ప్రధాన వార్తలు

మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు.

బాధ్యత నుంచి తప్పించుకోవడానికే...
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్) కార్యక్రమం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ‘పీ4’ ద్వారా ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ‘మార్గద ర్శులు’గానూ, వీరు దత్తత తీసుకునే పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’ గానూ పేర్కొన్నారు. ఈ మార్గదర్శులు తమ ఖర్చుతో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించి నూరు శాతం పేదరిక నిర్మూలన (జీరో పావర్టీ) సాధించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. కానీ దీని వెనక దాగి ఉన్న నిజం వింటే ప్రభుత్వ పెద్దల దుర్బుద్ధి ఇట్టే తేటతెల్లమవుతుంది.ఆంధ్రప్రదేశ్లో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. పీ4 ప్రాజెక్టు కింద కేవలం 19.15 లక్షల కుటుంబాలను మాత్రమే ‘పేదలు’గా గుర్తించారు. అంటే 87 శాతం మంది అల్పాదాయ వర్గం (బీపీఎల్) పరిధిలోని కుటుంబాలు ఈ దీని పరిధిలోకి రాలేదన్నమాట. నమోదైన వారిలో సైతం మార్గదర్శకులు దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలు కేవలం 62,970. అంటే మొత్తం పేదల్లో కేవలం ఒక శాతం కన్నా తక్కువే. వీరికి అండగా నిలిచేందుకు గుర్తించిన మార్గదర్శుల సంఖ్య కేవలం 5325 మంది ఉన్నారు. ఈ సంఖ్యలు చూస్తే... ‘పీ4’ ద్వారా పేదల్లో ఎంత శాతం మందికి మేలు చేకూరు తుందో, వారి జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడతాయో చెప్పొచ్చు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా కంపెనీలు, సంస్థలు ఏటా నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలను ఇక నుండి పీ4లో మార్గదర్శుల ఖాతాలో చూపించబోతున్నారు. వాస్తవానికి, కంపెనీల చట్టం 2013 ప్రకారం కంపెనీల స్థాయిని బట్టి తమ లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, పర్యావరణం, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలి. ఇలా ఏటా వేల కోట్లు కంపెనీలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిని పీ4 కింద చేర్చి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. సాధారణంగా పేదల ఆరోగ్యం, విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, ఇతర సంక్షేమ అవసరాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ బాధ్యత నుంచి తప్పించు కుంటూ పీ4 పేరిట కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు దీన్ని ప్రభుత్వం అప్పగించాలని చూడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పేదలకు ఆర్థిక చేయూత నిచ్చే సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడే కుట్రలో భాగమే ఇదని చెప్పొచ్చు. ఈ పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం – పేదలకు ధనవంతులు సహాయం చేయటం! కానీ చంద్రబాబు నాయుడు అమలు చేసిన ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రయోజనం పొందిన పెట్టుబడి దారులను ‘మార్గదర్శులు’ అని పిలవడం సరికాదు. సూపర్–6 వాగ్దా నాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వ పెద్దలు పీ4ను తెరపైకి తెచ్చినట్లుంది. వైఎస్సార్ వంటి మహానేతలు ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో పాటు ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు’ ప్రజల అవసరాలను నేరుగా తీరుస్తూ సంక్షేమాన్ని వారి కళ్ల ముందు నిలిపాయి. కానీ నేటి ప్రభు త్వానికి సంక్షేమ స్పృహ కని పించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఏదైనా పథకాన్ని ప్రభుత్వ భాగ స్వామ్యంతో నడిపితే సత్ఫలితాలుంటాయి. అది జరగనప్పుడు రాష్ట్రాభివృద్ధి తిరోగమిస్తుంది. పీ4 అనేది ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే కార్యక్రమం కానే కాదనేది గమనార్హం. ఇటువంటి కార్యక్రమాల అమలును స్వతంత్ర ట్రస్ట్ల ద్వారా, పార దర్శక ఆడిటింగ్తో, ప్రభుత్వ భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తేనే విశ్వస నీయత పెరుగు తుంది. లేదంటే, ఇది కూడా ఓ ‘సూపర్–6’ నినాదం లాగా మిగిలి పోతుంది. పేదల ఆత్మాభిమానాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం దీనిలో కనిపిస్తోంది. తాము సహాయం చేస్తున్నాం కాబట్టి ఎన్నికల సమయంలో తాము చెప్పిన రాజకీయ పక్షాలకే ఓటువేయాలని కార్పొరేట్ సంస్థలు పేదలపై ఒత్తిడి తేవచ్చు. అదే జరిగితే ప్రజా స్వామ్యం మంట గలిసిపోతుంది. కార్పొరేట్లు ఎవరిని తలచుకుంటే వారినే అధికారంలో కూర్చోబెట్టగలుగుతారు. ఎటూ ఈ కార్యక్రమాన్ని తామే ప్రవేశపెట్టాం కనుక పేదప్రజలను తమ ఓటుబ్యాంకుగా కార్పొ రేట్లు మారుస్తారని ప్రస్తుత ప్రభుత్వాధినేత ఆలోచన. ఇదే పీ4 వెనుక ఉన్న అసలు రహస్యం!– తలకోల రాహుల్ రెడ్డి,ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనలిస్ట్

