు అని చెప్పి వారు వెళ్లిపోయారు. సాయంత్రం సుజాత ఆమె భర్త చంద్రశేఖర్లు బియ్యం పెట్టెను తెరిచి చూశారు. అందులో బంగారం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ లింగప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది దేవదాసు, రియాజ్ ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి నిందితులను గుర్తించారు. వీరపునాయునిపల్లి, వేంపల్లి ప్రాంతాలలో కూడా ఇదే తరహాలో చోరీలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం వీరిని అరెస్టు చేసి వారి వద్దనుంచి పదితులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.నిందితులను అరెస్టు చేసిన పోలీసులు -
ఉపాధి కూలీలను ఆదుకోవాలి
రాయచోటి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించి కూలీలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యం, చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలపై ఆయన స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించి, వలసలు నివారించాలన్న ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నాలుగు మాసాలుగా కూలీలకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయ కూలీ పనులు సక్రమంగా దొరక్కపోవడంతో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో అధికారులు వివక్ష చూపుతున్నారని, జాబ్కార్డులు తీసేస్తామని రాజకీయ కోణంలో అధికారులు మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు రానున్న రోజుల్లో ఎక్కడున్నా తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. జరుగుతున్న ప్రతి పనిపై ఆరా తీస్తున్నామని, వీడియోలు ఇతర ఆధారాలతో సహా సేకరిస్తున్నామన్నారు. నాలుగేళ్ల తరువాత అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించి కచ్చితంగా రికవరీ చేయించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. కూలీలు చేయాల్సిన పనులను యంత్రాలతో చేస్తున్నారని, ఊర్లలో లేని వ్యక్తుల పేర్లను మస్టర్లలో నమోదు చేయడం, చేసిన పనులకే తిరిగి మెరుగులు దిద్ది, బెదిరించుకుని బిల్లులు చేయించుకుంటున్నారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియోలతో సహా ప్రాంతాల వారీగా, తేదీల వారీగా ఆధారాలు ఉన్నాయన్నారు. పథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు శ్రీకాంత్రెడ్డి సూచించారు. పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయండి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి డిమాండ్ -
కన్ను పడితే కబ్జా చేయాల్సిందే.!
రైల్వేకోడూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకుల భూ కబ్జాలకు అంతు లేకుండా పోతోంది. అగ్రనాయకుల అండదండలతో ఏటి, వంక, ప్రభుత్వ, ప్రైవేటు లిటిగేషన్ భూములను స్థానిక అధికారుతో కలిసి అడ్డదారిలో ఆక్రమించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నింటిని స్వాహాచేసి విక్రయించిన దాఖలాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల కన్నుపడితే అది కబ్జా కావాల్సిందే అనే విధంగా పరిస్థితి తయారైంది. అధికారం చేపట్టినప్పటి నుంచి ధన, భూ కబ్జాలపైనే దృష్టి సారించారని పలువురు చర్చించుకుంటున్నారు. కూటమిలో వర్గపోరు ఉన్నప్పటికీ స్వాహా చేసే విషయంలో అన్ని వర్గాలు ఒక్కటవుతున్నాయి. రాఘవరాజపురం సబ్స్టేషన్ వద్ద ఆర్అండ్బీ స్థలం, మైసూరావారిపల్లి ఈద్గా భూమి తంతంగం మరువక ముందే మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ పరిధిలో రెడ్డివారిపల్లి బ్రిడ్జి వద్ద గిరిజనుల ఇంటి స్థలాలు, ఏటి పొరంబోకు భూమిపై కొందరి కన్ను పడింది. గతంలో 1997 ఫిబ్రవరి నెలలో 573 సర్వే నంబర్లో దరిశా శేషయ్య కొంత భూమిని ఏటి పక్కన ఉండే 15 గిరిజన కుటుంబాలకు అగ్రిమెంటుపై విక్రయించారు. సుమారు 3 దశాబ్దాలుగా వారు గుడిసెలు వేసుకొని మామిడి చెట్లు నాటుకొని జీవనం సాగిస్తున్నారు. కొత్తగా రెడ్డివారిపల్లికి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండడంతో కొందరి కన్ను దీనిపై పడింది. నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసుకుని అధికారులతో కుమ్మకై ్క ఎలాంటి నోటీసులు లేకుండా ఎవరూ లేనప్పుడు చెట్లను, గుడిసెలను తొలగించడమే కాక ఆనుకొని ఉన్న ఏటి పొరంబోకు భూమిని, అక్కడి నదిలోని ఇసుక గుండ్రాళ్లను జేసీబీలు, పొకై ్లన్లతో ఎత్తులేపి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టించుకోని ఇరిగేషన్ఽ అధికారులు తమ ఇరిగేషన్ శాఖ పరిధిలోని గుంజనేటిలో యంత్రాలతో ఇసుక గుండ్రాయి తరలిస్తూ అక్కడే ఉన్న ఇరిగేషన్ పరిధిలోని భూమిని ఎత్తు లేపుతుంటే అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయమై డీఈ వినోద్కుమార్ను వివరణ కోరగా తమ శాఖలో సిబ్బంది కొరత ఉందని, సర్వే జరిపి ఏటి భూమి ఉంటే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. రెవెన్యూ అధికారి ఏమంటున్నారంటే.. ఈ సంఘటనపై విచారణ జరపాలని వీఆర్ఓను ఆదేశించామని, అలాగే సమగ్రంగా సర్వే జరపాలని మండల సర్వేయర్ను ఆదేశిస్తామని తహసీల్దార్ మహబూబ్చాంద్ తెలిపారు. ప్రభుత్వ భూమి ఉంటే తప్పని సరిగా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తకోడూరులో కూటమి నాయకుల పైరవీలు పట్టణంలోని కొత్తకోడూరు ప్రాంతంలో చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకొని నివాసముంటున్నారు. అక్కడ చాలా వరకు కేటాయించని ఇంటి స్థలాలు ఉన్నాయి. అలాగే ఇళ్లు నిర్మించుకోని స్థలాలు ఉన్నాయి. వీటిలో సుమారు 200 వరకు ఇంటి స్థలాలు అధికారులతో కుమ్మకై ్క కొందరు నాయకులు అమ్ముకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని భూ ఆక్రమణలు, దందాలపై ఇక్కడి అధికారుల ప్రమేయం లేకుండా జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పలువురు పేర్కొంటున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో కూటమి నేతల ఆక్రమణల పర్వం కోట్లు విలువ చేసే భూముల కబ్జాకు యత్నం నిద్రావస్థలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు -
ఒంటరి జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య
మదనపల్లె : ఒంటరి జీవితం, ఆపై అనారోగ్యం, వృద్ధాప్యం, తదితర సమస్యలతో మనస్థాపం చెంది ఓ వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. పట్టణంలోని కోటవీధిలో నివాసం ఉంటున్న గందోడి చెంగయ్య (76), భార్య లక్ష్మిదేవమ్మలకు ఒకే కుమార్తె అరుణ ఉండగా, ఆమెకు చాలా కాలం క్రితం గుర్రంకొండకు చెందిన మురళితో వివాహం జరిపించారు. 15 సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కోట వీధిలోని ఇల్లు బాడుగకు ఇచ్చి లక్ష్మిదేవమ్మ పట్టణంలోని దేవత నగర్లో నివాసం ఉంటోంది. చెంగయ్య మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లి పంచాయతీ ఎనుములవారిపల్లె సమీపంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. కుమార్తె అప్పుడప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్లి అవసరమైన వస్తువులు అందించి పలకరించి వచ్చేది. ఇటీవల చెంగయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవాడు. కుమార్తె తనను కలిసిన సందర్భంలో, అనారోగ్యం వేధిస్తోందని జీవితంపై ఆసక్తి లేదని నిర్లిప్తంగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం స్థానికుడైన నాగరాజ పాలు పోసేందుకు వృద్ధాశ్రమానికి వెళ్లగా, చెంగయ్య తాను ఉంటున్న గదిలో ఫ్యానుకు పంచెతో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడాన్ని గమనించాడు. వెంటనే స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తాలూకా ఎస్ఐ గాయత్రి ఆత్మహత్యకు గల కారణాలను స్థానికులను విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుమార్తె అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. -
విద్యుత్ కనెక్షన్ తీసుకోవద్దన్నందుకు కొడవలితో దాడి
రాయచోటి టౌన్ : తమ విద్యుత్ మోటార్ నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకోరాదని వారించినందుకు రేపన లక్ష్మిదేవి, రేపన రామకృష్ణలపై రేపన ప్రభాకర్ అనే వ్యక్తి కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి మండల పరిధిలోని మాధవరం గ్రామం వడ్డెపల్లెకు చెందిన రేపన లక్ష్మిదేవి, రేపన రామకృష్ణలు బావ మరదళ్లు. వారి పొలం వద్ద అమర్చుకున్న ట్రాన్స్ఫార్మర్ వైర్ల నుంచి రేపన ప్రభాకర్కు చెందిన విద్యుత్ మోటారుకు విద్యుత్ కనెక్షన్ అమర్చేందుకు వెళ్లాడు. అయితే వీరు తమ మోటారుకు విద్యుత్ సమస్య వస్తుందని వేరే చోటు నుంచి కనెక్షన్ తీసుకోవాలని చెప్పారు. అయితే అందుకు ప్రభాకర్ నిరాకరిస్తూ వారి మోటారు స్తంభం నుంచే విద్యుత్ కనెక్షన్ తీసుకుంటానని బెదిరించి కనెక్షన్ తీసుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. తన మాట వినడం లేదని భావించిన రేపన ప్రభాకర్ కొడవలితో వారిద్దరిని ఊరిలో వెంటాడి నరికేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గ్రామస్తులు ఒక్కసారిగా అతన్ని పట్టుకొన్నారు. అప్పటికే లక్ష్మిదేవి, రామకృష్ణ తలకు, భుజంపైన, ఇతర భాగాలపై కొడవలితో గాయపరిచాడు. అయితే అతన్ని పట్టుకొనే క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో రేపన ప్రభాకర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బైకు అదుపుతప్పి యువకుడి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని శాంతి నగర్ తిరుపతి బ్రిడ్జి వద్ద చియ్యవరం పంచాయతీ నడింపల్లికి చెందిన యువకుడు చరణ్ (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యువకుడు ద్విచక్రవాహనంలో వేగంగా వెళుతూ ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్తో వ్యక్తికి తీవ్ర గాయాలుమదనపల్లె : కరెంట్ షాక్తో వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం సత్యసాయి జిల్లా ఎన్.పి. కుంట మండలం బలిజ పల్లె పంచాయతీ సారగుండ్లపల్లెలో జరిగింది. స్థానికుడైన పెద్దరెడ్డప్ప కుమారుడు కృష్ణప్ప (40) తన పొలం వద్ద పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా తీవ్రమైన గాలులు వీచాయి. దీంతో మోటార్కు అమర్చిన తీగలు తెగిపోవడంతో, వాటిని సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎన్ పి కుంట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. సోమవారం మెరుగైన వైద్యం కోసం మదనల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పాఠశాల గుర్తింపు రద్దు కడప ఎడ్యుకేషన్ : కమలాపురం పట్టణంలోని స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6 నుంచి 10వ తరగతులకు సంబంధించిన గుర్తింపును రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. తల్లిదండ్రులు ఈ పాఠశాల నుంచి తమ పిల్లల ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసుకొని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చేర్పించుకోవాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
లక్కిరెడ్డిపల్లి : గాలివీడు మండలం, నూలివీడు శ్రీనివాసపునారానికి చెందిన ఏ.రవికుమార్ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. మంచాలపై వైరు అల్లుకుంటూ జీవనం సాగించే రవికుమార్ ఆదివారం రాత్రి తన పని ముగించుకొని లక్కిరెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా దొరిచెరువు వద్దకు రాగానే రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొని పక్కనే ఉన్న పొలాల్లో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సచివాలయానికి తాళంఒంటిమిట్ట : మండల పరిధిలోని సాలాబాదు సచివాలయంలో సోమవారం సచివాలయ సిబ్బంది కరువయ్యారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు హాజరు వేసిన సిబ్బంది సచివాలయానికి తాళాలు వేసి కనిపించకపోయే సరికి ప్రభుత్వ సేవలకు వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో సాలాబాదు సచివాలయం సిబ్బంది మంగళవారం ఉదయం కడప కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసినట్లు ఒంటిమిట్ట ఎంపీడీఓ కుళాయి బాబు తెలిపారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురబలకోట మండలం మట్లివారిపల్లె పంచాయతీ కోనంగివారిపల్లెకు చెందిన ఆనంద కుమారుడు శ్రీనివాసులు (26) ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. గ్రామంలో ఆనందకు ఇతరులతో ఉన్న భూ సమస్యల కారణంగా, పోలీస్ కేసు కావడం, తాజాగా ప్రత్యర్థులు కక్షపూరితంగా శ్రీనివాసులుపై మరోసారి కేసు పెట్టడంతో, పోలీసులు స్టేషన్ పిలిపించి విచారించారు. దీన్ని అవమానంగా భావించి మనస్థాపంతో శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనిల్ రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకొని జేసీబీ డ్రైవర్గా పనిచేస్తూ కురబలకోట మండలం అంగళ్లులో ఉంటున్నాడు. సోమవారం భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యల కారణంగా గొడవ జరిగింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అనిల్ భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నీవు స్వేచ్ఛగా ఉండొచ్చని ఫోన్లో చెప్పాడు. దీంతో, మనస్థాపం చెందిన లక్ష్మి(23) విష ద్రావణం తాగింది. గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే మదనపల్లెప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. దారి దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టుపెనగలూరు : మండలంలోని చక్రంపేట వద్ద రాత్రి వేళలో దారిదోపిడీ చేసిన కందుల బాలవర్దన్ నాయుడు అలియాస్ బాలు అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు పెనగలూరు ఎస్ఐ రవి వ్రకాష్ రెడ్డి తెలిపారు. 2023 మార్చి 8వ తేదిన పెనగలూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే ఫొటోగ్రాఫర్ చిట్వేలిలో ఓ కార్యక్రమానికి హాజరై ద్విచక్ర వాహనంలో అర్థరాత్రి వేళ ఇంటికి బయలుదేరాడు. చక్రంపేట సాయి వికాస్ స్కూల్ వద్ద టి.పెంచలయ్య అలియాస్ చిన్నతో కలిసి ఫొటోగ్రాఫర్ వాహనాన్ని ఆపి అతని వద్ద రూ. 5 వేలు తీసుకొని పరారయ్యాడు. వెంటనే బాధితుడు పెనగలూరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. అప్పట్లో పెంచలయ్య అలియాస్ చిన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాల వర్దన్ నాయుడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతను ఇటీవల పదిరోజుల క్రితం చిట్వేలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అరెస్టు చేశారు. మద్యం విక్రేతపై కేసు నమోదు నిమ్మనపల్లె : అధిక ధరలకు విక్రయించేందుకు అక్రమంగా మద్యం కలిగిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన తుమ్మల గోపాల్ మదనపల్లెలోని వివిధ మద్యం షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామానికి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో అతనిపై నిఘా ఉంచి ఆదివారం సాయంత్రం అరెస్టు చేశామన్నారు. అతను వద్ద నుంచి రూ.6482 విలువ కలిగిన 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించామన్నారు. -
సన్నగిల్లుతున్న నమ్మకం!
ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం టేకులపెంటలో కాపురముంటున్న యానాదులు. వీరికి 2000 సంవత్సరంలో సర్వే నెంబరు 1218–4లో 1.68 సెంట్ల డీకేటీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే అందుకు సంబంధించిన భూమిని ఆన్లైన్ చేయించాలని మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్కు వినతిపత్రం సమర్పించారు. గతంలోనూ సమస్యను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. ఇంతవరకు ఆన్లైన్లో చేర్చలేదని....దీంతో 1బీ, అడంగల్ రాక ఇబ్బందులు పడుతున్నామని సబ్ కలెక్టర్కు వివరించారు. మాకు వెంటనే ఆన్లైన్లో ఎక్కించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. సాక్షి రాయచోటి : ఏప్రిల్ నెల అందునా మండు వేసవి. ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమయ్యే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మండుటెండలో..ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పరుగులు పెడుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో నమ్మకం సన్నగిల్లుతోంది. ఏదో చేస్తారని.. ఏమేమో జరిగిపోతాయని ఎంతో ఆశతో.. కష్టాలు పడుతూ .. కన్నీళ్లు దిగమింగుతూ కలెక్టరేట్ వస్తున్న సమస్యలు పోవడం లేదు..అధికారం అండగా...ఆగడాలు మెండుగా...జిల్లాలో కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు న్యాయం మాత్రం కొండంత దూరంలో కనిపిస్తోంది.. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వచ్చి గోడు వెళ్లబోసుకునేందుకు బారులు తీరుతున్నారు. న్యాయం కోసం జిల్లాలోని అటు తంబళ్లపల్లె, ఇటు రైల్వేకోడూరు, మదనపల్లె, రాజంపేట ఇలా చెబుతూపోతే దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కలెక్టరేట్కు కదులుతున్నారు. కానీ పెన్షన్లు, ఇతరత్రా చిన్నపాటి సమస్యలకు కూడా ఒక్కోసారి పరిష్కారం గగనంగా మారుతోంది. ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి ఆన్లైన్, అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న స్థలాలను విడిపించమని, ఇతరత్రా దాడులు, వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. దివ్యాంగులు, వృద్ధులు, ఇతర వ్యక్తిగత సమస్యలతో ప్రతి సోమవారం 250–300 మంది వరకు వస్తున్నారు. ప్రధానంగా ఇంటి పట్టా, ఆన్లైన్ సమస్యలు, భూ కబ్జాలు, ఉద్యోగాలు, రుణాల కోసం ఇలా అనేక సమస్యలతో కలెక్టరేట్కు న్యాయం కోసం వస్తున్నారు.అయితే జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జేసీ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పరిశీలించిన అర్జీల విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో కొంతమేర పలితం కనిపిస్తోంది. మిగతా వాటికి సంబంధించి ఆయా శాఖల్లో ప్రయోజనం పెద్దగా ఉన్నట్లు లెక్కల్లో గ్రేడ్లు వేసుకుంటున్నా చాలా వరకు సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ఉపాధి కూలీలకు పెండింగ్ సొమ్ము అందించాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీపీఐ (ఎం ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ ఆధ్వర్యంలో పలువురు కూలీలు జేసీని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. రాయచోటి మండల పరిధిలోని మాధవరం గ్రామం గొర్లముదివీడు గ్రామంలో ఉపాధి కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలని వారు కోరారు. అంతేకాకుండా తమకు పనిదినాలు 200 రోజులు కల్పించాలన్నారు అలాగే ఉపాధి కూలీలకు వేసవి నేపధ్యంలో రక్షణ కల్పించాలని జేసీకి వివరించారు. సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి రాయచోటి : ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సమస్యపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందన్నారు. కావున అధికారులు ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. సమస్య ఏమిటి, దానిని ఎలా పరిష్కరించాలన్న విషయాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పింఛన్ తీసేస్తామంటున్నారు నాకు రెండు చేతులు పనిచేయడం లేదు. ఎప్పుడో సచ్చుపడిపోయాయి. ఉన్నా లేనట్లే. అయితే ఒక్కోసారి పింఛన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కనెల పింఛన్ తీసుకోకపోవడంతో మేనెల పింఛన్ రాదని గ్రామ సెక్రటరీ చెప్పారు. కలెక్టర్కు విన్నవించుకోవాలని వచ్చాను. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. – వెంకట్రాముడు, తవ్వగుంటపల్లె, కేవీ పల్లె మండలం పదేపదే ఒకే సమస్యపై తిరుగుతున్నా కనిపించని పరిష్కారం కూటమి సర్కార్ చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తగ్గిపోతున్న బాధితులు 60 నుంచి 70% మేర రెవెన్యూ సమస్యలతోనే కలెక్టరేట్కు -
ఫెయిల్ పరీక్షకే.. జీవితానికి కాదు
ఆత్మస్థైర్యం..సాధించాలన్న తపన ఉంటే చాలు...ఎంతటి కష్టాలనైనా ఎదుక్కోవచ్చు. పరీక్షలు..మార్కులు ర్యాంకులే పరమావఽధి కాదు. తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిలైనా జీవితం ముగిసిపోదు. క్షణికావేశ నిర్ణయాలు మంచిది కాదు. నిరాశ చెందకుండా మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం పాదాక్రాంతం అవుతుందని విద్యావేత్తలు, సైకాలజిస్తులు సూచిస్తున్నారు. ఈనెల 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపాలి టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు జీవితానికి ఫైనల్ కాదన్న విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి ఉత్తీర్ణత సాధించవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. అందువల్ల చదువులో రాణించలేక పోయినా తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించండి. అంతేకాని ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చకండి. పిల్లలు ఫెయిలైనా తల్లిదండ్రులు మందలించడం, నిదించడం వంటివి చేయకండి. ఇంతటితో చదువు ఆగిపోదు, పరీక్షలు ఆగిపోవు అన్న ఆత్మస్థైర్యాన్ని తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలి. – మునగాల కృష్ణకుమార్, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ, రాజంపేట ఽధ్రువపత్రాలు కేవలం అర్హతకే...! ప్రపంచ కుబేరుల్లో ఎక్కువ మంది పెద్ద చదువరులేం కాదు. వారు చేసిందల్లా ఒకటే.. నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. మనం చదివిన విద్యా ధ్రువపత్రాలు కేవలం అర్హతగానే పరిగణించాలి. మార్కులు తక్కువ వచ్చాయని కుంగుబాటుకు గురవటం అనవసరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకున్న రోజు ప్రపంచంలోను మనకన్నా గొప్పవారు ఉండరు. – చాముండేశ్వరి, సైకాలజిస్టు, మదనపల్లె. రాజంపేట టౌన్/మదనపల్లె సిటీ : ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో కొంతమంది, తక్కువ మార్కులు వచ్చాయని మరికొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక ఏం చేసినా, ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా వారి ప్రాణాలు మాత్రం తిరిగిరావు. అంతేకాదు ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. వారు ‘ఒక్కటంటే ఒక్క నిమిషం’ మనసు నిబ్బరంగా చేసుకొని ప్రశాంతంగా ముందున్న భవిష్యత్తు, తల్లిదండ్రుల గురించి ఆలోచించివుంటే వారు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదు. టెన్త్ విద్యార్థులూ...క్షణికావేశం వద్దు ఈనెల 23వ తేదీ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెన్త్ ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయినా,ఎవరికై నా తక్కువ మార్కులు వచ్చినా.. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యావేత్తలు, మేధావులు చెబుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటమి విజయానికి తొలిమెట్టులాంటిది. పరీక్షల్లో మనం ఎందుకు తప్పాం, లోపం ఎక్కడుంది అని ఆలోచించి దాని అధిగమిస్తే త్వరలో జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణులు కాగలరని విద్యావంతులు చెబుతున్నారు. చదువులో వెనకబడ్డా..గొప్ప వ్యక్తులయ్యారు ● క్రికెట్ క్రీడాభిమానులు తమ ఆరాధ్యదైవంగా భావించే సచిన్ టెండూల్కర్ టెన్త్ ఫెయిల్ అయ్యారు. అయితేనేం తనకు ఆసక్తి ఉన్న క్రికెట్లో రాణించి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గడించారు. ● పాతతరం ప్రజలను, సినీ ప్రేక్షకులను అలరించిన దివంగత అక్కినేని నాగేశ్వరరావు విద్యాభ్యాసం ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోయింది. అయితే ఆ యన ఏమాత్రం కుంగిపోలేదు. నటనపై ఉన్న ఆసక్తితో చైన్నెకి వెళ్లి గొప్ప నటుడయ్యారు. అంతేకాదు దేశంలోనే మేటిగా ఉన్న అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి అనేక మందికి ఉపాధిని కల్పించారు. ● అబ్దుల్కలాంకు మార్కులు తక్కువగా వచ్చేవి. కాని చదవడం, నేర్చుకోవడం అంటే ఆయనకు ఎనలేని ఇష్టం. అదే అబ్దుల్ కలాంను శాస్త్రవేత్తను, మనదేశానికి రాష్ట్రపతిని చేసింది. ‘భారతరత్న’ను కూడా తెచ్చిపెట్టింది. ● ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఎప్పుడూ స్కూల్కు వెళ్లలేదు. అయినా పాటల తోటలో గానకోకిలగా కీర్తి గడించారు. ● శ్రీనివాసరామానుజన్ గొప్ప గణిత మేధావి. కొన్నిసార్లు చదువులో ఇబ్బంది పడినా ఎప్పుడూ నిరాశ చెందకుండా లెక్కల్లో కొత్త విషయాలు తెలుసుకునేవారు. అతని మేథాశక్తిని గుర్తించిన గణిత ఆచార్యుల ద్వారా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు అవకాశం పొందారు. ఈ విషయాలు మరువద్దు ● పాస్, ఫెయిల్ అన్నవి అత్యంత సాధారణ విషయాలు. అందువల్ల విద్యార్థులు ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా చాలా లైట్గా తీసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని ముందుకు సాగాలి ● జరిగిన పొరపాటుకు కుంగిపోకుండా ఆత్మస్దైర్యాన్ని నింపుకోవాలి ● ఒత్తిడి నుంచి వేగంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. ● వెనకబడిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే ఉపాధ్యాయులు, సీనియర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలి. ● ఫలితాలు విడుదలయ్యే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు దగ్గరగా ఉండాలి.వారికి ధైర్యం చెప్పాలి. ● ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా తల్లిదండ్రులు ఏమాత్రం కోపగించుకోకుండా పిల్లలతో చిరునవ్వుతో మాట్లాడాలి. మూభావంగా ఉంటే అప్రమత్తంకండి ● టెన్త్ చదివే విద్యార్థులది కౌమారదశ. అందువల్ల వారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. ఫలితాలు విడుదలయ్యాక మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంటకనిపెట్టి ఉంచాలి. ● ఆహారం తీసుకోక పోయినా, ఏదో ఆలోచిస్తూ మూ భామంగా ఉన్నా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ● ఫెయిల్ అయిన వారిని ఒంటరిగా ఉంచకూడదు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలి పరీక్షల్లో వచ్చే మార్కులు కాదు... పిల్లలను ప్రేమించాలని ప్రముఖ మోటివేటర్ స్పీకర్ డీజీ రామ్మూర్తి అన్నారు. ఇటీవల పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పులు రావాలని సూచించారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలని తెలిపారు. క్షణికావేశానికిలోనై తొందరపాటు చర్యలు వద్దు ముందుంది బంగారు భవిష్యత్తు -
ఆపుకోలేని ఆవేదనకు బ్రేక్ !
● లోకోపైలట్లను కరుణించిన రైల్వేశాఖ ● రైలింజన్లోనే యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్ సీట్లు ● తొలుత గూడ్స్ రైళ్లలో ఏర్పాటుదిశగా చర్యలు డివిజన్ : గుంతకల్ లోకోపైలెట్స్ : 2500 రన్నింగ్స్టాప్ క్రూసెంటర్ : తిరుపతి, రేణిగుంట, నందలూరు, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్లు, రాజంపేట : ఆపుకోలేని ఆవేదనకు రైల్వేశాఖ బ్రేక్ వేసింది..ఇదేంటబ్బా అనుకోవచ్చు..విధి నిర్వహణలో రైలింజన్ నడిపే లోకోపైలెట్స్, అసిస్టెంట్ లోకోపైలట్స్ యూరినల్స్ తదితర సమస్యలు ఉత్పన్నమైతే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. లోకోపైలట్స్ ఒక్కోసారి నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి..మూత్ర విసర్జనకు వెళ్లాంటే రైలు ఆగే స్టేషన్ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలు కూడా పట్టొచ్చు.. మహిళాలోకోపైలట్లు చాలా అవస్థలు పడేవారు.ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వేశాఖ ముందడుగు వేసింది. రైలింజన్ క్యాబిన్లో యూరినల్స్, ఏసీవసతి, ఆధునిక ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాట్లను తప్పనిసరి చేసింది. దీంతో ఎల్పీ,ఎల్పీలకు పెద్ద ఉపశమనం లభించనుంది.రైల్వేశాఖ నిర్ణయంపై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ●కొత్తగా తయారుచేసే అన్ని లోకో క్యాబిన్లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్సీట్లు ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గుత్తి, విజయవాడ, లాలాగూడా, మౌలాలి, లోకోషెడ్లను ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్స్రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 42 లోకోమోటివ్లలో ఏర్పాటుచేశారు. ఇంజిన్ను పరిశీలించేందుకు వీలుగా అన్ని కారిడార్ చిన్న క్యాబిన్ ఏర్పాటుచేసి ,అందులో యూరినల్స్ కమోడ్ ఏర్పాటుచేస్తున్నారు. లోకోమోటివ్లో నీటి వసతి ఉండదు. కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్ వసతి మాత్రమే ఏర్పాటుచేస్తున్నారు. క్లీనింగ్ ప్రశ్నార్థకరం.. సాధారణ కోచ్ నాలుగురోజులకొకసారి స్పెషల్ క్లీనింగ్కు షెడ్డుకు వెళుతుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్థాలను తొలగిస్తారు. కానీ లోకోమోటివ్ 90రోజులకొకసారి మాత్రమే షెడ్డుకు వెళుతుంది. అప్పటి వరకు వ్యర్థాలను నిల్వ ఉంచలేరు. లోకోమోటివ్ కంపు కొడుతుందని ఎల్పీలు అంటున్నారు. దీంతో క్లీనింగ్ ప్రశ్నార్థకరంగా మారింది. ఎర్గోనాటిక్ సీట్లు... గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎ క్కువ గంటలు కూర్చొని పనిచేస్తే నడుము, వెన్నముక నొప్పులొస్తున్నాయనే ఆరోపణలున్నాయి. రైల్వేశాఖకు ఫిర్యాదులు వెళుతున్నాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్ సీట్లను ఏర్పాటుచేస్తున్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం వెంకటాద్రి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అదనపు ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని, బాధిలకు న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కి ల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వైభవం..పల్లకీ ఉత్సవం రాయచోటి టౌన్ : రాయచోటిలోని వీరభద్రస్వామి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి వీరభద్రస్వామి వారి, భధ్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధరకాల పూలతో అందంగా అలంకరించారు. పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఈవో డివి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులతోపాటు కర్ణాటక భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అభ్యంతరాలను 24 లోపు సమర్పించాలి – పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని అనంపురం, చిత్తూరు, కడప, కర్నూల్ పూర్వపు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి (గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు సవరించడానికి తాత్కాలిక జాబితాను htppr://rjdrekadapa.bofrpot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈ నెల 24వ తేదీలోల సమర్పించాలని సూచించారు. పదోన్నతి కౌన్సెలింగ్ ప్రశాంతం కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్సులుగా చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 15 మందికి గాను 9 మంది పదోన్నతులు పొందారు. నిబంధనల ప్రకారం ప్రమోషన్ల కౌన్సెలింగ్ ను చేపట్టినట్టు ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ డీఐఈఓగా సత్యనారాయణరెడ్డి కడప ఎడ్యుకేషన్ : డిస్ట్రిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ)గా సత్యనారాయణరెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ సెక్రటరీ కొన శశిదర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పయాకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఈయన్ను వైఎస్సార్జిల్లా డీఐఈఓగా నియమించారు. గతంలో డీవీఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కడప ఆర్ఐవోగా పనిచేస్తున్న బండి వెంకటసుబ్బయ్యకు డీవీఈఓను బాధ్యతలను అప్పగించారు. కాగా సత్యనారాయణరెడ్డి నూతన డీఐఈఓగా రెండు రోజుల్లో బాధ్యతలను చేపట్టనున్నారు. ఇంటర్ ఆర్జేడీగా శ్రీనివాసులు... ఇంటర్మీడియట్ ఎప్ఏపీ ఆర్జేడీగా శ్రీనివాసులును ప్రభుత్వం నియమించింది. ఈయన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డీకే గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తుండగా ఆయనను చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నియమించారు. చిత్తూ రు డీఐఈఓగా నియమించిన శ్రీనివాసులను ఎఫ్ఏసీ ఆర్జేడీగా కడపకు నియమించారు. ప్రస్తుతం కడప ఆర్జేడీగా పనిచేస్తున్న రవిని రాయచోటి డీఐఈఓగా నియమించారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
బద్వేలు అర్బన్ : నెల్లూరు జిల్లాలోని పెంచల కోనకు వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇరువురు బద్వేలు వాసులు మృతిచెందారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఎం.నరసింహులు (26) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అలాగే పట్టణంలోని రూపరాంపేటకు చెందిన వై.ఝాన్సీ (26) అదే ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇరువురు కలిసి శనివారం సాయంత్రం బద్వేలు నుండి ద్విచక్ర వాహనంలో పెంచలకోనకు బయలుదేరారు. అక్కడ దైవదర్శనం చేసుకుని రాత్రికి అక్కడే ఉండి ఉదయాన బద్వేలుకు బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిలోని కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందగా నరసింహులును స్థానికులు 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇరుగులమ్మా.. దీవించవమ్మా..
గాలివీడు : ఇరుగులమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం గాలివీడు మండలం, గోపనపల్లె గ్రామం పూజారి వాండ్లలో ఆదివారం నిర్వహిస్తున్న నల్లాబత్తుని వారి గురువు దేవర కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజలు శ్రీకాంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి ఆయన చేత ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహింపచేసి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల తరువాత నల్లాబత్తుని వంశీయులందరూ సమిష్టిగా కలసి పండుగ వాతావరణంలో ఘనంగా గురువు దేవర నిర్వహించుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఇరుగులమ్మ అమ్మవారి దయతో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఆప్యాయంగా.. ఆత్మీయంగా.. వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ గురువు దేవర కార్యక్రమంలో ప్రజలందరినీ శ్రీకాంత్ రెడ్డి పేరు పేరునా.. ఆత్మీయంగా.. ఆప్యాయంగా పలకరించి మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్టేట్ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ జల్లా సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండి చిన్నరెడ్డి, వాటర్ షెడ్ చైర్మన్ బండి బసిరెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్రెడ్డి, భూమా అమర్నాథరెడ్డి, సర్పంచులు ఉమాపతి రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, రామాంజులు రెడ్డి, ఉమా ప్రభాకర్, ఎంపీటీసీలు అమానుల్లా, చిన్నపురెడ్డి, మాజీ ఎంపీటీసీ చిన్నావుల చిన్నపు రెడ్డి, నాయకులు రమణా రెడ్డి, ఇటాచి రమణా రెడ్డి, నల్లా బత్తుని వెంకటరెడ్డి, భానుమూర్తి రెడ్డి, బండి బసిరెడ్డి, వల్లపు నగేష్ తదితరులు పాల్గొన్నారు. 40 ఏళ్ల తర్వాత గురువు దేవర ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
కురబలకోట : మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, గుట్టలు, డీకేటీ భూముల్లో మట్టిని అక్రమంగా తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అంగళ్లు గ్రామంలోని గుర్రాలవారిపల్లి వద్ద డీకేటీ భూముల్లో కనసానివారిపల్లెకు చెందిన మధు, కృష్ణమూర్తి జేసీబీలతో ఇష్టాను సారంగా రాత్రింబవళ్లు మట్టిని తోలి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం ఆదివారం రెవెన్యూ అధికారుల ఆదేశాలతో అంగళ్లు వీఆర్వో ఖాదర్ బాషా దృష్టికి వచ్చింది. ఆయన నేరుగా ఒక్కడే వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మట్టి మాఫియా నిర్వాహకుడు మధు వీఆర్వో మోటార్ సైకిల్ తాళాలను లాక్కున్నాడు. మట్టి తోలితే మీ వల్ల ఏమవుతుందని ప్రశ్నించాడు. ఆపై బరితెగించి దౌర్జన్యానికి దిగాడు. దీంతో పోలీసుల సహకారంతో వీఆర్వో మట్టి తోలుతున్న జేసీబీలను, ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ముదివేడు పోలీసులకు అప్పగించారు. వారు వాటిని సీజ్ చేసి మైనింగ్ శాఖకు నివేదిక పంపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు. అడ్డుకున్నందుకు వీఆర్వోపై దౌర్జన్యం రెండు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లు సీజ్ -
ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే
తంబళ్లపల్లె : ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మానవత్వం చాటుకున్నారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్య ఖర్చులకు ఆదివారం రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. మండలంలోని అన్నగారిపల్లెకు చెందిన విశ్వనాథ్ కుమారుడు రిషిక్ (6) అనే చిన్నారి బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ బెంగుళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి కవితమ్మ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయంగా రూ.50 వేలు నగదు అందజేశారు. ఇంకా ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తేవాలని వారికి సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు జైసింహారెడ్డి, సర్పంచు కె.జ్యోతి, మండల పార్టీ కన్వీనర్ చౌడేశ్వర్, నాయకులు నారాయణరెడ్డి, రమణారెడ్డి, సుదాకర్రెడ్డి, మల్లికార్జుననాయుడు, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం
రాజంపేట టౌన్ : ప్రచండ భానుడి భగభగలతో అల్లాడుతున్న వేసవిలో చల్లని పదార్థాలకు, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించే పదార్థాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో శరీరానికి చలువచేసే వివిధ పదార్థాలతో ప్రజలు సేద తీరుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా శరీరం డీహైడ్రేషన్ కాకుండా మజ్జిగ, కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు, పండ్ల రసాలు వంటివి వేసవి తాపాన్ని తీర్చుతున్నాయి. అయితే వేసవిలో తాటిముంజలకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి తాపాన్ని అధిగమించేందుకు, వేసవిలో శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు (ఐస్ యాపిల్) విశేష ప్రాచుర్యం పొందాయి. తాటిముంజల సీజన్ ప్రారంభం కావడం, దీనికితోడు భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ముంజలకు డిమాండ్ ఏర్పడింది. కొంత మంది వ్యాపారులు వైఎస్సార్ జిల్లా వేంపల్లె నుంచి తాటిముంజలను రాజంపేటకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తాటిముంజలు శరీరంలో చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగివున్నందున ముంజల విక్రయాలు హాట్ కేకుల్లా సాగుతున్నాయి. ఆరోగ్య ప్రదాయిని.. ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే తాటిముంజలు కల్తీలేని, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయిని అని వైద్యులు కూడా చెబుతున్నారు. ధర ఎక్కువైనా ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డజను నూరు రూపాయిల నుంచి నూట ఇరవై రూపాయిలకు విక్రయిస్తున్నారు. అనేక మంది ఇవి విక్రయించే ప్రాంతంలో వేచివుండి మరీ కొనుగోలు చేస్తున్నారు. లేతగా ఉండే వాటికి గిరాకీ ఎక్కువగా ఉంది. అనేక ప్రయోజనాలు.. ● తాటి ముంజల్లో విటమిన్లు, ఫాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు సోలెబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ● వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవితాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. ● తాటిముంజలు తినడం వల్ల శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ● వేసవిలో ఏటా క్రమం తప్పకుండా తినడం ద్వారా చెడుకొలస్ట్రాల్ తగ్గించి, మంచి కొలస్ట్రాల్ వృద్ది చేస్తుంది. ● వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ● చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమటకాయల్ని నివారిస్తుంది. తాటిముంజల్లో పుష్కలంగా విటమిన్లు భానుడి ప్రతాపంతో హాట్ కేకుల్లా తాటిముంజల విక్రయాలు ఐస్ యాపిల్గా ప్రాచుర్యంవ్యాపారం జోరుగా సాగుతుంది ఎండలు ఎక్కువగా ఉన్నందున తాటిముంజల వ్యాపారం జోరుగా సాగుతోంది. మేము వేంపల్లె నుంచి తాటిముంజలను తీసుకొస్తున్నాము. కొంతమంది తాటిముంజలు ఎప్పుడు వస్తాయా అని వేచివుంటున్నారు. ఖర్చులన్ని పోను ఆశాజనకంగా మిగులుబాటు ఉంది. – శివ, తాటిముంజల వ్యాపారిపోషక విలువలు అధికం వేసవిలో అధికంగా ఎండలు ఉండటం వల్ల మనిషి శరీరంలో నీటిని కోల్పోతాడు. అందువల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. తాటిముంజలు వేసవితాపాన్ని తీర్చడంతో పాటు పోషకాలను అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా తేమ, కార్పోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు వంటి పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. – డాక్టర్ పాలనేని వెంకటనాగేశ్వరరాజు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి రాజంపేట -
అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు
కలకడ : దేవునికి చందా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఓ మహిళను అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దేవులపల్లె పంచాయతీ బొజ్జగుంటపల్లె వడ్డిపల్లెకు చెందిన రమణప్రసాద్ గుడికి చందాలు వసూలు చేయగా అదే గ్రామానికి చెందిన డేరింగుల చంద్రయ్య, చంద్రయ్య భార్య లక్ష్మిదేవిలు చందా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి దుర్భాషలాడి లక్ష్మిదేవిపై దాడిచేశాడు. ఆదివారం బాధితురాలు లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు ఢీకొని ఇద్దరికి గాయాలుకలకడ : ద్విచక్రవాహనంను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ టౌన్కు చెందిన ఉమ్మర్ అతని భార్య నదియలు వారి ద్విచక్రవాహనంలో కలకడ వైపు నుంచి రాయచోటివైపు వెళుతుండగా.. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కలకడ ఇందిరమ్మ కాలనీ వద్ద పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఉమ్మర్, నదియలను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యువకులకు గాయాలు పెద్దతిప్పసముద్రం : పొట్టకూటి కోసం దినసరి కూలి పని కోసం వెళుతున్న ఇద్దరు యువకులను బొలేరో వాహనం ఢీ కొనడంతో గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కందుకూ రుకు చెందిన షాన్వాజ్ (18), జాఫర్ (21)లు పొట్టకూటి కోసం వెల్డింగ్ చేయడానికి సరిహద్దు కర్నాటక రాష్ట్రం ఊదోళ్ళపల్లికి ద్విచక్ర వాహనంలో ఆదివారం బయలు దేరారు. ఈ నేపథ్యంలో మండలంలోని కుక్కలపల్లి సమీపంలో ఓ బొలేరో వాహనం ఎదురుగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో జాఫర్కు స్వల్పగాయాలు కాగా షాన్వా జ్ అనే మరో యువకుడి కాలు విరిగింది. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా బి.కొత్తకోట సీహెచ్సీలో ప్రథమ చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన షాన్వాజ్ను మె రుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసు పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కారుఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలు మదనపల్లె : కారు ఢీకొని యువకుడు గాయపడిన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. మదనపల్లె పట్టణం కురవంక ప్రాంతానికి చెందిన సుధాకర్ కుమారుడు హర్ష (24) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో వెళుతుండగా విశ్వం కాలేజీ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో హర్ష గాయపడగా గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ముదివేడు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బాబు బర్త్డే వేడుకలో మారని తమ్ముళ్ల తీరు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు టీడీపీలో వర్గపోరు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలలో కూడా స్పష్టంగా కనిపించింది. పట్టణంలోని మాజీ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు పార్టీ కార్యాలయం, రాఘవరాజపురంలోని ప్రస్తుత టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి పార్టీ కార్యాలయంలో బాబు పుట్టిన రోజు వేడుకలు జరిపారు. వారం క్రితం రాఘవరాజపురంలోని రూపానందరెడ్డి కార్యాలయం వద్ద మంత్రి జనార్దన్ సమక్షంలో జరిగిన ఇరువర్గాల బాహాబాహి రచ్చ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రస్తుత ఇన్చార్జ్ ఒంటెద్దు పోకడలతో నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని పలువురు నాయకులు ఆరోపించారు. అలాగే రూపానందరెడ్డి పార్టీ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేసి రెండు గంటల పాటు రోడ్డున పడి రభస సృషించారు. దీంతో మంత్రి సైతం బయటకు రాకుండా కార్యాలయం లోపలే ఉండి పోయిన విషయం తెలిసిందే. తాజాగా కోడూరులో వర్గపోరు బాబు జన్మదిన వేడుకలలో కనిపించింది. ముక్కా రూపానందరెడ్డి కార్యాలయంలో ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, కట్టాబాలాజీ, గుండయ్యనాయుడు, తాతంశెట్టి నాగేంద్ర, గునిపాటి రాయుడు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే కస్తూరి కార్యాలయంలో మాచినేని విశ్వేశ్వరరావు, మాజీ టీడీపీ అభ్యర్థులు అజయ్బాబు, నరసింహప్రసాద్, జనసేన టికెట్ ఆశించి భంగపడిన మనమల భాస్కర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారీగా సభ ఏర్పాటు చేశారు. దీంతో బల నిరూపణ చేసినట్లయింది. నియోజకవర్గంలో కుటుంబ పాలన చేస్తూ నిజమైన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరగలేదంటూ పలువురు ఆక్రోశం వెలిబుచ్చడం గమనార్హం. ఎవరికి వారు.. రెండు వర్గాలు కేక్ కటింగ్ కార్యకర్తలలో అయోమయం -
గాలి, వాన బీభత్సం
కలికిరి: గాలి, వాన సృష్టించిన బీఽభత్సంతో రైతులక నష్టం వాటిల్లింది. ఆదివారం మండల పరిధిలో పెనుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి మామిడికాయలు నేలరాలగా, టమాట పంట దెబ్బతింది. బొప్పాయి తోటల్లో చెట్లు విరిగిపడ్డాయి. మరి కొన్ని చోట్ల వరి పంట నేలకొరిగింది. అసలే ధరలు లేక ఇబ్బంది పడుతున్న టమాట రైతులు పంట దెబ్బతినడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు పీలేరు రూరల్: మండలంలో గాలి, వాన భీభత్సంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదివారం పీలేరు పట్టణంలోని బోయపాళెం వీధిలో, నగిరిలో, వరంపాటివారిపల్లెలో విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. స్పందించిన ట్రాన్స్కో ఏఈ ఖాదర్ ఇలాహి మరమ్మతులు చేయించి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. పీలేరు పట్టణం మదనపల్లె మార్గంలోని రైల్వే స్టేషన్ వద్ద ఓ చెట్టు విరిగి జాతీయ రహదారిపై పడింది. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 21వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంగమ్మా..కాపాడమ్మా లక్కిరెడ్డిపల్లి: గంగమ్మా.. వర్షాలు కురిపించి.. కరుణించి కాపాడు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మకు ఆదివారం భక్తులు బోనాలు సమర్పించారు.తలనీలాలు అర్పించారు. చుట్టు పక్కల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చిఅమ్మవారిని దర్శించుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనారోగ్య బదిలీకి తాజా సర్టిఫికెట్లు పొందాలి రాయచోటి అర్బన్: అనారోగ్య కారణాలపై బదిలీని కోరుకునే ఉపాధ్యాయులు తాజా సర్టిఫికెట్లను పొందాలని డీఈఓ కె.సుబ్రమణ్యం తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామ రాజు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులు తాజా సర్టిఫికెట్లు పొంది సమర్పించాల్సి ఉంటుందన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యా యుల బదిలీలు జరుగుతున్న దృష్ట్యా ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్లు పొందిన వారు ప్రాధాన్యత కలిగిన వారిగా పరిగణింపబడతారన్నారు. అనారోగ్య కారణాలు చూపుతూ బదిలీకోరే ఉపాధ్యాయులకు ఈనెల 24 నుంచి 26వరకు కడప రిమ్స్లో ఏర్పాటు చేసిన అదనపు డైరెక్టర్లు, వైద్యవిద్య సూపరింటెండెంట్లు ధృవపత్రాలు జారీ చేస్తారన్నారు. శారీరక వైక ల్యం, 80 శాతం కంటే ఎక్కువ దృష్టిలోపం కలిగి ఉన్న, వినికిడి లోపం ఉద్యోగులు తాజా పత్రాలను పొందాల్సి ఉంటుందన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పి డి, క్షయ,టీబీ, కిడ్నీమార్పిడి, డయాలసిస్ చికి త్స పొందుతున్నవారు సర్టిఫికెట్లను పొందాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి చిత్తూరుజిల్లా ఉపా ధ్యాయులు తిరుపతి ఎస్వీఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యాయులు కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి వైద్య ధృవపత్రాలను పొందాలని ఆయన తెలిపారు. -
ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
మదనపల్లె సిటీ: తొమ్మిది నెలలుగా ఊరించిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు ఇచ్చారు. అయితే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయననున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు మెటీరియల్ కోసం బుక్సెంటర్లు, కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అవనిగడ్డ, గుంటూరు, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లలో చేరి వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈసారి డీఎస్సీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1473. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 705 పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రైవేటు పాఠశాల టీచర్లకు కలిసొచ్చిన వేసవి సెలవులు జిల్లాలో చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం.. వేసవి సెలవులు రావడం వారికి కలిసి వచ్చింది. దీంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇది కలిసి వచ్చింది. జిల్లాల వారీగా పోస్టులు వివరాలు: ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 705 ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్, మున్సిపాలిటీ పరిధిలో భర్తీ కానున్నాయి. ఇందులో 407 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు , 298 ఎస్జీటీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1473 టీచరు పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్, మున్సిపాలిటీ పరిధిలో భర్తీ కానున్నాయి. ఇందులో ఎస్జీటీ పోస్టులు 976 కాగా,స్కూల్ అసిస్టెంట్లు 497 పోస్టులు భర్తీ కానున్నాయి. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు... సబెక్టు పోస్టులు 20 నుంచి...మే 15 వరకు.. ఈనెల 20వతేదీ నుంచి మొదలై ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 15 వరకు ఉంటుంది. జూన్ 6 నుంచి జులై 6వతేదీ వరకు సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్టు) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు డీఎస్సీ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూలు, సిలబస నోటిఫికేషన కోసం వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మెటీరియల్ కోసం పరుగులు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 705 పోస్టుల భర్తీకి అవకాశం ఎస్ఏ లాంజ్వేజ్ 34 ఎస్ఏ హింది 18 ఎస్ఏ ఇంగ్లీస్ 81 ఎస్ఏ మ్యాథ్స్ 44 ఎస్ఏ పీఎస్ 30 ఎస్ఏ బీఎస్ 53 ఎస్ఏ సోసియల్ 65 ఎస్పీ పిఈ 82 ఎస్జిటి 298 మొత్తం 705 -
పేరుకే లైనింగ్ పనులు
జిల్లాలోని పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లె రూరల్, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు రూరల్, పెద్దపంజాణి మండలాల్లో హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ 224.5 కిలోమీటర్ల దూరం సాగుతుంది. ఈ కాలువను రూ.1,217 కోట్లతో వెడల్పు పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ పనులు కూడా మొదలైనా కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసి..ఇవే నిధులు మిగిలాయంటూ రూ.480.22 కోట్లతో ఎన్సీసీ సంస్థకు టెండర్ లేకుండా నామినేషన్పై కట్టబెట్టేసింది. ఈ పనులను మేనెలలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం, అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే ఇంతవరకు జరిగిన పనులు నత్తనే తలపిస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థ కాలువకు ఇరువైపులా లైనింగ్ పనులు చేపట్టి మేనెలలో పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న పనులు నామమాత్రమే. అన్నమయ్య జిల్లా పరిధిలో 13 కిలోమీటర్లు, చిత్తూరుజిల్లా పరిధిలో రెండు కిలోమీటర్ల వరకే లైనింగ్ పనులు జరిగినట్టు అధికారుల లెక్క. ఈ పనులపై సాంకేతిక అధికారులు, క్వాలీటి కంట్రోల్ విభాగం దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనుచూపు మేర కనిపించడం లేదు. -
టీటీడీ బోర్డు దృష్టిసారించాలి
టీటీడీలోకి సౌమ్యనాథాల యం విలీనమయ్యాక ఒంటిమిట్ట రామాలయం తరహాలో అభివృద్ధి చెందుతుందని ఆశించాం. టీటీడీ పాలకమండలి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి. శనివారం రోజున టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. –మేడా విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ, నందలూరు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి గతంలో భక్తులు సహకారంతో ప్రతి శనివారం వివిధ జిల్లాల నుంచి భక్తుల ఆకలి తీర్చేవిధంగా అన్నప్రసాదాలను పంపిణీ చేసేవారము. టీటీడీలోకి విలీనమైన తర్వాత అన్నప్రసాదాలను పంపిణీ చేయడం లేదు. ఈ విషయంపై టీటీడీ తక్షణమే స్పందించాలి. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. –అరిగెల సౌమిత్రి, ఆలయ మాజీ చైర్మన్, నందలూరు -
చెట్టును ఢీకొన్న మారుతీ వ్యాన్
మదనపల్లె/చిన్నమండెం : వేగంగా వస్తున్న మారుతి వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మదనపల్లె మండలంలో ఈ సంఘటన జరిగింది. లక్కిరెడ్డిపల్లె మండలం, చింతకుంటవారిపల్లెకు చెందిన అల్లా బక్షు, జరీనా దంపతుల కుమారుడు ఆరీఫుల్లా (42) అప్పకొండయ్యగారిపల్లె ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేసేవాడు. ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో చేరాడు. చిన్నమండెం మండలం మల్లూరులో ప్రస్తుతం ఉంటున్నాడు. చిన్న మండెంలో దొడ్ల మిల్క్ డైరీ షాప్ నిర్వహిస్తున్న మోదిన్ సాబ్ కుమారుడు ముజాహిద్దీన్ (35)తో కలసి మారుతి ఓమ్ని వ్యాన్లో వ్యక్తిగత పనులపై మదనపల్లెకు వచ్చారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు చిన్నమండెం వెళ్లేందుకు అదే వాహనంలో వాయల్పాడు, గుర్రంకొండ మీదుగా బయలుదేరారు. మార్గమధ్యంలోని మదనపల్లె – తిరుపతి రహదారిలో సీటీఎం గంగమ్మ గుడి ఆలయ సమీపంలో, ఆరీఫుల్లా వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ప్రమాదంలో ఆరీఫుల్లా తీవ్రంగా గాయపడి డ్రైవింగ్ సీట్ లోనే మృతి చెందాడు. పక్కనే ఉన్న ముజాహిద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు గంట సేపటి వరకు 108 వాహనం సంఘటన స్థలానికి రాకపోవడంతో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యమైంది. మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకున్న బాధితుడు ముజాహుద్దీన్కు అత్యవసర చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకువెళ్లారు. ప్రమాద సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దుర్మరణం చెందిన ఆరిఫుల్లా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య ఆస్మా ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. వ్యక్తి దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం -
కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బీసీ విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ జిల్లా నుంచి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివరామ్తోపాటు పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ విభాగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశాలపై బీసీ నేతలు దిశానిర్దేశం చేశారని, తదనుగుణంగా రాబోయే రోజుల్లో జిల్లా బీసీ విభాగం పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే జిల్లా, మండల కమిటీలు పూర్తి చేసి, కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరిగే అన్యాయాలు, టీడీపీ వారు చేసే అక్రమాలను బయటపెడతామన్నారు. -
ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలి
పీలేరు : ప్రభుత్వ వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం భద్రత కల్పించాలని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, కార్యదర్శి డాక్టర్ సుభాష్చంద్రబోస్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సేవకుమార్ కోరారు. శనివారం పీలేరు ఏరియా ఆస్పత్రిని వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ఆసుపత్రుల అనుమతులు, పాత ఆసుపత్రుల అనుమతుల రెన్యువల్ ప్రాసెస్ సులభతరం చేయాలని కోరారు. మిక్సోపతిని ప్రోత్సహించాలని, అల్లోపతి వైద్య విధానంలోకి మిగిలిన వైద్య విధానాలను కలపకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్, పీలేరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ మమతా లక్ష్మి, కార్యదర్శి డాక్టర్ పవన్కుమార్, కోశాధికారి డాక్టర్ ఈశ్వర సురేంద్ర, డాక్టర్ రాజాసాహెబ్, డాక్టర్ శ్రీనివాసగుప్తా, డాక్టర్ నాగవేణి, డాక్టర్ శివయ్య, డాక్టర్ రూపేష్కుమార్రెడ్డి, డాక్టర్ హరి, డాక్టర్ చంద్రశేఖర్నాయక్, డాక్టర్ అలీమ్ పాల్గొన్నారు. -
అక్రమంగా కొండను తవ్వేస్తున్నారు
జమ్మలమడుగు : పశువుల మేత కోసం వదిలిన కొండ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుని పూర్తిగా చదును చేస్తున్నారని , పైగా ఎలాంటి అనుమతులు లేకుండా సోలార్ కంపెనీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆర్డీఓ ఆదిమూలపు సాయిశ్రీకి ఫిర్యాదు చేశారు. శనివారం పెద్దముడియం మండలంలోని కొండ పాపాయపల్లి, దిగువకల్వటాల గ్రామాలకు చెందిన రైతులతో కలిసి ఆర్డీఓను కలిశారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కొండపాపాయపల్లి పంచాయతీ పరిధిలో నాగరెడ్డిపల్లె గ్రామంలోని సర్వే నంబర్ 224లో నంద్యాల, కడప జిల్లా ప్రాంతాలకు చెందిన రైతులు పశువులను మేపుకునేందుకు వస్తుంటారని తెలిపారు. రబీ, ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాంతంలో పూర్తిగా పంటలు వేసుకుంటారన్నారు. పశువుల మేత కోసం అన్ని వర్గాల ప్రజలకు ఈ కొండనే ఆధారంగా నిలిచిందని చెప్పారు. అలాంటి కొండను సోలార్ కంపెనీ కోసం పూర్తిగా చదును చేస్తున్నారన్నారు. కల్వటాల గ్రామానికి చెందిన రైతుల పట్టా భూముల్లో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా పనులు చేసి వదిలేశారన్నారు. వారు వేసిన సిమెంట్ దిమ్మెలను తొలగించాలంటే రైతులకు లక్షల రూపాయలలో ఖర్చు అవుతుందన్నారు. వారికి న్యాయం జరిగే విధంగా అధికారులు సోలార్ కంపెనీ ద్వారా హామీ ఇప్పించాలని కోరారు. అధికారులు ఒకవైపు అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. అక్కడ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయన్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ విష్ణువర్దన్రెడ్డి, కొండపాపాయపల్లె నాయకుడు వెంకటసుబ్బారెడ్డి, కల్వటాల నాయకుడు శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కండక్టర్కు కలాం కార్మిక రత్న అవార్డు
రాజంపేట : ఏపీఎస్ఆర్టీ కండక్టర్ సీఎస్ మణ్యం కలాం కార్మికరత్న అవార్డును దక్కించుకున్నారు. ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా తమిళనాడులోని మధురైలో జేపీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయ్యప్పన్, శ్రీలంక ప్రభుత్వ యువజన సర్వీసుల కమిషనర్ తదితరుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు కండక్టర్ తెలిపారు. అనారోగ్యంతో హోంగార్డు మృతి సుండుపల్లె : మండలంలోని అగ్రహారంలో నివాసం ఉంటున్న గూటి శివకుమార్(36) అనే హోం గార్డు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య నవ్యసుధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాజంపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో శివకుమార్ హోంగార్డు( 498)గా విధులు నిర్వహించే వాడు. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజుల నుంచి సెలవులో ఉన్నాడు. హోంగార్డు శివకుమార్ మృతిపట్ల అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే సుండుపల్లె ఎస్ఐ శ్రీనివాసులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అమరనాథరెడ్డి, రాజంపేట సబ్ డివిజన్ హోంగార్డు ఇన్చార్జి లక్ష్మీరెడ్డి, పోలీసు సిబ్బంది, తిమ్మసముద్రం గ్రామ పంచాయతీ కోడూరువాండ్లపల్లి గ్రామంలో స్వగృహంలో ఉన్న హోంగార్డు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బేకరీని తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు రామసముద్రం : రామసముద్రంలోని ఓ బేకరీని శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం హనీ కేక్ తిని ఐదుగురు చిన్నా రులు అస్వస్థతకు గురైన సంఘటన తెలిసిందే. ఈ మేరకు అన్నమయ్య జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షమీం బాషా తన సిబ్బందితో తనిఖీ నిర్వహించారు. బేకరీ లోని పలు రకాల తినుబండారాలను పరిశీలించారు. పదార్థాల తయారీకి సంబంధించి పరికరాలు, వస్తువుల నాణ్యతను తెలుసుకున్నారు. ఇందులో కొన్ని పదార్థాలను ల్యాబ్ పరిశీలన నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకెళ్లారు. పోలీసుల దాడిలో గాయపడిన వ్యక్తికి తీవ్ర అస్వస్థత సాక్షి, టాస్క్ఫోర్స్ : పెండ్లిమర్రి పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఎస్ఐ దాడి చేయడంతో నాగాయపల్లె గ్రామానికి చెందిన రామఓబుళరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. లాఠీ దెబ్బలు తిని గాయపడిన రామ ఓబుళరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్రే తీయగా పక్కటెముకలు వాపు వచ్చి దెబ్బతిన్నట్లు బాధితుడు తెలిపారు. రిమ్స్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసిన కేసులో రాజీ ప్రయత్నాల కోసం ఎస్ఐ టీడీపీ మండల నాయకులను ఆశ్రయించాడు. టీడీపీ నాయకులు రంగంలోకి దిగి చెన్నూరులో రామఓబుళరెడ్డి బంధువు ఇంటికి వెళ్లి రాజీ ప్రయత్నాల కోసం మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. -
కువైట్లో ఆకేపాటి జన్మదిన వేడుకలు
రాజంపేట : వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాధ్రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కువైట్లో వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కువైట్ ఓమేరియా పార్కులో కేక్ కట్ చేశారు. వందమందికి భోజనాలనుఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, రెడ్డి సంఘం కువైట్ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ గల్ఫ్ అడ్వయిజర్ కమిటీ సభ్యుడు నాయని మహేశ్వరరెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ షేక్ రహ్మతుల్లా, కో–కన్వీనర్ మర్రి కళ్యాణ్, సీనియర్ నేతలు రమణారెడ్డి, నరసింహ యాదవ్, సబ్దార్, లక్కీ అజీజ్, గజ్జల నర్సారెడ్డి తదితరులు హాజరయ్యారు. -
చిరుత మృతిపై అటవీశాఖ వైఖరి సరికాదు
మదనపల్లె సిటీ : అటవీ భూముల్లో చిరుతపులి ఉచ్చులో చిక్కుకుని మరణించిన సంఘటనను అటవీ శాఖ అధికారులు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక అటవీశాఖ కార్యాలయం ఎదుట పొన్నూటిపాలెం గ్రామ రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక రైతులతో కలిసి నిరసన తెలిపారు. అడవి జంతులను వేటాడే వాళ్లతో అటవీ అధికారులకు సత్సబంధాలు ఉన్నాయని ఆరోపించారు. గత పది నెలలుగా చిరుత సంచరిస్తోందని రైతులు చెప్పినా ఏమీ తెలియనట్లు అటవీశాఖ అధికారులు వ్యవహరించారన్నారు. చిరుత చనిపోయిన సంఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమానికి జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్చౌదరి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పొన్నూటిపాలెం రైతులు పాల్గొన్నారు. -
మార్కెట్ కమిటీ పదవి కోసం మల్లగుల్లాలు
రాజంపేట : రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీలకు కేటాయించడంతో, ఆ రిజ్వరేషన్ మార్పుకోసం టీడీపీ ప్రయత్నాలు చేసినట్లుగా కూటమి వర్గాల్లో విస్తృత ప్రచారం నెలకొంది. ఎస్టీలకు మార్కెట్ కుర్చీ దక్కకూడదనే టీడీపీ కమ్మ నేతలు మోకాలడుతున్నారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండల్లాలో ప్రొటోకాల్ కలిగిన స్థానికంగా ఏకై క పోస్టు రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ. తొలిసారిగా మార్కెట్ కమిటీ నియామకాల్లో దళితవర్గానికి (ఎస్టీ)కి రావడంతో ఆ పోస్టును బీజేపీ ఆశిస్తోంది. అయితే ఆశించిన బీజేపీ ఎస్టీనేత మస్తానయ్య ఇటీవల ఆకస్మిక మరణం చెందారు. స్నేహితుడు పోయాడు.. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తన స్నేహితుడు పోతురాజు మస్తానయ్యకు రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు వచ్చేందుకు ప్రయత్నించారు. తనకు అవకాశం కల్పించాలని మంత్రి సత్యను మృతిచెందిన మస్తానయ్య స్వయంగా కలిసి కోరారు. దీంతో ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళదాం, ప్రయత్నం చేద్దామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ మిత్రుడు మరణించిన నేపథ్యంలో ఆ స్థాయిలో ఎస్టీ నేత బీజేపీలో లేకపోవడ గమనార్హం. చైర్మన్, వైస్చైర్మన్ మాకే కావాలంటున్న టీడీపీ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్చైర్మన్ తమకే కావాలని టీడీపీ నేతలు ఊవ్విళ్లూరుతున్నారు. కూటమిలో నామినేటెడ్ పదవుల కేటాయింపులో తమకే అగ్రపీఠమనే భావనలో తమ్ముళ్లు ఉన్నారు. వర్గనేతలు సుగవాసి సుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్రాజు వర్గాలు మార్కెట్ కమిటీకి పోటీపడుతున్నారు. అధిష్టానానికి పలువురు కమ్మ సామాజికవర్గ నేతలు పేర్లు వెళ్లాయి. వీరి మధ్య పోటీ నెలకొనడంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. చైర్మన్కు రిజర్వేషన్ మార్చని క్రమంలో వైస్ చైర్మన్ పోస్టును కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వైస్చైర్మన్పై బలిజ నేతల కన్ను తమ వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న భావనలో ఉన్న జనసేన నాయకుల్లో నియోజకవర్గంలో ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా తమకు రాలేదనే ఆవేదనలో ఉన్నారు. అధికంగా ఈ పార్టీ బలిజ సామాజికవర్గం నుంచి పదవిని ఆశిస్తున్నారు. ఆ పార్టీ రాజంపేట నియోజకవర్గానికి ముఖ్యనేత, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు యల్లటూరు శ్రీనివాసరాజు వైస్చైర్మన్ పదవిని జనసేన పార్టీ కోసం పనిచేసిన నేతకు ఇప్పించాలనే అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే రైల్వేకోడూరులో చైర్మన్ పదవి జనసేనకు ఇవ్వడంతో, రాజంపేటలో వైస్చైర్మన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ కమిటీ నియమాకం విషయంలో కూటమిలో మల్లగుల్లాలు పడుతుండటంతో అధిష్టానం నియామకం నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్టీకి చైర్మన్ పదవిపై పెదవి విరుపు రిజర్వేషన్ మార్పునకు టీడీపీ యత్నం చైర్మన్ పదవి కోసం పలువురు పోటీ -
● ఏ పండ్లకు వాడవచ్చు..
● జామలో థైవాన్ గోవా పిందె ఏర్పడిన 20–25 రోజుల తర్వాత ఒక్కొక్క పిందెకు ఒక్కొక్క తెల్ల రంగు సంచి వాడాలి. 60 రోజు తర్వాత కాయలను కోయవచ్చు. ● దానిమ్మలో పిందె ఏర్పడ్డాక.. ఒక్కొక్క పిందెకు ఒక్కో తెల్లరంగు సంచి వాడాలి. 90 రోజుల తర్వాత కాయలను కోయాలి. ● ద్రాక్షలో గుత్తులు ఏర్పడిన 60 రోజుల తర్వాత ఒక్కో గుత్తికి ఒక్కో తెల్లరంగు సంచి వినియోగించాలి. 50 రోజుల తర్వాత గుత్తులను కోసుకోవాలి. పురుగుల నుంచి రక్షణ: ఫ్రూట్ కవర్ వినియోగంతో మంగు, మచ్చలు, మంచుపురుగు, ముడ్డిపుచ్చు, టెంక పురుగు, మకరం, ఈగలు మొదలగు వాటిని నియంత్రించి నాణ్యమైన పండ్ల దిగుబడికి తోడ్పడుతుంది. పిందె దశలో అంటే నిమ్మకాయ, కోడిగుడ్డు పరిమాణంలో ఉన్నపుడు వాడాలి. మంచి పలక పిందెలను సంచిలో పెట్టి 3 సెంటీమీటర్ల పైన తొడిమకు, సంచికి ఉండే తీగను గాలి చొరబడకుండా కట్టాలి. -
దెబ్బతిన్న అరటి పంట పరిశీలన
సిద్దవటం: మండలం లోని మాచుపల్లె గ్రామంలో శుక్రవారం సాయంత్రం వీచిన గాలులకు దెబ్బతిన్న అరటి పంటను శనివారం ఉద్యాన శాఖ అధికారి జయభరత్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచుపల్లె గ్రామానికి చెందిన రైతు పైనేని సుబ్బరాయుడు 3 ఎకరాల్లో అరటి పంటను సాగుచేశారన్నారు. గాలులకు తోట దెబతిందని తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులకు వైద్య శిబిరం కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో ఉపాధ్యాయులకు ఈ నెల 24 నుంచి 26 వరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల అన్ని క్యాటగిరీల ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు అనగా ప్రిఫరెన్సియల్ క్యాటగిరి స్పెషల్ పాయింట్లకు అర్హత కలిగిన వారు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. హాస్పిటల్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ మేరకు ప్రిఫరెన్సియల్, స్పెషల్ పాయింట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు రిమ్స్లో వైద్య ధ్రువీకరణ పత్రాలు పొందడానికి తాజా మెడికల్ రిపోర్టులు తీసుకుని రావాలని వివరించారు. బాధ్యతలు స్వీకరణ కడప కోటిరెడ్డి సర్కిల్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన నియమితులయ్యారు. శనివారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హిదాయతుల్లా మాట్లాడుతూ మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు వంటి అన్ని మైనారిటీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న మైనారిటీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన వ్యక్తులకు చేరుస్తామని తెలిపారు. సంబంధీకులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని వివరించారు. -
ఎలక్ట్రానిక్ వ్యర్థాల తొలగింపుపై అవగాహన
రాయచోటి: ఎలక్ట్రానిక్ వ్యర్థాల శాసీ్త్రయ తొలగింపుపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, ఎన్హెచ్జీ గ్రూపుల ద్వారా ఈ వ్యర్థాల సేకరణ జరుగుతుందని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రాయచోటి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాసీ్త్రయంగా తొలగించడం అనే కార్యక్రమౖంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ప్రతి నెల మూడో శని వారం స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యర్థాల తొలగింపులో రెడ్యూస్, రీయూన్, రీసైకిల్ అనే ఆర్ఆర్ఆర్ సిద్ధాతాన్ని ప్రజలందరూ అవలంబించుకోవాలన్నారు. జిల్లాలోని 04 మున్సిపాల్టీలు, పెద్ద పంచాయతీల్లో ప్రతిరోజూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ జరుగుతుందన్నారు. మిగిలిన పంచాయతీలలో వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ జరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల రీసైక్లింగ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చన్నారు. రాయచోటి మున్సిపాల్టీ ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రంలో నేడు 170 కిలోల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించారన్నారు. వీటిని ప్రైవేటు కంపెనీలకు అందించి రీసైకిలింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి మున్సిపల్ కమీషనర్ వాసు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
కవరు కట్టు.. లాభాలు పట్టు
రాయచోటి జగదాంబసెంటర్: పండ్లలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం, తద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పండ్ల తోటలు విస్తృతంగా సాగవుతున్నాయి. వీటిలో చెక్కగుజ్జుతో తయారైన పేపరు సంచులను వినియోగించడం ద్వారా నాణ్యమైన ఫలసాయం పొందే వీలుంది. పేపరు సంచులను కాయలకు గాలి చొరబడకుండా కడితే వంద శాతం నాణ్యతను పెంపొందించుకున్నట్లే. అన్నమయ్య జిల్లాలో మామిడి తోటలు దాదాపు 33 వేల హెక్టార్లలో సాగు కాగా.. వీటిలో దిగుబడి 30 నుంచి 40 శాతం మాత్రమే వచ్చాయి. ప్రస్త్తుం మామిడి చెట్లు కాయలతో ఉన్నాయి. ఈ పేపరు సంచుల ద్వారా పండించిన పండ్లు విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో ఉంటాయని చెబుతున్నారు. గతేడాది అనేక మంది రైతులు ఫ్రూట్ కవర్లు వినియోగించి మామిడిలో నాణ్యత పెంచుకొని అధిక ధరలు పొందటం విశేషం. అధిక ఉష్ణోగ్రతలతో రాలిన పూత, పిందె గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు మామిడిపై తీవ్ర దుష్ప్రభావం చూపాయి. మొదట్లో పూత, పిందె బాగున్నా.. అధిక ఉష్ణోగ్రతలు మామిడి రైతుల ఆశలను రాల్చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల రైతుల కళ్ల ముందే 60–70 శాతం పూత, పిందె రాలిపోయాయి. ఈ పరిస్థితుల్లో అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులను కాపాడుకోవడంతోపాటు నాణ్యను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం ఫ్రూట్ కవర్ల వినియోగం ఊరటనిచ్చింది. కాయలు తాజాగా ఉంటాయి మామిడికాయలకు కవర్లు తొడగడం వల్ల తాజాగా ఉంటాయి. దానికితోడు ఎటువంటి రోగాలు కూడా దరి చేరవు. నాకు గల 5 ఎకరాల మామిడి తోటలో కొన్ని చోట్ల ఫ్రూట్ కవర్లను తొడిగాను. ఈ సారి అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత, పిందె రాలిపోయాయి. దీంతో అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులను కాపాడుకోవడానికి ఫ్రూట్ కవర్లు తోడ్పడుతాయనే ఆశ ఉంది. – మండ్ల శివశ్రీనివాసులు, మామిడి రైతు, రాయచోటి మండలం గిరాకీ బాగుంటుంది మామిడి కాయలకు ఫ్రూట్ కవర్లు వేయడం వల్ల.. ఎటువంటి రోగాలు దరిచేరవు. ఇలాంటి పండ్లకు మార్కెట్లో అధిక ధరలు కూడా ఉన్నాయి. కొనుగోలుదారులు నేరుగా తోటల వద్దకు వచ్చి మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దానికితోడు ఇలాంటి పండ్లకు ధరలు కూడా బాగుంటాయని ఆశిస్తున్నా. – ఎం.వీరపవన్మహేష్, రైతు, కుర్నూతల, లక్కిరెడ్డిపల్లె మండలం చీడపీడలు దరి చేరవు ఫ్రూట్ కవర్లను మామిడి సహా వివిధ పండ్ల సాగులో వినియోగించవచ్చు. వీటి వల్ల వంద శాతం నాణ్యత ఉంటుంది. గాలి చొరబడకుండా కడితే ఎలాంటి చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన కాయలు పండించుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో నాణ్యత ఉంటుంది. మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ తదితరాలకు ఎంతో ఉపయోగం. – వనితాబాయి, ఉద్యాన శాఖ అధికారిణి, రాయచోటి పెరుగుతున్న ఫ్రూట్ కవర్ల వినియోగం వంద శాతం నాణ్యత పెంచేందుకు అవకాశం మామిడి, దానిమ్మ, జామ,డ్రాగన్ఫ్రూట్స్కు అనుకూలం -
దేవదాయ లీజులపై క్షేత్రస్థాయి పరిశీలన
బి.కొత్తకోట: ‘దేవదాయ వేలం పాటలు పారదర్శకంగా జరిగేనా’,(ఈనెల 10న), ‘చెన్నకేశవా నీ భూములు గోవిందా’(నవంబర్ 26న ) శుక్రవారం ప్రచురితమైన ‘ఆలయంలోకి మురికినీరు’శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన కథనాలపై స్పందించిన దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాఽథ్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. స్థానిక గ్రామదేవత గంగమ్మ ఆలయానికి చెందిన వాణిజ్య గదులు, మాన్యం భూమిలో స్థలాల లీజుపై నిబంధనలు పాటించడం లేదని సాక్షిలో ప్రచురితమైన కథనంతో ప్రజలు ఈనెల 10న నిర్వహించిన వేలాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై విశ్వనాఽథ్ ఇక్కడి సమస్యలను పరిశీలించారు. వాణిజ్య గదులను పరిశీలించాక మాన్యం భూమిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకుంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు లేనిపక్షంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంజనేయస్వామి ఆలయ మాన్యం భూమిలో అను మతి లేకుండా పెట్టుకున్న బంకులను తొలగించాలని నిర్వహకులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ మొహమ్మద్ అజారుద్దీన్ను కలిశారు. సాక్షిలో ప్రచురితమైన చెన్నకేశవా నీ భూములు గోవిందా శీర్షిక ప్రచురితమైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన భూములను వెంకటేశ్వరస్వామి ఆలయం పేరిట నమోదు చేశారని, దీన్ని మార్పు చేయాలని కోరగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. తర్వాత దిగువబస్టాండ్లోని పురాతన చెన్నకేశవ స్వామి ఆలయంలో చేరిన వర్షపునీటిని పరిశీలించారు. ఆలయం దిగువన ఉండటంతో పైనుంచి వర్షపునీళ్లు, మురికినీరు ఆలయంలోకి ప్రవహిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనాలను పరిశీలించి వాటి పరిష్కారం కోసం బి.కొత్తకోటలో పర్యటించినట్టు చెప్పారు. గ్రామదేవత ఆలయ మాన్యం భూమిని వినియోగించుకుంటున్న వ్యక్తులను అక్కడినుంచి ఖాళీ చేయాలని ఆదేశించామన్నారు. వాణిజ్య గదుల విషయంలో ప్రస్తుతం ఉన్న లీజు విధానాన్ని మార్పు చేసి 11 ఏళ్లు లీజు ఇచ్చేలా, ప్రతిఏటా అద్దె పెంచేలా కమీషనర్కు ప్రతిపాదనలు పంపుతున్నట్టు చెప్పారు. మాన్యం భూమిలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేలా వేలం నిర్వహించి స్థలాలను అప్పగిస్తామన్నారు. చెన్నకేశవ ఆలయం జీర్ణోద్ధరణ కోసం సాంకేతిక అధికారులను పంపి.. ప్రతిపాదనలు కమిషనర్కు నివేదించి నిధుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూముల్లో ఇసుకను అక్రమంగా తరలించకుంటున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈవో మునిరాజకు కమీషనర్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు చెప్పారు. ఇందులో ఒక ఇంక్రిమెంటును ఎందుకు కట్ చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటిసులో కమిషనర్ కోరినట్టు చెప్పారు. ఈవో మునిరాజుకు షోకాజ్ నోటీసు -
మిథున్ను ఎదుర్కోలేక కుట్రలు!