మస్క్ ‘కాల్పుల విరమణ’!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో డోనాల్డ్ ట్రంప్ వెనుకనో, పక్కనో అంతెత్తు గెంతుతూ... ఆయన అధ్యక్షుడయ్యాక తరచుగా వైట్ హౌస్కు సంతాన సమేతంగా వస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ నాలుగు రోజులపాటు ట్రంప్తో బహిరంగ యుద్ధానికి దిగి, ఇంతలోనే బుధవారం నాడు దానికి శుభం కార్డు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరచు ఒకటిగానే కనబడే రాజ్యశక్తి, ధనశక్తి నిజంగా కొట్లాటకు దిగితే చివరాఖరికి రాజ్యశక్తిదే పైచేయి అవుతుందని ఈ స్వల్పకాల ఉపాఖ్యానం నిరూపించింది. అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ట్రంప్కు దాదాపు ప్రతిపక్షం లేదు. ఆయన పాలనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అమెరికన్ కాంగ్రెస్ నిరాసక్తంగా ఉంది. వలస విధానం అంశంలో కోర్టులు కాదంటున్నా పంతం నెగ్గించుకుంటున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలు ఆయనకు తలొంచాయి. మీడియా సరేసరి. పర్యవసానంగా ఆయన తలచుకున్నదే ధర్మం, ఆయన అమలుచేసేదే న్యాయం! మన పురాణాల్లో వైరభక్తి అనేది ఒకటుంది. శాపవశాత్తూ శ్రీమహావిష్ణువుకు దూరం కావాల్సివచ్చిన ద్వారపాలకులు జయవిజ యులు... సత్వర శాపవిమోచనకు ఆయనతో మూడు జన్మల్లో వైరానికి దిగి, ఆయన చేతుల్లోనే హతమారి తిరిగి చేరువవుతారు. ట్రంప్–మస్క్ వైరం నిండా నెల్లాళ్లయినా కొనసాగలేదు. ట్రంప్–మస్క్ల బంధం ఏడాది క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. మస్క్ తన దారిన తాను ‘ఇన్నొవేషన్ గురు’ అనిపించుకుంటూ ప్రయోగాలు చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్మి ఖరీదైన టెస్లా కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ట్విటర్ను కొన్నాడు. ఈ భూమికి భవిష్యత్తు లేదని, అంగారకుడిపై ఆవాసాలు నిర్మించుకోవటమే ప్రత్యా మ్నాయమని అందరి చెవుల్లో హోరెత్తుతూ నిజమేనని భ్రమింపజేస్తున్నాడు. ఈలోగా హైపర్లూప్ రైళ్ల ఆలోచనను వదిలారు. ఇంతలో డెమాక్రటిక్ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా మొన్న అధ్యక్ష ఎన్ని కల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హ్యారిస్తో తేడా వచ్చింది. తాను భారీగా విరాళాలి చ్చినా తన కొత్త సాంకేతికతలను నిర్లక్ష్యం చేశారని అలిగాడు. అంతే... ఉదారవాదానికి స్వస్తిపలికి నిరుడు మితవాది ట్రంప్కు చేరువయ్యాడు. ఆయన ప్రచార సభలకైన వ్యయంలో అత్యధిక వాటా మస్క్దే. దాదాపు 30 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వటమే కాదు... వచ్చే ఏడాది నవంబర్లో 435 స్థానా లుండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు 10 కోట్ల డాలర్లు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. ట్రంప్–మస్క్ల మైత్రి ఉభయతారకమైనది. ట్రంప్కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్, మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒక్కటై అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవటంలో కృతకృత్యులయ్యారు. డెమాక్రటిక్ పార్టీ ప్రచార లోపాలు కూడా తోడవటంతో అవలీలగా ట్రంప్ విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక ప్రభుత్వోద్యోగులను సాగనంపే డోజ్లో కీలకపాత్ర పోషించాలని మస్క్ ఉబలాటపడినా అది కాస్తా వివేక్ రామస్వామికి పోయింది. ‘ఉరితీతలు కాదు... ఊచకోతలే’ అంటూ భారీయెత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్కు అది నిరాశ కలిగించినా, త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు. తనకు సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్ మాన్కు అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలన్నది మస్క్ ఆకాంక్ష. అదే జరిగితే సొంత సంస్థ స్పేస్ ఎక్స్కు నాసాను తాకట్టుపెడతాడన్న భయం ట్రంప్కు లోలోన ఉంది. ఈ సంగతి అర్థమైన నాటినుంచీ మస్క్ రగిలిపోయారు. పర్యవసానంగా ట్రంప్ అత్యద్భుతమని ప్రకటించిన పన్ను కోతల బిల్లును ఆయన తప్పుబట్టారు. ఒకపక్క తాను ప్రభుత్వ సిబ్బందిని సాగనంపి ఖజానా కళకళల్లాడేలా చేస్తుంటే, ప్రభుత్వ రుణభారాన్ని మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే పన్నుల తగ్గింపేమిటన్నది మస్క్ ప్రశ్న. తన కాంట్రాక్టు ముగిశాక మొదటగా ఆయన దీన్నే ఎత్తు కున్నారు. తనతో ఇన్నాళ్లూ కలిసిమెలిసి తిరిగి, మొదటినుంచీ ఈ బిల్లుపై అవగాహన ఉన్న మస్క్ ఇలా విమర్శించే సరికి ట్రంప్ ఆగ్రహం పట్టలేకపోయారు. ఆ తర్వాత జరిగిందంతా బహిరంగ యుద్ధం! వచ్చేసారి ఎన్నికల్లో డెమాక్రాట్లకు ఆర్థిక సాయం అందిస్తానన్న బెదిరింపు మొదలుకొని బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎపిస్టిన్తో ట్రంప్కు గల సంబంధాలు బయటపెడతాననేవరకూ మస్క్ మాటలు జారారు. ప్రతిగా స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు రద్దుచేస్తానని, ఇవ్వబోయే కాంట్రాక్టులు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజన్కూ, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ యునైటెడ్ లాంచ్ అలయెన్స్కూ కట్టబెడతానని ట్రంప్ బెదిరించారు. డెమాక్రాట్లకు విరాళమిస్తే పర్యవసానాలెలా ఉంటాయో చూపిస్తానని హెచ్చరించారు. తీరిగ్గా లెక్కలేసుకున్నాక ఈ కయ్యం వల్ల కలిసొచ్చేదేమీ లేదని మస్క్ గ్రహించినట్టున్నారు. ‘కాల్పుల విరమణ’ ప్రకటించటంతోపాటు ‘సారీ’ చెప్పారు. ఏడాది నుంచి అవిభక్త కవలల్లా ఎక్కడికెళ్లినా జంటగా పోతూ, మస్క్ను ‘సహ అధ్యక్షుడు’ అని అందరూ వేళాకోళం చేసేలా వ్యవహరించిన వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హృదయం అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. కనుక చెలిమి చిగురించినా మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఈ ఉపాఖ్యానంలో ప్రపంచ ప్రజానీకం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. వ్యక్తులైనా, పార్టీలైనా పరస్పరం లాభదాయకం, పంపకాలు బాగుంటాయనుకుంటే కూటములు కడతారు తప్ప, తమను ఉద్ధరించటం కోసం కాదని వారు గ్రహించాలి.