బి.కొత్తకోట: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎంపీ మిథున్రెడ్డి విజయ పరంపరకు బ్రేక్ వేయాలని శత విధాలా ప్రయత్నించిన కూటమి నేతలు హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేకపోయారు. 2014 నుంచి హేమాహేమీలను ఓడించిన మిథున్రెడ్డిని నిలువరించి రాజంపేటలో పాగా వేయలేమని తేలడంతో వేధింపులతో బలహీనపర్చాలన్న కుట్రలను ప్రభుత్వ పెద్దలు తెరపైకి తెస్తున్నారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ప్రమాదంలో ఫైళ్లు కాలిపోతే వారు చేసిన అర్భాటం అంతా ఇంత కాదు. చివరకు పాలిగ్రాఫ్ పరీక్షల్లో ఆరోపణలు నిజంకాదని తేలిపోవడం వారికి మింగుడు పడలేదు. మదనపల్లె ఫైల్స్ వ్యవహారంతుస్సుమనడంతో ఇప్పుడు మద్యం కుంభకోణం అంటూ కొత్త ఆరోపణలను ముందుకు తెచ్చారు. ఈ ఆరోపణలతో రాజకీయంగా బలహీనపర్చాలన్న కుతంత్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి హవా కొనసాగినా రాజంపేట పార్లమెంట్ పరిఽధిలో కూటమి చతికిలపడటం ఆ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అధికారంలో ఉన్నాం కాబట్టి అప్రతిష్టకు గురిచేస్తే రాజకీయంగా లాభపడొచ్చన్న అంచనాతో కుయుక్తులతో ప్రభుత్వస్థాయిలో మిథున్రెడ్డిపై కుట్రలు పన్నుతున్నారు. ● కూటమి హవాలోనూ రాజంపేట ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలను కోల్పోవడం వెనుక మిథున్రెడ్డి మంత్రాగమే పనిచేసిందని కూటమి నేతలు మథనపడుతున్నారు. ఇప్పటికే మూడు ఎన్నికల్లో పెద్ద నేతలనే బరిలోకి దింపినా ఓటమి తప్పలేదు. అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ వాడేయడం, అవి విఫలం కావడంతో వీరికి మించిన సమర్థులు వచ్చేఎన్నికల్లో లభించడం కష్టమే. దొరికినా మిథున్రెడ్డితో తలపడి గెలవడం అంటే ఆషామాషీ కాదు. అయినప్పటికి ఏదో సాధిస్తామన్న ఆశతో తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలతో మిథున్రెడ్డిని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ● 2014 ఎన్నికల్లో మిథున్రెడ్డి తొలిసారిగా వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసింది పురందేశ్వరితో. టీడీపీ, జనసేనతో ఉన్న పోత్తుతో మూడు పార్టీల అభ్యర్థిగా బీజేపీ తరపున బరిలో నిలిచారు. అయినప్పటికీ మిథున్రెడ్డి రాజకీయ వ్యూహం, పట్టుదల, ప్రజాభిమానం ముందు మాజీ సీఎం కుమార్తె పురందేశ్వరి ఓటమిపాలవ్వక తప్పలేదు. తొలి విజయంలో 1,74,762 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. ఈ విజయంతోనే మిథున్రెడ్డికి ఉన్న ప్రజాదరణ స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో చిత్తూరుకు చెందిన ప్రముఖ నేత డీకే ఆదికేశవులు సతీమణీ డీకే సత్యప్రభ టీడీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవగా మిథున్రెడ్డి ఆమెను భారీ మెజార్టీతో ఓడించారు. ఊహించని విధంగా 2,68,284 ఓట్ల మెజార్టీ సాధించారు. మాజీ సీఎంకు తప్పని ఓటమి 2024 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి మూడు పార్టీల కూటమి రాజంపేట ఎంపీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కిరణ్ నామినేషన్కు ముందు పలుమార్లు సర్వేలు చేయించుకుని బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో గెలవాలని వ్యక్తిగత ఆరోపణలను తెరపైకి తెచ్చారు. అవినీతి, అక్రమాలంటూ సభల్లో ఏకరువు పెట్టారు. చివరకు సొంత నియోజకవర్గం పీలేరులో తమ్ముడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిశోర్కుమార్రెడ్డికి వచ్చిన మెజార్టీలో మూడోవంతులో ఒక వంతు కూడా దక్కలేదు. ఎమ్మెల్యే అభ్యర్థికి 25,081 ఓట్ల మెజార్టీ లభిస్తే..అన్న కిరణ్కు వచ్చిన మెజార్టీ 6,988 ఓట్లు. ● కూటమి హావాలో రాజంపేట పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్సీపీ మూడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంది. తంబళ్లపల్లె,పుంగనూరు, రాజంపేట ఎమ్మెల్యేలుగా పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి 10,103, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,095, ఆకేపాటి అమరనాఽథరెడ్డి 7,016 ఓట్లతో గెలుపొందారు. రాయచోటిలో విజయం తృటిలో తప్పింది.కేవలం 2,495 ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలిచింది. అయినప్పటికీ ఇక్కడ వైఎస్సార్సీపీకి అదరణ తగ్గలేదని నిరూపణైంది. మూడు పార్టీలు ఏకమైనా ప్రత్యర్థికి తప్పని పరాభవం రాజంపేట హ్యాట్రిక్గా నిలవడం జీర్ణించుకోవడం లేదు తుస్సుమన్న మదనపల్లె ఫైల్స్..ఆపై తెరపైకి లిక్కర్ స్కామ్ ఆరోపణలు -
అప్పులిచ్చిన వారికి ఐపీ నోటీసులు
ఎర్రగుంట్ల(జమ్మలమడుగు) : ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో ఓ వ్యాపారస్థుడు ఐపీ పెట్టడంతో అప్పులు ఇచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాపారులు ఉన్నట్లుండి ఐపీ నోటీసులకు కోర్టు ద్వారా పంపించడంతో బాధితులందరూ శుక్రవారం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్కు చేరి తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల ముందు వాపోయారు. చిలంకూరు గ్రామంలో నమ్మకంగా ఉన్న వ్యాపారస్థుడు ప్రజల వద్ద నుంచి అధిక వడ్డీకి దాదాపు మూడు కోట్లకుపైగా అప్పుగా తీసుకున్నాడు. దానిని చెల్లించలేని పరిస్థితి అప్పులు ఇచ్చిన వారికి కోర్టు ద్వారా ఐపీ నోటీసులు ఇవ్వడంతో బాధితులు ఒక్కసారిగా అవాకై ్కపోతున్నారు.గుర్తు తెలియని వ్యక్తి మృతిబద్వేలు అర్బన్ : పట్టణంలోని సిద్దవటం రోడ్డులోని లైఫ్స్టైల్ రెడీమేడ్స్ పక్క సందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ పంచనామా నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతుడు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లైతే అర్బన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.కారు ప్రమాదంలో యువకుడు మృతి – ముగ్గురికి తీవ్ర గాయాలుసింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురం సమీపంలోని నిడివెల్ల గ్రా మం వద్ద గురువారం రా త్రి జరిగిన కారు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రవికుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా సింహాద్రిపురం మండలం నిడివెల్ల గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడిందన్నారు. ప్రమాదంలో యువకుడు వెంకటసాయి మృతి చెందగా, మణిదీప్, శివచంద్ర, వేణులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించామన్నారు. గాయపడ్డ వేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.లారీని ఆపబోయి కారు డ్రైవర్కు గాయాలుకొండాపురం : మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామ సమీపంలోని తాడిపత్రి– ముద్దనూరు ఎన్హెచ్–67 రోడ్డుపై శుక్రవారం కొండాపురం గ్రామానికి బోడోల్ల పెద్దన్న ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ కంటైనర్ ఢీ కొని వెళ్లిపోతోంది. దీనిని వెనుక వస్తున్న కారు డ్రైవర్ గమనించి లారీని ఆపడం కోసం ప్రయత్నించి గాయలపాలయ్యాడు. కడప వైపు నుంచి తాడిపత్రి వైపునకు వెళ్తున్న కారు డ్రైవర్ పసుపులేటి రమణరెడ్డి లారీ కంటైనర్ ఆపడానికి ప్రయత్నించగా పి. అనంతపురం సమీపలోని కణం వద్ద ఉన్న ఎస్సీ కాలనీ దగ్గర కారును లారీ కంటైనర్ ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జెడ్పీ చైర్మన్లకు గన్మెన్లను తొలగించడం దారుణం
వేంపల్లె : రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ చైర్మన్లకు గన్మెన్లను తొలగించడం దారుణమని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లెలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవక తాగునీటి సమస్య అధికంగా ఉందని, వచ్చే జెడ్పీ నిధులతో ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మే 8న జెడ్పీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్తో చర్చించి మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇవ్వనున్నామని, గత సమావేశాలలో కూటమి ఎమ్మెల్యేలు హాజరై జిల్లాలోని అనేక సమస్యలపై చర్చించకుండా గైర్హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల తదితర మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.16కోట్లను వేసవికాలంలో తాగునీటికి వినియోగిస్తామని తెలిపారు. ఇప్పటికే వివిధ రకాల పనులకు సంబంధించి రూ.6.కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, మాజీ మైనింగ్ డైరెక్టర్ వీర ప్రతాపరెడ్డి, వైఎస్సార్సీఫీ నాయకులు భరత్ కుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎం. రామగోవిందరెడ్డి -
నాటుసారా తయారు చేస్తే చర్యలు
పెద్దమండ్యం : తండాల్లో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు హెచ్చరించారు. మండలంలోని ముసలికుంట పంచాయతీ దామ్లానాయక్తండాలో శుక్రవారం నాటుసారా తయారీ, విక్రయాలపై అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఓ పాడుబడిన ఇంటిలో నిలువ ఉన్న నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు ఎవరనేది విచారిస్తున్నట్లు చెప్పారు. అలాగే తండాలో మరో వ్యక్తి వద్ద ఉన్న 5 లీటర్ల నాటుసారా, 5 కేజిల బెల్లం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం తండా వాసులతో ఆయన మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. సారాను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. నాటుసారా తయారీ, విక్రయాలతో జరుగుతున్న అనర్థాల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేషన్ రుణాలు, ఇండస్ట్రియల్ ద్వారా అందిస్తున్న రుణాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ మాధవి, సిబ్బంది పాల్గొన్నారు. -
సీపీఎంతో నారాయణరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు
కడప సెవెన్రోడ్స్ : తమ పార్టీతో బి.నారాయణరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, 2023 నుంచి ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శుక్రవారం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తమ పార్టీ జిల్లా కమిటీ తీర్మానాన్ని వివరించారు. ఈనెల 3, 18 తేదీల్లో నారాయణరెడ్డి , ఆయన కుటుంబ సభ్యుల భూ కబ్జాలపై పత్రికల్లో కథనాలు ప్రచురించారని, అయితే తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేన్నారు. సీపీఎం పద్ధతులకు భిన్నంగా వ్యవహారించిన తమ పార్టీ జిల్లా కార్యదర్శులను, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులను, జిల్లా కమిటీ సభ్యులను, పూర్తి కాలపు కార్యకర్తలను బహిష్కరించిన ఉదంతాలు గతంలో చాలా ఉన్నాయని పేర్కొన్నారు. చెమ్ముమియాపేట గ్రామ సర్వే నెంబరు 344లోని స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీలో 2017లో తమ పార్టీ విజ్ఞప్తి మేరకు సుందరయ్య స్మారక కేంద్రం లైబ్రరీకి కేటాయిస్తూ తీర్మానం చేశారని పేర్కొన్నారు. సదరు స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఈ విషయాన్ని ఈనెల 2వ తేది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చామన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల ఆ స్థలంలో కార్పొరేషన్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. భగత్సింగ్ కాలనీలోని కమ్యూనిటీ స్థలాన్ని అధికారులు, స్థానిక ప్రజల అభీష్టం మేరకు కమ్యూనిటీ లైబ్రరీగా మార్చాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. నారాయణరెడ్డికిగానీ, వారి కుటుంబ సభ్యులకుగానీ పట్టా ఎలా వచ్చిందో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణరెడ్డి భూ కబ్జాలపై ఏవైనా కథనాలు రాసేవారు తమ పార్టీ పేరు ఉపయోగించరాదని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్, ఎ.రామ్మోహన్, వి.అన్వేష్తోపాటు దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ -
బీజేపీవి కక్ష సాధింపు చర్యలు
రాజంపేట రూరల్ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై రాజకీయ కుట్రలో భాగంగా బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు అత్తింజేరీ శ్రీనాథ్ ఆరోపించారు. స్థానిక ఆర్అండ్బీలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేక ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను సొంత ఏజీన్సీలుగా వాడుకొంటూ అక్రమ కేసులు నమోదు చేయిస్తోందని మండిపడ్డారు. దేశంలో బీజేపీ చేస్తున్న అరచకాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ గొంతు నొక్కాలని కుట్రలు చేయటం సబబు కాదని హితబోధ చేశారు. మనీనే లేని కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆరోపణలు చేయటం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ చేస్తున్న నీచ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మీద చార్జీ షీట్ వేయటం కాదు ప్రజలే బీజేపీ మీద చార్జీషీట్ వేసే రోజులు దగ్గరపడ్డాయని గుర్తు చేశారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి లింగం నాగేశ్వరరావు, డీసీసీఅ ధికార ప్రతినిధి అహమ్మద్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు అత్తింజేరీ శ్రీనాథ్ -
● వేధిస్తున్న పశుగ్రాసం కొరత
గుర్రంకొండ: జిల్లాలో పాడిరైతులకు అవసరమైన గడ్డికి గడ్డుకాలం వచ్చిపడింది. ప్రస్తుతం పాడి ఆవులకు గడ్డి దొరకడం కష్టంగా మారింది.భగ్గుమంటున్న గడ్డి ధరలు పాడిరైతులుకు మోయలేని భారంగా మారింది. ప్రస్తుతం వరిగడ్డి కిలో రూ.8 నుంచి రూ.12 వరకు ధరలు పలుకుతున్నాయి. వేరుశనగ పొట్టు లోడు రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు ధర ఉంది.దీంతో పశుగ్రాసానికి డిమాండ్ ఏర్పడింది. జిల్లాలో పాడిపశువులకు ప్రతి రోజు 7,128 టన్నుల గడ్డి అవసరం ఉంది. పాలపై వచ్చే ఆదాయం సగభాగం పశుగ్రాసం కొనడానికే సరిపోతోంది. దీంతో పాడిరైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గడ్డి కోసం రోజుకు రూ.8.52 కోట్ల ఖర్చు జిల్లాలో పాడిరైతులు పశుగ్రాసం కోసం ప్రతిరోజు రూ. 8.52 కోట్ల మేరకు ఖరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కిలో ఎండుగడ్టి ప్రస్తుతం రూ. 8 నుంచి రూ.10 వరకు ధరలు పలుకుతున్నాయి. గతంలో ట్రాక్టర్లు, లారీల్లో లోడ్ల కింద జమకట్టి గడ్డిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం రోల్స్ రూపంలో ఎండుగట్టిని బయట ప్రాంతాలనుంచి వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒకరోల్ లో 25కిలోల మేరకు గడ్డి ఉంటుంది. ప్రస్తుతం ఒకరోల్ ధర రూ. 180 నుంచి రూ.200 వరకు ధరలు పలుకుతున్నాయి. దీనికితోడు మొక్కజొన్న,జొన్న పచ్చిగడ్డి, ఉలవపొట్టు, వేరుశనగ పొట్టును పాడిరైతులు కొనుగోలు చేస్తున్నారు. అన్ని కలుపుకుంటే ఒక రోజుకు పాడిఆవుకు రూ. 100 నుంచి రూ.150 వరకు పశుగ్రాసం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు. ఫీడు, ఇతరత్రా మందుల ఖర్చు కలుపుకొంటే పశుపోషణ తడిసిమోపెడవుతోందని చెబుతున్నారు. భారంగా మారిన పశపోషణ రోజురోజుకు పశుపోషణ భారంగా మారుతోందని పాడిరైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు డిమాండ్ ఏర్పడడంతో వైఎస్సార్ జిల్లా నుంచి ప్రతిరోజు ఎండుగడ్డిని దిగుమతి చేసుకుంటున్నారు. పచ్చిగడ్డికి తోడు వరిగడ్డిని వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని పాడిరైతుల నమ్మకం. దీంతో పచ్చిగడ్డి ఉన్నా ఎండు వరిగడ్డి, వేరుశనగ పొట్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. నెలరోజుల క్రితం కిలో ఎండు వరిగడ్డి రూ. 5 ఉండేది. ప్రస్తుతం దళారులు ధరలు విపరీతంగా పెంచేసి రూ. 8 నుంచి రూ.10 వరకు పాడిరైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. రెండున్నర సెంట్ల పొలంలో ఉన్న మొక్కజొన్నలు రూ. 2వేలకు, జొన్నలు రూ.1000, వేరుశనగ పొట్టు లోడు రు.25 వేల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పాడిరైతులకు చేయూత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో పాడిరైతులకు చేయూత నిచ్చి ఆదుకొంది. గతంలో గడ్డికొరత ఏర్పడిన సమయంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఎండుగడ్డిని అందించింది.పాడిరైతులకు 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకు గడ్డిని పెంచుకొనేలా చర్యలు తీసుకుంది. పశువైద్యకేంద్రాల ద్వారా పాడిరైతులకు సబ్సిడీపై దాణా అందించారు. రైతుభరోసాకేంద్రాల ద్వారా పాడిరైతులకు సబ్సీడీపై పచ్చరొట విత్తనాలను సరఫరా చేసి పశుగ్రాసం కొరత రానీయకుండా తగు చర్యలు చేపట్టింది.దీంతో పాడిరైతులు ఎన్నడూ గడ్డికోసం కష్టాలు పడలేదు. గత ఐదేళ్లు పాడిఆవులకు గడ్డి కొరత రాలేదు. ఎక్కడ చూసినా పుష్కలంగా గడ్డి లభించేది. ప్రస్తుతం వర్షాలు సక్రమంగా కురవలేదు. దీంతో చెరువులు, బావుల్లో చక్కునీరు కనిపించడంలేదు. కొండలు, గుట్టలు కాలిబూడిదయ్యాయి. సాధారణంగా ఈ సీజన్లో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండేది. ప్రస్తుతం అన్నిచోట్లా నీటికి కరువొచ్చి పడింది. దీంతో అరకొరగా పశుగ్రాసం సాగు చేపట్టారు. ఇది ఏమాత్రం పాడిఆవులకు సరిపోవడం లేదు. చేసేదిలేక పాడిరైతులు బయట జిల్లాల నుంచి వరిగడ్డిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మండుతున్న గ్రాసం ధరలు వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు డిమాండ్ కిలో రూ. 8 నుంచి రూ.10 ఖర్చయినా కొనక తప్పదు ప్రస్తుతం ఎండు వరిగడ్డి ధరలు భగ్గుమంటుంటాయి. పశుపోషణ భారమైంది. ఇంకా మొక్కజొన్నలు, జొన్నలు, ఫీడు, వేరుశనగ పొట్టు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా వస్తోంది.అయినా గడ్డి కొనక తప్పడం లేదు. – నాగరాజ, పాడిరైతు, గంగిరెడ్డిపల్లె పశుపోషణ భారంగా మారింది పశుపోషణ భారంగా మారుతోంది. గడ్డికొరత కార ణంగా ఎండు గడ్డి కొని ఆవుల్ని పోషిస్తున్నాము. అయినా రోజుకు 5లీటర్లే ఇస్తున్నా యి. దీంతో పాలల్లో వచ్చే రాబడి ఎక్కువ శాతం పశుపోషణకే సరిపోతోంది. మాకు కూలీపాటు డబ్బులు కూడా మిగలడం లేదు. – నరసమ్మ, పాడిరైతు, మొరంపల్లె -
పొన్నూటిపాళ్యంలో టెన్షన్..టెన్షన్
మదనపల్లె : వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి మృతి చెందిన ఘటనపై రాష్ట్రప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో...శుక్రవారం ఉదయం మదనపల్లె మండలం పొన్నూటిపాళ్యం గ్రామంలో టెన్షన్ నెలకొంది. అడవిలో ఉచ్చువేసి చిరుత మృతికి కారకులయ్యారంటూ గురువారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేయడం, శుక్రవారం ఉదయాన్నే గ్రామాన్ని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చుట్టుముట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకుంది. చిరుతపులి మృతి ఘటనలో ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల్లో మరికొందరిని అరెస్ట్ చేస్తారన్న సమాచారం తెలియడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చిరుతమృతికి కారణాలను పరిశీలించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పొన్నూటిపాళ్యం చేరుకున్న ఏపీ పీసీసీఎఫ్ చలపతిరావు, డీఎఫ్ఓ జగన్నాథసింగ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తిరుపతి సర్కిల్ ఎస్.సెల్వం తదితరులు నేరుగా అడవిలోకి వెళ్లారు. చిరుత మృతి చెందిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, కారణాలను అంచనా వేశారు. అనంతరం తిరిగి మదనపల్లెకు వస్తుండగా, పొన్నూటిపాళ్యం గ్రామస్తులు అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. చిరుతపులి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతో, 8 గంటల సేపు నరకయాతన అనుభవించి, అధికారుల కళ్ల ముందే చనిపోయిందన్నారు. కాపాడే అవకాశాలున్నప్పటికీ, అధికారులు కాలయాపన చేస్తూ చిరుత చావుకు కారకులయ్యారని చెప్పుకొచ్చారు. గన్ పనిచేయకపోవడం, సరైన ఎక్విప్మెంట్, అనుభవం కలిగిన సిబ్బంది లేకపోవడంతోనే చిరుతపులిని అధికారులు కాపాడలేకపోయారన్నారు. ఈ ఘటనలో అధికారులు తమ వైఫల్యాలను చెప్పుకోకుండా, అమాయక రైతులను కేసులో ఇరికించి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. పులిని చంపేంత ధైర్యం గ్రామస్తులకు లేదని, రైతులను విచారణ పేరుతో తీసుకెళ్లి అరెస్ట్ చేసి, అప్పటికప్పుడే రిమాండ్కు ఎలా పంపుతారని నిలదీశారు. ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్న కే.రెడ్డెప్పరెడ్డి, వెంకటరమణారెడ్డి, డి.గంగాధరకు ఘటనతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణశాఖమంత్రి పవన్కల్యాణ్ అమాయకుల్ని కాపాడండంటూ నినాదాలు చేశారు. దీంతో పీసీసీఎఫ్ చలపతిరావు, గ్రామస్తులతో మాట్లాడుతూ..ప్రజల వినతిని రాతపూర్వకంగా మదనపల్లె ఫారెస్ట్ కార్యాలయానికి తెచ్చి ఇవ్వాల్సిందిగా చెప్పడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. అనంతరం ఫారెస్ట్ కార్యాలయంలో, ఘటనకు, పొన్నూటిపాలెం గ్రామస్తులకు సంబంధం లేదని, అమాయకులను విడిచిపెట్టాల్సిందిగా కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేసును త్వరగా పరిష్కరించాలనే ఆతృతతో నిష్కారణంగా రైతులను బలిచేస్తున్నారన్నారు. పులి ఫారెస్ట్ ఏరియాలోని ఉచ్చులో తగులుకుంటే అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, విచారణ కోసం తీసుకువచ్చి 24గంటల్లోపు అరెస్ట్చేసి రిమాండ్కు పంపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక రైతులను విడిచిపెట్టి, అసలు దోషులను శిక్షించాల్సిందిగా కోరారు. ఉదయాన్నే గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఉచ్చు వేసిన ప్రాంతం పరిశీలనకు ఫారెస్ట్ ఉన్నతాఽధికారుల రాక అమాయక రైతులను అరెస్ట్ చేశారంటూ గ్రామస్తుల ఆవేదన ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే చిరుత చనిపోయిందంటూ ఆగ్రహం అధికారులను అడ్డుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు -
చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలి
సిద్దవటం: ప్రతి ఒక్కరూ చారిత్రక కట్టడాలను, సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించుకోవాలని ఇంటాక్ జిల్లా కన్వీనర్ డాక్టర్ చిన్నపరెడ్డి తెలిపారు. సిద్దవటంలోని మట్లి రాజుల కోటలో శుక్రవారం ఆర్కిలాజికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి. సూర్యప్రకాష్ అధ్యక్షతన ప్రపంచ వారసత్వ దినోత్సవ కార్యక్రమం జరిగింది. మందుగా పురాతన కట్టడాల ఫొటో ఎగ్జిబిషన్ను రేంజర్ కళావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటాక్ జిల్లా కన్వీనర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఇంటాక్ ద్వారా ప్రతి విద్యార్థిని యంగ్ ఇంటాక్లో చేర్పించి దేశంలోని వారసత్వ కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.ఆర్కిలాజికల్ అసిస్టెంట్ సూపరింటెండెంటు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రాచీన కట్టడాలు, స్మారక చిహ్నాలు , స్థలాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది ఏప్రిల్ 18న ప్రపంచ, వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. సిద్దవటం రేంజర్ కళావతి మాట్లాడుతూ అడవులకు కొందరు నిప్పు పెట్టడం వల్ల వృక్షాలు, పక్షులు, జంతువులు కాలిపోవడంతో పాటు పర్యావరణం దెబ్బతింటోందన్నారు.వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. అంతకు ముందు మట్టిరాజుల కోట నుంచి ్ల విద్యార్థులు , అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఇంటాక్ సభ్యులు రచించిన చరిత్ర పుస్తకాన్ని సూర్యప్రకాష్ ఆవిష్కరించారు.ఇంటాక్ సభ్యులు రంగనాథ్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి,ఓ.వి. రెడ్డి, అసిస్టెంట్అర్కిలాజికల్ అఽధికారి కమలాసన్, ఉద్యానశాఖ అస్టెంట్ వెంకటరమణ, జిల్లా పురావస్తు శాఖ అధికారి డాకారెడ్డి, సీ నియర్ఫొటోగ్రాఫర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
సమష్టి కృషితో పార్టీని బలోపేతం చేసుకుందాం
సంబేపల్లె : సమష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పంచాయతీ తిమ్మక్కగారిపల్లెలో మాజీ జెడ్పీటీసి ఉపేంద్రనాఽథ్రెడ్డి నివాసంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్రెడ్డితో కలసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న పాలనలో శెట్టిపల్లె గ్రామం అభివృద్ధికి వివిధ పధకాల ద్వారా దాదాపు రూ. 60 కోట్లకు పైగా నిధులు వచ్చాయని శ్రీకాంత్రెడ్డి ఎదుట నాయకులు గుర్తు చేసుకున్నారు. అనంతరం మాజీ కోఆప్షన్ జాఫర్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో అనిరుథ్రెడ్డి, మాజీ ఎంపీపీ నాగారెడ్డి, ఆనంద్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మధన్మోహన్రెడ్డి, నరసింహారెడ్డి, రమణారెడ్డి, మాధవ్, శివయ్య, నౌషాద్, సయ్యద్, సమీర్, మహేశ్వర, శంకర్, శివయ్య తదితరలు పాల్గొన్నారు. -
మెడికల్ అండ్ హెల్త్ డీడీగా శేఖర్
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్గా శేఖర్ నియమితులయ్యారు. ఈయన కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న భక్తవత్సలం పదోన్నతిపై ఏపీ రిక్రూట్మెంట్ బోర్డు జాయింట్ డైరెక్టర్గా వెళ్లారు. దీంతో ఈ స్థానంలోకి శేఖర్ వస్తున్నారు. అంతర్జాతీయ కవిసమ్మేళనానికి ఆహ్వానం రాజంపేట: హైదరాబాదులోని చిక్కడపల్లి త్యాగరాయగానసభలో మే8న నిర్వహించే అంతర్జాతీయ కవిసమ్మేళనానికి అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకకు చెందిన కవి బాలరాజుజనార్ధనరాజుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణా తెలుగు భాష చైతన్యసమితి 12వవార్షికోత్సవం సందర్భంగా తెలుగుభాషకు పట్టాభిషేకం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఇందులో కవితా ధోరణి వినిపించడానికి అన్ని దేశాల్లోని తెలుగు కవులు వారి వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఆహ్వానం పంపినట్లు వివరించారు. కాగా జనార్ధనరాజు ఇప్పటికే మూడు కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితలను వినిపించారు. బాలరాజు జనార్ధనరాజును తాళ్లపాకవాసులు అభినందించారు. దంత సంరక్షణపై అవగాహన కడప అర్బన్: వరల్డ్ ఓరల్ హెల్త్ డే మార్చి 20 సందర్భంగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం వారిచే నిర్వహించే వివిధ నోటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. నెల రోజులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా వాకతాన్ చేశారు. పుచ్చిన పళ్ల సమస్యలు, దంతాల సంరక్షణతోపాటు గుట్కా, కై ని, పొగాకు, మందు మొదలగునవి అరికట్టే విధానం ప్రాథమిక దశలో రోగనిర్ధారణ చేయగలిగిన పరికరాలు, నోటి క్యాన్సర్పై ప్రజలలో అవగాహన కల్పించారు. నోటి ఆరోగ్యం, శరీర ఆరోగ్యం ఎలా సంరక్షించుకోవాలో ముందుగా దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వాళ్లకు వివిధ పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా స్లోగన్, రైటింగ్, పెయింటింగ్, డెంటల్ ఫోటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్ 9న వాకతాన్ మహావీర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో యూజీ, పిజి దంత వైద్య విద్యార్థులు, స్టాఫ్ పాల్గొన్నారు. ఏప్రిల్ 17న గ్రూప్ టూత్ బ్రెషింగ్ పద్ధతి, నోటి ఆరోగ్యం అవగాహన ప్రజల్లో దంత సంరక్షణ అవగాహన కల్పించారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
● భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే ● చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు రాయచోటి: గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం జిల్లా పరిధిలోని క్యాథలిక్, ప్రొటెస్ట్ టెన్స్, మిస్వా ప్రార్థన మందిరాలు, లూథరన్, ఇండియన్, పెంతుకొస్తు, యూక్తూస్ తదితర చర్చిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ఫ్రైడే సందర్భంగా జిల్లాలోని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మదనపల్లె, రాయచోటి, పీలేరు, రాజంపేట, కోడూరు, బి కోట, తంబళ్లపల్లి ప్రాంతాల్లోని చర్చిల్లో పాస్టర్లు, మతబోధకులు ప్రసంగిస్తూ క్రీస్తుమార్గం అనుసరణీయమని అన్నారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే శుక్రవారం గుడ్ఫ్రైడే జరుపుకుంటామని మత పెద్దలు తెలిపారు.మానవాళి శాంతి కోసం రక్తం చిందించిన ఏసుక్రీస్తు ప్రేమకు ఇది ప్రతీక అన్నారు. ఏసుకు శిలువ వేసిన రోజునే పవిత్ర శుక్రవారంగా జరుపుకుంటామని తెలిపారు. పండుగ సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మానవులు చేసిన పాపాలను తను మోస్తూ సిలువపై ప్రాణాలను అర్పించి త్యాగాన్ని చాటిన ఏసును క్రైస్తవులు స్తోత్రాలతో కీర్తించారు. -
ధర లేక.. దిక్కుతోచక!
● పంట విక్రయించేందుకు అన్నదాత అగచాట్లు ● తగ్గుతున్న ధాన్యం ధరలు ● ఆందోళనలో రైతులు సుండుపల్లె: రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు మాత్రం లేవు. ఎకరం వరి పంట సాగు చేయాలంటే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధర ఉండటం లేదని.తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు. ● జిల్లాలో 6,885 హెక్టార్లకు 2024–25 సంవత్సరం రబీ సీజన్లో 2,735 హెక్టార్లలో మాత్రమే రైతులు వరి పంటను సాగు చేశారు. సిద్దవటం మండలంలో 621 హెక్టార్లు, నందలూరు మండలంలో 300, రాజంపేట మండలంలో 260, కలికిరి మండలంలో 231, వాయల్పాడు మండలంలో 203, పీలేరు మండలంలో 147, సుండుపల్లె మండలంలో 133 హెక్టార్లలో వరి పంటను సాగు చేయగా మిగతా మండలాల్లో వరి సాగు తగ్గింది. వ్యవసాయ కూలీలు, రసాయనిక ఎరువులు, తెగుళ్లకు మందులు, సేద్యపు ఖర్చులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కౌలు రైతులకు అదనంగా ఖర్చు వస్తుంది. కూలీలు సమయానికి దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు పంట పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చి విక్రయించే వరకు భయం భయంగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో 77 కేజీల వరి ధాన్యం బస్తా రూ.2 వేలు గత ప్రభుత్వంలో జిల్లాలో 77 కేజీల వరి ధాన్యం బస్తా రూ.2 వేల నుంచి గరిష్టంగా రూ.2,200 వరకు అమ్మినట్లు రైతులు తెలిపారు. కానీ ఈసారి రబీ సీజన్లో వరి ధాన్యం బస్తా రూ.1,400 రేటు పలికింది. దీంతో ఒక్కో బస్తాపై దాదాపు రూ.600 నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరాకు దుక్కులు దున్నేందుకు ఎరువులు, వరి నాటు, కలుపు కూలీలు, వరికోత ఖర్చులు కలిపి దాదాపు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఒక ఎకరాకు పంట బాగా పండితే 38 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. వరి రైతుకు రూ.15.58 కోట్ల నష్టం జిల్లాలో ఎకరాకు 38 బస్తాలు దిగుబడి వస్తుంది. కానీ ఒక బస్తాకు రూ.600 రేటు తగ్గింది. జిల్లాలో 6,837 ఎకరాల్లో వరి సాగు చేయగా ఒక ఎకరాకు 38 బస్తాల సగటున 2,59,806 బస్తాల దిగుబడి అంచనా. ఒక బస్తాకు రూ.600 చొప్పున రూ.2,59,806 బస్తాలకు నష్టం రూ.15,58,83,600 ఈసారి రబీ రైతులు వరి ధాన్యంపై నష్టపోయారు. నియోజకవర్గాల వారీగా వరిసాగు హెక్టార్లలో.. గిట్టుబాటు ధర కల్పించాలి రెండు ఎకరాలలో వరి పంటను సాగు చేశాను. సాగు ఖర్చులు పెరగడంతో అప్పు చేసి పెట్టుబడి పెట్టినా పంట చేతికందే సమయంలో ధరలు ఉండటం లేదు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. – పోకల సిద్దయ్య, రైతు, సుండుపల్లె మండలంప్రభుత్వం ఆదుకోవాలి రబీ సీజన్లో రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశా. ఎకరా పంట సాగుకు రూ.40 ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు ఐదున్నర పుట్టి వచ్చింది. అయితే పుట్టి వడ్లు రూ.11 వేలకు అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో పుట్టి వడ్లు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలికింది. ప్రస్తుతం పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – నాగమునిరెడ్డి, రైతు, వంతాటిపల్లి, సిద్దవటం మండలం -
విద్యార్థినికి గోల్డ్మెడల్ ప్రదానం
పీలేరు: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదివి గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలో తెలుగు సబ్జెక్టులో 99 శాతం మార్కులు సాధించిన విద్యార్థిని పి నందినికి ఇదే కళాశాల పూర్వ విద్యార్థి, పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిణి గురువారం గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. ఈసందర్భంగా ప్రొఫెసర్ సుభాషిణి మాట్లాడుతూ తాను చదివిన పాఠశాలలో మెరిట్ విద్యార్థినులకు ప్రతి ఏటా పతకాలు,సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎం ఫౌజియాబేగం, ఉపాధ్యాయినులు సుజాత, గంగయ్య, శ్రీకళ, ఉమామహేశ్వరి, రెడ్డి దీపారాణి, ఇంద్రాణి, ప్రసన్నలక్ష్మీ, రాధారాణి, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పనుల పరిశీలన రామాపురం: మండలంలోని హసనాపురం పంచాయతీలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను గురువారం పీడీ వెంకటరత్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజువారి వేతనం రూ.350 వచ్చేలా ఉపాధి కూలీలు పని చేయాలన్నారు. మండలంలో మంజూరైన ఫారంపాండ్స్, పశువుల నీటి తొట్టె పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా కూలీలు 3 నెలలుగా చేసిన పనులకు డబ్బులు రాలేదని పీడీ దృష్టికి తీసుకురాగా మూడురోజుల్లో వస్తాయని తెలియజేశారు. లక్ష్మినరసయ్య, ఏపీఓ పెంచలయ్య, టీఏ చంద్రశేఖర్రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు రవిశంకర్రెడ్డి, పక్కీర్రెడ్డి పాల్గొన్నారు. -
యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
కడప సెవెన్రోడ్స్: ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన, అలాగే ఎస్ఎస్సీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే యాదవ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నామని రాయలసీమ యాదవ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జి.నారాయణయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించరాదని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి ఉండాలన్నారు. విద్యార్థులు తమ బయోడేటా, మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ సర్టిఫికెట్, ఫోటోలను జతపరిచి పంపాలన్నారు. ఇతర వివరాలకు 94408 49234 , 94406 51405 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఉండాలి రాయచోటి టౌన్: ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం తప్పక ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో డ్రోన్లు ఎలా ఉపయోగించాలో టెక్నీషియన్లకు అవగాహన కల్పించారు. అనంతరం చంద్రానాయక్ మాట్లాడుతూ డ్రోన్ ద్వారా ఒక ఎకరం పొలంలో పది నిమిషాలలో పురుగుమంది పిచికారీ చేయొచ్చన్నారు. కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. జిల్లాకు 34 డ్రోన్లు 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్ఎండీ ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ సీనీయర్ మేనేజర్ పి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పథకాల ప్రగతి సాధనలో లక్ష్యాలను పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాయచోటి: ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి వీసీలో జిల్లా కలెక్టర్, డీఆర్ఓ మధుసూదనరావు పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19న మూడో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఉచిత ఇసుక పథకంలో జిల్లా అవసరాలకు తగినంత ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చేపట్టిన ఎంఎస్ఎంఈల సర్వేను పటిష్టంగా నిర్వహించాలన్నారు. పదివేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి కృషి జిల్లాలో పదివేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, డీఎల్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రెవెన్యూ అంశాలు, నిత్యావర వస్తువుల పంపిణీ, పల్లె పండుగ పనులు, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పనులు, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష చేసి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. నిరుపయోగంగా, వ్యవసాయ వినియోగం లేని భూములను నేపియర్ గడ్డి పెంపకానికి గుర్తించిన ఏజెన్సీకి లీజుకు ఇస్తే ఎకరాకు వార్షికంగా రూ. 30 వేలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాలు లీజుకు ఇస్తే రైతులకు నికర ఆదాయం ఉంటుందన్నారు. పల్లె పండుగ క్రింద జిల్లాలో చేపట్టిన పనులన్నింటినీ ఈ మాసాంతంలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, వైఖోమ్ నదియా దేవి, డిఆర్ఓ మధుసూదనరావు, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
వైవీయూకు రూ.10 కోట్ల ప్రాజెక్టు మంజూరు
కడప ఎడ్యుకేషన్: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకెళ్తున్న యోగి వేమన విశ్వవిద్యాలయానికి మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘పార్టనర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (ఏ ఎన్ ఆర్ ఎఫ్–పి.ఎ.ఐ.ఆర్) పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో కలిసి రూ. 10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం యోగి వేమన విశ్వవిద్యాలయం లో రోగనిర్ధారణ, మెటబాలిక్, ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధుల చికిత్సలు, వ్యాధి నిఘా యంత్రాంగంపై దృష్టి సారించే మొత్తం 22 ప్రతిపాదనలను వివిధ విభాగాలలో కలసి 27 మంది అధ్యాపకులు సమర్పించారు. ప్రాజెక్టు నిధులతో పరిశోధనలు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని స్పోక్ సంస్థగా ఎంపిక చేయడం, ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఎఎన్ఆర్ఎఫ్–పీఏఐఆర్ గ్రాంట్ను అందించడం వెనక విశ్వవిద్యాలయంలో నాణ్యమైన బోధన, పరిశోధన ఉన్నత ప్రమాణాలే కారణమన్నారు. పరిశోధన నిధులతో నాణ్యమైన పరిశోధనలు చేస్తామన్నారు. పరిశోధనల కేంద్రంగా, పరి శోధన వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ప్రొఫె సర్ కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా. పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యంశర్మ పాల్గొన్నారు.వైవీయూ వీసీ ఆల్లం శ్రీనివాసరావు -
ఎస్ఐ ఇల్లు సహా నాలుగు ఇళ్లలో చోరీ
ప్రొద్దుటూరు క్రైం : కొన్ని రోజుల క్రితం వచ్చిన అల్లుఅర్జున్ పుష్ప–2 సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ పోలీసులకు దొరకకుండా వారికి చుక్కలు చూపిస్తాడు. కథలో భాగంగా పుష్ప చెప్పే ‘దమ్ముంటే పట్టుకో షెకావత్తు.. పట్టుకుంటె వదిలేస్త సిండికేట్టు’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ప్రొద్దుటూరులో కూడా కొన్ని రోజుల నుంచి వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్లల్లోకి చొరబడి వరుసగా చోరీలు చేస్తున్నా పోలీసులు వారిని పట్టులేకపోతున్నారు. ఇన్ని రోజులు ప్రజల ఇళ్లలో చోరీలు చేసిన దొంగలు ఈ సారి ఎస్ఐ ఇంటినే టార్గెట్ చేశారు. ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ ధనుంజయ ఇంట్లో చోరీ చేసి ‘దమ్ముంటె పట్టుకో ధనుంజయ..! పట్టుకుంటే వదిలేస్త దొంగతనాలు’ అంటూ ఎస్ఐకే సవాల్ విసురుతున్నారు. ఎస్ఐ అనే భయమే లేకుండా ఆయన ఇంట్లో హుండీని ఎత్తుకెళ్లారు. ఎస్ఐ ఇంట్లో చోరీ జరగడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ప్రొద్దుటూరులో దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ఇళ్లల్లో చొరబడ్డారు. ఒక ఇంట్లో మాత్రం పెద్ద ఎత్తున బంగారు, వెండి, నగదును దొంగలు దోచుకెళ్లారు..ఎస్ఐ ఇంట్లో హుండీని ఎత్తుకెళ్లారు. మిగిలిన రెండు ఇళ్లల్లో విలువైన వస్తువులేమీ దొంగలకు దొరకలేదు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న నరాల బాలిరెడ్డి కాలనీలో విలాసవంతమైన ఇళ్లను నిర్మించారు. ఈ కాలనీలోని నాలుగు ఇళ్లలో గురువారం అర్థరాత్రి 1.30 సమయంలో దొంగలు పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎనమల చంద్రశేఖర్రెడ్డి ఇంట్లో సుమారు 60 తులాల బంగారు, 3 కిలోల వెండి, రూ. 12 లక్షల నగదును దోచుకెళ్లారు. వారి ఇంటి సమీపంలో ఉన్న టూ టౌన్ ఎస్ఐ ధనుంజయ ఇంట్లో హుండీని దోచుకెళ్లారు. ఎస్ఐ ఇంటి పక్కనే ఉన్న ఈశ్వరరెడ్డి, ఎల్లంశెట్టి రాజా ఇంట్లో విలువైన బంగారు నగలు ఏమీ దొరకలేదు. కనిపెట్టి కన్నేశారు..చంద్రశేఖర్రెడ్డి కుమారుడు చెన్నకేశవరెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని వివాహం ఈ నెల 13,14 తేదీల్లో ప్రొద్దుటూరులోని వైవీఆర్ కల్యాణమండపంలో జరిగింది. ఇందులో భాగంగా ఇంటికి తాళం వేసి చంద్రశేఖర్రెడ్డి కుటుంబ సభ్యులందరూ 16న కర్నూలుకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ ఇంట్లో చొరబడిన దొంగలు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ 60 తులాల బంగారు, రూ. 12 లక్షలు నగదు, 3 కిలోల వెండి అపహరణ శుభ కార్యానికి కర్నూలుకు వెళ్లిన ఓ కుటుంబం ఐదుగురు కలిసి చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో నిర్ధారణ ఎస్ఐ ఇంటిని వదలని పోలీసులు ఎస్ఐ ధనుంజయుడు ఇంట్లో దొంగతనం జరగడం పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. పోలీసుల ఇళ్లకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఇళ్ల పరిస్థితి ఏంటని అంటున్నారు. ఎస్ఐ ధనుంజయుడు తన యూనిఫాంను సోఫాపై ఉంచారు. యూనిఫాంను చూసిన దొంగలు ఇది పోలీసు అధికారి ఇల్లని గ్రహించి ఉంటారు. అయినా ఏ మాత్రం భయపడకుండా ఇంట్లో ఉన్న హుండీని ఎత్తుకొని వెళ్లారు. -
వ్యక్తి అదృశ్యం
ఓబులవారిపల్లె : గాదెల వెంకటాపురం గ్రామానికి చెందిన టి.శంకరయ్య 15 రోజులుగా కనిపించడం లేదని, గురువారం కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. ఎవరికై నా ఆచూకీ తెలిసినట్లయితే 9121100580 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ స్తంభం విరిగిపడి పాడి ఆవు మృతి రామసముద్రం : జోరుగా వీచిన ఈదురు గాలులకు చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ లైన్పై పడటంతో ఆ దెబ్బకు విద్యుత్ స్తంభం విరిగి పాడి ఆవుపై పడింది. ఈ ప్రమాదంలో పాడి ఆవు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి అరికెల పంచాయతీ దాసిరెడ్డిపల్లిలో జరిగింది. ఆవు యజమాని దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నిలుపుదల కోసం విద్యుత్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడి ఆవు విలువ సుమారు. రూ.70వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. వరకట్న వేధింపులపై కేసు నమోదు రామసముద్రం : వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాలేనత్తం పంచాయతీ ఎరపశెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమార్తె లావణ్య (23) ను పెద్దపంజాణికి చెందిన సునీల్ ప్రతాప్కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే భర్త సునీల్ ప్రతాప్, అత్త గంగులమ్మలు వరకట్నం తెమ్మని వేధిస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసిందన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిపై దాడిపెద్దతిప్పసముద్రం : మండలంలోని మల్లెల గ్రామ మసీదులో మౌజన్గా పని చేస్తున్న అజ్మత్పై అదే గ్రామానికి చెందిన వల్లీసాబ్ అనే వ్యక్తి దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామంలో ఉన్న ఓ చింత చెట్టు ఫలసాయాన్ని మసీదు అవసరాలకు వినియోగించాలనేది మత పెద్దల నిర్ణయం. ఈ నేపథ్యంలో మౌజన్ చింత కాయలను కోస్తుండగా ఇదే గ్రామానికి చెందిన వల్లీసాబ్ అనే వ్యక్తి ఈ చింత చెట్టు తమ పూర్వీకులదని, ఇందులో తమకూ హక్కు ఉందని, కాయలు కోయడానికి నువ్వెవరు అని దూషిస్తూ అజ్మత్పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రాయచోటి : జిల్లాలో పెట్రేగుతున్న అసాంఘిక శక్తులపట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి, పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నేర నిరూపణలకు శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నేర పరిశోధన చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలని ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో చైన్ స్నాచింగ్కు పాల్పడిన నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాలు, నిషేధిత మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతను, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా గ్రామాలు, పట్టణాలలోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు సంబంధిత పోలీసులు పాల్గొన్నారు. చంద్రబాబు పాలన అంతమే మాలల పంతం – మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం మదనపల్లె : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేవలం ఒక కులానికి మద్దతు తెలిపి, మిగిలిన వారిపై నిర్లక్ష్యం కనబరిచిన చంద్రబాబు పాలన అంతమే మాలల పంతమని మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం తెలిపారు. గురువారం పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 2011 గణాంకాల ప్రకారం 2025లో వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాలలకు అన్యాయం చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని రానున్న స్థానిక సంస్థల్లో మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు యమలా చంద్రయ్య, గుండా మనోహర్, వీరనాల మాణిక్యం, ఎలక్ట్రిషియన్ మోహన్, పలమనేరు జయశంకర్, గంగరాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు ఆత్మహత్య ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామంలో అప్పుల బాధ భరించలేక మడక రామకృష్ణ(49) అనే కౌలు రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు కౌలు వ్యవసాయంలో ఆదాయం లేకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ పొలంలో వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఎంపీ మిథున్రెడ్డి చొరవతో... పీఎంఎన్ఆర్ఎఫ్ మంజూరు
మదనపల్లె : వైఎస్సార్ సీపీ లోక్సభపక్షనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చొరవతో, పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన తలసేమియా వ్యాధిగ్రస్తుడు చరణ్కు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి(పీఎంఎన్ఆర్ఎఫ్) మంజూరైంది. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ చేతుల మీదుగా తలసేమియా బాధితుడు చరణ్, తాత, నానమ్మలకు రిలీఫ్ఫండ్ మంజూరుపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ...పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉండే గీతాంజలి, హరిబాబు దంపతుల కుమారుడు చరణ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడన్నారు. వైద్య చికిత్సకు రూ. 14లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. బాధిత కుటుంబ దయనీయ స్థితిని స్థానిక నాయకులు ఎంపీ మిథున్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సాయం చేయాల్సిందిగా కోరారన్నారు. దీంతో స్పందించిన ఆయన ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద రూ.3లక్షలు మంజూరు చేయించారన్నారు. ఈ మొత్తాన్ని చరణ్ చికిత్స పొందుతున్న బెంగళూరు భగవాన్ మహావీర్జైన్ హాస్పిటల్కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జమచేశారన్నారు. ఈ సందర్భంగా చరణ్ కుటుంబ సభ్యులు.. ఎంపీ మిథున్రెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్నాయక్, కొత్తపల్లె మహేష్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జుననాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుడికి మంజూరుపత్రాన్ని అందించిన నిసార్ అహ్మద్ -
మళ్లీ టూ ట్వంటీ ఆక్రమణకు యత్నం !
కురబలకోట : మండలంలోని అంగళ్లు మిట్స్ కళాశాల సమీపంలోని సర్వే నంబరు టూట్వంటీ (220) భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం పుంగనూరుకు చెందిన కొందరు ఈ భూమిలో ప్రవేశించి రేకులు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో మొదటి నుంచి ఈ భూమిపై హక్కులతో పాటు స్వాధీన అనుభవంలో వి. వెంకటరమణ రాజు (రాజు), సుబహాన్ తదితరులతో పాటు ఇక్కడ ప్లాట్లు కొన్నవారు వీరిని నిలువునా అడ్డుకున్నారు. భూ హక్కు పత్రాలు చూపాలని పట్టుబట్టారు. పుంగనూరుకు చెందిన వారు వినకుండా రేకులు వేస్తామని లారీలో వాటిని తెప్పించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల వారు పరస్పరం మోహరించారు. ఈ విషయం ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్కు సమాచారం అందడంతో హుటాహుటిన ఆయన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. ఇరువర్గాల వారితో చర్చించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుండడంతో ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేట్మెంట్లు రికార్డు చేసి వదిలి పెట్టారు. భూ వివాదాన్ని చర్చల ద్వారా లేదా చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్ఐ సూచించారు. దాదాగిరిలా వ్యవహరిస్తే తగిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు. ఇదిలా ఉండగా టూట్వంటీ సర్వే నంబరులో ఐదున్నర ఎకరం ఉంది. ఇది హైవేకు ఆనుకుని ఉంది. రూ. 10 కోట్లకుపైగా విలువ చేసేదిగా ఉంది. గతంలో కూడా వివిధ ప్రాంతాల వారు ఈ భూమిపై కన్నేసి రాద్ధాంతం చేశారు. ఒకరైతే చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి ఆక్రమించారు. ఇక్కడ ప్లాట్లు కొన్న వారు స్థానికులు మూకుమ్మడిగా తరలి వచ్చి ఈ ఫెన్సింగ్ను ఒక్కసారిగా ధ్వంసం చేయడంతో పాటు నిమిషాల్లో నేల మట్టం చేశారు. మదనపల్లెకు చెందిన వి. రాజు తదితరులు ఈ భూమిని 2016లో అంగళ్లుకు చెందిన ఇస్మాయిల్, ఖలీల్, సీకే మహమ్మద్ తదితరుల నుండి కొన్నారు. ప్లాట్లు వేసి 72 మందికి విక్రయించారు. కొందరు కట్టడాలు కూడా నిర్మించారు. రికార్డు కూడా వీరికి పక్కాగా ఉంది. అయినా ఎవరెవరో వచ్చి ఆక్రమించే యత్నం చేస్తున్నారు. గురువారం వచ్చిన వారికి కూడా ఈ భూమికి సంబంధించి కనీసం వన్బీ లేదా పట్టాదారు పాసుపుస్తకం కూడా లేదు. మాదే భూమంటూ చొరబడే యత్నం చేశారు. 1923లో సదరు భూమిని వీరు విక్రయించినట్లు రికార్డులు కూడా ఉన్నాయి. అయినా భూమి తమదేనంటూ ఆక్రమించే యత్నం చేయడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. అంగళ్లులోని టూ ట్వంటీ భూ వివాదం ఎనిమిదేళ్లుగా నడుస్తూనే ఉంది. అన్నమయ్య జిల్లాలోనే టూట్వంటీ భూ వివాదం హైటెన్షన్గా మారింది. జిల్లాలోనే అత్యంత వివాదాస్పద భూమిగా పేరు పొందింది అడ్డుకున్న హక్కుదారులు ఇరు వర్గాలను స్టేషన్కు తరలించిన ఎస్ఐ సడలిన ఉద్రిక్తత -
ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ
నిమ్మనపల్లె : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపైనే దగ్ధమైన సంఘటన నిమ్మనపల్లిలో గురువారం జరిగింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం కొత్త ఇండ్లు ప్రాంతానికి చెందిన వంశీ (28) తన తల్లి, కూతురితో కలసి బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంపై మదనపల్లి నుంచి నిమ్మనపల్లె మండలం తవళం గ్రామానికి బయలుదేరాడు. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ గజ్జలవారిపల్లెకు చెందిన హరీష్ కుమార్ రెడ్డి(38), తన స్నేహితుడు మహబూబ్ బాషాతో కలిసి వ్యక్తిగత పనులపై నిమ్మనపల్లెకు వచ్చి, తిరిగి స్వగ్రామానికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో చల్లావారిపల్లె సమీపంలోని మలుపు మిట్ట వద్ద ద్విచక్ర వాహనాలు రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో హరీష్ కుమార్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, మహబూబ్ బాషా, మరో వాహనంలోని వంశీ, అతని కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో హరీష్ కుమార్ రెడ్డి నడుపుతున్న బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి రోడ్డుపైనే వాహనం దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను 108 వాహనం లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపైనే దగ్ధం వ్యక్తికి తీవ్ర గాయాలు -
గురుకుల పాఠశాల విద్యార్థులకు పతకాలు
రామాపురం : విజయవాడకు చెందిన డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఆల్ ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ విభాగంలో రామాపురం గురుకుల పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించారు. 30 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఈనెల 5వ తేదీన ఫలితాలు ప్రకటించగా అందులో ఆరుగురు విద్యార్థులకు బంగారు పతకాలు, 8 మంది విద్యార్థుకు వెండి పతకాలు దక్కడంతో ఆర్ట్ టీచర్ ఆనందరాజును ప్రిన్సిపాల్ వి.వి. వరప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు. బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించాలి మదనపల్లె సిటీ : ఘన చరిత్ర కలిగిన బీటీ కళాశాలను ప్రభుత్వం యూనివర్సిటీగా ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. గురువారం మదనపల్లెలో విలేకర్లతో మాట్లాడారు. కాలేజీలో పూర్థిస్థాయిలో ఫ్యాకల్టీ, నాన్ టీచించ్ స్టాఫ్ను నియమించాలన్నారు. పీజీ కోర్సులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు. మెడికల్ కాలేజీని పీపీఈ పద్ధతిలో కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పడంతో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, జిల్లా అధ్యక్షుడు నరసింహ, కార్యదర్శి రమణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
మదనపల్లె : వేటగాళ్ల ఉచ్చులో పడిన చిరుతపులిని కాపాడటంలో నిర్లక్ష్యం కనబరిచి, పులితో పాటు రెండు మగ కూనల మృతికి కారకులైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన(బీవైఎస్) అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. గురువారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ను కలిసి చిరుత పులిని కాపాడటంలో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ చిరుత పులి మరణానికి కారణం ముమ్మాటికీ అటవీశాఖ అధికారులదేనన్నారు. ఎఫ్బీఓ పర్యవేక్షణ సక్రమంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కార్యక్రమంలో బీవైఎస్ నాయకులు జిలానిబాషా, ఆది, వినయ్, బాలకృష్ణ, ద్వారక, వంశీ, శంకర్, జగదీష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి....
ఐదు ఎకరాల మామిడి తోటలో కాయలు, చెట్లు, కొమ్మలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాపు, కోత దశలో ఉన్న అరటిచెట్లు గాలివానకు పడిపోయాయి. కోలుకోలేని విధంగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. –సుంకేసుల మస్తాన్, రైతు, చెన్నరాజుపోడు, ఓబులవారిపల్లి మండలం నష్టపరిహారం అందించాలి వై కోట, గాదెల గ్రామాల్లో గాలివానకు అరటి, మామిడి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చేతికి అందిన పంట నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. –మల్లెం ఈశ్వరయ్య, సర్పంచ్, వై కోట -
ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాయచోటి: ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్లు వందశాతం రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 2025–26లో ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద ఏపీ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వైబ్సైట్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు అంశంపై బ్యాంకర్లతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 2025–26లో ఎస్సీ ప్రణాళిక కింద జిల్లాకు 563 యూనిట్లను కేటాయించారని కలెక్టర్ తెలిపారు. 563 యూనిట్లకు వివిధ సెక్టార్లలో రూ. 2341 లక్షల రుణాలు ఇవ్వాలని, ఇందులో రూ. 924 లక్షలు 40 శాతం మేర రాయితీగా పరిగణిస్తారని తెలిపారు. జిల్లాకు 34 డ్రోన్ యూనిట్లు..... వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను పొందేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతను అందిస్తోందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం పెంచడానికి కూడా రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జిల్లాకు 34 డ్రోన్లు యూనిట్లు మంజూరు అయ్యాయన్నారు. 80 శాతం రాయితీతో డ్రోన్ యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ చంద్ర నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి విద్యార్థులు విద్యతోపాటు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమ శిక్షణతో వాటిని సాధించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి గ్రాండ్ ప్రైజ్ (లాప్టాప్) టాబ్, ఫస్ట్ ప్రైజ్తోపాటు గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారు సాధించిన ల్యాప్టాప్, ట్యాబ్, గోల్డ్ మెఢల్, సర్టిఫికెట్లను బహూకరించి అభినందనలు తెలిపారు. -
ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం
సిద్దవటం: ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ సురేష్బాబు తెలిపారు. సిద్దవటంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని టక్కోలు, మాచుపల్లె గ్రామాల్లోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారం అంతా విషపూరితమే అని అన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై మహిళా సమాఖ్యలతో భాగస్వామ్యం , ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రైతు సాధికార సంస్థ.. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్య సంఘాలతో సంప్రదించి ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్.వి. ప్రవీణ్, అదనపు ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి, బద్వేల్ సహాయ వ్యవసాయ సంచాలకులు నాగరాజ, మండల వ్యవసాయధికారి రమేష్రెడ్డి, ఏపిఎం సుజాత, మండల సమాఖ్య అధ్యక్షురాలు , వివోఏలు పాల్గొన్నారు. -
సారూ.. తాగునీరేది?
● డీహైడ్రేషన్ ప్రమాదం ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దాహం ఎక్కువగా వేస్తుంది. అందుబాటులో నీరు లేకపోతే డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదముంది. ఇందుకోసం విద్యాశాఖ జలగంట కార్యక్రమం అమలు చేస్తుంది. ఇంటి నుంచి నీళ్ల సీసా తెచ్చుకుంటున్న చిన్నారులకు అది పూర్తయితే మళ్లీ పట్టుకునే వీలులేకుండా పోయింది. ఆర్ఓ ప్లాంట్లు వినియోగంలోకి తేవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల దాహం పెరుగుతోంది. తాగడానికి నీరు ఉండటం లేదు. అనేక స్కూళ్లలో ఇంటి నుంచి తాగేందుకు నీరు తెచ్చుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఉన్నా.. నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. మరికొన్ని స్కూళ్లలో తాగునీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మదనపల్లె సిటీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే గడప దాటని పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో గొంతులు తడారి పోతున్నాయి. సరైన సమయానికి మంచినీరు తాగకుంటే శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఉదయం 10, 11, 12 గంటలకు జల గంట మోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా.. సర్కారు పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ల మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకున్న నీటి బాటిళ్లు ఒక్కసారిగా ఖాళీ అవుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులకు శుద్ధ జలం అందేది. ఆర్ఓ ప్లాంట్లు విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడ్డాయి. నాడు–నేడు మొదటి విడతలో 600 పాఠశాలలు, రెండో విడతలో 1016 పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో సుమారు 1000 వరకు ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. తూతూ మంత్రంగా.. పాఠశాల్లో నీటి గంట(వాటర్బెల్) కన్పించడం లేదు. ఆర్ఓ ప్లాంట్లు పని చేయకపోవడంతో.. విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు మొదటి గంటకే పూర్తవుతున్నాయి. దీంతో వాటర్ బెల్ కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు. అంత నీరు తాగాల్సిందే వైద్యనిపుణుల సూచనల ప్రకారం .. ఒకటి నుంచి మూడేళ్లలోపు పిల్లలు రోజుకు 1.3 లీటర్లు, 4 నుంచి ఆరేళ్లలోపు 1.7 లీటర్లు, ఐదు నుంచి 13 ఏళ్ల లోపు 2.4 లీటర్లు, 13 ఏళ్లు పైబడిన వారు 3 నుంచి 4 లీటర్లు తాగాలని చెబుతున్నారు. విద్యార్థులు కచ్చితంగా ప్రతి గంటన్నరకు ఒకసారి 100 ఎంఎల్ నీటిని తాగాలి. సరైన మోతుదులో నీరు శరీరంలో లేకుంటే అలసట, బాలికలకు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు రావడం, కాళ్లునొప్పి, ఇతర సమస్యలు తలెత్తడం, ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు:1734 ప్రాథమికోన్నత పాఠశాలలు: 162 ఉన్నత పాఠశాలలు: 304 విద్యార్థులు: 1,54,784 ఆర్వో ప్లాంట్ల వివరాలు మొదటి విడత: 600 పాఠశాలలు రెండవ విడత: 1016 పాఠశాలలు ప్రస్తుతం పని చేయని ఆర్వో ప్లాంట్లు: సుమారు 1000 ఫిర్యాదు చేశాం ఆర్ఓ ప్లాంట్లు సరఫరా చేసిన వారికి ఫిర్యాదు చేశాం. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పని చేయడం లేదు. సాంకేతిక సిబ్బంది రావడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –ప్రభాకర్రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి, మదనపల్లె పాఠశాలల్లో మోగని నీటి గంట పని చేయని ఆర్వో ప్లాంట్లు గంటకే ఖాళీ అవుతున్న సీసా నీరు దాహార్తితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు -
కందుల కొనుగోలు గడువు పెంపు
రాయచోటి జగదాంబసెంటర్: నాఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏపీ మార్క్ఫెడ్ జిల్లాలో కంది పండించిన, ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి మద్దతు ధరపై ఒక క్వింటా రూ.7,550 కందులు కొనుగోలు చేసేందుకు గడువును ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ త్యాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు గడువు గతంలో ఈ నెల 15 వరకు ఉందని, ప్రస్తుతం 19వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్లు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులు రూ.150 దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశాలు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వన్నుట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు డీఈఓ కార్యాలయంలో కానీ సంబంధింత మండల విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. విజయానికి అవగాహనే అస్త్రం కురబలకోట: ఏ రంగంలో నైనా విజయానికి అవగాహన అస్త్రం లాంటిదని, విద్యార్థులు ఉద్యోగం సాధించాలంటే లర్న్, అడాప్ట్, స్కిల్ చేంజింగ్ ఎబిలిటీ అనే మూడు క్వాలీటీలు ఆవశ్యకమని బెంగళూరు మైక్రోసాఫ్ట్ అజురే ఏఐ ఎంవీపీ ఎస్. పూర్ణిమ అన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు తర్వాత మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటారన్నారు. ఇందుకు తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ స్టూడెంట్స్ క్లబ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ నైపుణ్యాలు, గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్పై అవగాహన పెంచుకోవచ్చన్నారు. ప్రాజెక్టులు, హ్యాక్ధాన్ ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందడంతో పాటు నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. -
మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
రాయచోటి జగదాంబసెంటర్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీల వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్.గౌస్బాషా బుధ వారం తెలిపారు. జిల్లా పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 8 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు గల క్రీడాకారులకు సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడా సంఘాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వివరాలను డీఎస్డీఓ కార్యాలయానికి తెలియజేయాలని ఆయన తెలియజేశారు. అసంపూర్తి ఇళ్లకు ఆర్థిక సాయం పెనగలూరు: గతంలో పక్కా ఇళ్లు మంజూరై, వివిధ కారణాల వల్ల నిర్మాణ పనులు పూర్తిచేయలేకపోయిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తున్నదని పీడీ సాంబ శివయ్య తెలిపారు. బుధవారం మండలంలోని కొండూరు పంచాయతీ కేసీ ఎస్టీ సముద్రం కాలనీలో హౌసింగ్ లబ్ధిదారులతో పీడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీకి గతంలో మంజూరైన పక్కా గృహాల లబ్ధిదారులకు పాత బిల్లుతో కలిపి అదనంగా రూ. 75 వేలు కలిపి ఇస్తున్నామని తెలిపారు. పురోగతిలో ఉన్న ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం చేసేందుకు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75వేలు అదనంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ మురళీకృష్ణ, ఏఈ హరిప్రసాద్, సర్పంచ్ రామాంజులమ్మ పాల్గొన్నారు. -
ఆధునిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు
రాయచోటి : అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానం ద్వారా కేసుల దర్యాప్తులో వేగం పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులన ఆదేశించారు. బుధవారం రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్ల అధికారులతో ఎస్పీ అధ్యక్షతన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ముఖ్య నేర సంఘటనలు, వాటిపై చేపట్టిన విచారణలు, పరిష్కారాల పురోగతి తదితర అంశాలపై సమగ్ర సమీక్ష చేశారు. నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మహిళల భద్రత, మైనర్లపై జరుగుతున్న అకృత్యాల నిరోధం, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వ్యాప్తి అడ్డుకోవడం, మైనర్లు వాహనాలు నడపకుండా కఠిన చర్యలు, రౌడీషీటర్లపై నిఘా పెంచి కార్యకలాపాలను అణచివేయాలన్నారు. కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేసే వారిని అరికట్టడం, సైబర్ నేరాలు తగ్గించడం వంటి పలు అంశాలపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ల పనితీరుపై పరిశీలన చేపట్టి ప్రజలతో మరింత సన్నిహితంగా ఉండే విధంగా ప్రజాసేవ దృక్పథంతో పనిచేయాలని సూచించారు. సమిష్టి కృషి, సమన్వయంతో పనిచేసి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రాయచోటి అర్బన్, రూరల్ సీఐలు బీవీ చలపతి, ఎన్.వరప్రసాద్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మర్రి తులసీరామ్, ఎస్ఐలు పాల్గొన్నారు. నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
స్కూటీని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
కమలాపురం : కమలాపురం రైల్వే గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని రాం నగర్కు చెందిన మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాం నగర్కు చెందిన సరోజ(48) తన కూతురు మౌనికతో కలసి స్కూటీలో క్రాస్ రోడ్డు నుంచి కమలాపురం పట్టణంలోకి వెళ్తుండగా రైల్వే గేటు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు స్కూటీని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సరోజ స్కూటీ నుంచి కింద పడింది. ట్రాక్టర్ టైర్ తలపై ఎక్కడంతో సరోజ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ విద్యా సాగర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుమార్తె మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా సరోజ మృతి చెందిన విషయం తెలియడంతో రాం నగర్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై బుగ్గలేటిపల్లె గ్రామం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లె మౌలాలి(19), వెంకట జగదీశ్వర్ (20) అనే ఇరువురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మూలవంక గ్రామానికి చెందిన వేంపల్లె మౌలాలి, అతని స్నేహితుడు వెంకట జగదీశ్వర్తో కలిసి మంగళవారం రాత్రి బుగ్గలేటిపల్లె వద్ద డాబాకు భోజనానికి వెళ్లి తిరిగి ఇంటికి బైకుపై వస్తుండగా విష్ణు విద్యామందిర్ స్కూల్కు వద్ద రాయచోటి వైపు నుంచి కడపకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వేంపల్లె మౌలాలి, వెంకట జగదీశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. వెంకట జగదీశ్వర్ అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. వేంపల్లె మౌలాలి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీంతో మూలవంక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకట జగదీశ్వర్ బెంగళూరులో బీబీఏ చదువుతున్నాడు. తండ్రి కరోనా కాలంలో మృతి చెందాడు. ఏకై క కుమారుడు కావడంతో తల్లి, అక్క హృదయవిదారకంగా విలపించారు. మౌలాలి బీకాం చదువుతూ పారిశ్రామిక సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వక్ఫ్ పరిరక్షణ కమిటీ(జేఏసీ) జిల్లా కన్వీనర్ అహ్మద్ బాబు బాయ్ పేర్కొన్నారు. బుధవారం ఆప్కీ ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల ప్రకారం పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ జిల్లా మీడియా ఇన్చార్జి మగ్బూల్ బాషా మాట్లాడుతూ త్వరలో మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్కీ ఆవాజ్ నగర ఉపాధ్యక్షుడు ఆబిద్ హుస్సేన్. జేఏసీ కో కన్వీనర్లు రిజ్వానా, మెహనూర్, ఫాతిమా, నిరోఫర్, అక్కర్నిసా, హసీనా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ముగ్గురు అంతర్ జిల్లా బైక్ దొంగలు అరెస్టు
మైదుకూరు : వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో బైకులను దొంగతనం చేస్తున్న ముగ్గురు అంతర్ జిల్లా బైక్ దొంగలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 27 బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద గత నెల 21న ఓ విద్యార్థికి చెందిన స్కూటీ చోరీకి గురైంది. ఆ మేరకు చాపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశంతో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక బృందాన్ని నియమించారు. ప్రొబేషన్ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ జె.శివశంకర్, చాపాడు ఎస్ఐ కె.చిన్న పెద్దయ్యలకు అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం చాపాడు మండలం అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు, మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీని చేపట్టారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు మోటారు బైక్లపై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. విచారణలో పట్టుబడిన వారు జిల్లాలోని లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన కర్ణ పవన్ కుమార్ రెడ్డి, కర్ణ లోకనాథ్రెడ్డి, పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన గంగిరెడ్డి అశోక్రెడ్డిగా తేలారు. వీరు బైక్లను దొంగిలింస్తుంటారని తెలిసింది. మార్చి 21వ తేదీన సీబీఐటీ కాలేజీ వద్ద స్కూటీని తామే చోరీ చేసినట్లు వారు అంగీకరించారు. మరింత లోతుగా విచారించడంతో సత్యసాయి జిల్లా కదిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, తొండూరు, పులివెందుల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 27 బైక్లను చోరీ చేసినట్లు వెల్లడించారు. చోరీ చేసిన బైకులను విక్రయించేందుకు వెలిగండ్ల గ్రామంలో దాచి ఉంచినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రొబేషన డీఎస్పీ టి.భవాని నిందితులను, బైకులను చూపించారు. మరో రెండు బైకులను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ ఆదేశాల మేరకు బైక్ దొంగడలను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన చాపాడు పోలీసులు వి.బ్రహ్మేంద్ర, మధుసూదన్రెడ్డి, సబ్ డివిజన్ క్రైం పార్టీకి చెందిన పోలీసులు తిరుమలయ్య, నవీన్, గణేష్, ప్రసాద్, రాఘవరెడ్డిలను అభినందించి వారికి రివార్డులను అందజేశారు. సమావేశంలో రూరల్ సీఐ శివశంకర్, చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య పాల్గొన్నారు. 27 ౖబైకులు స్వాధీనం వివరాలను వెల్లడించిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ -
చిరుతను చంపింది ఎవరు.?
మదనపల్లె : మండలంలోని పొన్నూటిపాళ్యం అటవీ ప్రాంతంలో బుధవారం వేటగాళ్ల ఉచ్చులో చనిపోయిన చిరుత విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరుతను బతికించే అవకాశాలు కళ్ల ముందే ఉన్నప్పటికీ, ఫారెస్ట్ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి కనబరచడంతోనే వన్యప్రాణి చనిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పొన్నూటిపాళ్యం గ్రామస్తులు మాట్లాడుతూ...చిరుత ఉచ్చులో పడిన విషయం ఉదయం 6 గంటలకే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు ఉదయం 8 గంటలకే ఘటనా స్థలానికి చేరుకోగా, ఫారెస్ట్ అధికారులు మాత్రం 9 గంటలపైన వెటర్నరీ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. వచ్చిన వెంటనే చిరుతను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టకపోగా, అక్కడ ఉన్న జనాలను అదుపుచేయడం, ఏం చేయాలనే విషయమై చర్చించడంలోనే సమయం వృథా చేశారన్నారు. చిరుతను బంధించేందుకు వల, బోనును తీసుకువచ్చిన ఫారెస్ట్ అధికారులు డార్టింగ్ గన్ సహాయంతో ట్రాంక్విలైజర్స్ ద్వారా మత్తుమందు ఇంజెక్ట్ చేసి కాపాడాలని నిర్ణయించారు. అయితే ఫారెస్ట్ అధికారులు తెచ్చిన గన్కు మత్తు మందు ఎక్కించడం, దానిని ఉపయోగించడంపై అధికారులకు అవగాహన లేకపోవడం, సమయానికి అది కాస్తా పనిచేయకపోవడంతో మరింత సమయం వృథా అయింది. చిరుత ఉచ్చులో తగులుకుని విలవిలలాడటాన్ని చూసిన ప్రజల్లో నుంచి కొంతమంది, ఫారెస్ట్ అధికారులు సహకరిస్తే..తాము వలను తీసుకుని చిరుత వద్దకు వెళతామని, ఎలాగోలా విడిపించేందుకు సహకరిస్తామని చెప్పినా అధికారులు అంగీకరించలేదు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో దప్పికతో అల్లాడుతున్న చిరుతకు నీళ్లు అందిస్తామన్నా ఒప్పుకోలేదు. చిరుత భయపడుతోందని, దానికేమీ కాదని, తిరుపతి జూపార్కు చీఫ్ కన్జర్వేటర్కు సమాచారం అందించామని, వారు వచ్చి రక్షిస్తారని చెప్పుకొచ్చా రు. అయితే ఉచ్చులో బిగుసుకున్న చిరుత దాదాపు 8 గంటలకు పైగా నరకయాతన పడుతూ, ఒంటిపై ఉన్న గాయాల బాధను భరించలేక, ఊపిరాడక మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చనిపోయింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఆవేశం పట్టలేక ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో సబ్ డీఎఫ్ఓ...ఉచ్చులు వేసిన వారిదే తప్పని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించే బదులు.. అడవుల్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ ఎఫ్బీఓ, ఏబీఓ, సెక్షన్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కార్యాలయాలకే పరిమితం కావడంతో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయన్నారు. ఘటనలు జరిగిన ప్పుడు ఫారెస్ట్ అధికారులు స్పందిస్తున్నారే తప్ప జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వేటగాళ్ల ఉచ్చులో ప్రాణాలు కోల్పోయిన చిరుత గర్భిణి కావడం, రెండు మగకూనలు కడుపులోనే చనిపోవడంతో సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. అయ్యో..అధికారులు సరైన రీతిలో స్పందించి ఉంటే చిరుత ప్రాణాలతో పాటు మరో రెండు చిరుతలు బతికేవన్నారు. ఎక్విప్మెంట్ లేకపోవడంతోనే.. ఫారెస్ట్ అధికారి సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు చిరుత మృతి ఘటనపై మాట్లాడుతూ... చిరుతను ఉచ్చు నుంచి తప్పించి, బోను సహాయంతో అడవిలోకి వదలిపెడదామని ప్రయత్నించామన్నారు. అయితే తమ వద్ద రెస్క్యూకు సంబంధించి సరైన ఎక్విప్మెంట్స్, నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఇదే విషయాన్ని తిరుపతి జూ చీఫ్ కన్జర్వేటర్కు విషయం తెలిపితే.. ఆయన సాయంత్రం 4 గంటల తర్వాత చిరుత ఇన్యాక్టివ్ అవుతుందని, తర్వాత రక్షించవచ్చని తెలిపి, తాము వస్తున్నట్లుగా తెలిపారన్నారు. ఈలోపు జరగాల్సిన అనర్థం జరిగిపోయిందన్నారు. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడం, వన్యప్రాణుల సంచారానికి ఆటంకం కలిగించడం చట్టరీత్యానేరమని, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నాన్బెయిలబుల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొన్నూటిపాళ్యం అడవిలో ఉచ్చులు ఎవరు, ఎందుకు వేశారనే విషయమై సమగ్ర విచారణ చేస్తామన్నారు. వేటగాళ్లా.. అధికారులా.! ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే అంటున్న ప్రజలు గర్భిణి చిరుత కూనలతో సహా చనిపోవడంపై సర్వత్రా ఆవేదన ఉచ్చువేసిన వేటగాళ్లపై కఠినచర్యలు సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు చిరుత మరణించిన ఘటనపై విచారణ జరిపించాలి – సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మదనపల్లి మండలం, పొన్నూటిపాళ్యం సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉచ్చులో చిక్కుకున్న చిరుతను రక్షించడంలో అటవీ అధికారులు తీవ్ర వైఫల్యం చెందారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత ఉచ్చుకు చిక్కుకుంటే దానిని కాపాడడంలో అధికారుల వైఫల్యం కళ్లకు కట్టినట్టు కనబడుతోందని ఆరోపించారు. ఉచ్చులో తగులుకున్న చిరుతను కాపాడలేకపోయిన అధికారులు, ఒకవేళ అదే చిరుత జనావాసాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వీరబల్లి మండలంలో చిరుతపులి సంచారం – భయాందోళనలో ప్రజలు వీరబల్లి : మండలంలోని సుగాలి తాండా సమీపంలో గత వారం రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. చిరుతపులి మేకలను వెంటాడి ఎత్తుకెళ్లిన ఘటనలు జరిగాయి. మంగళవారం అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే రైతు పొలంలో వెళ్తుండగా చిరుతపులి కనిపించడంతో భయాందోళనకు గురై ఇంటిలోకి పరుగులు తీశాడు. ఇంత జరుగుతున్నా ఫారెస్టు సిబ్బంది మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అరుదైన శస్త్ర చికిత్సతో ప్రాణాలు పోశారు
రాయచోటి టౌన్ : ఒకప్పుడు రాయచోటిలో చిన్న పాటి చికిత్స చేయాలన్నా సరైన వైద్య నిపుణులు లేక తిరుపతి, కడప లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే రాయచోటిలో కూడా కార్పొరేట్ స్థాయిలో శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాయచోటి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని 100 గదుల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో దాదాపుగా రూ.25కోట్లు ఖర్చు చేసి పెద్ద భవనాలు నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే వైద్యులను నియమించడంతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో.. గాలివీడు మండలానికి చెందిన శృతి అనే పేద మహిళ మొదటి కాన్పు సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి శస్త్ర చికిత్స ద్వారా మొదటి కాన్పు జరుపుకొంది. ఆ సమయంలో ఆ సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ మలం, మూత్రం రెండు ఒకే దారిలో రావడం మొదలయ్యాయి. దీనిని రెక్టో వేజైనల్ ఫిస్టులా అంటారు. అసలే పేద కుటుంబం కావడంతో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకోలేక తీవ్ర మనోవేదనను అనుభవించింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం రెండవ కాన్పు కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తన తల్లితో కలసి వచ్చింది. ఈ విషయం ఆస్పత్రి వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. సాధారణ కాన్పు చేసిన వైద్యులు తరువాత ఆమెకు ఉన్న పెద్ద సమస్యను కూడా గుర్తించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ జీనత్ బేగం, శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్, అనస్థీషియా డాక్టర్, ఇతర వైద్యులు కలిసి చర్చించారు. ఆమెకు ఉన్న సమస్యను పరిష్కరించాలంటే ఆపరేషన్ ఒక్కటే మార్గమని తీర్మానించారు. అందుకు ఆమె అంగీకారం తీసుకుని వెంటనే ఆమెకు డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ జీనత్ బేగం, డాక్టర్ బండారు కిరణ్కుమార్, డాక్టర్ శివ, డాక్టర్ అజాజ్ అహమ్మద్తో కలసి ఆపరేషన్ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఆస్పత్రిలో... రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలో ఒకే రోజు రెండు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి ప్రాణదానం చేశారు. గాలివీడుకు చెందిన బాలుడు నీటి కుంటలో పడిన సమయంలో ఊపిరి ఆడక పోవడంతో పాటు అదే సమయానికి గుండెకు ఆక్సిజన్ అందకపోవడంతో గుండె పోటు వచ్చింది. స్థానికులు గమనించి రాయచోటికి తరలించారు. శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి స్పందించి ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. అలాగే మంగళవారం రాత్రి ఒక మధ్య వయస్సు వ్యక్తి కంటి కింద దవడ భాగం తీవ్రంగా బాధిస్తోందని చెప్పడంతో స్కానింగ్ చేసి బ్లాక్ ఫాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే హైదరాబాద్కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల సలహా మేరకు వారి పర్యవేక్షణలో ఆపరేషన్ చేసి దవడ ఎముక తొలగించి దాని స్థానంలో మరొకటి అమర్చారు. -
పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?