కేబినెట్ ఆమోదంతోనే..
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భారీ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే తీసుకున్నాం. సాంకేతికపరమైన అంశాలపై ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కట్టాలని తొలుత రాజకీయ నిర్ణయం మేమే (ప్రభుత్వం) తీసుకున్నాం. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు నిర్మించాలని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచించింది..’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్.. బుధవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన 115వ సాక్షిగా పాల్గొన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాకపోవడం వల్లే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది అని కమిషన్ ప్రశ్నించగా, కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని నాటి మహారాష్ట్ర సీఎం పృథీ్వరాజ్ చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ను నేను స్వయంగా కలిసి 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సహకరించాలని కోరితే ససేమిరా అన్నారు. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సహకరిస్తామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల కింద 160 టీఎంసీలను తరలించాల్సి ఉండగా, తుమ్మిడిహట్టి వద్ద అంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాకపోవడం వల్లే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేపట్టాం. ప్రత్యామ్నాయాలపై వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైడార్ సర్వే చేయించగా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బరాజ్లు నిర్మించాలని సిఫారసు చేసింది. బొగ్గు గనులు ఉండడంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీళ్లను తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అందుకే మూడు బరాజ్లు నిర్మించి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోయాలనే నిర్ణయం జరిగింది. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీల జలాల లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నాం. బరాజ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం ఉంది. మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు జరిగాయి..’ అని కేసీఆర్ చెప్పారు. ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే... బరాజ్ల లొకేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఇంజనీర్లు, సాంకేతిక బృందం తీసుకుందని కేసీఆర్ బదులిచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4 వేల మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. బరాజ్ల నుంచి పంప్హౌస్ల ద్వారా నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన స్థాయిల్లో నిల్వలను కొనసాగించే అంశంపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక అంశాల్లో నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారు. మంత్రివర్గ ఆమోదంతో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ఏర్పాటుకు అనుమతిచ్చాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత ఉండడంతో రుణాల సమీకరణ కోసం దీనిని ఏర్పాటు చేశాం. ప్రాజెక్టుకు ఆదాయం సమకూరే వరకు రుణాల తిరిగి చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదే..’ అని మాజీ సీఎం చెప్పారు. బరాజ్ల నిర్వహణకు రూ.280 కోట్ల నిధులిచ్చాం..కానీ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సీపేజీ ఏర్పడడం వెనక నిర్వహణ, పర్యక్షణ లోపాలు సైతం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు. బరాజ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం రూ.280 కోట్లను కేటాయిస్తూ 2020లో తమ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 ప్రతిని కమిషన్కు అందజేశారు. నిధులు మంజూరు చేసినా ఇంజనీర్లు వాడుకోలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ క్వాలిటీ కంట్రోల్ డివిజన్నే ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ రూపొందించిన ఓ పుస్తకాన్ని కూడా కమిషన్కు కేసీఆర్ అందజేశారు. మాజీ మంత్రి హరీశ్రావు ఇటీవల విలేకరుల సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్నే పుస్తక రూపంలోకి మార్చి కమిషన్కు ఇచ్చారు. సిబ్బందిని, మీడియాను బయటకు పంపించి.. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇప్పటివరకు హాజరైన ఇతర సాక్షులందరినీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ కార్యాలయ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల సమక్షంలో బహిరంగంగానే ప్రశ్నించింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా బహిరంగ విచారణలో పాల్గొనలేనని, తనను ప్రశ్నించేటప్పుడు ఎవరినీ అనుమతించరాదని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది. కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించి ‘ఇన్ కెమెరా’ విధానంలో (కేవలం కేసీఆర్, కమిషన్ కార్యదర్శి మాత్రమే ఉన్నప్పుడు) క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. జస్టిస్ ఘోష్ అడిగే ప్రశ్నలు, కేసీఆర్ ఇచ్చే సమాధానాలను కంప్యూటర్పై టైప్ చేసేందుకు కమిషన్ కార్యదర్శిని అనుమతించారు. 18 ప్రశ్నలు...50 నిమిషాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 50 నిమిషాల పాటు సాగి 12.50 గంటలకు ముగిసింది. కేసీఆర్కు కమిషన్ 18 ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. కేసీఆర్ను కమిషన్ కార్యాలయానికి తోడ్కొని వచ్చిన వారిలో మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచే అవకాశం ఉంది.

హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం
హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది . శంషాబాద్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మెన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాక మరికొంత మంది ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం కలిగిందని తెలుస్తోంది.

ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వరుసగా కనిపిస్తున్న అశక్తతలు దేనికి చిహ్నం? ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 140 రోజులలో ప్రకటించిన విధానాలను, తీసు కున్న చర్యలను, వాటి పర్యవసానాలను పరిశీలించినప్పుడు, వాటిలో దాదాపు అన్నింటా తన అశక్తతలే కనిపిస్తాయి. మరొక మాటలో వైఫల్యాలు. అయితే ఆ అశక్తతలు, వైఫల్యాలు వ్యక్తిగతంగా ట్రంప్కు పరిమితమైనవా, లేక అమెరికా మహా సామ్రాజ్యమే క్రమంగా బలహీనపడుతున్న స్థితికి సంకేతాలా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ ట్రంప్కు పరిమితమైన స్థితి అయితే ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అందుకు సవరణలు చేసుకోగల అవకాశం ఉంటుంది. అవి ఆ వ్యవస్థకే మౌలిక బలహీనతలు అయ్యే పక్షంలో సవరణలు తన కాలంలో సాధ్యపడకపోగా, ఆ తర్వాత రాగల అధ్యక్షులకు కూడా అతి పెద్ద పరీక్షలు ఎదురవుతాయి.తగిన భావజాలం ఏది?విధానాలు, చర్యలలో అంతర్గతం, విదేశీయం అని రెండు ఉంటాయి. ఎప్పుడైనా విదేశాంగ విధానాలు అంతర్గత ప్రయోజనాల కోసమేనన్నది తెలిసిందే. ఆ విధంగా చూసినపుడు ట్రంప్ విధానాలకు ఆధారమైనవి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు. వీటిలో ప్రతిఫలించే ఆలోచన అమెరికా తన ఒకప్పటి గొప్పతనాన్ని కోల్పోయిందని! అందుకు బాధ్యత డెమోక్రాట్ల పరిపాలన అని! అమెరికా విధానాల వల్ల అమెరికన్ ధనిక వర్గాలు, ఇతర దేశాలు విపరీతంగా లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతూ అమెరికా వెనుకబడుతున్నదనీ; సామాన్యులు, అలాగే తమ దేశం బాగుపడే విధానాల వల్లనే తిరిగి ‘అమెరికా ఫస్ట్’ కాగల దన్నది ఆయన తర్కం.ఇది యథాతథంగా సహేతుకమైన, ఆహ్వానించదగిన తర్కంగానే కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలను, వాటి ఆధారంగా నిర్మితమైన వ్యవస్థను రద్దు చేయటం కాకున్నా ఒక మేర సవరించాలన్నా మామూలు విషయం కాదు. రద్దు చేయాలన్నది ట్రంప్ ఆలోచన ఎంతమాత్రం కాదు. అంతర్గతంగా, విదేశీయంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రం అనుకున్నట్లు ఆయన మాటలు, చేతలు సూచించాయి. ఆ కొద్దిపాటి మార్పులకైనా తగిన ఫిలసాఫికల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. కానీ ట్రంప్ ప్రధానంగా ఉద్వేగాల వ్యక్తి. ఉద్వేగతలకు లోతు ఉండదు, చంచలత ఉంటుంది.అమెరికా మహా సామ్రాజ్యపు శక్తి ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం ఈ 21వ శతాబ్దపు ఆరంభం నుంచే నెమ్మదిగా మొదలై, 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో వేగం అందుకున్నది. అమెరికా ‘గ్రేట్నెస్’ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటి దశాబ్దం నుంచే కనిపిస్తాయి. అమెరికా బలాలు నాలుగింటిలో ఆర్థికం, రాజకీయం రెండు గాక, సైనికం, శాస్త్ర – సాంకేతికం మరొక రెండు. ఈ చివరి రెండింటిలో అమెరికా శక్తి ఆర్థిక, రాజ కీయాలవలె తగ్గలేదు గానీ, ఆ రెండు రంగాలలో ఇతరుల నుంచి పోటీలు పెరగసాగాయి. అనగా అమెరికాకు అవి పరోక్ష బలహీనత లన్నమాట. దెబ్బకొట్టిన నిర్ణయాలుట్రంప్ తమ దేశాన్ని మళ్లీ ‘గొప్పది’ చేయదలచుకుంటే, ఈ నాలుగు బలహీనతలను ఆపటం ఏ విధంగాననే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒకవేళ ఉన్నా కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదుర వుతాయి. వాటిలో మొదటిది–చరిత్రలో ఏ సామ్రాజ్యాలూ శాశ్వతంగా నిలవనపుడు అమెరికా అందుకు భిన్నం కాగలదా అన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్వీయ ప్రయోజ నాల స్పృహలు పెరుగుతూ, ఎవరి దారులు వారు వెతుక్కుంటూ, వాటిలో కొన్ని గణనీయంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, యూరప్ల పట్ల గత విధేయతలు బలహీనపడుతూ, బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కారమవుతున్నపుడు, అమెరికాకు గానీ, అమెరికన్ కూటమికి గానీ ఒకప్పటి ‘గొప్పతనం’ తిరిగి ఎట్లా సాధ్యమన్నది మరొక ప్రశ్న. అంతెందుకు, ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాము అధికారానికి వచ్చిన కొత్తలోనే, ‘ఏకధ్రువ ప్రపంచమన్నది గతించిన విషయ’మన్నారు.ఈ విధమైన బలహీనతలు అర్థమవుతూ, అదే సమయంలో అమెరికాను కనీసం ఉన్న స్థాయిలో నిలబెట్టాలని, అట్లాగే అక్కడి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా రూపొందించాలని కొత్త అధ్యక్షుడు భావించితే, అందులో ప్రశంసించదగినదే తప్ప కొట్టివేయ వలసింది ఉండదు. ఆ విధంగా ఆయన ఒక వాస్తవవాది అను కోవాలి. అందుకు తగిన ఆచరణ ఏమిటన్నది అసలు ప్రశ్న. దిగుమతి సుంకాలను అన్ని దేశాలపై పెంచితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య లోటు, ద్రవ్యలోటు, అప్పులు తగ్గుతాయనీ, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చుననీ భావించారు. అందుకు తోడుగా అనేక రూపాలలో వ్యయ నియంత్రణ చేయ బూనారు. ఉద్యోగాల కోత, విదేశీ సహాయాల ఆపివేత వంటివి అందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన సుంకాల హెచ్చింపు వెంటనే గందరగోళంలో పడింది. ఉద్యోగాల కోత తీవ్రమైన వ్యతి రేకతను తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు వరుసగా దెబ్బతినగా,బాండ్ల మార్కెట్ ఎదురుతిరిగి, డాలర్ విలువ పడిపోవటం మొదలైంది. అమెరికా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన వాటిపై ఇతర దేశాలు ఎదురు సుంకాలు విధించటంతో ధరలు పెరగ సాగాయి. ఈ పరిణామాలతో జంకిన ప్రభుత్వం సుంకాల వాయిదాలు, తగ్గింపులు, చర్చల మార్గానికి మళ్లింది. ఇదే ఇప్పటికీ కొనసా గుతున్నది. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులను భయపెట్టి వేలకు వేలుగా పంపివేయటం వల్ల ఉత్పత్తి, సర్వీస్ రంగాలు దెబ్బ తినటం వెంటనే కనిపించింది. అది గ్రహించి యజమానులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వబూనినా ఉపయోగం లేకపోయింది. ఉక్రెయిన్ వైఫల్యంఆ విధంగా కొన్ని వారాలు గడిచేసరికి ఆ గందరగోళం స్వదేశంలో, విదేశాలలో కూడా అందరికీ అర్థమై ట్రంప్ పట్ల గౌరవం, భయం తగ్గాయి. పరిపాలనా వ్యవహరణలు అస్తవ్యస్తంగా మారటంతో సన్నిహిత సలహాదారులను తొలగించటం కూడా మొదలైంది. ఎలాన్ మస్క్ ఉదంతం తాజా ఉదాహరణ. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు కొత్తగా వినవస్తున్నది. యూనివర్సిటీలు, విద్యా శాఖ, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య రంగాలను వేధిస్తూ అమెరికాను తిరిగి గొప్పదిగా ఎట్లా చేయగలరన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి వేసేందుకు నిజంగానే ప్రయత్నించినా అది ఆగకపోగా తీవ్రమవుతున్నది. దానితో ఆయన చేతులెత్తేశారు. గాజా పట్ల గందరగోళం. నెతన్యాహూ తనను ఏ విషయంలోనూ లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్, యూరప్ తమ దారి తాము చూసు కుంటున్నాయి. ఇరాన్ లొంగి రావటం లేదు. సిరియా, లెబనాన్పై దాడుల నిలిపివేతకు నెతన్యాహూ అంగీకరించటం లేదు. చైనాతో పాటు ‘బ్రిక్స్’ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ, డాలర్కు బదులు తమ స్థానిక కరెన్సీలలో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికన్ సామ్రాజ్యవాద బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అశక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు

తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.👉గడ్డం వివేక్- కార్మిక, మైనింగ్ శాఖలు👉వాకిటి శ్రీహరి- పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యూత్ శాఖలు👉అడ్లూరి లక్ష్మణ్- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖకాగా, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. అనంతరం నిర్ణయం తీసుకున్నారు.

చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ను వెబ్స్టెర్తో కలిసి స్మిత్ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన స్మిత్..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన విదేశీ బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లండ్లో 18 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బోర్డర్ (17) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బోర్డర్ ఆల్టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.ఇంగ్లండ్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన విదేశీ బ్యాటర్లు వీరే..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-18అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)- 17వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 17డాన్ బ్రాడ్మాన్ (ఆస్ట్రేలియా)- 14గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 14అదేవిధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) పేరిట ఉండేది. 1909-1926 కాలంలో బార్డ్స్లీ ఈ ఫీట్ సాధించాడు. తాజా ఇన్నింగ్స్తో 99 ఏళ్ల బార్డ్స్లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.లార్డ్స్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్లు..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 591వారెన్ బార్డ్స్లీ (ఆస్ట్రేలియా) - 575గ్యారీఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్) - 571డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా) - 551శివ్నారాయణ్ చందర్పాల్ (వెస్టిండీస్) - 512దిలీప్ వెంగ్సర్కార్ (భారత్) - 508అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 503చదవండి: WTC Final: ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆన్లైన్లో పలు కథనాలు వచ్చాయి. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రూ.3,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి.మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ మే నెలలో 1868 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అనేక అంతరాయాలు వచ్చినప్పటికీ ఏప్రిల్లో 1789 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు మార్చిలో 1830 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.23.95 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరగగా మే నెలలో రూ.25.14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్పీసీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading. Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.The Government remains fully committed…— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025

గుడిని కూల్చేసిన టీడీపీ గూండాలు
సాక్షి, తిరుపతి: తిరుచానూరులో టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు.. ఆలయాన్ని కూల్చివేశారు. తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని రాత్రి రాత్రే నేలమట్టం చేసిన టీడీపీ నేతలు.. ఆలయ ఆనవాళ్లు లేకుండా స్వర్ణముఖి నదిలో కలిపేశారు. అనంతరం.. టీడీపీ నేత కిశోర్రెడ్డి ఆలయ భూమిని కబ్జా చేసేశారు. గుడి ఆనవాళ్లను హిందూ సంఘాలు.. స్వర్ణముఖి నది నుంచి బయటకు తీశాయి. హిందూ సంఘాలను అడ్డుకున్న పోలీసులు.. విగ్రహాన్ని తీసుకుపోయారు. టీడీపీ నేత కిశోర్రెడ్డి, పోలీసులు తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేపట్టాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు.
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం
రాయచోటిలో దారుణం.. ప్రేమోన్మాది అకృత్యాలకు బాలిక ఆత్మహత్య
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
చంద్రబాబు మీది కూటమి ప్రభుత్వం కాదు.. వంచన ప్రభుత్వం
చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
డ్రగ్స్ నివారణకు 'మా' సహకారం.. ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
అక్కడ 11 ఏళ్ల తర్వాత 'దేవర'.. సతీమణితో మంచు మనోజ్ సందడి (ఫోటోలు)
ప్రపంచం మన మాట వినట్లేదేం?
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
Sakshi Cartoon: పొన్లెండి! ఒక రాష్ట్రంలోనే అన్నారు!
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
సాక్షి కార్టూన్ 11-06-2025
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
సీఎం శాఖలు సీనియర్లకు!
సమ్మర్ జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న బన్నీ భార్య (ఫొటోలు)
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం
రాయచోటిలో దారుణం.. ప్రేమోన్మాది అకృత్యాలకు బాలిక ఆత్మహత్య
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
చంద్రబాబు మీది కూటమి ప్రభుత్వం కాదు.. వంచన ప్రభుత్వం
చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
డ్రగ్స్ నివారణకు 'మా' సహకారం.. ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
ప్రపంచం మన మాట వినట్లేదేం?
అలాగే ట్రంప్, మస్క్ ఎప్పుడు కొట్టుకుంటారో కూడా కాస్త చెబుతారా!
కేవలం నకిలీ కరెన్సీ, నకిలీ సర్టిఫికెట్స్లాంటి కేసుల కోసమే ఏర్పాటు చేశారట... ఏదో నకిలీ కేసు పెట్టి వదిలేయమంటున్నార్సార్!
కొమ్మినేనిపై కేసు.. పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం
టీమిండియావైపు దూసుకొస్తున్న నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
‘రేవంత్ పార్టీని వీడాలనుకుంటున్నారు’
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
Sakshi Cartoon: పొన్లెండి! ఒక రాష్ట్రంలోనే అన్నారు!
రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే పూరన్కు బంపరాఫర్.. కెప్టెన్గా ఎంపిక
నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
సాక్షి కార్టూన్ 11-06-2025
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
సీఎం శాఖలు సీనియర్లకు!
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ విచారణలో కీలక మార్పులు!
‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్
సినిమా

బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది. జూన్ 9న తమకు బాబు పుట్టాడని దంపతులిద్దరూ ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.కాగా.. షిరీన్ మీర్జా బాలీవుడ్లో యే హై మొహబ్బతేన్ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోహోత్ ప్యార్ కర్తే హై, దై కిలో ప్రేమ్, యే హై ఆషికి, గుతుర్ గు, అన్హోనియోన్ కా అంధేరా లాంటి సీరియల్స్లో మెప్పించింది. షిరీన్ చివరిసారిగా యే హై చాహతేన్ షోలో కనిపించింది. షిరీన్ 2021లో హసన్ సర్తాజ్ను వివాహం చేసుకుంది. దాదాపు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో బుల్లితెర దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza)

ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో సెన్సేషన్ సృష్టించిన అవికా గోర్ (Avika Gor) పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సంతోషంతో అరిచేశా..ఈ సందర్భంగా అవికా.. 'ఆయన నోరు తెరిచి అడగ్గానే.. సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.కన్నీళ్లు..ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలియాడిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని అవికా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్ముంబైలో పుట్టిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ‘బాలికా వధు’ సీరియల్తో ఆమె జీవితమే మారిపోయింది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, 'బ్రో', 'షణ్ముఖ' ఇలా అనేక సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) చదవండి: మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి

'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. A powerful promise sparks a fierce battle for survival...! 👪Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄▶️ https://t.co/QX2opY8tyDIn theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025

సంధ్య థియేటర్లో పాముల కలకలం.. వీడియో వైరల్
సంధ్య థియేటర్.. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఈ సినిమా హాల్ చాలా ఫేమస్. స్టార్ హీరోల అభిమానులంతా ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అని ఇది లగ్జరీ థియేటర్ ఏం కాదు. చాలా కాలం నుంచి ఉండడం.. స్టార్ హీరోలు ఇక్కడకు వచ్చి సినిమా చూస్తుండడంతో ‘సంధ్య థియేటర్’ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కూడా ఈ థియేటర్లోనే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది. తాజాగా మరోసారి ఈ థియేటర్ వార్తల్లో నిలిచింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్స్లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంట పడింది. చాలా పొడవుగా ఉన్న ఆ పాముని చూసి బయపడి పోయిన సిబ్బంది..వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్కి కాల్ చేసి రప్పించారు. వారు చాకచక్యంతో పాముని పట్టుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. తరచు థియేటర్స్లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెబుతోంది. వందల సంఖ్యలో జనాలు వచ్చే థియేటర్లో ఇలా పాములు రావడం ఏంటి? ఇప్పుడంటే లక్కీగా ప్రేక్షకులు లేరు కాబట్టి.. ప్రమాదం తప్పింది. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులు ఉన్నప్పుడే పాము వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలే సినిమా థియేటర్స్ చీకటిగా ఉంటాయి.. అలాంటి ప్రదేశాల్లోకి ఇలాంటి విష సర్పాలు రావడం ప్రమాదకరమే... యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పాముల కలకలంఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో మైదానంలో ఎంతో యాక్టివ్గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత భారత జట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారని అతడు కొనియాడాడు.ఇంగ్లండ్ టూర్కు ముందు కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు వరకైనా కొనసాగాలని విరాట్ను సెలక్టర్లు కోరినప్పటికి అతడు మాత్రం తన మనసును మర్చుకోలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత టెస్టు జట్టులోకి చోటు దక్కగా.. కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. ప్రాక్టీస్లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తోంది.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.అతడొక సూపర్ స్టార్. అయితే స్లిప్లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్లో తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం

ఆసీస్ స్టార్ ఓపెనర్ అత్యంత చెత్త రికార్డు.. బుమ్రా సరసన
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో ఖాతా తెరవకుండానే ఖవాజా పెవిలియన్కు చేరాడు. మార్నస్ లబుషేన్తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఖవాజా.. ప్రోటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికా స్పీడ్స్టార్ కగిసో రబాడ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఖవాజా ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో డకౌటైన ఖవాజా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక డకౌటైన ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా, తిలకరత్నే దిల్షాన్, మెకల్లమ్ సరసన నిలిచాడు.బుమ్రా, దిలాన్ష్, మెకల్లమ్ ఐసీసీ ఈవెంట్ల ఫైనల్లో రెండు సార్లు డకౌట్ కాగా.. ఖవాజా సైతం సరిగ్గా రెండు సార్లు ఎటువంటి పరుగులు చేయకుండా ఔటయ్యాడు. కాగా ఆసక్తికరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో కూడా ఖవాజా డకౌటయ్యాడు.ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్లు వీరే..జస్ప్రీత్ బుమ్రా - 2తిలకరత్నే దిల్షాన్ - 2ఉస్మాన్ ఖవాజా - 2బ్రెండన్ మెకల్లమ్ - 2మొయిన్ అలీ - 1కష్టాల్లో ఆసీస్..కాగా ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాటర్లకు సఫారీ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రోటీస్ బౌలర్ల దాటికి కంగారులు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఇప్పటివరకు రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనంKagiso Rabada delivers big time for South Africa with two wickets in an over 🔥Catch the action live on our official broadcasters here ➡ https://t.co/oas2Rsdptj#Cricket #CricketReels #WTC25 pic.twitter.com/I9vOR8nCup— ICC (@ICC) June 11, 2025

టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.భారత్తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఎడ్జీ జాక్స్కు ఇంగ్లండ్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేసర్ జోష్ టాంగ్ గాయపడడంతో ప్రత్యామ్నయంగా జాక్స్ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్ల అనాధికారిక సిరీస్లో ఇంగ్లండ్ లయన్స్ తరపున జాక్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాలుగు ఇన్నింగ్స్లలో 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ను జాక్స్ ఔట్ చేశాడు. కాగా జాక్స్ తన కెరీర్లో ఇప్పటివరకు కేవలం రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అవికూడా ఇండియా-ఎపై ఆడినవే.వోక్స్పైనే భారం..కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా మార్క్వుడ్, ఓలీ స్టోన్ ఈ సిరీస్కు దూరం కాగా.. అటిన్కిసన్, ఆర్చర్ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఇప్పుడు ఈ జాబితాలోకి టంగ్ కూడా చేరడం ఇంగ్లీష్ జట్టు మెనెజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయనున్నాడు. వోక్స్, కార్స్, సామ్ కుక్ ఫ్రంట్లైన్ సీమర్లగా ఉన్నారు.భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జాక్చదవండి: WTC Final: కోహ్లి ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన ట్రవిస్ హెడ్

India vs Aus 5th test: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికా
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికాసౌతాఫ్రికా బ్యాటర్లు సైతం తొలి ఇన్నింగ్స్లో తడబడుతున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(3) , బెడింగ్టన్(8) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టగా జోష్ హేజిల్వుడ్, పాట్ కమిన్స్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా స్పీడ్స్టార్ కగిసో రబాడ 5 వికెట్లతో చెలరేగాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్లో 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో వెబ్స్టెర్(72) టాప్ స్కోరర్గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో రబాడతో పాటు మార్కో జానెసన్ మూడు, మార్క్రమ్, మహారాజ్ తలా వికెట్ సాధించారు.ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన వెబ్స్టెర్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 55 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 210/8ఆసీస్ ఏడో వికెట్ డౌన్199 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రబాడ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. అంతకుముందు అలెక్స్ క్యారీ(23).. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.ఆసీస్ ఐదో వికెట్ డౌన్.. స్మిత్ ఔట్స్టీవ్ స్మిత్ రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన స్మిత్.. మార్క్రమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 44 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో వెబ్స్టెర్(48), అలెక్స్ క్యారీ(1) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న స్మిత్, వెబ్స్టెర్31 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(45), వెబ్స్టెర్(8) ఆచితూచి ఆడుతున్నారు.పంజా విసురుతున్న ప్రోటీస్ పేసర్లు..ట్రావిస్ హెడ్ రూపంలో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన హెడ్.. మార్కో జానెసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి 23.2 ఓవర్లలో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(26) ఉన్నాడు. ప్రోటీస్ బౌలర్లలో రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఆసీస్ మూడో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన లబుషేన్.. జానెసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావెస్ హెడ్ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోర్ఆచితూచి ఆడుతున్న స్మిత్, లబుషేన్..ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును సీనియర్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్(17), లబుషేన్(17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.రబాడ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా స్పీడ్స్టార్ కగిసో రబాడ బెంబెలెత్తిస్తున్నాడు. 7వ ఓవర్ వేసిన రబాడ బౌలింగ్లో ఉస్మాన్ ఖావాజా(0), గ్రీన్(4) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(10), స్మిత్(0) ఉన్నారు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టులోకి కామెరూన్ గ్రీన్ తిరిగి రాగా.. సౌతాఫ్రికా టెస్టు టీమ్లోకి పేసర్ లుంగీ ఎంగిడీ పునరాగమనం చేశాడు.ప్రోటీస్ జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. ఆసీస్కు రెండో ఫైనల్. ఈ ఆఖరి పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని సఫారీలు భావిస్తుంటే, కంగూరులు మాత్రం మరో ఐసీసీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే చోకర్స్గా పేరొందిన దక్షిణాఫ్రికా, పటిష్టమైన ఆసీస్ను ఓడించడం అంతసులువు కాదు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.చదవండి: శ్రేయస్ అయ్యర్ కోసం భారత సెలెక్టర్లపై ధ్వజమెత్తిన గంగూలీ
బిజినెస్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలలో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య ఇతర ఆసియా మార్కెట్ల సంకేతాలతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 82,783.5 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 123 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 82,515.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కేవలం 37.15 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 25,141.4 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.49 శాతం, 0.53 శాతం క్షీణించాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.47 శాతం, ఐటీ 1.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.48 శాతం క్షీణించి 13.66 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఉద్యోగులు ఆఫీస్కు రాకపోతే.. గూగుల్ కొత్త ఎత్తుగడ
ఉద్యోగులను తగ్గించుకునేందకు టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఎత్తుగడ ఎత్తుకుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యగులను వదిలించుకునేందుకు ప్రణాళిక వేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది.కొత్త ఆదేశాల ప్రకారం.. గూగుల్లోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ (కేఅండ్ఐ), కమ్యూనికేషన్స్ సహా కీలక విభాగాల్లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల లోపల నివసించే ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇది పనిప్రాంత అంచనాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.ఈ పరివర్తనను సులభతరం చేయడానికి, గూగుల్ కొత్త మార్గదర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలగింపు ప్యాకేజీలను అందిస్తోంది. అయితే ఇవి తొలగింపులు కాదని గూగుల్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి నిష్క్రమణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా విస్తృతమైన శ్రామిక శక్తి తగ్గింపులకు ముందు అమలవుతున్నవే.ఉద్యోగుల వ్యక్తిగత సహకారం నేరుగా ఆఫీస్లలో ఉండాలని భావిస్తున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐ ఫోకస్డ్ కార్యక్రమాలనూ టెక్ దిగ్గజం వేగవంతం చేసింది. కంపెనీలు తమ సొంత రిమోట్ వర్క్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నందున, ఈ విధానం టెక్ పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.👉ఇది చదివారా? లక్షలకొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్గూగుల్ తాజా ఈ ప్రకటన కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో గూగుల్ ఇదే తరహా ఎగ్జిట్ ఆఫర్లు ఇచ్చి ఉద్యోగాల కోత విధించింది. 2023లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కూడా ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో చిన్నపాటి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఎంతమందిపై ప్రభావం పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. గూగుల్ తన ఎక్కువ మంది సిబ్బందిని ఆఫీస్లకు తిరిగి రప్పించాలని భావిస్తోంది. ఇందుకు ఇష్టపడని వాళ్లు ఉద్యోగం వీడాల్సి ఉంటుంది.

యువతకు సత్య నాదెళ్ల సూచన
కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఔత్సాహిక సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బేసిక్స్పై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ కోడింగ్, ఇతర సంక్లిష్టమైన పనులను ఆటోమేట్ చేస్తున్నప్పటికీ టెక్ డెవలప్మెంట్కు మానవ నైపుణ్యాలు అవసరం అవుతాయని చెప్పారు. బలమైన కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సమస్యలను తార్కికంగా పరిష్కరించాలని, నిర్మాణాత్మక సొల్యూషన్స్ సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా ఎదిగేందుకు ఏఐ మానవుల ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని సత్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో వ్యవస్థలను అర్థం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్ కాంప్రహెన్షన్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను సత్య సూచించారు.ఇదీ చదవండి: యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?సుందర్ పిచాయ్ కూడా అదే బాటలో..లెక్స్ ఫ్రిడ్మన్తో గతంలో జరిగిన పాడ్కాస్ట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కంప్యూటర్ కోడింగ్ రాసేందుకు 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని చెప్పారు. మరింత సృజనాత్మక పనుల కోసం మానవ ప్రతిభ తప్పకుండా అవసరం అవుతుందన్నారు. ఏఐ తమ ఇంజినీరింగ్ వేగాన్ని 10% పెంచిందని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత మంది ఏఐ ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిచాయ్ తెలిపారు.

నథింగ్ ఫోన్ 3 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవేనా..
బ్రిటన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ‘నథింగ్ ఫోన్ 3’ను జులై 1, 2025న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. గతంలో ఉన్న మోడళ్లతో పోలిస్తే దీనిలో కొన్ని డిజైన్, హార్డ్వేర్లో మార్పులను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. అయితే టెక్ నిపుణుల అంచనాల ప్రకారం నథింగ్ ఫోన్ 3లో తీసుకొస్తున్న మార్పులు కింది విధంగా ఉండనున్నాయి.ఇంటర్ఫేస్: కంపెనీ ఉత్పత్తులకు సిగ్నేచర్గా నిలిచిన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ను తొలగించడం లేదు.మూడు 50 ఎంపీ కెమెరాలు: మెరుగైన ఫొటోగ్రఫీ కోసం ప్రధాన, అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్లతో కొత్త కెమెరా మాడ్యూళ్లను అందిస్తుంది.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ లేదా జెన్ 3: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ 8 ప్రాసెసర్తో మార్కెట్లోకి తీసుకొస్తారని భావిస్తున్నారు. ఇది అధిక పనితీరు, ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది.నథింగ్ ఓఎస్ 3.0 (ఆండ్రాయిడ్ 15): మెరుగైన యూజర్ అనుభవం కోసం ఇంటర్నల్గా నథింగ్ ఓఎస్ 3.0ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.6.77 అంగుళాల ఎమోలెడ్ డిస్ప్లే: 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మెరుగైన విజువల్స్ కోసం ఎల్టీపీఓ టెక్నాలజీ.5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ: 50 వాట్ వైర్డ్, 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: ఉద్యోగులను తైవాన్ పంపుతున్న టాటా గ్రూప్.. ఎందుకంటే..ధరలు ఇలా.. (అంచనా మాత్రమే)ఇండియాలో రూ.60,000-రూ.65,000అంతర్జాతీయ మార్కెట్లో: 799 డాలర్లు – 899 డాలర్లు (సుమారు రూ.68,000–రూ.73,000)
ఫ్యామిలీ

ప్రపంచానికి పచ్చబొట్టు
ఒకప్పుడు చేతిపై బైగ పచ్చబొట్టు కనిపిస్తే... ‘పక్కా పల్లెటూరు వాళ్లు’ అని వెక్కిరించేవాళ్లు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆదివాసీ పల్లెల్లో ఒక వెలుగు వెలిగిన బైగ టాటూ ఆర్ట్ మిణుకు మిణుకుమంటూ ఆరి పోయే స్థితికి చేరుకుంది. ఆ కళ మళ్లీ ఉజ్వలంగా వెలిగేలా గల్లీ నుంచి దిల్లీ వరకు కృషి చేస్తోంది ఆదివాసీ మహిళ మంగళ బాయ్. మధ్యప్రదేశ్లోని మారుమూల పల్లె లాల్పూర్ నుంచి సిడ్నీ వరకు బైగ టాటూ ఆర్ట్ను తీసుకువెళ్లిన మంగళబాయ్...మధ్యప్రదేశ్లోని దిందోరీ జిల్లాలోని చిన్న గ్రామం అయిన లాల్పూర్లో పుట్టింది మంగళబాయ్. తల్లి శాంతిబాయ్ బైగ టాటూ ఆర్టిస్గా గొప్ప పేరు పొందింది. తల్లి నుంచి బైగ ఆర్ట్ను నేర్చుకుంది మంగళ. శాంతిబాయ్ ఎవరికైనా టాటూ వేస్తుంటే ‘నేను వేస్తాను’ అంటూ తల్లిని బతిమిలాడేది. ‘అలాగే’ అంటూ ఒకటి, రెండు గీతలు వేసే అవకాశం ఇచ్చేది శాంతిబాయ్. ఈ మాత్రం దానికే మంగళ ఏనుగు ఎక్కినంత సంబరపడి పోయేది. ఏడు సంవత్సరాల వయసు నుంచే బైగ టాటూ వేయడం మొదలుపెట్టింది మంగళ. పదకొండు సంవత్సరాల వయసులో తన బైగ ఆర్ట్ను నేషనల్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించే స్థాయికి చేరుకుంది.పాత కళకు కొత్త కళబైగ టాటూ ఆర్ట్లో చెట్ల నుంచి పక్షుల వరకు, ఆదిమ చరిత్ర నుంచి పురాణాల వరకు ఎన్నో ప్రతీకలు కనిపిస్తాయి. వాటికి అర్థం ఏమిటి? అనేది తెలుసుకోవడం గురించి ఎంతో శోధన చేయడమే కాదు నుదురు, మెడ, భుజాలు... శరీర భాగాలకే పరిమితం అయిన ‘బైగ’ను కాగితం, కాన్వస్ పైకి తీసుకురావడం ద్వారా ఆ కళకు కొత్త వెలుగు