– ఐదుగురిపై ఫిర్యాదు, కేసు నమోదు కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్టప్ సర్కిల్ వద్ద పులివెందుల రోడ్డులో మద్యం దుకాణం వద్ద అత్యంత కిరాతకంగా సాదిక్ వలి(30) అనే వ్యక్తిని మరియాపురానికి చెందిన రాయప్ప అలియాస్ పెద్దోడు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజీలను సేకరించారు. హత్య చేసిన వారిలో రాయప్పతో పాటు, కాలియా, బాలస్వామి అలియాస్ బాలదాసులు, మరో ఇద్దరు ఉన్నట్లు సాదిక్వలీ భార్య యాస్మిన్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మహిళపై దాడి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మాలెపాడు గ్రామానికి చెందిన కుప్పన్నగారి సుబ్బమ్మపై భూమి సమస్య విషయమై కె.క్రిష్ణారెడ్డి అనే వ్యక్తి దాడి చేసి బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు బుధవారం తెలిపారు. సుబ్బమ్మ, క్రిష్ణారెడ్డిల మధ్య భూ విషయంపై సమస్య ఉంది. సుబ్బమ్మ భర్త ఉషిరెడ్డి చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. ఇంటిలో సుబ్బమ్మ ఒంటరిగా ఉంటోంది. అయితే భూ సమస్య విషయంపై సుబ్బమ్మ ఇంటిపై క్రిష్ణారెడ్డి దాడి చేసి బెదిరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళ్లమాపురంలో చోరీ యత్నం – అడ్డు వచ్చిన యువతిపై దాడి చేసిన దుండగులు ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని తాళ్లమాపురం గ్రామంలో దుండగులు ఓ ఇంట్లో చోరీ యత్నం చేశారు. అయితే దుండగుల అ ్చటకిడిని గ్రహించి కుటుంబ సభ్యులు నిద్రలేవడంతో వారు పారిపోయారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లమాపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబ సభ్యులతో కలిసి అతను ప్రతిరోజు రాత్రి ఆరుబయట పడుకుంటాడు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటి ప్రహరీ దూకారు. అక్కడే ఉన్న కుక్క వారిని చూసి మొరగడంతో సుబ్బారెడ్డి కుమార్తె వెంకటలక్ష్మి నిద్ర లేచింది. దుండగులను చూసి ఆమె దొంగా దొంగా అంటూ గట్టిగా కేకలు వేసింది. దీంతో దుండగులు అక్కడే ఉన్న కట్టె తీసుకొని ఆమె తలపై కొట్టి పారిపోయారు. రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వెంకటలక్ష్మిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గాలివానకు కూలిన విద్యుత్ స్తంభాలు కురబలకోట : మండలంలో బుధవారం రాత్రి గాలి వానకు దొమ్మన్నబావి ప్రాంతంలో లెవన్ కేవీ లైన్కు చెందిన మూడు విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. వెంటనే విద్యుత్ సరఫరాను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పరిసర ప్రాంతాలతో పాటు నాయనబావి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంగళ్లులో కూడా విద్యుత్ వైర్లపై కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. హుటాహుటిన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్కో ఏఈ తెలిపారు. -
అమృత్ భారత్ స్కీం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
రాజంపేట : రాజంపేట రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్కీం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని గంతకల్లు డివిజన్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్గుప్తా ఆదేశించారు. బుధవారం రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డీఆర్ఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న పనుల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పన దిశగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. రైల్లో బోగీలకు సంబంధించి డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వెయిటింగ్ హాల్, స్టేషన్ బయట జరుగుతున్న పనుల నిర్మాణ దశలపై ఆరా తీశారు. డీఆర్ఎంతో పాటు సీనియర్ డీసీఎం మనోజ్, ఏడీఎన్ అహ్మదుల్లా, పలువురు డివిజన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డీఆర్ఎం దృష్టికి పలు సమస్యలు.. రాజంపేట రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా పార్సిల్ కేంద్రాన్ని పునరుద్ధరించాలని గంతకల్ డివిజనల్ రైల్వే యూజెస్ కమిటీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి కోరారు. డీఆర్ఎం రాజంపేటకు వచ్చిన సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజంపేట రైల్వే స్టేషన్లో పార్సిల్ కేంద్రం ఉండటం వల్ల ఈ ప్రాంత రైతుల ఉద్యాన వన ఉత్పత్తులకు దోహద పడుతుందన్నారు. ఇందుకు డీఆర్ఎం సానుకూలంగా స్పందించారు. పలురైల్లు హాల్టింగ్ అంశాన్ని మరోసారి డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో సీనియర్ డీఈఈ యల్లయ్య, సీనియర్ డీఈఎన్ అభిరామ్, కడప సీసీఐ జనార్దన్, రాజంపేట రైల్వే స్టేషన్ మేనేజర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్గుప్త -
●నష్టపరిహారం అందించాలి
రామాపురం: గాలివాన ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రాంగారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలో నష్టపోయిన పంటలను రైతు సంఘం నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో.. రైతాంగం మామిడి తోటలను బిడ్డల్లాగా పెంచుకుంటున్నారని తెలిపారు. అలాంటి తరుణంలో అకాల గాలివానతో చెట్లు వేర్లతో సహా నేలకు ఒరగడంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. బోర్ల కింద సాగు చేసిన పొద్దుతిరుగుడు, వరి పంటలు నేలమట్టం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు షబ్బీర్బాషా, శివారెడ్డి, లక్ష్మిరెడ్డి, కిరణ్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రామ్మోహన్, మదన్, యువరాజు, రైతులు పాల్గొన్నారు. -
రక్తమోడుతున్న రోడ్లు
సాక్షి రాయచోటి: ప్రయాణం ప్రమాదంగా మారుతోంది. ప్రతి నిత్యం రోడ్లు రక్తమోడుతున్నాయి. ఎక్కడ చూసినా ఎర్రటి ఎండలకు తోడు నడిరోడ్డుపై జరుగుతున్న ప్రమాద ఘంటికలు వేడి పుట్టిస్తున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులతోపాటు సాధారణ రోడ్లపై కూడా ప్రమాదం నిత్యకృత్యమైంది. బయటికి వచ్చి రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మత్తు ఏదైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. దేవాలయాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు, వేడుకలు, విహార యాత్రలు, కర్మకాండలు, ఇతర బంధువులు, స్నేహితుల వద్దకు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా.. జాగ్రత్తగా ఉంటున్నా కూడా చిన్నపాటి పొరపాటు, గ్రహపాటు కారణంగా మృత్యువు కబళిస్తోంది. అంతేకాకుంగా వేగం కూడా ఒక్కోసారి అదుపు తప్పడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భయం.. భయం అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా కడప–రేణిగుంట రహదారితోపాటు కడప వయా రాయచోటి, పీలేరు, చిత్తూరు రహదారితోపాటు మదనపల్లె, పీలేరు జాతీయ రహదారులు ఉన్నాయి. అవి కాకుండా అనేక రహదారులు ఉన్నాయి. అయితే ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళిస్తోంది. ఇప్పటికే ఒక్క ఏడాదిలోనే సుమారు 380కి పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, 1200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 635 మందికి పైగా గాయపడిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కువ జాతీయ రహదారులపైనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో జాతీయ రహదారులపై అనేక చోట్ల అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోపోవడంతో, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. ఇటీవల పెరుగుతున్న ప్రమాదాలు రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడంతో సమస్య వాహనదారులను చైతన్యం చేయాల్సిన అవసరం అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు -
‘గిన్నిస్’లో చోటు
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణానికి చెందిన జి.శివసాయి నాగేంద్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. ఈ విషయాన్ని ఆ యువకుడు మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. గతేడాది డిసెంబర్ 1న మిస్టర్ అగస్టిన్, దండిగి వేణుగోపాల్, హల్లెలూయ సంగీత పాఠశాలల ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా గంట వ్యవధిలో కీబోర్డు వాయించే పోటీ ఏర్పాటు చేశారు. ఇందులో దేశ వ్యాప్తంగా 1046 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కీబోర్డు వాయించి అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయడంతో ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ నెల 14న సంస్థ ప్రతినిధులు హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని అందజేశారు. నృత్య ప్రదర్శనలో ప్రతిభ మదనపల్లె: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పట్టణానికి చెందిన శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్.జైత్రమాధుర్ చోటు దక్కించుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన శాసీ్త్రయ నృత్యప్రదర్శనలో 4,218 మంది పాల్గొనగా, అందులో జైత్ర మాధుర్ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. శ్రీ లలిత కళా ఆర్ట్స్ ఆధ్వర్యంలో గురువు బాలాజీ పర్యవేక్షణలో ఐదేళ్లుగా నృత్యశిక్షణ పొందుతున్నాడు. కళాశాల విద్యార్థి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడంపై కరస్పాండెంట్ డాక్టర్.ఆర్.గురుప్రసాద్, ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, ప్రిన్సిపాల్ రాటకొండ వెంకటాచలపతి అభినందనలు తెలిపారు. ఉపాధిలో పండ్ల తోటలకు ప్రాధాన్యం కేవీపల్లె: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీడీ వెంకటరత్నం అన్నారు. మంగళవారం మండలంలోని గ్యారంపల్లె పంచాయతీలో ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025–26 సంవత్సరానికి పండ్ల తోటలు పెట్టుకోవడానికి ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతి కూలీకి 100 రోజుల పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాదిలో కూలీలకు రూ. 300 దినసరి కూలీ కాగా ప్రస్తుతం రూ.307కు పెంచినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
పువ్వులు విరిసె.. సీతాపతి మురిసె
ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రామయ్య సన్నిధిలో మంగళవారం సాయంత్రం పుష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన నయనమనోహరమైన పుష్పాలతో దాశరథిని అర్చించారు. ఈ కమనీయ ఘట్టాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయత్వం పొందారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ జరిగింది. ఆలయశుద్ధి, ఆరాధన చేపట్టారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం 5:30 గంటలకు ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పుష్పప్రదర్శన చేశారు. బెంగళూరు, నాగర్కోయిల్, శ్రీరంగం, చైన్నె, తిరుపతి, కడప నగరాల నుంచి 2.5 టన్నుల 14 రకాల పూలు, 6 రకాల పత్రాలు తెప్పించారు. గులాబి, చామంతి, నూరువరహాలు, సంపంగి, మల్లె, గన్నేరు, మొగలిరేకులు, కనకాంబరాలు, తామర పూలు తీసుకువచ్చారు. తులసిదళాలు, దవనం, పన్నీరు, మరవం పత్రాలతో సీతారామలక్ష్మణ మూర్తులకు పుష్ప నీరాజనం చేశారు. ఈ యాగం నిర్వహించడంతో సమస్త దోషాలు తొలగిపోతాయని వేదపండితులు రాజేష్ భట్టార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.శ్రీ కోదండ రామాలయంలో నయనానందకరంగా పుష్పయాగం -
రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి రాయచోటి: అకాల వర్షాలు, ఈదురు గాలులతో రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం రాయచోటిలో పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందివ్వాలని కోరారు. మామిడి పంట ప్రారంభ దశలో మంచు ప్రభావంతో పూత రాలిపోయిందన్నారు. అంతో ఇంతో పూత నిలిచి పిందె పట్టినా ఎక్కువ ఎండలు వల్ల అవీ రాలిపోయాయన్నారు. మందులు కొట్టి అరకొరగా పిందెలు నిలబెట్టుకుని దిగుబడి వస్తున్న తరణంలో.. అకాల వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మామిడి పంటకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత భీమా పథకం ద్వారా ఎకరాకు ప్రీమియం రూ. 2250 చొప్పున కట్టించుకుందని తెలిపారు. మామిడి రైతులపై మానవతా దృక్పథంతో మామిడి పంటకు బీమా చేయని వారికి కూడా పరిహారం అందించాలన్నారు. ఖరీప్, రబీ సీజన్లలో పంటలు రాక తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతన్నలకు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులతో మరిన్ని కష్టాలు తోడయ్యాయన్నారు. ఉద్యానవన శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్న వివరాలను సేకరించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని కోరారు. -
మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక చర్యలు
రాయచోటి : జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి అన్నారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన వ్యూహాలు, ప్రణాళికల అమలు గురించి చర్చించామని, జిల్లాలో మాదక ద్రవ్యాల సమస్య సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ బృందం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. టోల్ ఫ్రీ హెల్ప్లైన్ 1972 ద్వారా సమాచారం సేకరించడం, మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈగల్ టీమ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మందుల షాపుల్లో డాక్టర్ రసీదు లేకుండా మందులు ఇవ్వరాదని సూచించారు. మాదక ద్రవ్యాల నివారణకు నిపుణులు, మానసిక ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.సుబ్రహ్మణ్యం, డీఎంఅండ్హెచ్ఓ జి.ఉషశ్రీ, రాయచోటి జైల్స్ సూపరిటెండెంట్ ఉమామహేశ్వర రావు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎస్.జయరాముడు, ఎకై ్సజ్ సూపరిటెండెంట్ జి.మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.మస్తాన్వలి డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.తులసీరామ్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి -
కడపలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
కడప అర్బన్ : పాత కక్షలతో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి.. గొంతు కోసి దారుణంగా హతమార్చిన సంఘటన మంగళవారం సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కడప నగరం రవీంద్రనగర్ మరాఠివీధికి చెందిన సాదిక్ వలి(30)ని బిల్డప్ వద్ద నడిరోడ్డుపై మంగళవారం దారుణంగా హత్య చేశారు. కడపలోని మరాఠీ వీధిలో నివాసముంటున్న సాదిక్వలికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పాత బస్టాండులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో ఇతడు బిల్టప్ సమీపంలోని పుత్తా ఎస్టేట్స్ సమీపంలో వెంకటేశ్వర్లు అనే యువకుడిని దారుణంగా మద్యం సీసాతో గొంతు కోసి చంపిన కేసులో నిందితుడిగా వున్నారు. ఆ హత్యకేసులో అరెస్టయిన ప్రస్తుత మృతుడు సాదిక్వలి బెయిల్పై ఇటీవల విడుదలై వచ్చాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పరిశీలించారు. హత్యకు పాల్పడిన వారు నలుగురు లేదా ఐదుగురు వుండవచ్చని భావిస్తున్నారు. నిందితులు పరారీలో వున్నారు. మృత దేహం వద్ద బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. నిందితులకు సంబంధించిన పుటేజీని పోలీసులు సేకరించారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసుబృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పాత కక్షలతోనే ఈ హత్య జరిగి వుంటుందని భావిస్తున్నారు. పాత కక్షలతోనే కత్తితో గొంతుకోసి దారుణంగా చంపారు సంఘటన స్థలంలో పరిశీలించిన కడప తాలూకా పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు -
టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు..!
కురబలకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. హార్సిలీ హిల్స్లో ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ముందే ఈ నెల 13న టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతోపాటు పరస్పరం తన్నుకున్న విషయం తెలిసిందే. అది ఇంకా మరువక మునుపే కురబలకోట మండలంలో అన్నమయ్య జిల్లా టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్కు చెందిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ చించివేయడం రోడ్డుపక్కన విసిరివేయడం లాంటివి చేశారు. ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పర్యటన పురస్కరించుకుని ఆయనను స్వాగతిస్తూ ఇటీవల హైవే పొడవునా కంటేవారిపల్లె నుంచి చెన్నామర్రి మిట్ట, దొమ్మన్నబావి, విశ్వం కళాశాల సర్కిల్ తదితర ప్రాంతాలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అక్కసుతో వాటిని ఎక్కడికక్కడ చించి వేశారు. ఈ మార్గంలో సీసీ పుటేజీలు పరిశీలించి ఫ్లెక్సీల చించివేత, తొలగింపు కారకులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సురేంద్ర యాదవ్ మంగళవారం ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుడితో తీవ్రంగా విభేదిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడలకు పార్టీలో ఓ వర్గం నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది జీర్ణించుకోలేక అతని ప్రమేయంతోనే సురేంద్ర యాదవ్ ఫ్లెక్సీలను చించివేయడం, తొలగించడం లాంటివి చేసి ఉంటారని భావిస్తున్నారు. నియోజక వర్గంలోని టీడీపీ వర్గ పోరు రచ్చకెక్కడంతో అది కాస్తా చర్చనీయాంశంగా మారింది. రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడి ఫ్లెక్సీలు చించివేత సురేంద్ర యాదవ్ పోలీసులకు ఫిర్యాదు -
రాజధాని సెంటిమెట్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం
మదనపల్లె : రాష్ట్ర రాజధాని అమరావతి సెంటిమెంట్తో ఇప్పటికే రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు.. తాజాగా విస్తరణ పేరుతో మరో 44 వేల ఎకరాల భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధమవుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్ అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ....ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు, రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెర తీశారన్నారు. మూడు వాణిజ్యపంటలు పండే ఎంతో సారవంతమైన 34,568 ఎకరాల భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలో చంద్రబాబు సేకరించారన్నారు. ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్లో బొమ్మలు చూపించి, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు మినహా ఎలాంటి ప్రగతి చూపలేదన్నారు. రైతులు ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కాలం గడిపేసి, నేడు మరోసారి రాజధాని విస్తరణ పేరుతో మరో 44 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కునేందుకు సిద్ధమయ్యారన్నారు. వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కేటాయించి సొమ్ము చేసుకునేందుకు పావులు కదుపుతున్నారన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయన్నారు. భూములు కోల్పోతున్న రైతుల్లో అధికభాగం ఎస్సీ, ఎస్టీ సామాజిక చెందిన వ్యక్తులు ఉండటంతో వారి జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్ -
రేషన్ కార్డులున్నాయ్.. బియ్యం ఇవ్వరేం?
సిద్దవటం : ‘రేషన్ కార్డులున్నాయ్.. తాము తీసుకోకుండా బియ్యం ఎక్కడికి పోతాయ్.. ఎప్పుడు డీలర్ షాపునకు వెళ్లి అడిగినా లేవంటూ సమాధానం చెబుతున్నారు’. అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మాధవరం–2 సచివాలయం వద్ద రేషన్ కార్డులు చేతపట్టుకొని మహిళలు మంగళ వారం ఆందోళన చేపట్టారు. స్థానిక వీఆర్వో రజనీకి సమస్యలను విన్నవించారు. వారు మాట్లాడుతూ మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్కేఆర్ నగర్, బంగారుపేట గ్రామాలకు చెందిన రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ చేయలేదని తెలిపారు. తమ ప్రాంతానికి చెందిన 15వ రేషన్ షాపునకు ఎప్పుడు వెళ్లినా బియ్యం లేవంటున్నారని, డీలర్ సరైన సమాధానం ఇవ్వడంలేదని ఆరోపించారు. చాలామంది పేదలు స్టోర్ బియ్యంపై ఆధారపడి జీవిస్తున్నారని, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమకు బియ్యం అందేలా చూడాలని వారు కోరారు. -
ఘర్షణ కేసులో 20 మందిపై కేసు నమోదు
కేవీపల్లె : ఇరువర్గాల ఘర్షణ కేసులో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న రెడ్డెప్ప తెలిపారు. వివరాలిలా వున్నాయి. మండలంలోని తిమ్మాపురానికి చెందిన రెండు వర్గాలు సోమవారం ఇసుక విషయమై గొడవ పడ్డారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో పదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓ వర్గానికి చెందిన భారతి, మరో వర్గానికి చెందిన తిమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు కింద పడి ఒకరు మృతి నందలూరు : నందలూరు రైల్వే కేంద్రంలో కలగట్ల సిద్ధయ్య(45) గూడ్స్ రైలు క్రింద పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ సుభాన్ వివరాల మేరకు.. పోరుమావిళ్ల ప్రాంతానికి చెందిన సిద్దయ్య రైలు క్రిందపడి మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించడం జరిగిందన్నారు. ఓబులవారిపల్లెలో.. ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని పున్నాటివారిపల్లి రైల్వే గేట్ సమీపంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ రైలు క్రిందపడి షేక్ అహ్మద్ వలి(40) మృతి చెందారు. ముక్కవారిపల్లి తురకపల్లి గ్రామానికి చెందిన అహ్మద్వలి బేల్దారి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు రేణిగుంట సీఆర్పీఎస్ ఎస్ఐ శివ తెలిపారు. -
ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ
నందలూరు : డబ్బు విషయమై మండలంలోని ఆడపూరు గ్రామంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. సంగీతం టీచర్ ఈశ్వరమ్మకు పార్ట్టైమ్ తెలుగు టీచర్ శ్రీదేవి కొంత నగదు ఇతరులతో ఇప్పించారు. ఆ డబ్బు అడగడంతో ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు.. ఐదు నెలలు తరువాత ఇస్తానని ఈశ్వరమ్మ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది. ప్రిన్సిపల్ ఎదుట ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ విషయం పోలీసుల వరకు వెళ్లినట్లు సమాచారం. మద్దతు ధరకే కందుల కొనుగోలు రాయచోటి జగదాంబ సెంటర్ : రైతుల నుంచి మద్ధతు ధరకే కంది కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ త్యాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ ఆధ్వర్యంలో కంది పండించి... ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి అన్నమయ్య జిల్లా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, నిమ్మనపల్లె, ములకలచెరువులోని కేంద్రాలలో క్వింటా రూ.7550కే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 144 మంది రైతుల నుంచి 55.90ఎంటీల కందులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.15లక్షలు 47 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని, మరో 73 మంది రైతులకు సంబంధించి రూ.17 లక్షలు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కందుల సొమ్ము వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపారు. ఈత సరదా.. ప్రాణం తీసింది అట్లూరు : సోదరుడితో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలిక తేజశ్విని(14) నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు.. బంధువుల వివరాల మేరకు.. అట్లూరు మండలం కమలకూరు గ్రామానికి చెందిన చిట్టిబోయిన సిద్దయ్య(శివప్రసాద్), సుబద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారి ద్వితీయ కుమార్తె తేజశ్విని తొమ్మిదో తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం పొలాలకు వెళ్లింది. పొలం సమీపంలో ఉన్న కమలకూరు ఆనకట్ట వద్ద నీరు పుష్కలంగా ఉండడంతో సరదాగా ఈత కొట్టాలని అనుకుంది. తమ్ముడు నానితో కలిసి ఆనకట్ట వద్దకు వెళ్లి ప్లాస్టిక్ డబ్బాల సాయంతో నీటిలోకి దిగింది. ప్రమాదవశాత్తూ డబ్బా ఊడిపోయి అక్క నీట మునగడం చూసిన తమ్ముడు నాని కుటుంబీకుల వద్దకు వెళ్లి చెప్పారు. వారు హుటాహుటిని వచ్చి చూసేలోగా తేజశ్విని మృతిచెందిందని ఆమె బంధువులు తెలిపారు. అంతకుముందు అందరితో కలిసి సామూహికంగా బోజనం చేసి ఈతకు వెళ్లిన కుమార్తె ఇంతలోనే మృతిచెందడంతో తల్లి తండ్రులు రోదన స్థానికులను కలచివేసింది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. జిల్లాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని 111 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక బొలెరో క్యాంపర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఎవరైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మానవత్వం చాటుకున్న భారతి సిమెంట్ ప్రొద్దుటూరు : మండు వేసవిలో కష్టపడుతున్న భవన నిర్మాణ కార్మికులపై భారతి సిమెంట్ యాజమాన్యం మానవత్వం చూపింది. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో పలు చోట్ల పనిచేస్తున్న తాపీ మేసీ్త్రలకు వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు శీతల పానీయాలు, రక్షణ కోసం టీషర్ట్లు, టోపీలు మంగళవారం అందించింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ కె.నాగేంద్ర తాపీ మేసీ్త్రలతో మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీతో భారతి సిమెంట్ను తయారు చేస్తున్నారని, శ్లాబ్ల నిర్మాణానికి తమ సిమెంట్ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, సీనియర్ టెక్నికల్ ఇంజినీరింగ్ ఛాయాపతి, చిన్న శ్రీకాంత్రెడ్డి, భవాని శంకర్, ఉదయ కిరణ్, సాయిప్రకాష్తోపాటు తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు. -
ఆటో ద్విచక్ర వాహనం ఢీ: ఇద్దరికి గాయాలు
గాలివీడు : ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నూలివీడుకు చెందిన యోగాంజులు, పార్వతి ద్విచక్ర వాహనంపై చాకిబండలోని దేవాలయానికి వెళ్లి వస్తున్నారు. గాలివీడు– రాయచోటి ప్రధాన రహదారిలో ఆటో వస్తోంది. స్థానిక పెట్రోల్ బంక్ వద్దకు రాగానే మేకలను తప్పించబోయే ఆటో అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వృద్ధ దంపతులకు.. మదనపల్లె : పొలం వద్ద పామును చూసి భయపడి వృద్ధ దంపతులు గాయాల పాలైన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. కొండామర్రి పంచాయతీ కొటూరుకు చెందిన ఇబ్రహీం సాహెబ్ (75), అతడి భార్య మొరంబీ(70) గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అల్లనేరేడు చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్నపాటుగా చెట్టుపైకి చూడగా కొమ్మలపై పెద్ద పాము కన్పించింది. దీంతో కంగారుపడి ఇద్దరు పక్కకు దూకే క్రమంలో గుంతలో పడి గాయపడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కుమారుడిపై కత్తితో దాడి రైల్వేకోడూరు అర్బన్ : మద్యం తాగి రోజూ రచ్చ చేస్తున్నావంటూ.. కుమారుడు మందలించడంతో కోపోద్రిక్తుడైన తండ్రి మచ్చుకత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రైల్వే కోడూరు మండలం వీవీకండ్రిక పిట్టావాండ్ల గ్రామంలో నివాసముంటున్న చింతల వెంకటయ్య మంగళ వారం తెల్లవారు జామున ఫూటుగా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయనను రోజూ మద్యం తాగి రచ్చ చేస్తున్నావంటూ కొడుకు చింతల శివ మందలించాడు. తండ్రీ, కొడుకుల మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన తండ్రి వెంకటయ్య తన ఇంట్లో మచ్చుకత్తితో కొడుకుపై దాడి చేశాడు. శివ తలకు తీవ్రగాయమవడంతో హుటాహుటిన కోడూరు సామాజిక ఆరోగ్యకేంద్రంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం తిరుపతి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం మదనపల్లె : రుణదాతల ఒత్తిడి అధికం అవడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లెకు చెందిన సాదిక్ బాషా, నసీజ్తాజ్ దంపతుల కుమారుడు నయాజ్(28) బాడుగ ఆటో నడుపుతూ తల్లిని పోషించుకుంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద రూ.1.5 లక్షలు అప్పుచేశాడు. ప్రతినెలా సక్రమంగా వడ్డీలు చెల్లిస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక అవసరాలు పెరిగి ఇబ్బందులు తలెత్తడంతో ఏడు నెలల నుంచి వడ్డీలు చెల్లించలేకపోయాడు. మంగళవారం రుణదాతలు అప్పు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది ఇంటి వద్దే సుసైడ్ నోట్ రాసి ఎలుకల మందు తిని ఆత్మహత్యయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో అనారోగ్యంతో ఈ నెల 8న గుర్తుతెలియని వృద్ధురాలు(65) చికిత్స నిమిత్తం వార్డులో చేరారు. ఈ నెల 14న పరిస్థితి విషమించి మృతిచెందారు. దీంతో ఆమె మృతదేహాన్ని మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసినవారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
ముస్లింల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు
మదనపల్లె : ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. మదనపల్లె వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, ముస్లిం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరతుగా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంపై ముస్లిం సమాజం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. క్సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంపీలు మిథున్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తమకు మంచి చేస్తారని టీడీపీ, జనసేన పార్టీలకు ముస్లింలు ఓటువేస్తే ఇపుడు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపి వారి మనోభావాలు దెబ్బతీశారన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణచివేసేందుకు వక్ఫ్ చట్టానికి సవరణ చేసిందని ఆరోపించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించడంతోపాటు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముస్లింల పక్షపాతిగా నిలిచారన్నారు. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యులుగా ఉన్న నితీష్కుమార్, చంద్రబాబునాయుడు మద్దతు తెలపకుంటే బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. ఎల్లో మీడియాలో టీడీపీ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నట్లు విపరీతంగా ప్రచారం చేయించి, ఆ పార్టీ ఎంపీలతో బిల్లుకు మద్దతు ప్రకటించి మైనార్టీలను దగా చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర ప్రదేశ్లో వక్ఫ్ బిల్లు అమలు చేయమని ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ బిఏ.ఖాజా, గుండ్లూరు రఫీ, ఎంఎస్.సలీం, రహీం, నూర్ మొహిద్ధీన్ ఖాన్, యూనస్ఖాన్, ముజీబుద్ధీన్, రహంతుల్లా, షఫీ, తాజ్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్అహ్మద్ -
ముగ్గురు పిల్లలు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదు
రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల ఓబులవారిపల్లె : చిట్వేలి మండలంలో ప్రమాదవశాత్తూ ముగ్గురు పిల్లలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర అదికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రాచపల్లి గ్రామం వద్ద నీటి కుంటలో పడి మృతిచెందిన చిన్నారులు చొక్కారాజు దేవాన్స్, చొక్కారాజు విజయ్, రెడ్డిచర్ల యశ్వంత్రాజు కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రమాద విషయంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు చనిపోతే కంటి చూపు చర్యగా కుటుంబ నాయకులు వచ్చి పరామర్శించి వెళ్లారన్నారు. వారికి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అనంతరం ఎంపీటీసీ బండారు గుండయ్య తల్లి ఇటీవల మృతి చెందారని తెలుసుకుని ఆయనను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, కనకరాజు, సిద్దు రాయల్, కోటిరెడ్డి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
దార్శనికుడు బాబా సాహెబ్ అంబేడ్కర్
రాయచోటి : సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం డాక్టర్ బాబా సాహెబ్ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడన్నారు. రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని, ఆయనను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విధుల్లో పునరంకితం అవుదామని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంమలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.రాజారమేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వీజే రామకృష్ణ, ఎం.పెద్దయ్య, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
విద్యార్థి అదృశ్యం
జమ్మలమడుగు : మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన మంగపట్నం పవన్ అదృశ్యమైట్లు మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగపట్నం పవన్ జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజిలో ఇంటర్మీడియట్ సీఈసీ చదువుతున్నాడు. అయితే ఈనెల 12వతేదీ మధ్యాహ్నం కాలేజీ ఫీజు కట్టేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిపోయాడు. ఇంత వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థి తండ్రి లింగమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతికడప అర్బన్ : కడప నగరం రిమ్స్ ఆసుపత్రి సమీపంలో గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యకిత రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రిమ్స్ పోలీసుల కథనం మేరకు.. వీరపునాయునిపల్లి మండలం పాలగిరి గ్రామానికి చెందిన మల్లెం కొండ జగదీష్ (42) కడప జెడ్పీ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్లో పని చేసేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై గత నెల 27న రిమ్స్ ఆసుపత్రి సమీపంలో పురుగుల మందు తాగాడు. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆటో నిలుపుదల స్థలం కోసం ఘర్షణ ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మేకలబాలయపల్లి గ్రామంలో ఆటో నిలుపుదల చేసుకునే స్థలం విషయమై సాయిరాం, రమేష్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ మరింత ముదిరి ఆదివారం అర్థరాత్రి సాయిరాం ఇంటిపైకి రమేష్ , సురేష్లతో పాటు మరికొంత మంది కలసి దాడి చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్, సురేష్లపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మేకలబాలయపల్లి గ్రామానికి చెందిన సాయిరాం, రమేష్, సురేష్ల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే వీరి మధ్య ఆటో నిలుపుదల స్థలంపై ఆదివారం ఘర్షణ జరిగింది. అయితే అర్థరాత్రి రమేష్, సురేష్లతో పాటు మరి కొందరు కలసి కర్రలు తీసుకుని సాయిరాం ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో సాయిరాం, జయరాం, రామచంద్రుడు, రామదేవి, నాగవేణి, తేజ్రాంలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు రామచంద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష, సురేష్లతో పాటు మరి కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కలమల్ల పోలీసులు తెలిపారు. లారీలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించకుంటే సమ్మె చేస్తాం ప్రొద్దుటూరు క్రైం : ఠిలారీలపై వేస్తున్న గ్రీన్ ట్యాక్స్ను తగ్గించకుంటే సమ్మె చేయడానికై నా వెనుకాడేది లేదని ఏపీ న్యూ ఆంధ్రా మోటార్, ట్రక్కర్స్ అసోసియేషన్ (నమ్తా) జనరల్ సెక్రటరి టీవీ చలపతి తెలిపారు. స్థానిక లింగాపురంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం లారీ ఓనర్లు, డ్రైవర్లకు రవాణా చట్టాలు, సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీరో ఆక్సిడెంట్ సమాజం కోసం అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై గతంలో అనేక మార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. టోల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, గ్రీన్ ట్యాక్స్ పేరుతో విపరీతంగా డబ్బు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరుగురికి తీవ్ర గాయాలు -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
పెద్దతిప్పసముద్రం : రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. మండలంలోని చిన్నపొంగుపల్లికి చెందిన చౌడప్ప (72) బస్సులో వెళ్లేందుకు టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి క్రాస్ రోడ్డులో వేచి ఉన్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి నిలబడి ఉన్న చౌడప్పను బలంగా ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో పాస్టర్..పీలేరు రూరల్ : మండలానికి చెందిన చర్చి పాస్టర్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తూ చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన నాంపల్లె బాబు అలియాస్ మహర్షిబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు చర్చిలలో పాస్టర్గా పనిచేశారు. ఆదివారం ఉదయం పీలేరు–చిత్తూరు మార్గంలోని హెబ్రోను ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వెళ్లారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం గుండెలో నొప్పిగా ఉందని తెలిపిన కొంత సమయానికే ప్రార్థన మందిలోనే స్పృహతప్పి పడిపోయారు. గమనించిన సహచరులు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాస్టర్ మహర్షి బాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు..కలకడ : కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ, ఆర్పెంటిదిన్నె (దాసిరెడ్డిగారిపల్లె) కు చెందిన నాగసిద్దారెడ్డి భార్య ఆదిలక్ష్మి (85) మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు కలకడ పోలీసులకు సమాచారం అందించారు. కలకడ సీఐ గురునాథ ఇంటిని పరిశీలించి ఆదిలక్ష్మి శరీరంపై కాలిన గాయాలు, రక్తగాయాలు ఉండటంతో మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి కుమారుడు ద్వారకనాథరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వైద్య ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ పద్ధతి తొలగించాలి
రాయచోటి అర్బన్ : రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ సిస్టం) పద్ధతిని తొలగించాలని పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ – 3194 రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో జిల్లా స్థాయి ఉద్యోగుల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ విధానం తీసివేయాలన్నారు. సరైన నెట్వర్క్ లేని కారణంగా మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న సమయంలో ఉద్యోగులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్ను నమోదు చేయలేరన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు వై. శ్రీనివాసులు రెడ్డి, కార్యదర్శి మహబూబ్బాషా, జోనల్ ఉపాధ్యక్షుడు సుధాకర్ రాజు, జాయింట్ సెక్రటరీ రాఘవ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు నాయక్, లక్ష్మినారాయణతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. రాయచోటి తాలూకా కార్యవర్గం.. రాయచోటి తాలుకా యూనియన్ అధ్యక్షుడిగా సుదర్శనరాజు, ఉపాధ్యక్షురాలిగా చంద్రకళ, శివనాయక్, సదాశివరెడ్డి, శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులుగా నూర్జహాన్, ఖదీర్, రాజేంద్ర, కోశాధికారిగా మహబూబ్బాషా, సెక్రటరీలుగా ప్రమీల, ధర్మారెడ్డి, రాజసులోచనలను ఎన్నుకున్నారు, ఎగ్జిక్యుటివ్ మెంబర్లుగా వెంకట్రామిరెడ్డి, వెంకటయ్య, రెడ్డెమ్మ, భాగ్యలను ఎంపిక చేశారు. -
ప్యాసింజర్ రైళ్లు తాత్కాలిక రద్దు
కలికిరి : తిరుపతి నుంచి పాకాల, ధర్మవరం మీదు గా గుంతకల్, కదిరిదేవరపల్లి వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా 35 రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. అలాగే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దుతో పాటు, కదిరి, మదనపల్లి రోడ్, పీలేరు, పాకాల మీదుగా నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను దారిమళ్లించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి – గుంతకల్ ప్యాసింజర్(57403) మే నెల 18వ తేదీ వరకు, గుంతకల్ – తిరుపతి ప్యాసింజర్(57404) మే నెల 19వ తేదీ వరకు, తిరుపతి – కదిరిదేవరపల్లి ప్యాసింజర్(57405) మే నెల 16వ తేదీ వరకు, కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్(57406) మే నెల 17వ తేదీ వరకు రద్దయ్యాయి. అలాగే తిరుపతి–అమరావతి ఎక్స్ప్రెస్(12765) మే నెల 6, 10, 13, 17 తేదీలలో రద్దు చేశారు. అమరావతి–తిరుపతి ఎక్స్ప్రెస్ (12766) మే నెల 5, 8, 12, 15 తేదీలలో రద్దు చేశారు. దారి మళ్లింపు ఇలా.. తిరుపతి–అకోలా వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్(07605) పాకాల, పీలేరు, ధర్మవరం మీదుగా కాకుండా మే నెల 9, 16 తేదీలో తిరుపతి నుంచి రేణిగుంట, గుత్తి మీదుగా దారి మళ్లించారు. అకోలా–తిరుపతి వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్(07606) ధర్మవరం, కదిరి, పీలేరు, పాకాల మీదుగా కాకుండా మే నెల 4, 11 తేదీలలో గుత్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి దారి మళ్లించారు. తిరుపతి–సికింద్రాబాద్ సెవెన్హిల్స్(12769) వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను మే నెల 5, 9, 12, 16 తేదీలలో పాకాల, పీలేరు, కలికిరి, కదిరి, ధర్మవరం మీదుగా కాకుండా తిరుపతి నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగా, అలాగే సికింద్రాబాద్–తిరుపతి సెవెన్హిల్స్(12770) వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను మే నెల 6, 9, 13, 16 తేదీలలో గుత్తి నుంచి కడప, రేణిగుంట మీదుగా తిరుపతి రూట్కు మార్చారు. పాకాల, కలికిరి, కదిరి మీదుగా నడిచే తిరుపతి–సికింద్రాబాద్(12731) సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ ను మే నెల 8, 11, 15 తేదీలలో తిరుపతి నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగానూ, ధర్మవరం నుంచి కదిరి, కలికిరి, పీలేరు మీదుగా నడిచే సికింద్రాబాద్–తిరుపతి(12732) సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ ను మే నెల 7, 10, 14 తేదీలలో గుత్తి, కడప, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్ కదిరి మీదుగా నడిచే మధురై–కాచిగూడ(07192) స్పెషల్ వీక్లీ ఎక్స్ప్రెస్ మే నెల 5, 12 తేదీలలో గుత్తి, కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగానూ, కాచిగూడ–మధురై(07191)స్పెషల్ వీక్లీ ఎక్స్ప్రెస్ మే నెల 7, 14 తేదీలలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి మీదుగానూ దారి మళ్లించారు. పాకాల, పీలేరు, ధర్మవరం మీదుగా నడిచే నాగర్కోయిల్–ముంబై(16340) ఎక్స్ప్రెస్ను మే నెల 5, 6, 7, 9, 12, 13, 14, 16 తేదీలలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, కడప, గుత్తి మీదుగా, ముంబై–నాగర్కోయిల్(16339)ఎక్స్ప్రెస్ను మే నెల 6, 7, 8,10,13, 14, 15 తేదీలలో గుత్తి నుంచి కడప, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగా మళ్లించారు. మధురై–కాచిగూడ(22716) వీక్లీ ఎక్స్ప్రెస్ను మే నెల 04, 11 తేదీలో పాకాల నుంచి తిరుపతి, రేణిగుంట, డోన్, గుత్తి మీదుగానూ, కాచిగూడ–మధురై(22715) వీక్లీ ఎక్స్ప్రెస్ను మే నెల 10, 17 తేదీలలో డోన్, రేణిగుంట, తిరుపతి, పాకాల మీదుగా దారి మళ్లించారు. ధర్మవరం నుంచి రోజు నడిచే ధర్మవరం–నరసాపూర్(17248) ఎక్స్ప్రెస్ బుధవారం నుంచి కదిరి నుంచి మాత్రమే ప్రారంభమవుతుంది. అలాగే నరసాపూర్–ధర్మవరం(17247) ఎక్స్ప్రెస్ను మంగళవారం నుంచి కదిరి వరకు మాత్రమే నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు గమనించాలని అధికారులు కోరారు. కాగా గత ఏడాది డిసెంబరు 28 నుంచి మహాకుంభమేళా కోసం గుంతకల్–తిరుపతి ప్యాసింజర్ రైళ్లను సుమారు రెండు నెలలకు పైగా రద్దు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 1 నుంచి ప్రారంభించారు. ఇప్పుడు ధర్మవరం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కోసం నెల రోజులకు పైగా ప్యాసిజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులపై మరో పిడుగు పడ్డట్లైంది. రైలు ప్రయాణికులపై మరో పిడుగు పలు ఎక్స్ప్రెస్ రైళ్లు దారి మళ్లింపు ధర్మవరం రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో అధికారుల నిర్ణయం -
రూ.4 లక్షలు పోయాయి
రాత్రి 12 గంటలకు మార్కెట్కు కాయలు తెస్తే కొనేవారు లేక మరుసటి రోజు కూడా కూర్చుంటున్నా.. 20 కిలోల ప్యాకెట్లు రూ.50, 60కు ఇవ్వగలవా అంటూ బేరాలు ఆడుతున్నారు. మళ్లీ, మళ్లీ ఆటోలకు రవాణా చార్జీలు ఇవ్వలేక అడిగిన ధరకు ఇచ్చేస్తున్నాం. 2.5 ఎకరాల భూమిని లక్ష రూపాయలతో కౌలుకు తీసుకొని వంగ తోట సాగు చేశాను. సాగు కోసం రూ.3 లక్షలు ఖర్చు చేసి పంట పండించాను. ఇప్పటికీ 80 శాతం పంట దిగుబడి వచ్చినా రూ.50 వేలు కూడా రావడం లేదు. మార్కెట్లో లభిస్తున్న ధరలను చూస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. – సుబ్బారెడ్డి, రైతు, ఏపిలవంకపల్లి, రాయచోటి మండలం -
రాములవారి ఊరేగింపులో యువకుడికి కత్తిపోట్లు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణం పగడాలపల్లిలో రామాలయానికి సంబంధించిన సీతారాములవారి గ్రామోత్సవంలో సోమవారం ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. చిట్వేలి రోడ్డులో గ్రామోత్సవం జరుగుతుండగా స్థానికులైన కంబాల గౌరీ శంకర్, గోవింద్ చేతన్లు ఘర్షణకు దిగారు. దీంతో కంబాల గౌరీ శంకర్ గోవింద్ చేతన్పై కత్తితో దాడి చేశాడు. ఇందుకు పాత కక్షలే కారణమని పలువురు చెబుతున్నారు. హుటాహుటిన గాయపడిన వ్యక్తిని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రూయాకు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై సీఐ హేమసుందర్ రావు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆటో చోరీ కడప అర్బన్ : కడప చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకరాపురంలో పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురైంది. మాసాపేటకు చెందిన నాగభూషణం అనే వ్యక్తి శంకరాపురంలో తన బంధువుల ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఆటోను పెట్టి అక్కడే పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆటో కనిపించలేదు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం
రామాపురం : పారిశుద్ధ్య కార్మిక కుటుంబంలో విద్యాకుసుమం వికసించింది. మండలంలోని సుద్దమళ్ల పంచాయతీ ఎగువదళితవాడకు చెందిన పూతోక రవణమ్మ, గంగులయ్య దంపతుల కుమారుతు శివశంకర్ ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో 973/1000 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. రవణమ్మ రాయచోటి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తోంది. తన కుమారుడిని చదివించుకోవాలనే లక్ష్యంతో రాయచోటి పట్టణంలోని ప్రతిభ జూనియర్ కాలేజీలో చేర్పించింది. తమ కష్టాలు కుమారుడికి గుర్తుకు రానివ్వకుండా చదివించింది. తల్లిదండ్రుల ఆశయానికి తగ్గట్టుగా శివశంకర్ కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఉచితంగా ఇంటర్ విద్యకు అవకాశం రాయచోటి టౌన్ : అర్హత కలిగి ఉండి ప్రతిభావంతులైన బాలికలకు కడప ఆర్తి హోం ఉచితంగా ఇంటర్ విద్యను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ పీవీ సంధ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరాశ్రయులుగా ఉన్న బాలికలకు తమ సంస్థ ద్వారా ఉచితంగా కార్పొరేట్ స్థాయి ఇంటర్ విద్యను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హత కలిగిన వారు ఆర్తి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు 8074717196/8331951098/8106123469లకు ఫోన్ చేయాలని కోరారు. 10వ తరగతి పూర్తి చేసి, ఆర్థికంగా వెనుకబడిన, నిరుపేద, తల్లిదండ్రులు లేని వారు అర్హులని పేర్కొన్నారు. ఉచిత వసతి, కెరీర్ మార్గదర్శనం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న సామర్థ్య పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. వీరభద్రుడికి పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి పల్లకీలో విహరించారు. సోమవారం రాత్రి మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి, పల్లకీలో కొలువు దీర్చారు. ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు చేపట్టారు. స్థానిక భక్తులతోపాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా పాల్గొన్నారు. 16,17 తేదీల్లో పరీక్ష రాయచోటి అర్బన్ : రాయచోటి డైట్ (జిల్లా విద్యాశిక్షణా సంస్థ)లో అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమించేందుకు ఉద్దేశించిన పరీక్షలు ఈ నెల 16,17 తేదీలలో నిర్వహించనున్నట్లు రాయచోటి డైట్ ప్రిన్సిపల్ అజయ్కుమార్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రంలో హాజరు కావాలన్నారు. తమ వెంట దరఖాస్తు ప్రతులు, గుర్తింపు కార్డులను తీసుకురావాలని కోరారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పరీక్షకు హాజరు కావాలన్నారు. జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాల నివారణ రాయచోటి టౌన్ : ముందు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మాసాపేట వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను తెలిపే కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్ రావు, అగ్నిమాపక శాఖ అధికారులు పి.అనిల్కుమార్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దళారుల బారి నుంచి కాపాడాలి
రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి, రాత్రింబవళ్లు నిద్రలేకుండా సాగు చేసిన పంటకు మార్కెట్లో దళారుల కారణంగా దారుణంగా నష్టపోతున్నారు. రాయచోటి, కడప లాంటి మార్కెట్లో అర్ధరాత్రి వేళ కూరగాయలు వేలం వేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు అక్కడున్న వ్యాపారులతో కుమ్మకై .. వారు నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి దళారుల బారి నుంచి రైతులను కాపాడేందుకు అధికారులు ముందుకు రావాలి. – బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం, రాయచోటి ఏరియా ప్రధాన కార్యదర్శి -
మహనీయుడు అంబేడ్కర్
రాయచోటి : న్యాయవాదిగా, సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ తెలిపారు. రాయచోటి మాసాపేటలోని సాయిశుభ కల్యాణ మండపంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యలో సోమవారం భారతరత్న అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు మాండవ్యనది బ్రిడ్జి పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ మధుసూదన్రావు, ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అంబేడ్కర్ ఒక గొప్ప రచయిత, అనర్గళంగా మాట్లాడగలిగే ఒక వక్త, ఒక తత్వవేత్త, సీ్త్రల హక్కుల కోసం పోరాడిన సంస్కర్త అని అన్నారు. అనంతరం డీఆర్ఓ మధుసూదన్రావు మాట్లాడుతూ కుల వివక్ష పూర్తిగా పోలేదని, దానిని రూపుమాపేందుకు అందరం కృషి చేయాలన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు నరేంద్రబాబు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలు అభివృద్ధి చెందాయి అంటే దానికి కారణం అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జయప్రకాష్, భారతీయ అంబేడ్కర్ సేన నాయకుడు పల్లం తాతయ్య, డీవీఎంసీ సభ్యుడు శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఎంఆర్పీఎస్ నాయకులు, భారతీయ అంబేడ్కర్ సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.● జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ ● ఘనంగా బాబా సాహెబ్ జయంతి -
ధర పతనం.. రైతుకు శోకం
రాయచోటి : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్నలు వరుస నష్టాలు చవిచూస్తున్నారు. ఇంకా టమాటా రైతు కోలుకోలేని స్థితిలో ఉండగా.. మరోవైపు వంగ తోటలు సాగు చేసిన వారు నిలువునా మునిగిపోతున్నారు. మార్కెట్లో వంగ ధర పడిపోవడంతో రైతు కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. గత రెండు నెలల వరకు గిరాకీ ఉండటంతో.. వంగ పంటను అధికంగా సాగు చేశారు. కాయలను కోసి మార్కెట్కు తరలించేందుకు రవాణా చార్జీలు 20 కిలోల ప్యాకెట్కు రూ.50 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.3 నుంచి 4 మాత్రమే పలుకుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ. 20 ఉండగా ఈ ఏడా రూ.3 నుంచి 4కు పడిపోయింది. దోచుకుంటున్న వ్యాపారులు జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో వంగ సాగయ్యేది. ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగులోకి తెచ్చారు. చైన్నె, ఏలూరు, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రోజుకు 20 నుంచి 30 టన్నుల పంట రవాణా అవుతుండేది. ఆయా ప్రాంతాల్లో కూడా వంగ సాగు పెరగడంతో.. నేడు బయటి ప్రాంతాల మార్కెట్ రవాణా 50 శాతానికి తగ్గింది. దీనిని ఆసరాగా చేసుకొని స్థానిక వ్యాపారాలు దోచుకుంటున్నారు. రైతుల వద్ద నిల్వ చేసుకొనే సామర్థ్యం లేకపోవడంతో.. అడిగిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటపై చేసిన అప్పులు, వడ్డీలు ఎలా తీర్చాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు. వినియోగదారులకు.. కూరగాయల మార్కెట్, రైతు బజార్లో వినియోగదారులకు మాత్రం వంకాయలను రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. లాభాన్ని దళారులు, వ్యాపారులు కలిసి ఆర్జిస్తున్నారు. నిల్వ చేసుకునే సామర్థ్యం, వినియోగదారులకు అమ్మే అనుకూలత వ్యాపారులకు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. పంట సాగు చేసిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. పడిపోయిన వంకాయల రేట్లు పెట్టుబడి కూడా దక్కని వైనం అప్పుల పాలవుతున్న అన్నదాత -
తన్నుకున్న తమ్ముళ్లు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని చల్లనికొండ హార్సిలీహిల్స్పై టీడీపీ తమ్ముళ్ల మధ్య డిష్యూం డిష్యూం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి సమావేశంలో ఉండగానే.. వెలుపల ఇరువర్గాలు ఉద్రిక్తత సృష్టించేలా వ్యవహరించడం మంత్రికి చిరాకు తెప్పించడంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఆదివారం రహదారి భవనాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి నిర్వహించిన టీడీపీ నేతల సమావేశం సందర్భంగా.. మాజీ ఎమ్మెల్యే శంకర్యాదవ్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రరెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎంపిక చేసిన నాయకులతో సమావేశం ఉంటుందని ముందుగా చెప్పిన నిర్ణయం మార్చుకుని.. మండలాల వారీగా అందరికీ అవకాశం కల్పించడంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది. కేఎస్ఎస్ల నియామకం పార్టీ చూసుకుంటుందని చెప్పిన మంత్రి హార్సిలీహిల్స్పై ఆరు మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఇన్చార్జ్లు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జ్లతో సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన ఓ ప్రయివేటు సమావేశ హాలులో మంత్రి జనార్దన్రెడ్డి, జోన్ఫోర్ ఇన్చార్జ్ దీపక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు, పరిశీలకుడు గురువారెడ్డి హాజరయ్యారు. దీనికి ముందు జయచంద్రారెడ్డి వర్గంతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. తర్వాత ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిని ఈ సమావేశానికి దూరంగా పెట్టారు. తొలుత పెద్దమండ్యం మండల నేతల సమావేశంలో కన్వీనర్ బిల్డర్ రమణ పార్టీలో కష్టపడి పని చేసినా గుర్తింపులేదని, తమను ఇన్చార్జ్ పట్టించుకోవడం లేదంటూ ఏకరువు పెట్టారు. మిగిలిన కొందరు నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత తంబళ్లపల్లె మండల సమావేశంలో రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ములకలచెరువు సమావేశంలో కన్వీనర్ పాలగిరి సిద్దా తమ ఇబ్బందులపై ఏకరువు పెట్టారు. అందులో కేఎస్ఎస్ సభ్యుల ప్రస్తావన చేయడంతో.. ఈ నియామక ప్రక్రియను పార్టీ చూసుకుంటుందని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. శంకర్ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఇలా సమావేశం జరుగుతుండగా వెలుపల భారీసంఖ్యలో రెండు వర్గాలు మోహరించి ఉన్నాయి. హాలు వద్ద రెండు వర్గాలు ఎదురెదురుగా ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా శంకర్ వర్గీయులు తాము పా ర్టీకి కష్టపడి పని చేశామని, గుర్తింపు లేదని దీపక్రెడ్డికి మొరపెట్టుకున్నారు. అంతలో రెండు వర్గాలు అరుపులు, కేకలు, ఈలలు వేయడంతో ఒక్కసారి రెండు వర్గాలకు తలపడే పరిస్థితి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ పరిస్థితిపై అసహనానికి గురైన మంత్రి జనార్దన్రెడ్డి అందరిన్నీ ఆహ్వానిస్తే ఇలా వ్యవహరించడం తగదు అంటూ మిగిలిన బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం మండలాల సమావేశాలను రద్దు చేసుకుని బయటకు వచ్చేశారు. సమావేశం నుంచి మంత్రి బిరాబిరా వెళ్లిపోయారు. వెళ్తున్నట్టు కానీ, సమావేశాలు ముగించామని గానీ చెప్పలేదు. అందరి అభిప్రాయాలను కూడా తెలుసుకోలేదు. ఆయనతోపాటు మిగిలిన నేతలు హార్సిలీహిల్స్ నుంచి వెళ్లిపోయారు. మంత్రి సమక్షంలో జేసీఆర్, శంకర్ వర్గాల బలప్రదర్శన మంత్రి నిర్ణయమే కారణం తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి సమావేశానికి వచ్చే పార్టీ నాయకుల జాబితాను పోలీసులకు అందజేశారు. అందులో 26 మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. వీరిని మాత్రమే హార్సిలీహిల్స్కు పంపాల్సి ఉండగా పోలీసులు ఇదే పని చేశారు. కొండ కింద అను మతి లేని వారిని నిలిపివేశారు. అయితే మంత్రి జనార్దన్రెడ్డి అందర్నీ పంపండని, వారిని తనిఖీ కూడా చేయెద్దు అంటూ పోలీసులను ఆదేశించారు. దీనితో కొండ కింద నుంచి, సమావేశానికి హాజరయ్యే నేతల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోలేదు. ఈ వ్యవహారం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. -
వైభవంగా కమలాపురం ఉరుసు
కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్ల ఉరుసు మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రధాన ఉరుసు మహోత్సవం భక్తుల కోలాహలం నడుమ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ముస్లిం, హిందు భక్తులు పెద్ద సంఖ్యలో ఉరుసు మహోత్సవానికి తరలివచ్చారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో దర్గా ఆవరణం కిటకిటలాడింది. భక్తులు దర్గాలోని స్వామి వారి మజార్లపై పూల చాదర్లు సమర్పించి చక్కెర చదివింపులు చేశారు. పీఠాధిపతి మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రిని భక్తులు గౌరవ పూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్, తదితర రంగుల రాట్నాల వద్ద పిల్లల సందడి కనిపించింది. ● దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటీ ఆద్యంతం అలరించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఢిల్లీకి చెందిన ఖుత్బీ బ్రదర్స్, యూపీ కి చెందిన సర్ఫరాజ్ అన్వర్ సాబిరి ల మధ్య వేకువ జాము వరకు ఖవ్వాలీ పోటీ ఉత్సాహ భరితంగా సాగింది. ఖవ్వాలి విన్న ఖవ్వాలి ప్రేమికులు పాటలను వింటూ, మజా చేస్తూ ఖుషీ ఖుషీగా నజరానా సమర్పించారు. వైఎస్సార్సీపీ నాయకుల ప్రత్యేక ప్రార్థనలు కమలాపురంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా ఉరుసు మహోత్సవాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం రాత్రి దర్గా కన్వీన ఇస్మాయిల్ ఆహ్వానం మేరకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామి వారి మజార్లపై చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రసవత్తరంగా బండలాగుడు పోటీలు ఉరుసును పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాడుగు పోటీలు రసవత్తరంగా సాగాయి. జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన 11 కాండ్ల జతల ఎడ్లు పోటీలో తలపడ్డాయి. ప్రొద్దుటూరుకు చెందిన బీసీఎస్ఆర్ బుల్స్ అధినేత వెంకటసాయి భవిత్రెడ్డి ఎడ్లు 5107 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా పెద్ద కొట్టాలకు చెందిన నారాయణరెడ్డి ఎడ్లు 4694 అడుగులతో ద్వితీయ స్థానంలో, దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన టి.అశోక్ ఎడ్లు 4600 అడుగులతో తృతీయ స్థానంలో, కమలాపురం మండలం జంగంపల్లెకు చెందిన నాగ సుబ్బారెడ్డి ఎడ్లు 4470 అడుగులతో నాల్గవ స్థానంలో నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. భక్తులతో కళకళలాడినదర్గా ప్రాంగణం అలరించిన ఖవ్వాలీ పోటీ -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి
కలకడ : మదనపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ యర్రయ్యగారిపల్లెకు చెందిన ఉపాధ్యాయురాలు శారద (40) మృతి చెందారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆమె భర్త వై.వెంకటరమణ, కుమార్తె కీర్తితో కలిసి మదనపల్లెకు కారులో వెళుతుండగా సుగాలిమిట్ట వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి శారద మృతి చెందారు. ఆమె భర్త వెంకటరమణ, కుమార్తె కీర్తిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయ దంపతులిద్దరూ గ్రామస్తులతో సన్నిహితంగా ఉండేవారు. ఆదివారం రాత్రి శారద మృతదేహం యర్రయ్యగారిపల్లెకు చేరుకోగానే గ్రామం శోకసంద్రమైంది.భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
రాయచోటి టౌన్: బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్జీదారులు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తమ వినతి పత్రాలు సమర్పించేందుకు కలెక్టరేట్కు రావద్దని సూచించారు. జీఐపీకేఎల్లో రాయచోటి వాసి రాయచోటి జగదాంబసెంటర్: రాయచోటి పట్టణం బోస్నగర్కు చెందిన అలీ అహమ్మద్(22) ఈ నెల 18, 19, 20వ తేదీల్లో ఉత్తరప్రదేశ్లో నిర్వహించే కబడ్డీ జీఐపీకేఎల్(గ్లోబల్ ఇండియా ప్రవాసి కబడ్డీ లీగ్)లో లయన్స్ తమిళ్ టీం తరఫున ఆడనున్నారు. ఈయన రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. అలీఅహమ్మద్ చిన్ననాటి నుంచే కబడ్డీ ఆట ఆడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లేవాడని అతని తండ్రి షబ్బీర్ తెలిపారు. విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించిన ఆ యువకుడికి రాయచోటి, జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. రానున్న రోజులలో అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి, జిల్లాకు, రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు సిద్దవటం: సిద్దవటం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గొల్లపల్లె, రోళ్లబోడు, సిద్దవటం బీట్లలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ఆదివారం తనిఖీలు చేపట్టారు. అనంతరం రోళ్లబోడు బేస్ క్యాంప్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంపద తరలిపోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. ఫారెస్టు చెక్పోస్టు వద్ద రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీలు చేయాలన్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల పట్ల వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి తొట్లలో తాగునీరు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం రేంజర్ బి.కళావతి, డీఆర్ఓ ఓబులేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
హత్యకేసులో పోలీసుల నిర్లక్ష్యం
మదనపల్లె : ఆటోలో ఎక్కిన వృద్ధురాలిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆటోడ్రైవర్ హత్యచేసిన కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ను తప్పులతడకగా రూపొందించడమే కాకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయడంలో నిర్లక్ష్యం చూపడంపై బాధిత కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. తాలూకా పోలీస్ స్టేషన్ సమీపంలోని బెంగళూరు రోడ్డుపై బైఠాయించి వాహనాలను కదలనీయకుండా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్బాషా రావాలంటూ నినాదాలు చేస్తూ, పోలీసులకు వ్యతిరేకంగా గళమెత్తారు. హత్యకేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ హత్యకు గురైన వృద్ధురాలి మనవడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తక్షణమే యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తెలిపిన వివరాలు..శనివారం ఉదయం చంద్రాకాలనీ లక్ష్మీనగర్కు చెందిన వృద్ధురాలు గంగులమ్మ(73) వరుసకు కుమారుడైన వెంకటరమణ తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటడంతో, వైద్యచికిత్స నిమిత్తం అవసరమైన రూ.2లక్షలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి మెయిన్రోడ్డుకు చేరుకుంది. అదేసమయంలో ఎగువకురవంక భవానీ నగర్కు చెందిన విష్ణువర్దన్ ఆటోలో అటువైపుగా రావడంతో గంగులమ్మ ఆటోను ఆపింది. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాలని, తన కొడుకు వైద్యచికిత్సకు డబ్బులు తీసుకెళుతున్నానని, తొందరగా తీసుకెళ్లాల్సిందిగా కోరింది. గంగులమ్మ వద్ద డబ్బులు ఉన్న విషయంతో పాటు ఆమె ఒంటిపై నగలు ఉండటంతో విష్ణువర్దన్ దుర్బుద్ధితో ఆమెను బైపాస్మీదుగా నిమ్మనపల్లె సర్కిల్ రామాచార్లపల్లె చెరువు మొరవ సమీపంలోకి తీసుకెళ్లాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తుల సహాయంతో పథకం ప్రకారం గంగులమ్మను హత్యచేసి ఆమెవద్ద ఉన్న నగదు, నగలను కాజేసి, వారిద్దరినీ అక్కడి నుంచి పంపేశాడు. గంగులమ్మ ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి పడిపోయి చనిపోయిందంటూ ఆటో డ్రైవర్ విష్ణువర్దన్ కట్టుకథ అల్లాడు. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు డ్రైవర్ విష్ణువర్దన్ ప్రవర్తనపై అనుమానం రావడం, గంగులమ్మ తల, ఒంటిపై తీవ్రగాయాలు, రక్తస్రావం ఉండటంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ విష్ణువర్దన్ను పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే కేసు నమోదుకు సంబంధించి పోలీసులు రాత్రి వరకు తర్జనభర్జనలు పడటం, కేసులో ఎక్కడా నగలు, నగదు గురించి ప్రస్తావించకపోవడం, ఆటో డ్రైవర్తో ఐదురూపాయల చిల్లర కోసం జరిగిన గొడవలో హత్య జరిగిందని నిర్ధారించారు. ఈలోపు బాధితులు ఎమ్మెల్యే షాజహాన్బాషాను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఆయన స్టేషన్కు వెళ్లండి. నేను ఫోన్ చేస్తానని చెప్పారు. దీంతో బాఽధితులు స్టేషన్కు చేరుకుంటే, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా పరుష పదజాలంతో తిట్టారు. ఎమ్మెల్యేకు చెబితే పనులు చకచకా జరిగిపోతాయా...స్టేషన్ నుంచి బయటకు వెళ్లండంటూ గదమాయించారు. ఉదయం 4 గంటలకు పోలీస్ స్టేషన్కు చేరుకున్న కుటుంబ సభ్యులు శవపంచనామా త్వరగా పూర్తిచేసి మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులను కోరితే, ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత భోజనం చేసుకుని రండంటూ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసుల తీరును నిరసిస్తూ బెంగళూరు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో రూరల్, టూటౌన్ సీఐలు సత్యనారాయణ, రామచంద్ర, ఎస్ఐలు అన్సర్బాషా, గాయత్రిలు అక్కడకు చేరుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారు వినకుండా ఎమ్మెల్యే వచ్చి సమస్యను పరిష్కరించాలని పోలీసులతో గొడవకు దిగారు. ఇంతలో గంగులమ్మ మనుమడు మనోహర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో, పోలీసులు తక్షణమే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్బాషా అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చులకనగా మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని, కేసు విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు పోస్టుమార్టం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో నిరసన విరమించారు. ఎమ్మెల్యే షాజహాన్బాషా ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని గంగులమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. బాధితుల రాస్తారోకో ఎఫ్ఐఆర్ తప్పులతడకగా ఉందంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం మృతదేహాన్ని అప్పగించలేదని కుటుంబ సభ్యుల నిరసన ఎట్టకేలకు ఎమ్మెల్యే జోక్యంతో సద్దుమణిగిన వివాదం -
కాళీయమర్దనుడిగా కోదండ రాముడు
ఒంటిమిట్ట: ఏకశిలానగరిలో కొలువైన కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో జగదభిరాముడిని ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు గ్రామ వీధుల్లో విహరించారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన కోదండ రామ ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. అశ్వవాహనంపై ఒంటిమిట్ట విభుడు రాత్రి 7 నుంచి 8:30 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్ముడు అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించాలని ప్రబోధిస్తున్నాడు. నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన శనివారం ఉదయం 9 నుంచి 10:30 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణం ఉంటుందని ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు తెలిపారు. -
టీడీపీలో కుమ్ములాట
● రైల్వేకోడూరులో తారా స్థాయికి విభేదాలు ● రాజంపేటలో నేతల మధ్య వర్గ పోరు ● రాయచోటిలో మంత్రి, సుగవాసిల మధ్య పెరిగిన దూరం ● తంబళ్లపల్లెలో కుదరని సమన్వయం ● ఇన్చార్జి మంత్రికి తప్పని తమ్ముళ్ల తలనొప్పి సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారులో ఆధిపత్య పోరు మొదలైంది. నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఇన్చార్జిగా ప్రకటించిన నేతకు బాగా పలుకుబడి ఉంటుందన్న కారణంతో పోరు సాగుతోంది. ఎన్నికల ముందు అంతంత మాత్రంగా ఉన్నా... అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు కోసం ఒకరిపై మరొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మరో పక్క ఆర్థికంగా బలపడేందుకు.. అధికారులతో పని చేయించుకునేందుకు పదవి అన్నది కీలకంగా మారింది. దీంతో ఇంతకు మునుపు వరకు కలిసికట్టుగా ఉన్న నేతల్లో.. ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి నెలకొంది. అఽధిష్టానం మాత్రం ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇన్చార్జిలను కూడా ప్రకటించలేని దుస్థితిలో ఉండగా.. తమ్ముళ్ల మధ్య తగువులాటలు యథా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట రైల్వేకోడూరు, రాజంపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల్లో కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్రెడ్డి ఎదుటే తమ్ముళ్లు యుద్ధ చేయడంతో ఆయన తల పట్టుకోవాల్సి వచ్చింది. రూపానందరెడ్డి తీరుపై ప్రత్యర్థి వర్గం బహిరంగ యుద్ధం జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికార పార్టీ టీడీపీలో కుమ్మలాటలు తారా స్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడును పక్కనపెట్టి.. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన రూపానందరెడ్డికి టీడీపీ ఇన్చార్జిగా అధిష్టానం పట్టం కట్టింది. అంతేకాకుండా అధికారంలోకి రాగానే రూపానందరెడ్డికి అడ చైర్మన్గా అవకాశం ఇస్తూ పెద్దపీట వేశారు. మరోపక్క ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపు కోసం పని చేసిన విశ్వనాథనాయుడుతోపాటు మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులును పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో కార్యకర్తలు రగలిపోతున్నారు. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని కాకుండా.. కొత్తగా వచ్చిన వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారంటూ వర్గాలు యుద్ధ వాతావరణం సృష్టించాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నా.. పెత్తనమంతా రూపానందరెడ్డి కుటుంబమే చేస్తున్నదని రగలిపోతున్న ప్రత్యర్థి వర్గాలు ఇన్చార్జి మంత్రిని చూడగానే రెచ్చిపోయాయి. మాజీ ఇన్చార్జితోపాటు మాజీ ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత తగ్గించడంపై పార్టీ శ్రేణులు మంత్రి ఎదుటే దాడికి దిగారు. టీడీపీ కార్యాలయంలోని అద్దాలతోపాటు కుర్చీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యే శ్రీధర్ రావడాన్ని కూడా తీవ్ర స్థాయిలో ప్రత్యర్థి వర్గాలు ఆక్షేపించాయి. రైల్వేకోడూరు టీడీపీలో మూడు వర్గాల మధ్య ప్రచ్చన్నయుద్ధం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిిస్థితికి వచ్చింది. జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సమక్షంలోనే తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు, తోపులాట పరిస్థితి చూసిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. తంబళ్లపల్లెలో ఇన్చార్జి రగడ జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య ఇన్చార్జి వ్యవహారం రగులుతోంది. ఒకపక్క మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డి.. ఆది నుంచి పార్టీ కోసం పని చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గాల మధ్య రచ్చ ముదిరింది. ఇటీవల ములకలచెరువు, తంబళ్లపల్లె, బి.కొత్తకోట ప్రాంతాల్లో వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని మంత్రి లోకేష్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఒక వర్గం చింపివేసి కేకులను విసిరి కొట్టారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రెండు వర్గాల మధ్య ముష్టి యుద్ధం చోటుచేసుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటుచేసుకుంటున్నా తంబళ్లపల్లెను మాత్రం అధిష్టానం గాలికి వదిలివేయడంపై కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీలోని కొన్ని వర్గాలు పని చేస్తున్నాయి. ఏది ఏమైనా అన్ని నియోజకవర్గాల్లో కూటమిలో కుమ్మలాటలు తారాస్థాయికి చేరాయి. రాయచోటిలో రగులుతున్న అసమ్మతి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కీలక నేతల మధ్య దూరం పెరిగింది. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటిలో మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారులకు ప్రాధాన్యత తగ్గించారని ఆ వర్గం రగిలిపోతోంది. రాజంపేటలో పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం తర్వాత మంత్రిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి సుగవాసి, మండిపల్లి మధ్య దూరం పెరిగింది. అంతేకాకుండా ఇటీవల ముఖ్యమంత్రి సంబేపల్లెకు వచ్చిన సందర్భంలోనూ బాలసుబ్రమణ్యం కలిసేందుకు ప్రొటోకాల్ లిస్టులో పేరు లేకుండా చేశారని ఆ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కూడా ఆహ్వానం లేనట్లు తెలుస్తోంది. మరోపక్క అన్నకు జరుగుతున్న అవమానాలపై టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న ప్రసాద్బాబు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. రాయచోటిలో కూడా అటు మండిపల్లి, ఇటు సుగవాసి కుటుంబాల మధ్య పొరపచ్చాలు రావడంతో కార్యకర్తలు కూడా వర్గాలుగా విడిపోయారు. రాజంపేటలో రచ్చరచ్చ రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఒకవైపు జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్రాజు, మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గాల మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేటలో గత ఆగస్టులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా రిబ్బన్ కత్తిరించే విషయంలో కీలక నేతలైన జగన్మోహన్రాజు, బాలసుబ్రమణ్యంలు తోసుకోవడంతో .. అప్పటి నుంచి కార్యకర్తల్లో కూడా భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఇన్చార్జి మంత్రి సమక్షంలో జరగాల్సిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు యుద్ధం చేశారు. ఒక పక్క టీడీపీ ఇన్చార్జిగా రాజంపేట నుంచి పోటీ చేసిన బాలసుబ్రమణ్యంకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేశారు. మరోపక్క జగన్మోహన్రాజు వర్గం నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యకర్తలు అందరూ లోపల ఉండాల్సిందేనంటూ ఒకరునొకరు తోసుకోవడంతో రాజంపేటలోనూ గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్నా.. ఇప్పటికీ ఇన్చార్జిని నియమించలేక అధిష్టానం సాగదీస్తోంది. -
అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ఆదివారం ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. గంజాయి విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎర్రగుంట్ల రోడ్డు, పాల కేంద్రం, పెన్నానది పరివాహక ప్రాంతం, చిన్నశెట్టిపల్లె రోడ్డు, అమృతానగర్, పెద్దశెట్టిపల్లె గ్రామ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టి అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడికి గాయాలుముద్దనూరు : మండలంలోని డీయన్పల్లె గ్రామ సమీపంలో ఆదివారం ఆటో ఢీకొని ద్విచక్రవాహనదారుడు నందకిషోర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కొసినేపల్లె గ్రామానికి చెందిన కిషోర్ ముద్దనూరుకు మోటార్బైక్పై వస్తుండగా ఎదరుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో కిషోర్ కాలికి తీవ్ర గాయం కాగా అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. -
రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని యువకుడి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని ఉప్పరపల్లి రైల్వేగేటు వద్ద గుర్తు తెలియని యువకుడు(25) ఆదివారం రేణిగుంటవైపు వెళ్తున్న రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రేణిగుంట రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్యమదనపల్లె : ఒంటరి జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. దేవళంవీధిలోని ఉమ్మర్ మసీదు సమీపంలో నివసిస్తున్న సయ్యద్ జాఫర్హుస్సేన్(70)కు భార్య ఫామిదా, కుమారులు జాకీర్ హుస్సేన్, షాకీర్ హుస్సేన్, జావీద్ హుస్సేన్లు ఉన్నారు. జాకీర్హుస్సేన్ కువైట్లో స్థిరపడగా, షాకీర్, జావీద్లు ముంబైలో ఉంటున్నారు. భార్య ఫామిదా ముంబైలో కుమారుల వద్దే ఉంటోంది. అయితే, జాఫర్హుస్సేన్ వారివద్ద ఉండేందుకు ఇష్టపడకుండా, మదనపల్లెలోని స్వగృహంలోని కింది పోర్షన్ అద్దెకు ఇచ్చి పై పోర్షన్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. వారంరోజుల క్రితం భార్య ఫామిదా ముంబై నుంచి మదనపల్లెకు వచ్చింది. తనతోపాటు పిల్లల వద్దకు వచ్చేయాలని భర్తను కోరింది. పోతబోలులోని తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆయనను చూసేందుకు ఆమె అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో జాఫర్హుస్సేన్ ఆదివారం తెల్లవారుజామున జీవితంపై విరక్తి చెంది మనస్తాపంతో తాను నివసిస్తున్న ఇంటిలోని గ్రిల్ ఫేమ్కు తాడుతో ఉరివేసుకుని వీధివైపుగా దూకాడు. ఇంటికి వేలాడుతూ ఉండగా, ఉదయాన్నే స్థానికులు గుర్తించి వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అన్సర్బాషా సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి ఆత్మహత్యకు గల కారణాలను విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య ఫామిదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైద్య ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యమంకడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పలు దఫాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాం. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. దీంతో ఆందోళన కార్యక్రమాలు, సమ్మె ద్వారా హక్కులను సాధించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ రావు అన్నారు. ఆదివారం స్థానిక కింగ్స్ ఫంక్షన్ హాలులో ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం (పీహెచ్ఎంఈయూ) జిల్లా, జోనల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్కార్రావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇతర శాఖల విధులు ఆటంకంగా మారాయన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె ద్వారా హక్కులను సాధించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని తెలిపారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎర్రపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్యదర్శిగా ఎస్ఎండీ మహబూబ్బాషా, కోశాధికారిగా జనార్దన్బాబు, ఉపాధ్యక్షుడిగా సుధాకర్ బాబు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం పైడి కాలువ పంచాయతీ సీతోరుపల్లె గ్రామానికి చెందిన పంగా రామయ్య (21)అనే యవకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వల్లూరు మండలానికి చెందిన పంగా వీరయ్య కుమారుడు పంగా రామయ్య కూలి పనులు చేసుకొనేవాడు. అయితే నందిపల్లి గ్రామ సమీపంలో కాలిన గాయాలతో రామకృష్ణారెడ్డి అరటి తోట వద్ద పడి ఉండడంతో అరటి తోట వద్దకు పనికి వెళ్లిన లక్ష్మిదేవి అనే మహిళ చూసి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో కొన ఊపిరితో ఉన్న రామయ్యను వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు నరసింహులు, చాంద్ బాషా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే మృతుని తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ విలేకరులతో మాట్లాడుతూ పొలం పనులకు వెళ్లిన లక్ష్మిదేవి గమనించి రైతు రామకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చిందన్నారు. ఆయనతోపాటు నందిపల్లె గ్రామస్తులు కొందరు అక్కడికి వెళ్లి కాలిన గాయాలతో పడి ఉన్న యువకుడిని విచారించగా ముందు నీళ్లు ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పినట్లు తెలిపారు. అలాగే నీళ్లు తాగి మా నాన్న పేరు వీరయ్య అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు రామయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటన స్థలంలో రామయ్యపై పెట్రోల్ కాని కిరోసిన్ కాని వేసి కాల్చిన ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. వేరే ప్రాంతంలో కాల్చి రాత్రి సమయంలో నందిపల్లె ప్రాంతానికి తీసుకొని వచ్చి పడేసినట్లు ఉందన్నారు. రామయ్యది హత్య కేసుగానే భావిస్తున్నామన్నారు. వల్లూరు మండలంలో సీతోలుపల్లె నుంచి వీఎన్ పల్లెలో ఉన్న అక్క ఇంటికి భోజనానికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు. సీతోలుపల్లె నుంచి వీఎన్ పల్లెకు వెళ్లలేదని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. హత్యగా భావిస్తున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ -
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
రామాపురం : రామాపురం మండలం బండపల్లె గ్రామం వీఆర్ పాఠశాల సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు రామాపురం మండల వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన షేక్ గౌస్మొహిద్దీన్, అతని భార్య షేక్ గులాబ్జాన్, కుమారుడు మహమ్మద్ అనాస్లు రాయచోటికి వెళ్లి తిరిగి స్వగృహానికి ఏపీ04ఏబి 3151 ఎక్స్ఎల్ ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ బంక్ (వీఆర్ పాఠశాల) సమీపంలోకి రాగానే రాయచోటి వైపు నుంచి కడపకు వెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఏపీ40 ఎఫ్సీ 7187 వాహనం అతి వేగంగా, అజాగ్రత్తగా, హారన్ కొట్టకుండా వచ్చి ముందు వెళ్తున్న ఎక్స్ఎల్ను బలంగా ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న షేక్ గౌస్మొహిద్దీన్, గులాబ్జాన్, మహమ్మద్ అనాస్లు రోడ్డుపై పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మండల ఎస్ఐ వెంకటసుధాకర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షేక్ గులాబ్జాన్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
పెద్దమండ్యం : స్నేహితుని ఊరిలో జరిగే జాతర కోసం వచ్చి సరదాగా ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని కలిచెర్లలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలిచెర్లకు చెందిన అరవింద్ ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షలు రాసి మదనపల్లెలోని ఓ కోచింగ్ సెంటర్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడ పెద్దతిప్పసముద్రం మండలం బూర్లపల్లె గ్రామం పిడుమువారిపల్లెకు చెందిన రెడ్డెప్ప కుమారుడు భాస్కర (15), అలాగే తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన జయప్రకాష్రెడ్డితో అరవింద్కు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో కలిచెర్లలో శుక్రవారం నుంచి పోలేరమ్మతల్లి జాతర ఉండడంతో ముగ్గురు స్నేహితులు కలిచెర్లకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలో బండకాడచెరువు వద్దకు వెళ్లారు. ఈత కొడుతుండగా నీరు లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన భాస్కర హఠాత్తుగా నీటిలో మునిగి పోవడం గమనించిన స్నేహితులు కలిచెర్లలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. నీటిలో మునిగిపోయిన విద్యార్థిని యువకులు గుర్తించి బయటకు తీసి హుటాహుటిన కలిచెర్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆప్పటికే మృతి చెందినట్లు ఆర్ఎంపీ డాక్టర్ తెలిపారు. ఘటనపై మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
అధికార దర్పం ప్రదర్శిస్తే సహించేది లేదు
రాయచోటి : అధికార పార్టీ దర్పంతో మంత్రి హోదాలో ఏం మాట్లాడినా చెల్లుతుందన్నట్లుగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి భగ్గుమన్నారు. ఆదివారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి పనికోసం నిల్వ ఉంచిన కంకర, సామగ్రిని దొంగిలించడంపై మందలించాల్సిన మంత్రి తన పేరు చెప్పుకొని ఎవరైనా తీసుకెళ్తే తాను దొంగతనం చేసినట్టా అని మాట్లాడడం దారుణమన్నారు. ఇలా ఇయితే మంత్రి పేరు చెప్పుకొని ఎవరైనా దర్జాగా దొంగతనాలు చేయొచ్చా? అని మంత్రిని నిలదీశారు. తాను ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు తీసుకొని వైఎస్సార్సీపీలోకి వచ్చినట్లు చేసిన ఆరోపణలపై వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధమన్నారు. చంద్రబాబు నాయుడు తనకు టికెట్టు ఇవ్వకుండా ద్రోహం చేశారని, అందుకే పార్టీలో ఉండనని ఆయనకే చెప్పి బయటకు వచ్చానన్నారు. కడపలో తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో ఉండి ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి వైఎస్సార్సీపీని ఓడించడానికి టీడీపీ నుంచి రూ. 40 లక్షలు వసూలు చేసిన నీచ చరిత్ర మండిపల్లిది అని ధ్వజమెత్తారు. జాతీయ రహదారి పనులు నా పేరున లేదంటావా? పనిచేసేందుకు అన్ని అర్హతలు ఉన్న ఒప్పంద పత్రం ఇదిగో చూడండని మంత్రికి సవాల్ విసిరారు. తనను రాయచోటిలో తిరగనివ్వకుండా చేస్తానన్న మంత్రి మాటలపై రమేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీలాంటి వారు వందమంది వచ్చినా తనను అడ్డుకోవడం సాధ్యం కాదంటూ హెచ్చరించారు. మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేస్తే రెండుసార్లు డిపాజిట్ కూడా దక్కించుకోలేని విషయాన్ని మరచిపోయావా అంటూ ఎద్దేవా చేశారు. సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం -
ఫెయిల్ అయ్యామని ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన ముగ్గురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి, స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని(16) పరీక్షలో గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయింది. మనస్తాపంతో విష ద్రావణం తాగింది. గుర్రంకొండ మండలం నడిమికండ్రిగకు చెందిన విద్యార్థి(16) మదనపల్లెలో ఉంటూ జెడ్పీ హైస్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. నీరుగట్టువారిపల్లెకు చెందిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి(18) పరీక్షలో ఫెయిల్ కావడంతో నిద్రమాత్రలు మింగాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెడికల్ ఏజెన్సీలో చోరీకడప అర్బన్ : కడప నగరం బీకేఎం వీధిలో ఈశ్వర్ మెడికల్ ఏజెన్సీలో గుర్తుతెలియని దొంగలు జొరబడి నగదును అపహరించినట్లు కడప టూ టౌన్ ఎస్ఐ ఎస్కేఎం హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు కడపకు చెందిన శివకుమార్ ఈనెల 11వ తేదీ రాత్రి తమ ఏజెన్సీ మూసుకొని ఇంటికి వెళ్లాడు. తిరిగి ఉదయం వచ్చి చూసేసరికి తమ ఏజెన్సీ షట్టర్ పగలగొట్టి దొంగలు చొరబడి రూ.1.21 లక్షల నగదును అపహరించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్బీఐలో చోరీవల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలంలోని కొత్త రోడ్డులోగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో 30 వేల రూపాయలు నగదు, సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్ను దొంగిలించినట్లు సమాచారం. సీఐ కృష్ణారెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు ఢీకొని బాలుడికి గాయాలుబద్వేలు అర్బన్ : పట్టణంలోని నెల్లూరు రోడ్డు నుంచి శివాలయంకు వెళ్లే రోడ్డులో ఆదివారం కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. పట్టణంలోని గౌరీశంకర్ నగర్కు చెందిన రాజు, క్రిష్ణవేణిల కుమారుడైన గుర్రాల వెంకటనాగేష్ (11) శివాలయం రోడ్డు నుంచి నెల్లూరు రోడ్డు వైపు వస్తుండగా ప్రొద్దుటూరు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో ఎడమ కాలు విరిగింది. -
తంబళ్లపల్లె టీడీపీలో ఉత్కంఠ
బి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీలో ఉప్పు–నిప్పుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారరెడ్డి వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. మంత్రులు నిర్వహించే సమావేశ నిర్వహణ తీరును పూర్తిగా మార్చేశారు. ఆదివారం ములకలచెరువు మార్కెట్ యార్డులో ఈ సమావేశం ఉందని, పార్టీ శ్రేణులు హాజరు కావాలని జయచంద్రారెడ్డి వీడియో సందేశంలో కోరారు. దీంతో సమావేశం రసాభాసగా మారే పరిస్థితులున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్రెడ్డి, జోన్ఫోర్ ఇన్చార్జి దీపక్రెడ్డిలు నిర్వహించే ఈ సమావేశాన్ని.. 30 మందిలోపు ముఖ్యలతోనే నిర్వహించి ముగించేలా నిర్ణయించారు. సమావేశం ములకలచెరువు మార్కెట్లో నిర్వహిస్తే భారీ సంఖ్యలో రెండు వర్గాలు ఒకేచోటికి తరలివచ్చాక ఉద్రిక్తత నెలకొంటే పరిస్థితి చేయిదాటి పోతుందని భావించినట్టు పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. దీంతో కొద్ది మందితో జరిపే సమావేశాన్ని ములకలచెరువులో కాకుండా శనివారం రాత్రి మంత్రులు విడిదిచేసే బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్పైకి మార్చారు. శుక్రవారం రాత్రి తంబళ్లపల్లె పరిశీలకులు గురువారెడ్డి ముఖ్యులతో ఫోన్లో మాట్లాడి ఈ సమాచారం ఇచ్చారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి పదవి విషయంలో గత ఎనిమిది నెలలుగా రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇన్చార్జి బాధ్యతలను శంకర్కు అప్పగించాలని ఆయన వర్గం పట్టుపడుతుండగా.. ఇన్చార్జి మార్పు లేదని జయచంద్రారెడ్డి వర్గం గట్టిగా వాదిస్తోంది. దీనితో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ రెండు వర్గాలుగా మారిపోయారు. పరస్పర ఆరోపణలతో వివాదాలు తంబళ్లపల్లె టీడీపీలోని రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో మునిగిపోయారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి వెనుకాడటం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. ‘శంకర్ వస్తున్నారు.. కార్యకర్తలకు అండగా ఉంటారు’ అంటూ పోస్టులు పెడితే దానికి కౌంటర్గా.. శంకర్ టీడీపీకి రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. విభేదాలపైనే దృష్టి హార్సిలీహిల్స్పై మంత్రులు నిర్వహించే పార్టీ నేతల సమావేశానికి హాజరయ్యే స్థానిక నాయకుల ద్వారా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, వర్గ విభేదాలు, పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులపై వివరాలు సేకరిస్తారని తెలిసింది. ఇరువర్గాల వాదనలు వినే అవకాశం ఇచ్చాక వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని తెలిసింది. ఒకరిపై ఒకరు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తారా లేక వారి మధ్య సమోధ్య కుదుర్చుతారా, రెండు వర్గాల వాదనలు విని అధిష్టానానికి నివేదిస్తారా అన్నది చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో బలప్రదర్శనకు తావులేకుండా మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఇన్చార్జిలు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలను మాత్రమే ఆహ్వానించి వారి నుంచి అభిప్రాయాలు సేకరణకే ప్రాధాన్యం ఇచ్చారు. వీరికి మాత్రమే పాసులు ఇస్తున్నారని తెలిసింది. దీంతో ఇతరులతో సంబంధం లేకుండా.. పార్టీ ముఖ్యల నుంచే వారి అభిప్రాయాలను తీసుకుంటారని తెలుస్తోంది. ● సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం ములకలచెరువు నుంచి హార్సిలీహిల్స్కు మారిన మంత్రుల భేటీ పార్టీ ముఖ్యలతోనే సమావేశం బలప్రదర్శనకు సిద్ధమవుతున్న జేసీఆర్, శంకర్ వర్గాలు హార్సిలీహిల్స్పై జరిగే పార్టీ సమావేశం సందర్భంగా తమ బలమెంతో చూపెట్టాలని రెండు వర్గాలు సిద్ధం కావడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తమ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమీకరణ మొ దలుపెట్టారు. శంకర్ వర్గం బలప్రదర్శనతో తమ వాదనను మంత్రులకు వినిపించి ఇన్చార్జి బాధ్యతలు శంకర్కు ఇ వ్వాలని డిమాండ్ చేసేందుకు, ఇక్కడి పరిస్థితులను వివరించేందుకు సిద్ధమ య్యారు. ఈ వాదనను జయచంద్రారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ గట్టిగా వాదించే పరిస్థితి ఉంది. దీంతో రెండు వర్గాలు ఒకే చోట ఉండి.. భిన్నవాదనలు తెరపైకి వచ్చాక అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణలకు దారి తీస్తుందని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య విమర్శలు, ఆరోపణల యు ద్ధమే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు వర్గాలు ఒకే చోట కలవడం అంటే ఏమి జరు గుతుందో చెప్పాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనిపై పోలీసు నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. మండలాల నుంచి ఏ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఏ సంఖ్యలో వస్తారన్న వివరాలు సేకరిస్తున్నారు. -
ఇంటర్లో పెరిగిన ఉత్తీర్ణత
రాయచోటి: విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈసారి అన్నమయ్య జిల్లా పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. అలాగే రాష్ట్రంలోనే రాయచోటి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మార్కుల సాధనలో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓవరాల్గా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 13108 మందికి గాను 7814 మంది పాసై 60 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 23వ స్థానాన్ని దక్కించుకున్నారు. సెకండియర్లో 11486 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనగా 9175 మంది ఉత్తీర్ణతతో 80 శాతం సాధించి 13వ స్థానంలో నిలిచారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, వెల్ఫేర్, వసతి గృహాల వారీగా ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి కృష్ణయ్య కొనియాడారు. అయితే.. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే.. ఫెయిల్ అయిన వారి కోసం సప్లిమెంటరీ పరీక్ష తేదీలు కూడా ప్రకటించారన్నారు. మొదటి సంవత్సరంలో 60 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానం ద్వితీయ సంవత్సరంలో80 శాతంతో 13వ స్థానం -
రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
రాయచోటి జగదాంబసెంటర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. జిల్లా ప్రజలు (ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆంజనేయా.. ఆశీర్వదించవయా! సాక్షి రాయచోటి: ‘ఆంజనేయా.. ఆశీర్వదించవయా’.. అంటూ భక్తులు పెద్ద ఎత్తున హనుమంతుడికి పూజలు నిర్వహించారు. శనివారం హనుమద్ విజయం పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా హనుమంతుని ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే అంజనీపుత్రుడి ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. పలువురు భక్తులు మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా స్వామి మూల విరాట్కు ఆకుపూజ, వడమాల సేవ నిర్వహించారు. అర్చకులు ఉదయం స్వామికి పంచామృతాభిషేకం, సింఽధూర అభిషేకాలు నిర్వహించారు. స్వామికి విశేష అలంకారం చేసి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ఈ సందర్భంగా సామూహికంగా భజనలు, భక్తిగీతాలాపనలు చేశారు. -
సమష్టి కృషితో విజయవంతం
కడప అర్బన్: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగడంపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమష్టి కృషితోనే కల్యాణ ఘట్టం విజయవంతంగా ముగిసిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి చిన్న ఘటనకు తావులేకుండా ముగిసేలా అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, జిల్లాలోని ఇతర ప్రత్యేక విభాగాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖకు సహకరించిన టీటీడీ, అగ్నిమాపక, రెవెన్యూ, ఏపీ ట్రాన్న్స్కో, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఇంటర్ ఫలితాల్లో ‘శ్రీధర్స్’ ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి శ్రీధర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారని కళాశాల చైర్మన్ మద్దినేని శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో సి.ఉమామహేశ్వర్ 465, కె.నిత్యశ్రీకల్యాణి 464, వి.శ్రీకర్రెడ్డి 463, ఎస్.యామిని, కె.పనుష్య, పి.వాసవి, పి.మానస 462, సి.షామితారెడ్డి, పి.యశ్విత 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో సి.జ్యోష్ణ 433, వీఎస్ రక్షిత 426, ఎం.దివ్య 422, సి.ధన్యత, వి.ప్రియదర్శిని 419 మార్కులు సాధించినట్లు చెప్పారు. అలాగే సీనియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.వన్షిక, మహమ్మద్ ఇమ్రాన్ 987, పి.నిఖిలేశ్వర్ 985, ఆర్.యుక్త 984, మహమ్మద్ తాలిబ్, డి.షోషిత 980 మార్కులు సాధించినట్టు తెలిపారు. విద్యార్థులను అభినందించారు. -
సీఐపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
రాజంపేట : రాజంపేట అర్బన్ సీఐ రాజాపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని ఓ కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ స్ధాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందే గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం వర్గీయులు కళ్యాణమండపం వద్దకు చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సమావేశంలో కేవలం 30 మందికి అనుమతి ఉందని, బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన సీఐ రాజా తెలిపారు. ఇందులో పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలే అని సుగవాసి వర్గీయులకు వివరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు తమను సమావేశానికి రానివ్వకుండా చేస్తున్న కుట్ర అని భావించిన సుగవాసి వర్గీయులు వీరంగం సృష్టించారు. వాగ్వాదానికి దిగారు. సీఐ మాటలను ఖాతరు చేయలేదు. ఇక చేసేదిలేక సీఐ వెనుదిరిగి వెళ్లిపోయారు. సమావేశానికి మంత్రితో పాటు సీడాప్ చైర్మన్, జోనల్ 4 ఇన్చార్జి దీపక్రెడ్డి హాజరయ్యారు. కాగా మరోసారి రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి సమావేశంలో సుగవాసి వర్గీయుల రగడ -
మంత్రి కనుసన్నల్లో ఇసుక మాఫియా
రాయచోటి అర్బన్ : మంత్రి రాంప్రసాద్రెడ్డి కనుసన్నల్లో జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు విమర్శించారు. శనివారం సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నా జిల్లా ప్రజలకు ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియా మంత్రి అండదండలతో పెద్దఎత్తున ఇసుకను తరలించుకు పోతోందన్నారు. సుండుపల్లె మండలం ఎర్రమనేనిపాళెం వద్ద బహుదానది నుంచి నెల్లూరు ప్రసాద్రెడ్డి, రాంబాబు తదితరులు ప్రతిరోజు లక్షల విలువ చేసే ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారన్నారు. విషయం తెలిసినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించారు. సుండుపల్లె – పీలేరు రోడ్డు నుంచి సుమారు 6 కిలో మీటర్ల దూరం వరకు హిటాచీలతో రోడ్డు వేశారంటే ఇసుకారులు ఎంతకు బరితెగించారనేది అర్థమవుతుందన్నారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ దందాపై మంత్రి స్పందించాలని, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు -
ప్రజా క్షేత్రంలో హుందాతనం ఉండాలి
రాయచోటి టౌన్ : ప్రజాక్షేత్రంలో హుందాతనం, జవాబుదారితనం ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులుగా రాయచోటిలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్రెడ్డికి చెందిన కాంపౌండ్లో ఉన్న మెటీరియల్ను అక్రమంగా తరలించిన సంఘటన చాలా బాధాకరమన్నారు. రమేష్కుమార్రెడ్డి వీడియో క్లిప్పింగులతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా వారిని అక్కడి నుంచి పంపించడం ఎంతవరకు సమంజసమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణల మేరకు రాయచోటి రింగ్ రోడ్డు గుండా అటు సుండుపల్లె, ఇటు బహుదా, వీరబల్లె నుంచి ఇసుక టిప్పర్లు వెళుతున్న విషయం వాస్తవం కాదా అన్ని ప్రశ్నించారు. వందలాది టిప్పర్లు పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయన్నారు. ఐదేళ్లకు ఒకసారి ప్రజలు ఇచ్చే అవకాశం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమేనన్నారు. రాచరికంలా వ్యవహరించకూడదని హితవు పలికారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
657 కేజీల చౌక బియ్యం సీజ్
పీలేరు రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 657 కేజీల చౌక బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. శనివారం మండలంలోని శివరామ్పురం నుంచి పీలేరుకు వస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో ఆరు బస్తాల చౌకబియ్యం ఉండడంతో ఆటోను అదుపులోకి తీసుకున్నారు. కలకడకు చెందిన అన్సారీ ,జోహర్లతోపాటు బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నీట మునిగి ఉపాధ్యాయుడి మృతి పీలేరు : తన కుమారుడికి ఈత నేర్పించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఉపాధ్యాయుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన పీలేరులో జరిగింది. నందకుమార్(50) అనే ఉపాధ్యాయుడు కేవీపల్లె మండలం మారెళ్ల పడమట పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పీలేరు పట్టణంలో నివాసముంటున్నారు. శనివారం తన కుమారుడికి ఈత నేర్పించడానికి పట్టణ సమీపంలోని బోడుమల్లువారిపల్లెకు వెళ్లారు. అక్కడ పొలాల వద్ద ఉన్న చెక్డ్యామ్లో నీళ్లు ఉండడంతొ నీళ్లలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి అక్కడే చనిపోయారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టైరు పగిలి కారు బోల్తా – తప్పిన పెను ప్రమాదం నందలూరు : కడప–చైన్నె జాతీయ రహదారిలోని నందలూరు వద్ద శుక్రవారం రాత్రి చెయ్యేరు బ్రిడ్జిపైన టైరు పగలడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి తిరుమలకు వెళ్తున్న తోటకూరి నరేష్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. -
ఇది కథ కాదు.. అంతులేని వ్యఽథ.!
● ఆమె జీవితమంతా శోకమే ● తొమ్మిది మందిలో ఆరుగురు బిడ్డలు చనిపోయారు ● ఇక జీవితమెందుకుని మనస్తాపంతో ఆత్మహత్య కురబలకోట : కనిపెంచి పెద్ద చేసిన బిడ్డలు ఏడుగురు వివిధ కారణాలతో ఒకరి తర్వాత ఒకరుగా చనిపోవడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగు చూసింది. గ్రామస్తులతో పాటు ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కథనం మేరకు..మండలంలోని సింగన్నగారిపల్లెకు చెందిన కన్మెమడుగు ఈశ్వరమ్మ (80)కు తొమ్మిది మంది సంతానం. ఐదుగురు మగ బిడ్డలు, నలుగురు ఆడపిల్లలు. వీరిలో గత 20 ఏళ్లుగా వివిధ కారణాలతో ఉన్న ఐదుగురు మగ బిడ్డలు ఒకరి తర్వాత ఒకరుగా చనిపోయారు. మరో ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. భర్త కూడా మృతి చెందారు. అయినా గుండె రాయి చేసుకుని జీవితాన్ని వెళ్లదీయసాగింది. వీరిలో గత ఏడాది ముఖ్యంగా ఇద్దరు కుమారులు చనిపోవడం ఆమెను మరింత కుంగదీసింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. అయితే కన్నబిడ్డలు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు చనిపోవడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. పైగా వృద్ధాప్యం వెంటాడసాగింది. ఇటీవల ఉగాది పండుగకు చనిపోయిన బిడ్డల జ్ఞాపకార్థం కొత్త దుస్తులు నిలువుగా పెట్టింది. వారిని తలచుకుని ఎంతగానో బాధపడింది. బిడ్డలు వెళ్లిపోయారు.. నేను కూడా వారి చెంతకు వెళ్లిపోతానని స్థానికులకు చెప్పేది. జీవితంలో అల్లకల్లోలాన్ని చవి చూసింది. విధిరాతకు చింతించింది. బిడ్డలు లేని జీవితం వ్యర్థమనుకుంది. దీనికి తోడు జీవితం శోకమయమైంది. ఇక ఎవరి కోసం బతకాలి.. బతికుండి ఏం సాధించాలని ఇరుగుపొరుగువారితో చెబుతూ మథనపడినట్లు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో వారం క్రితం ఆమె స్వగ్రామం సింగన్నగారిపల్లె నుంచి పుట్టినిల్లయిన కుక్కరాజుపల్లెకు వెళుతున్నానని ఇంటి వద్ద నుంచి బయలు దేరింది. కుటుంబీకులు కూడా పుట్టినింటికి వెళ్లి ఉంటుందని భావించారు. అయితే ఆమె మార్గమధ్యంలోని కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డు పక్కనున్న తేనెకొండ అటవీ ప్రాంతంలో కొంత దూరం వెళ్లింది. అక్కడ చీరతో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది. పోలీసులు మృత దేహాన్ని శనివారం కనుగొన్నారు. తొలుత గుర్తు తెలియని శవంగా భావించారు. ఆ తర్వాత సింగన్నగారిపల్లె గ్రామస్తులు ఈ విషయాన్ని తెలుసుకుని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎం.రాచపల్లి.. చిన్నారుల మృతితో తల్లడిల్లి..
చిట్వేలి : మండల పరిధిలోని ఎం.రాచపల్లిలో శుక్రవారం ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన చొక్కారాజు దేవాన్స్ (7) తండ్రి నరసింహారాజు, తల్లి చంద్రకళ. వీరికి ఇద్దరు కుమారులు కాగా దేవాన్స్ పెద్ద కుమారుడు. అలాగే చొక్కారాజు విజయ్ (7) తండ్రి శేఖర్ రాజు, తల్లి విజయలక్ష్మీ. వీరికి ముగ్గురు కుమారులు కాగా విజయ్ చిన్న కుమారుడు. అలాగే రెడ్డిచర్ల యశ్వంత్ (6) తండ్రి వెంకటేష్, తల్లి సుప్రజ. వీరికి ముగ్గురు కుమారులు కాగా యశ్వంత్ పెద్దకుమారుడు. విజయ్ తండ్రి శేఖర్ రాజు, యశ్వంత్ తండ్రి వెంకటేష్ ఇద్దరు జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి ఉన్నారు. సంఘటన జరగడంతో శనివారం స్వగ్రామం చేరుకొని కుమారుల మృతిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. మృతులు యశ్వంత్, విజయ్ చిట్వేలిలో ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతుండగా దేవాన్స్ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతునాడు. వీరి మృతితో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
మదనపల్లెలో వృద్ధురాలి హత్య
మదనపల్లె : మదనపల్లెలో వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఆమె వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, ఒంటిపై ఉన్న నగలు దోచుకుని హత్య చేశారని కుటుంబ సభ్యులు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాలు... మదనపల్లె పట్టణం చంద్రాకాలనీలోని లక్ష్మినగర్లో నివాసముంటున్న రెడ్డప్ప భార్య గంగులమ్మ (73) గాజుల వ్యాపారం, జాతరలో బొమ్మల వ్యాపారం చేస్తూ జీవిస్తుంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా అందరికి వివాహమైంది. గంగులమ్మ సోదరి లక్షుమ్మ కుమారుడు వెంకటరమణ భవన నిర్మాణం పనులు చేస్తూ కొత్త ఇండ్లు రంగారెడ్డికాలనీలో నివాసమున్నాడు. శుక్రవారం ఇంటి వద్ద పనులు చేసే క్రమంలో ప్రమాదశాత్తు నీటి తొట్టెలో పడి గాయపడ్డాడు. వెంకటరమణ తిరుపతిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గంగులమ్మ వైద్య చికిత్స కోసం డబ్బు అవసరమవుతుందని భావించి, చీటీ ద్వారా తనకు వచ్చిన నగదు, కుమార్తె ఇచ్చిన నగదు మొత్తం రూ.2లక్షలు తీసుకుని శనివారం ఉదయం 6 గంటలకు తిరుపతికి బయలుదేరింది .ఇంటి వద్ద నుంచి బైపాస్ మెయిన్రోడ్డులోకి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తుండగా పట్టణంలోని ఎగువ కురవంక భువనేశ్వరి నగర్కు చెందిన గంగరాజు కుమారుడు విష్ణువర్దన్ ఏపి03 టీవీ 4314 నంబరు గల ఆటోతో ఆటువైపుగా వచ్చాడు. గంగులమ్మను ఆటోలో ఎక్కించుకున్నాడు. తాను తిరుపతికి వెళ్లాలని, ఆస్పత్రిలోని బంధువులకు డబ్బులు ఇచ్చి రావాలని చెప్పింది. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాల్సిందిగా కోరింది. అయితే ఆటో డ్రైవర్ ఆర్టీసీ బస్టాండుకు రాకుండా వెంగమాంబ సర్కిల్ మీదుగా బైపాస్రోడ్డులోకి గంగులమ్మను తీసుకెళ్లాడు. ఇదే విషయమై ఆమె దారి వెంట అతనితో పోట్లాడుతూ గట్టిగా అరవసాగింది. ఆటోను బైపాస్రోడ్డులోని నిమ్మనపల్లె సర్కిల్ వద్ద నిమ్మనపల్లె మార్గంలోని చెరువు మరవ వద్దకు మళ్లించాడు. అక్కడే ఆటోను నిలిపి ఉంచి ఆమైపె దాడి చేశాడు. ఆమె తల వెనుక భాగం, చెంపలు, భుజంపై గాయాలు కాగా నోటి నుండి రక్తం కారుతూ అక్కడే పడిపోయింది. ఆ సమయంలో ఆటోలో మరికొందరు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె దగ్గరున్న రూ.2 లక్షల నగదు, ఒంటిపై నగలు దోచుకుని కొందరు పరారయ్యారని స్థానికులు తెలిపారు. అయితే ఆటో డ్రైవర్ విష్ణువర్దన్ అక్కడే ఉండగా ఆమె పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయానికి ఆమె బంధువులు మరొకరు ఆక్కడికి చేరుకుని ఆమెను గుర్తించారు. తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని గమనించగా గంగులమ్మ అప్పటికే మృతి చెంది ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ విష్ణువర్దన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న నగదు, నగలు కోసమే హత్య చేశారని గంగులమ్మ కుమార్తెలు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై గంగులమ్మ కుమారుడు అంజి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై తాలూకా సీఐని విచారించగా ఘటనకు సంబంధించిన నిందితులను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఆటోడ్రైవర్పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు రూ.2 లక్షలతో ఇంటి నుంచి బయలుదేరిన వృద్ధురాలు -
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
● జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ● డీఆర్సీలో పలు శాఖలపై సమీక్ష రాయచోటి : జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమన్వయంగా పని చేద్దామని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి అన్నారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మంత్రి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ(డీఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా ఎన్నో విషయాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. పింఛన్ల పంపిణీ, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, జాబ్ మేళాల నిర్వహణ, రీ సర్వే, ఎన్టీఆర్ హౌసింగ్, ఇళ్ల నిర్మాణాలు, పల్లె పండుగ పనులు, సూక్ష్మ నీటిపారుదల తదితర అంశాలలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే అంశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి ముందు ఉంచారని, వెంటనే స్పందించిన చంద్రబాబు రాష్ట్రమంతా దానిని అమలయ్యేలా చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. విజన్–2047లో పేర్కొన్న విధంగా అన్నమయ్య జిల్లా 15 శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి పథంలో నిలుస్తుందని తెలియజేయడంలో సందేహం లేదన్నారు. జిల్లాలో పలు జాతీయ రహదారులు పనులు, మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచ సూత్రాలు, ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్య, వైద్యం, ఇలా అన్ని అంశాలపై రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కూలంకషంగా చర్చించి మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ జిల్లాలో టమాటా, మామిడి పంటలు ఎక్కువగా ఉన్నందున ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హార్టికల్చర్ హబ్గా చేయడానికి మీ సూచనలు, సలహాలు, సహకారం కోరుతున్నామన్నారు. సూక్ష్మనీటి పారుదలలో మూడో స్థానం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మనీటి పారదలలో అన్నమయ్య జిల్లా మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2025–26లో 15 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదలను అందించే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. పర్యాటక రంగంలో అభివృద్ధి పనులకు అవసరమయ్యే భూసేకరణపై తగిన నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. గ్రామీణ నీటిపారుదల, గనులు–భూగర్భ, డ్వామా, విద్య, ఐసీడీఎస్, అటవీ, పరిశ్రమలు, డీఆర్డీఏ, పట్టణ ప్రజారోగ్యం తదితర శాఖలపై చర్చించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, చైర్మన్ రూపానందరెడ్డి, డీఈఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రాయచోటిలో రాజకీయ దొంగలు పడ్డారు
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో రాజకీయ దొంగలు పడి ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్కుమార్రెడ్డి ఆరోపణలు గుప్పించారు. శనివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, అతని అనుచరులు చేస్తున్న దోపిడీ, అరాచక పాలనను ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణంలో పాల్గొంటే రాయచోటిలో మంత్రి అనుచరులు దొంగతనాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రోడ్డు నిర్మాణం సామగ్రిని దొంగిలించే టిప్పరు, జేసీబీలను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే గంట తిరగకముందే ఆ టిప్పర్, జేసీబీ కనబడటం లేదన్నారు. రాజకీయ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ యంత్రాంగాన్ని సైతం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. దోపిడీ చేసుకెళ్తున్న సంఘటనపై మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదునే పట్టించుకోని పోలీసులు సామాన్య ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ఎంత వరకు విలువ ఇస్తారో అర్థమవుతోందన్నారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో చిల్లర నేతలకు ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోందన్నారు. తమ క్రషర్పై కేసు రాయించి రూ.12 కోట్లు అపరాధ రుసుము వేశారన్నారు. తన క్రషర్ కేసును చూపిస్తూ మిగిలిన క్రషర్ యజమానుల నుంచి గత నాలుగు నెలలుగా లక్షలాది రూపాయల మామూళ్లు వసూలు చేస్తున్నారని మంత్రిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాత్రం పరిశ్రమలు తెస్తా, ఉపాధి కల్పిస్తా అంటూ చెబుతుండగా స్థానిక మంత్రి దాడులు, దోపిడీలతో వందల మందికి ఉపాధి కోల్పోయేలా జిల్లాలో పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. ఏ సమయంలో ఎవరి స్థలం కబ్జా చేస్తారో.. ఎవరి మీద దాడులు చేస్తారో.. అన్న భయంతో ప్రజలు జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో తొలి ఏడాదిలోనే విపత్కర పరిస్థితులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారన్నారు. గత పది నెలల కూటమి పాలనను చూసిన ప్రతి కుటుంబం జగన్మోహన్రెడ్డిని తలుచుకుంటోందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి 2.0 ఫార్ములా అందరి జీవితాలను ఉన్నత స్థానంలో ఉండేలా మారుస్తుందన్నారు. బీజేపీ, జనసేనలు కూటమిలో నామమాత్రమే అన్నారు. పవన్ కళ్యాణ్ సత్తా లేని మనిషిగా మిగిలిపోయారన్నారు. పోలీసులను వాడుకొని జూదం కేంద్రాలు నిర్వహించి తద్వారా లక్షల రూపాయలను మంత్రి మండిపల్లి, అతని అనుచరులు గడించారన్నారు. జిల్లా కేంద్రంలో తహసీల్దార్ స్థానంలో అర్హత లేని డీటీని నియమించి ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అరాచకాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్రెడ్డి ఫైర్ -
బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలి
రాయచోటి అర్బన్ : సమాజంలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లను కల్పించాలని బహుజన సమాజ్పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం జాతీయస్థాయిలో బహుజన సమాజ్పార్టీ పోరాటం చేస్తోందన్నారు. కులగణన ద్వారా బీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కాగా కేంద్ర – రాష్ట్రప్రభుత్వాలు బీసీ ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మేలును చేకూర్చే కులగణన పట్ల నిర్లక్ష్య దోరణిని ప్రదర్శిస్తుండడం దారుణం అన్నారు. బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడతామన్నారు. బడుగు, బలహీనుల అభివృద్ధికి కృషిచేసిన జ్యోతిరావుపూలే, బాబు జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ల బాటలో బహుజన యువత నడవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యుగంధర్, ఉపాధ్యక్షుడు మహేష్, సెక్రటరీ నరసింహులు, జనరల్ సెక్రటరీ సోమశేఖర్, సీనియర్ న్యాయవాది ఈశ్వర్, బహుజనవాది మల్లూరి రెడ్డిప్ర సాద్, రజకసంఘం నేతలు రమేష్బాబు, శ్రీనివాసులు, న్యాయవాది నాగముని, బీసీ నేతలు నరసింహాచారి, జీవానందం, జయరామయ్య, రామమోహన్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే కులగణను చేపట్టాలి రాయచోటి అర్బన్ : పాలకులు వెంటనే కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేతలుకె.వి.రమణ,ఈ.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట బీసీ కులసమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కులగణనను చేపట్టాలన్న డిమాండ్తో ఆ సంఘం నేతలు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన జరపడం ద్వారా సమాజంలో ఏయే కులాల ప్రజలు ఎంత శాతం మేర ఉన్నారనేది గుర్తించవచ్చునన్నారు. తద్వారా అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు దువ్వూరు నరసింహాచారి, పల్లపు రమణ మ్మ, పాలగిరి హబీబుల్లా, వడ్డెరసంఘం నేతలు నాగముని, జీవానందం, సీనియర్ అడ్వకేట్ ఈశ్వర్, రమేష్బాబు, వీరబల్లి శ్రీనివాసులుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
రిమ్స్లో ఫార్మసిస్ట్పోస్టు భర్తీకి పైరవీలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (రిమ్స్)లో రెగ్యులర్ ఫార్మసిస్ట్– గ్రేడ్ –2ను, ఫార్మసిస్ట్ కాంట్రాక్ట్ పోస్టులో నియమించమని యూనియన్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారనీ అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకోసం యూనియన్ నాయకులు రూ. 5– 8 లక్షల వరకు వసూలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెగ్యులర్ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ పోస్టులో ఉద్యోగిని నియమిస్తే జీతాలు సమస్య ఎదురవుతుందని తర్వాత భవిష్యత్తులో కాంట్రాక్టు ఉద్యోగి జాయిన్ అయితే రెగ్యులర్ ఉద్యోగస్తుని బయటికి వెళ్లాల్సి వస్తుంది. నిబంధన ప్రకారం కాంట్రాక్టు ఫార్మసీ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగులకు పోస్టింగ్ లేదా బదిలీ ఇచ్చుట నిబంధనలకు విరుద్ధమని రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ వివరణతో యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. పైరవీలకు అలవాటు పడిన అధికార పార్టీ పేరుతో చలామణి అవుతున్న కొందరు యూనియన్ నాయకులు రిమ్స్ సిబ్బందిని చివరికి బెదిరింపు ధోరణికి పాల్పడిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈసంఘటన వివరాల్లోకెళితే ..ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడిసీ)సెంట్రల్ ట్రక్ స్టోర్లో వి.ఎన్పల్లి నుంచి డిప్యుటేషన్ లో ప్రస్తుతం ఓ రెగ్యులర్ ఉద్యోగి విధులను నిర్వహిస్తున్నారు.అతను తన మాతృశాఖకు వెళ్లుటకు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన ఉద్యోగి జిల్లా లోని ఏ పిహెచ్సీ లో పోస్టు ఖాళీగా ఉన్న కూడా పల్లెల్లో పోయి డ్యూటీ చేయుటకు ఇష్టం లేక రిమ్స్ జనరల్ హాస్పిటల్కు బదిలీ కావాలని ప్రయత్నించారు. యూనియన్ వారితో ఒక రేటు మాట్లాడుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. యూనియన్ నాయకులలో కొందరు సొంత లాభం ఆలోచించి రిమ్స్ సూపరింటెండెంట్ సంప్రదించారు. కాంట్రాక్ట్ పోస్ట్లో రెగ్యులర్ ఉద్యోగిని నియమించడం లేదా బదిలీ చేయడం డిపార్ట్మెంట్ నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సదరు యూనియన్ లీడర్స్ సిబ్బందిని బెదిరించి జీతాలు విషయంలో మిగతా ఏ సమస్యలనైనా డీఎంఈ కార్యాలయం లో తమకు సహకరించు అధికారులు ఉన్నారు. డీఎంఈ ఇంకా పైస్థాయిలో మేం చూసుకుంటాము మీరు క్లారిఫికేషన్ రాయండి అని ఒత్తిడి చేశారు. అయినా రిమ్స్ సూపరింటెండెంట్ మొత్తం రిమ్స్ లో ఫార్మసిస్టులు పోస్టులు 11. రెగ్యులర్ ఉద్యోగులు 11 మంది పనిచేస్తున్నారని, 10 కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్ పోస్టులకు 9 మంది పని చేస్తున్నారని ఇటీవల ఒక కాంట్రాక్టు ఉద్యోగి రిజైన్ చేయడం వల్ల ఒక ఖాళీ ఏర్పడిందిదని, ఆ పోస్టు కాంట్రాక్ట్ పోస్ట్ మాత్రమే అని క్లారిఫికేషన్ ఆర్డీకి లెటర్ పెట్టారు. ఈ విధానానికి యూనియన్ నాయకులు సంతృప్తి చెందలేదు. కోర్టును ఆశ్రయిస్తామని రిమ్స్లో అధికారులను, సిబ్బందిని బెదరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యూనియన్ నాయకులు తమ స్వార్థాలకు సమూహంగా ఏర్పడి చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అధికారులు వీరి బెదిరింపులకు లొంగవద్దని పలువురు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఈ సంఘటనలో జీజీహెచ్లోని ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ యూనియన్ నాయకుల బెదరింపులకు బెంబేలెత్తి పోయింది. మరోవైపు జీజీహెచ్(రిమ్స్)లో ఫార్మసీ విభాగంలోనే పనిచేస్తున్న రెగ్యులర్ మహిళా ఉద్యోగి ఈనెలలోనే రిటైర్డ్ కాబోతుందని సమాచారం. ఆమె స్థానంలో కూడా సదరు ‘ఫార్మసీ ఆఫీసర్’ను నియమించేందుకు కూటమి అధికారపార్టీకి సన్నిహితంగా వుంటున్న పై యూనియన్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి భర్తీకి యూనియన్ నాయకులు అధికారులపై ఒత్తిడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్న పాలనా విభాగా సిబ్బందికి బెదిరింపులు ఇందుకోసం ‘పరిపాలనా విభాగం’లో కొందరి సహకారం? -
దోపిడీ, దౌర్జన్యాలకు మంత్రి మండిపల్లి తెర
రాయచోటి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సూచనల మేరకు రాయచోటి ప్రాంతంలో ఆయన అనుచరులు దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, దొంగతనాలకు తెరలేపారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి మంత్రి సూచనల మేరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం నిల్వ ఉంచిన కంకర, ఇతర సామగ్రిని దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారని రమేష్కుమార్రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్రెడ్డి, మేనల్లుడు మౌర్యారెడ్డి, వినోద్కుమార్రెడ్డి మరికొందరితో కలిసి కుట్రలో భాగంగా జాతీయ రహదారి పనులు నిర్మాణం కోసం నిల్వ ఉంచిన కంకర, ఇతర మెటీరియల్ను దొంగతనంగా జేసీబీలతో టిప్పర్లకు పోసి దోపిడీకి యత్నించడం సిగ్గుచేటన్నారు. సమాచారం తెలుసుకుని నిల్వ ప్రాంతానికి చేరుకునేటప్పటికి 15, 20 టిప్పర్లు అప్పటికే తరలించారన్నారు. మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన వస్తువులనే దోపిడీ చేస్తున్నారంటే ఇక సామాన్యుడికి ఎక్కడ రక్షణ ఉంటుందని రమేష్రెడ్డి నిలదీశారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఎంతటి నీచమైన సంస్కృతితో ముందుకు వెళ్తున్నారో వారు పాల్పడిన దోపిడీని చూస్తే తెలుస్తోందన్నారు. దౌర్జన్యాలు, అరాచకాలే కాకుండా దొంగతనాలకు పాల్పడటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికే మట్టి, ఇసుక, కంకర మిషన్ల దగ్గర కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. ప్రతి పని దగ్గర టీడీపీ నాయకులు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రోజు దౌర్జన్యంగా ఎమ్మెల్యేకి చొరబడి డబ్బులు సంపాదించే దిగజారుడుతనానికి దిగారు. మరో పక్క ఎర్రచందనాన్ని మంత్రి అనుచరులు భారీగా తరలించి కోట్ల రూపాయలు గడిస్తున్నారని వివరించారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్నదంటే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఇదేనా గవర్నర్స్ అంటే కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి వ్యవహారాలను చంద్రబాబునాయుడు ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఇంతటి దురదృష్టకరమైన పాలన దౌర్జన్యకరమైన సంఘటన నా రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే పనులను ఎవరైనా టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. టెండర్లు దక్కించుకుని పనులు చేసుకుంటుంటే మంత్రి ఇంజినీర్లకు చెప్పి పనులు ప్రారంభం కాకుండా నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. అంతటితో ఆగక పనుల కోసం నిలువ ఉంచిన కంకర, ఇతర సామగ్రిని దోపిడీ చేయించే దౌర్భాగ్య స్థితిలో మంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కంకర, ఇతర సామగ్రిని దోచుకెళ్లడం జిల్లాలో మంత్రి ఆగడాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఇంతటి దురదృష్టకరమైన పరిపాలనను ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. మంత్రి అరాచకలపై చంద్రబాబునాయుడు, లోకేష్లు దృష్టి సారించాలన్నారు. లేకుంటే మండిపల్లి దోపిడీ, దౌర్జన్యాలు మీ అనుమతులతోనే జరుగుతున్నాయా అనేది స్పష్టం చేయాలన్నారు. మీరే అనుమతి ఇచ్చినట్లయితే నేరుగా మీకే టాక్స్లు కడతామని తెలిపారు. ఎక్కడ ఎవరు అరాచకం చేసిన తాట తీస్తానని స్టేట్ గెస్ట్హౌస్లో మంత్రి రాంప్రసాద్రెడ్డి చెప్పిన రోజునే ఆయన అనుచరులు దొంగతనాలకు పాల్పడటంపై సమాధానం చెప్పాలన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇద్దరు పోలీసులను పంపారన్నారు. దౌర్జన్యంగా దొంగతనాలు చేస్తున్నారంటే ఇలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వారిపైన తక్షణం చర్యలు తీసుకొని అరాచకాలు ఆపుతారా లేదా వారిని రమేష్రెడ్డి డిమాండ చేశారు. 1999లో తాను ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. ఇది ప్రజాస్వామ్యమే కాదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటమిలో ఉంటాయి, ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి రేపు వెళ్తాయన్నారు. ఈ అరాచకాలకు పాల్పడిన వారు ఏ బొక్కలో దాక్కున్న భవిష్యత్తులో బయటకు తెచ్చి ఏం చేయాలో అవి చేస్తామని హెచ్చరించారు. మాకు ప్రభుత్వం వస్తుంది.. మేము అధికారంలోకి వస్తాం.. ఇలాంటి వారి కథ చూస్తాం అని ఘాటుగా స్పందించారు. అంత సులభంగా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చేతులకు గాజులు తొడుక్కొని ఇక్కడ ఎవరూ లేరంటూ హెచ్చరించారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన వినోద్కుమార్రెడ్డి అనే వ్యక్తి మట్టి అమ్ముతూ ఒక్కొక్క లారీ నుంచి రూ.1200 వసూళ్లు చేస్తున్నట్లు విమర్శించారు. అంతేకాకుండా ఎర్రచందనం తరలించి సంపాదిస్తున్నట్లు చెప్పారు. మంత్రి రాంప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు మేము తీసుకెళ్తున్నామని వినోద్కుమార్రెడ్డి ఓ సందర్భంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని ప్రశ్నించారు. తాను టీడీపీలో 25 సంవత్సరాలు పనిచేశానన్నారు. ఎన్నికల ముందు నాకు నచ్చక పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. నా మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడతారా.. కక్ష సాధింపు అంటే దొంగతనాలు చేయడమా అని ఆయన విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అయినా నా ఆస్థికే భద్రత లేదు అంటే సామాన్యుడి ఆస్థికి ఏం భద్రత ఉంటుందో పోలీసు అధికారులు చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రమేష్రెడ్డికి సంబంధించిన కంకర, సామగ్రి దోపిడీకి యత్నం మంత్రి అనుచరులను అడ్డుకున్న వైనం మట్టి, ఇసుక, కంకర, ఎర్రచందనం అక్రమ రవాణాలో మంత్రి, అతని అనుచరులు దోచుకుంటున్నారు మంత్రి రాంప్రసాద్రెడ్డి అరాచకాలపై మీడియా ముందు మండిపడిన ఆర్.రమేష్కుమార్రెడ్డి సీఐకి ఫిర్యాదు రాయచోటి ఎస్పీ కార్యాలయం సమీపంలో స్టాక్ పాయింట్లో నిల్వ ఉంచిన కంకర ఇతర సామగ్రిని దొంగలించుకు వెళ్తుండటంపై మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి రాయచోటి అర్బన సీఐ బివి చలపతికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి రమేష్కుమార్రెడ్డి నేరుగా అర్బన్ పోలీస్స్టేషన్కు వెళ్లి స్వయంగా రాసిన ఫిర్యాదుపత్రాన్ని సీఐకు అందజేశారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దోపిడీకి పాల్పడిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని సీఐను కోరారు. అలాగే కంకర ఇతర సామగ్రిని తరలిస్తున్న జేసీబీ, టిప్పర్లను పోలీసులకు స్వాధీనం చేశారు. -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
సింహాద్రిపురం : మండలంలోని అంకాలమ్మ గూడూరు సమీపాన పులివెందుల రోడ్డులో శుక్రవారం ట్రాక్టర్ ఢీకొని బైక్పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు అరటి కాయలను లారీల లోడు నింపే కూలి పని చేసుకుంటూ పులివెందులలో నివాసముంటున్నాడు. వెంకట్రాముడు తన స్వగ్రామంలో జాతర ఉండటంతో శుక్రవారం కూలి పని తొందరగా ముగించుకొని తన స్వగ్రామానికి బైకుపై వెళుతుండగా అంకాలమ్మ గూడూరు బలపనూరు గ్రామాల మధ్యలో ఎదురుగా ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట్రాముడు(38) మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు. -
పూలే ఆశయసాధనకు కృషి చేయాలి
రాయచోటి: అణగారిన వర్గాల అభ్యున్నతికోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రాయచోటి కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఆ మహనీయుని చిత్రపటానికి కలెక్టర్, జేసీ, డీఆర్ఓ, అధికారులు, బీసీ సంఘ నాయకులు, ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి, సీ్త్ర విద్యకు పాటుపడిన గొప్ప సంస్కర్తగా పూలే పేరొందారన్నారు. ఆ మహనీయుని ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమావేశంలో జేసి ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు పాల్గొన్నారు. ● బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి నిమిత్తం 707 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 14.14 కోట్ల రాయితీ మెగా చెక్కును కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి సురేష్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జయసింహ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ 16లోపు అభ్యంతరాలు తెలపాలి కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వపు జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు(గవర్నమెంట్) తాత్కాలిక జాబితా వెబ్సైట్ https:/rjdsekadapa.blog spot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలి పారు. కావున ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో తగిన ఆధారాలతో ఈ నెల 16లోపు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. -
బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ
ఓబులవారిపల్లె : జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీలపై చంద్రబాబు నాయుడు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఫొటోలకు పోజులిస్తున్నారన్నారు. బీసీలకు, మైనార్టీల లబ్ధిదారులకు గుర్తించకుండా మేము బీసీలకు మైనార్టీలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని సీఎం, మంత్రులు అనడం హాస్యాస్పదమన్నారు. బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించకుండా బీసీ, మైనార్టీ లబ్ధిదారులను గుర్తించకుండా ఏ విధంగా అభివృద్ధి చేసారని చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి ఎన్నికలలో అబద్ధపు హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో బీసీలు, మైనార్టీలు, మహిళలు, యువత వారికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. నేడు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలు, మైనార్టీలను మోసగిస్తున్నారని విమర్శించారు. సంక్షేమానికి బడ్జెట్లో ఒకరూపాయి కేటాయించలేదు రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు -
విద్యార్థులతో చెడుగుడు!
బి.కొత్తకోట: వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల ఉన్నత భవిష్యత్కు బాటలు వేస్తే..ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోజుకో మౌఖిక ఆదేశాలతో చదువుతో చెడుగుడు ఆడుకుంటోంది. ఈరోజు ఇచ్చిన ఆదేశాలు మరుసటిరోజు ఉండటం లేదు. స్పష్టమైన, సరైన నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మార్పును సరి చేస్తామంటూ విద్యాశాఖను గందరగోళంలోకి నెట్టేస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకోవడమేకాక విద్యావ్యవస్థ ఎటు పోతోందని వాపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నంబర్ 117 ద్వారా ప్రాథమిక పాఠశాల్లోని 3,4,5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేయడం ద్వారా మార్పు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం ఇది తప్పుడు నిర్ణయమని.. దీనిని సరిచేస్తామంటూ చేస్తున్న హడావిడి, అసంబద్ధ నిర్ణయాలతో విద్యాశాఖను బలహీనపర్చేలా ఉన్నాయని ఆ శాఖ అధికారులే అంటున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ఆదేశాల అమలు, తల్లిదండ్రుల కమిటీల నుంచి తీర్మాన ఆమోదాలను బలవంతంగా చేయించడం కోసం జిల్లాలో విద్యాశాఖ అధికారులు మునిగిపోయారు. వెనక్కి అంటే ఒక పాఠశాలకేనట జిల్లాలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో 3,4,5 తరగతుల వారిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీప హైస్కూళ్లలో విలీనం చేసింది. ఈ చర్య ఇక్కడికే పరిమితం చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ గతంలో విలీనమైన 3, 4,5 తరగతుల విద్యార్థులు ఏ పాఠశాల నుంచి వచ్చారో వారిని తిరిగి అక్కడికే పంపాలని అధికారులకు ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకునే పనిలో ఉండగానే మళ్లీ వెనక్కు పంపాల్సిన విద్యార్థులను ఆయా పాఠశాలలకు కాకుండా ఏ స్కూలులో ఎక్కువ మంది ఉంటారో అక్కడికి పంపాలని, మిగిలిన పాఠశాలలను అలాగే ఉంచాలన్న ఆదేశం అందింది. దీంతో పాత విధానం ఎక్కడ అమలు చేసినట్టని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా గత ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగతే ఉంటాయి. దీనికి ఒక ఉపాధ్యాయుడే ఉంటాడు. ఇలా చేయడం అంటే విద్యార్థులతో చెలగాటం అడటమే అవుతుంది. అంగన్వాడీలను కలిపేస్తారట: ప్రస్తుతం1,2 తరగతులతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలకు ఏకో పాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలల సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను ఇందులో కలిపి అంగన్వాడీకి వచ్చే పిల్లలను పాఠశాలలో పెట్టి చదివిస్తే సంఖ్య పెరగడం, అంగన్వాడీ టీచర్ కూడా అక్కడే పని చేస్తారు కాబట్టి ఇద్దరు టీచర్లు అవుతారన్న అభిప్రాయం కల్పిస్తోంది ప్రభు త్వం. దీనివల్ల అంగన్వాడీలకు వచ్చే పసిపిల్లల ఇబ్బందులు అన్నిఇన్నీకావు. 30 మందిని చేర్పిస్తే ఐదో క్లాస్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,2 తరగతుల పాఠశాలలకు ఐదోతరగతి వరకు కొనసాగాలంటే ఒక్కో పాఠశాలకు ఈనెల 15లోగా 30 మంది విద్యార్థులను చేర్పించాలని విద్యాశాఖ మౌఖిక ఆదేశాలిచ్చింది. హైస్కూళ్ల నుంచి తిరిగి వచ్చే 3,4,5 తరగతుల విద్యార్థులు ఒక పాఠశాలకే పంపిస్తారు కాబట్టి మిగిలిన 1,2 తరగతుల పాఠశాలకు పై తరగతుల నిర్వహణ ఉండదు. దీంతో ఇలాంటి పాఠశాలకు 30 మంది విద్యార్థులను చేర్పించే మెలికను పెట్టారని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఈ విధానం తొలగించే అవకాశమూ ఉందని అంటున్నారు. ఇలాంటి నిబంధన ఉపాధ్యాయులు, పాఠశాల విద్యతో చెలగాటం అడటమేనని వాపోతున్నారు. యూపీ స్కూల్ను పరిశీలిస్తే.. యూపీ స్కూళ్లలో 6,7,8 విద్యార్థుల సంఖ్య 30 లేదా ఆపై సంఖ్య ఉంటే ఆ స్కూలు అక్కడే ఉంటుంది. ఉదాహరణకు కురబలకోట మండలం ముదివేడు ఉర్దూ యూపీ స్కూలులో 6,7,8 తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 30 లోపలే ఉంది. ఈ నిబంధన అమలు చేస్తే ఇక్కడ పై తరగతుల నిర్వ హణ నిలిపివేస్తారు. ఈ విద్యార్థులంతా 15 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నియోజకవర్గానికి చెందిన మండల కేంద్రం గుర్రంకొండ లేదా 20 కిలోమీటర్ల దూరంలో మదనపల్లె యూపీ స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా విద్యా ర్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్ పెరుగుతారు. జిల్లాలో విద్యార్థులు, పాఠశాలల వివరాలు ప్రాథమిక పాఠశాలలు: 1,711 విద్యార్థులు : 43,192ప్రాథమికొన్నత పాఠశాలలు: 162విద్యార్థులు: 11,202ఉన్నతపాఠశాలలు: 304విద్యార్థులు: 79,232మొత్తం పాఠశాలలు: 2,177విద్యార్థులు: 1,33,626 (కొత్త విధానాలతో ఈ పాఠశాలల సంఖ్య తారుమారు కాబోతోంది) ఒక స్కూలు ఖాళీ కొత్తగా ప్రతిపాదిస్తున్న విధానంపై ఒక సారి పరిశీలిస్తే..ఉదాహరణకు బి.కొత్తకోట మండలంలోని గట్టు జెడ్పీ హైస్కూలులో సమీపంలోని గుట్టపాళ్యం, గట్టు తెలుగు ప్రాథమి పాఠశాలల నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులను కలిపారు. ఇప్పుడు వీరిని ఈ రెండు పాఠశాలలకు తిరిగి పంపాలి. అయితే ఒక పాఠశాలకు మాత్రమే అందరినీ పంపుతారు. ఒక పాఠశాల ఖాళీగా ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి స్కూలుకు వచ్చే విద్యార్థులను ఇబ్బంది తెచ్చిపెట్టడమే కాక కొత్త సమస్యను తీసుకొస్తుంది. 30కి తగ్గితే యూపీ స్కూళ్లు గోవిందా ఇప్పుడు జిల్లాలో యూపీ స్కూళ్ల మనుగడకు గండం పొంచి ఉంది. జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న యూపీ స్కూళ్లలో 6, 7, 8 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 30కి మించాలి. ఇందులో ఒకరు తగ్గినా ఆ తరగతులను యూపీ స్కూళ్ల నుంచి తొలగించి సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీనికోసం గురువారం జిల్లాలోని విద్యాశాఖ అధికారులు సంబంధిత హెచ్ఎంలు, తల్లిదండ్రుల కమిటీలు ఆమోదించిన తీర్మానం కోసం తంటాలు పడ్డారు. ఈ తీర్మానం ఆమోదమోగ్యం కాదని యూపీ స్కూళ్లు హెచ్ఎంలు, కమిటీలు వ్యతిరేకించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలు తీర్మానం ఇవ్వాల్సిందేనని విద్యాశాఖ అధికారులు పట్టుబట్టి ఆమోదాలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎన్ని యూపీ స్కూళ్లు మూతపడతాయో లెక్క తేలనుంది. 3,4,5 తరగతులు మళ్లీ యథా స్కూళ్లకు పంపాలని సూచన ఇప్పుడు వీళ్లను ఒక పాఠశాలకే పంపాలని ఆదేశం రోజుకో ఆదేశాలతో విద్యాశాఖ అధికారుల్లో అలజడి, గందరగోళం -
నీలిమేఘ శ్యాముడు.. రఘుకుల సోముడు.. శ్రీరామచంద్రుడు.. కల్యాణ రామునిగా మారి.. సౌందర్య రాశి.. సుగుణాల తల్లి సీతమ్మను పరిణయమాడారు. నునుసిగ్గుల మొలకై న సీతమ్మకు నుదుటన కల్యాణ బొట్టు, బుగ్గన కాటుక పెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలను అలంకరింపజే
● కమనీయంగా సీతారాముల కల్యాణం ● వైకుంఠాన్ని తలపించిన ఏకశిలానగరి ● పోటెత్తిన భక్తజనం ● మార్మోగిన రామనామం రాజంపేట/ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సీతారామ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఏకశిలానగరం రామనామంతో మార్మోగింది. దారులన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి. జిల్లా నలు మూలల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా రామాలయంలోని సీతా,రామ,లక్ష్మణ మూర్తులను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయం ఆడిన వేల శిల్పకళాశోభితమైన కల్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచంద్రులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు దీర్చారు. ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్సేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కల్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా.. సీతమ్మ నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించిన ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. ఆమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి.. అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నారు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కన్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళాష్టం చదివారు. హస్త నక్షత్రయుక్త శుభ లగ్నంలో 6:30 నుంచి 8:30 గంటల మధ్య సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతిదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానం చేసి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించారు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కల్యాణ ముర్తుల శిరస్సుపై వేసి కల్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కల్యాణ క్రతువు ముగిసింది. ● వేదిక.. సుందర దీపిక కల్యాణ వేదికను టీటీడీ ఉద్యానవ విభాగం ఆధ్వ ర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా త్రేతా యుగం నాటి జనకపురిని గుర్తుకు తెచ్చేలా సుందరంగా ముస్తాబు చేశారు. వేదికపై ప్రాచీన ఆలయాలలోని కళాకృతులు, దశావతరాల సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరిగింజలతో మండపం ఏర్పాటు చేశారు. రంగురంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ పూత, అరటి ఆకులు, మామిడాకులు, హెలికానియమ్స్, టార్చ్ జింజర్, నీలం, ఆర్కిడ్, రెడ్ ఆంధూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో రెండు రోజుల పాటు 120 మంది అలంకరణ నిపుణులు, 120 మంది టీటీడీ సిబ్బంది ఇందుకోసం పని చేశారు. -
నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
చిట్వేలి : అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎం. రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చొక్కారాజు దేవాన్స్ (5), చొక్కారాజు విజయ్(4), రెడ్డిచెర్ల యశ్వంత్ (5) ఆడుకోవడానికి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అందులో ఉన్న నీటిలో పడి మృతి చెందారు. చిన్నారుల ఆచూకీ కోసం వెతుకుతుండగా కుంటలో విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి కడప కోటిరెడ్డిసర్కిల్ : కడ ప రైల్వేస్టేషన్లో సాకేత్ (3), మల్లి (2) అనే చిన్నారు లు ఉన్నారని తెలియడంతో ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్, మహిళా పోలీసులు చిన్నారులు తీసుకుని సీడబ్ల్యుసీ ఎదుట హాజరు పరిచామని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే బాలల సంక్షేమ సమితిలో సంప్రదించి తీసుకు వెళ్లాలన్నారు. చౌకదుకాణం సీజ్ బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని శీలంవారిపల్లె గ్రామంలోని చౌకదుకాణాన్ని శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ ఆధ్వర్యంలో రేషన్ షాపును తనిఖీ చేయగా అందులో 4897 కేజీల బియ్యం, 128 కేజీల చక్కెర తక్కువగా ఉన్నట్లు గుర్తించి సంబంధిత డీలర్పై కేసు నమోదు చేయడంతో పాటు రేషన్ షాపును సీజ్ చేసినట్లు డీటీ తెలిపారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
సిద్దవటం : ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి పంచాయతీలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దుకాణ దారులకు శుక్రవారం డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుకాణదారులు చెత్తను చెత్తబుట్టల్లో వేసి ప్రతిరోజు గ్రామంలోకి వచ్చే హరిత రాయబారుల వాహనంలో చెత్తను వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి గ్రామాన్ని పరి శుభ్రంగా పెట్టుకోవాలని తెలిపారు. కాలుష్య నివారణ కోసం గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఒంటిమిట్టలోని కోందడ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జేఎంజే కాలేజీ నుంచి జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో బద్వేల్ డీఎల్పీఓ రమణారెడ్డి, ఏఓ ఖాదర్బాషా, గ్రామ కార్యదర్శి రాజేష్ స్థానిక నాయకుడు తుర్రా ప్రతాప్ పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. డీపీఓ రాజ్యలక్ష్మి -
వీఆర్ఓ అవినీతిపై నివేదిక ఇవ్వండి
– సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మదనపల్లె : మండల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో లంచం వసూళ్లపై సోషల్మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలపై శుక్రవారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ స్పందించారు. బీకే.పల్లె పంచాయతీలో ఓ భూమి భాగపరిష్కారాల్లో భాగంగా అన్నదమ్ములకు మ్యుటేషన్ చేసేందుకు రూ.5లక్షలు వీఆర్వో వసూలు చేశాడన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ ధనంజయులు, ఆర్ఐ భరత్ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై రెవెన్యూ సిబ్బందిని సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అలాగే బాధిత రైతులను, పంచాయతీ వీఆర్వోలను క్షేత్రస్థాయిలో విచారించాలన్నారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేర్వేరు ఘటనలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నంకు పాల్పడి స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలకడ మండలం నడిమిచెర్ల గ్రామానికి చెందిన చంద్రయ్య కుమారుడు రమణ(48) కుటుంబ సమస్యల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. అదే విధంగా మదనపల్లె పట్టణం శేష్మహల్ ప్రాంతానికి చెందిన యువకుడు (18) తల్లిదండ్రులు మందలించారని లక్ష్మణరేఖ తిని ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వజిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంఽధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. టాక్టర్ను ఢీకొన్న లారీ సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై శుక్రవారం టాక్టర్ను లారీ ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీ ముదినేని వడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర టాక్టర్లో రాయచోటి వెళుతున్న క్రమంలో నారాణరెడ్డిపల్లె సమీపంలో పిలేరు నుంచి వస్తున్న లారీ ముందు వెళుతున్న టాక్టర్ను ఢీకొంది. ప్రమాదంలో టాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. 108 వాహనంలో అతడిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టమాటా లారీ బోల్తా.. సుండుపల్లి వాసి మృతి రాయచోటి : చిన్నమండ మండలం కేశాపురం చెక్పోస్టు వద్ద టమాటా లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి గుర్రంకొండ మండలం తరిగొండ నుంచి టమాటాల లోడుతో నంద్యాలకు వెళుతున్న వాహనం కేశవరం చెక్ పోస్ట్ వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో సుండుపల్లి మండలం రాచంవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణ (53) టమాటా లారీ కిందపడి మృతి చెందాడు. సుండుపల్లి నుంచి వివాహానికి వెళ్తున్న ఆయన చెక్ పోస్ట్ వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారిస్తున్న చిన్నమండెం పోలీసులు తెలిపారు. -
రాయితీ పథకాలతో ఆర్థికాభివృద్ధి
కలెక్టర్ చామకూరి శ్రీధర్ బి.కొత్తకోట: భవిష్యత్ సాగు పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం ఆయన బి.కొత్తకోట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉద్యాన పంటల సాగు స్థితిగతులపై తెలుసుకునేందుకు స్వయంగా గులాబీ, టమాట సాగు చేస్తున్న పోలాల్లోకి వెళ్లారు. కూలీలతో ముచ్చటించారు. మొదట బీరంగి గ్రామం కర్ణాటక సరిహద్దులో నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద రూ.40 లక్షల పెట్టుబడితో సాగు చేస్తున్న గులాబీతోటను పరిశీలించారు. తోటలో మొక్కలను పరిశీలించి మొగ్గలకు తొడిగిన కవర్లను పరిశీలించారు. తోటనిర్వహణ చూస్తున్న వారితో మాట్లాడారు. గులాబీ పంట దిగుబడితో సంబంధం లేకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పూలను ఎగుమతి చేస్తామని, ధరలు ఆశాజనకంగా ఉంటే ఏడాది పొడవునా పూలను మార్కెటింగ్ చేస్తున్నట్టు కలెక్టర్కు వివరించారు. దిగుబడికి సంబంధించి ప్రస్తుతం ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించడంతో పూల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని, దీనికితోడు మార్కెట్ లేకపోవడంతో మొగ్గులను తుంచేస్తున్నామని వివరించారు. ఎగుమతి చేస్తున్న గులాబీకి మంచి మార్కెటింగ్తో ఆదాయం లభిస్తుందని చెప్పగా కలెక్టర్ ఇక్కడ పని చేస్తున్న బిహారీ కూలీల జీవనంపై ఆరా తీశారు. అక్కడినుంచి మోడల్ స్కూల్ వద్ద మల్చింగ్తో సాగవుతున్న టమాట, మిరప పంటలను కలెక్టర్ పరిశీలించారు. ● జిల్లాలో ఉద్యాన పంటల పెంపకం విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ మోహమ్మద్ అజారుద్దీన్, ఎంపీడీఓ దిలీప్కుమార్, ఆర్ఐ వీరాంజనేయులు, వీఆర్ఓల ఉన్నారు. ● ప్రజల నుంచి పీజీఆర్ఎస్కు అందే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ చ శ్రీధర్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అప్పటికప్పుడు వ్యవసాయ, హౌసింగ్, హార్టికల్చర్, సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖలవారీగా వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. -
బ్రహ్మోత్సవం.. నయనమనోహరం
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అలంకారంలో స్వామివారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వ హించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ జరిగింది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి గరుడ సేవ ఘనంగా జరిగింది. రామయ్య పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కళాకరుల కోలాటాలు, చెక్కభజనల మధ్య కోదండ రాముడి ఊరేగింపు కనులపండువగా సాగింది. ఈ కార్యక్రమం టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. గురువారం సీతారాముల కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో దాశరథి దివ్యక్షేత్రాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు శుక్రవారం ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు శివధనుర్భంగాలంకారం, 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం. సాయంత్రం 3:15 నుంచి 5 గంటల వరకు ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 6:30 నుంచి 8:30 వరకు కల్యాణోత్సవం, 9:30 నుంచి 10:30 వరకు గజవాహనం, 11 నుంచి 11:15 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు వైభవంగా గరుడవాహసేవ -
సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం
● టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం సీతారామ కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశం హాల్లో చైర్మన్, ఈఓ జె. శ్యామలరావు, వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేఈఓ వీరబ్రహ్మం, వైఎస్సార్ జిల్లా జేసీ అదితిసింగ్, ఎస్పీ ఈజీ అశోక్ కమార్, సీవీఎస్ఓ హర్షవర్దన్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సీతారాముల కల్యాణం సందర్బంగా శుక్రవారం సాయంత్రం రారష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కల్యాణ వేదిక వద్ద ఉన్న 147 గ్యాలరీల్లో 60 వేల మంది కూర్చొని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తలంబ్రాల పంపిణీకోసం తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.ఎస్వీబీసీ చానల్లో స్వామివారి కల్యాణం నేరుగా ఎల్ఈడీ స్క్రీన్ మీద ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు సిద్దవటం: మండలంలోని కనుమలోపల్లె,భాకరాపేట, శివునిపల్లె, బొగ్గిడివారిపల్లె, చాముండేశ్వరీపేట, మాధవరం–1 ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఒంటిమిట్టలో ఈ నెల 11న జరిగే సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జేఎంజే కళాశాల నుంచి ఒంటిమిట్ట వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్తకుప్పలు, కల్వర్టులు, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేశామని బాంబుస్క్వాడ్ పోలీసులు తెలిపారు. -
●గోటితో ఒలిచిన తలంబ్రాలు అందజేత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పించారు.సూపరిటెండెంట్ హనుమంతయ్య అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో వీటిని అందించారు. తలంబ్రాల కోసం మూడునెలలపాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన భక్తులు భక్తిభావంతో మూడు నెలలపాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టుకు మూడో స్థానం
రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర స్థాయి జూనియర్స్ హాకీ పోటీలలో రాజు హాకీ అకాడమీ మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా హాకీ సెక్రటరీ ఇ.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ధర్మవరంలో జరిగాయన్నారు. పోటీలలో రాష్ట్ర స్థాయి జూనియర్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అన్నమయ్య జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా హాకీ జట్టును హాకీ ఫౌండర్ సి.చంద్రశేఖర్, కోచ్లు సుబ్బు, నారాయణ, రాజి, రాజు విద్యాసంస్థల అధ్యాపకులు అభినందించారు. అన్నమాచార్య యూనివర్సిటీలో టెక్ఫెస్ట్ విజయవంతం రాజంపేట : రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో జాతీయస్థాయిలో నిర్వహించిన రెండురోజుల సాంకేతిక సాంస్కృతిక మహోత్సవం (టెక్ఫెస్ట్–2025) గురువారం విజయవంతంగా ముగిసింది. ముఖ్య అతిథిగా జేఎన్టీయూఏ ఇంజినీరింగ్ కాలేజ్, పులివెందుల ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, పోటీతత్వాన్ని పెంపొందించడంతోపాటు సమకాలిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవచ్చన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఈ.సాయిబాబా రెడ్డి మాట్లాడారు. ముగింపు సందర్భంగా పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రోఛాన్సలర్ చొప్పా అభిషేక్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.మల్లికార్జున రావు, కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎంవి నారాయణ, బి.జయరామిరెడ్డి, డీన్ డాక్టర్ ఎం.సుబ్బారావు, పరిపాలన అధికారి ఎన్.సుబ్బారెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కారులో మంటలు.. వ్యక్తికి తీవ్ర గాయాలు వీరబల్లి : మండలంలోని షికారుపాలెం వద్ద గురువారం రాత్రి 8 గంటల సమయంలో కారు దగ్ధం కావడంతో అందులోని వ్యక్తికి గాయాలయ్యాయి. రాయచోటి పట్టణంలోని బీరంసాబ్ వీధికి చెందిన మన్నూరు అలీ (53) రాజంపేట నుంచి రాయచోటికి కారులో వస్తుండగా షికారుపాలెం వద్ద ఉన్న మలుపువద్ద అదుపు తప్పడంతో కారు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోయింది. మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వరప్రసాద్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మన్నూరు అలినీ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. -
ఇసుకను కొల్లగొట్టారు.. చెట్లను కూల్చేశారు
గుర్రంకొండ : ఇసుకాసురులు ఎంతకై నా తెగిస్తున్నారు. చెరువుల్లో ఇసుక కోసం అడ్డుగా ఉన్న చెట్లను జేసీబీలతో పెకలించేశారు. రూ. లక్ష విలువచేసే చెట్లను చెరువులో నుంచి మాయం చేసిన సంఘటన మండలంలోని తరిగొండ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో రామానాయిని చెరువు విస్తరించి ఉంది. మండలంలోని ఇది అతిపెద్ద ఇరిగేషన్ చెరువు. ఈ చెరువు నిండి మొరవ పోతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం వైభవంగా చెరువు వద్ద నిర్వహిస్తారు. అంతటి ప్రాశస్త్యమున్న చెరువు ఇసుకాసురుల అక్రమ సంపాదనకు ఆవాసంగా మారింది. ఓవైపు వందలాది లోడ్ల ఇసుకను ఇప్పటికే అక్రమంగా తరలించకు పోగా చెరువులో ఉన్న చెట్ల పై కూడా ఇసుకాసురుల కన్ను పడింది. చెరువుల సువిశాలమైన ప్రాంతంలో పురాతన నల్లతుమ్మ, నీలగిరి చెట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటి మధ్యలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇసుకాసురులు ఇసుక తోడేందుకు అడ్డుగా ఉన్న నల్లతుమ్మ, నీలగిరి చెట్లను జేసీబీలతో పెకలించి వేశారు. చెరువులోనే మరికొన్నిచోట్ల ఇసుకను తరలించడానికి కొత్త దారుల ఏర్పాటు కోసం చెట్లను జేసీబీలతో పెకలించి పక్కన పడేశారు. కొంతమంది ఇసుకాసురులు వీటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బట్టీల యాజమానులకు సుమారు లక్ష విలువ చేసే నల్లతుమ్మ, నీలగిరి చెట్లను ఇప్పటికే ఇసుకాసురులు విక్రయించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మరికొన్ని చెట్లను వేళ్లతో సహా పెకలించి చెరువుల్లో అలాగే వదిలిపెట్టేశారు. చెరువుల్లో ఎక్కడ చూసినా నేలకొరిగిన చెట్లే దర్శనమిస్తుండడం గమనార్హం. ఓవైపు ఇసుక మరోవైపు చెట్లను అక్రమంగా విక్రయిస్తూ ఇసుకాసురులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా చెరువులను కాపాడుకునేందుకు ఇప్పటికే వీఆర్ఓ, వీఆర్ఏలను అక్కడ కాపలాగా ఉంచామన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక కోసం జేసీబీలతో చెట్లను తొలగించిన వైనం రూ.లక్ష విలువ చేసే చెట్లు మాయం -
వరిపంటపై అడవి పందుల దాడి
సుండుపల్లె : మండల పరిధిలోని సుండుపల్లె గ్రా మ పంచాయతీ గుట్టకాడ బలిజపల్లెకు చెందిన నంద్యాల సిద్దయ్య వేరుశనగ పంట పొలంపై బుధవారం రాత్రి సమయంలో అడవి పందులు దాడి చేశాయి. ఈ సందర్భంగా రైతు సిద్దయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్ 105లో దాదాపు రెండు ఎకరాల వరిమడిని సాగు చేశానని తెలిపాడు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా అడవి పందులు దాడి చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. జిల్లాలోని 268 ఆలయాలకు అర్చకుల నియామకం రామాపురం : అన్నమయ్య జిల్లాలోని 268 దేవాలయాలకు అర్చకులను నియమించనున్నట్లు జిల్లా దేవదాయ శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. గురువారం మండల పరిధి బండపల్లె , సూర్యనారాయణపురంలో శ్రీ మల్లాలమ్మ తల్లి ఆలయం గువ్వలచెరువు, ఓబుల్రెడ్డిగారిపల్లె, యర్రమరెడ్డిగారిపల్లె, రాచపల్లె, వడ్డెపల్లె, పర్వతరెడ్డిగారిపల్లె, నల్లగుట్టపల్లె, పాతపల్లి, కర్ణపువాండ్లపల్లె గ్రామాలలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అర్చకులు దేవాలయంలో సక్రమంగా పూజలు చేయకుండా ఉంటే అలాంటి వారిపైన ఫిర్యాదు చేస్తే తొలగిస్తామన్నారు. చేబ్రోలు కిరణ్పై ఫిర్యాదు సుండుపల్లె : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని దుర్భాషలాడిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై వైఎస్సార్సీపీ రాజంపేట నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్దుల్లా, మండల సోషల్ మీడియా విభాగం నాయకుడు సయ్యద్ సల్మాన్లు సుండుపల్లె ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. అతని వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ముదివేడు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
రాయచోటి టౌన్ : ముదివేడు రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ కోసం రైతుల భూములు లాక్కొని వారికి పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పరిహారం ఇవ్వకపోతే భూములను వెనక్కి ఇవ్వాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాసులు, రాజేష్, వెంకటరెడ్డి, మారపరెడ్డి, తిమ్మారెడ్డి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర కరువై.. అప్పులు భారమై.!
ఓబులవారిపల్లె : తొలి నుంచి రైల్వేకోడూరు నియోజకవర్గం ఉద్యాన పంటలకు ప్రసిద్థి. అయితే తక్కువ వ్యవధిలో ఆదాయం వస్తుండడంతో దశాబ్ద కాలంగా కర్బూజ, దోస పంటలను రైతులు సాగు చేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి అప్పుచేసి పంట సాగు చేస్తే చేతికి అందే సమయంలో దళారుల సిండికేట్తో అమ్ముడుపోక తోటలోనే కాయలు వదిలేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక కలత చెంది ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని వై.కోట గ్రామానికి చెందిన రామ జనార్దన్ (49) అనే రైతు సాగు చేస్తున్న దోస, కర్బూజ పంటలో తీవ్రంగా నష్టం రావడంతో కలత చెంది గుండెపోటుతో ఈనెల 4వ తేదీ మృతి చెందాడు. వ్యవసాయమే ఆధారంగా అప్పులు చేసి తనకున్న పది ఎకరాలలో అంతర పంటగా దోస, కర్బూజను సాగు చేశాడు. దళారులు సిండికేట్గా మారి టన్ను రూ. 4 వేలు నుంచి రూ. 5 వేలుగా నిర్ణయించారు. ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతు ఆందోళన చెందాడు. దళారులు రాకపోవడంతో తోటలోనే కాయలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రూ. 10 లక్షలలో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో రోదించాడు. కాయలు తోటలోనే కుళ్లిపోగా మనస్తాపం చెంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. చివరకు రైతు కాయలు వదిలేసిన తోటలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. జీవనోపాధి కోల్పోయిన కుటుంబం.. రామ జనార్దన్ మృతి చెందడంతో పెద్దదిక్కు లేక వారి కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. జనార్దన్కు భార్య సులోచన, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయికి వివాహం కాగా, పెద్దబ్బాయి వెంకటేష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మృతి చెందడంతో వెంకటేష్ చదువు చాలించి తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు.. లక్షలు అప్పుచేసి సాగు చేసిన పంట చేతికి రాకపోవడంతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలని నియోజకవర్గంలోని ప్రజలు కోరుతున్నారు. గిట్టుబాటు ధర లేక వందల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం నష్టపోతున్న దోస, కర్బూజ రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు . దళారుల సిండికేట్తో దగాపడుతున్న రైతులు వందలాది ఎకరాల్లో దోస, కర్బూజ పంటను వదిలేస్తున్న వైనం గుండెపోటుతో దోస రైతు మృతి పట్టించుకోని ప్రభుత్వం -
గ్యాంగ్ల భరతం పడతాం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో గ్యాంగుల పేరుతో రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడే వారి భరతం పడతామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శివాలయం వద్ద జరిగిన గ్యాంగ్ వార్ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలు, అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్ట పరిధి దాటిన వారిని ముందుగా హెచ్చరించడంతోపాటు వారికి అన్ని కోణాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అప్పటికీ దారికి రాకపోతే వారిపై రౌడీషీట్ కేసులు ఓపెన్ చేసి అవసరమైతే జిల్లా బహిష్కరణ చేయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో జూద శాలలపై ఉక్కుపాదం మోపామన్నారు. కుల మతాలు, వర్గాల ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న వారిపట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రధాన పట్టణాలలో నిరుద్యోగ యువకులు, మైనర్ విద్యార్థులు కొంతమంది మాయమాటలలో పడి మత్తుకు బానిసలై తప్పుదారిలో పయనిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కూడా తగు చర్యలు తీసుకోవడంతోపాటు గ్యాంగుల నిర్వాహకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ మాసం సందర్భంగా జరిగిన సంఘటనపై కూడా ఇంకా విచారణ సాగుతోందన్నారు. అన్ని వీడియో పుటేజీలను పరిశీలించిన అనంతరం దాడుల్లో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా తక్షణం పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన పోలీసులను కూడా సిద్ధం చేశామన్నారు. పట్టణాల పరిధిలో రాత్రి సమయాలలో అదనపు బలగాలతో పోలీసులు గస్తీని ఏర్పాటు చేశామని తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమన్నారు. మైనర్లతోపాటు బైక్లు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా పోలీస్ దండనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ తీవ్రంగా హెచ్చరించారు. తొమ్మిది మంది ముద్దాయిలు అరెస్టు.. అమ్మాయి విషయంపై ఒకరిపై మరొకరు మనస్పర్థలు పెంచుకొని దాడులు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. ఈ కారణంగానే కక్షలు పెంచుకొని శివాలయం చెక్పోస్టు వద్ద జరిగిన ఘర్షణ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గ్యాంగ్ వార్ దాడిలో ఇరువర్గాలకు చెందిన 24 మందిని గుర్తించి రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సయ్యద్ నూరుల్లా ఉరఫ్ నూర్ (21), సయ్యద్ బైతుల్లా (23), షేక్ ఖదీర్ అహ్మద్ ఉరఫ్ ఖాదర్ (24), షేక్ సుహైల్ ఉరఫ్ గుర్రం (21), షేక్ మన్సూర్ అలీ (22), షేక్ ఇర్ఫాన్ (21), షేక్ ఇర్ఫాన్ (21), షేక్ షారుక్ (21), పఠాన్ రియాజ్ అలీఖాన్ ఉరఫ్ నాజుల్లా (22)లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పెడుతున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న 15 మందికోసం వేట సాగుతుందన్నారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. నిందితులు దాడులకు ఉపయోగించిన ఐదు కట్టెలు, మూడు ఇనుప రాడ్లు, ఒక ఇనుప చైన్, తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి పాల్గొన్నారు. అసాంఘిక కార్యక్రమాలు.. అరాచకాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం గ్యాంగ్వార్ ఘటనలో తొమ్మిది మంది అరెస్టు మిగిలిన వారికోసం వేట మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు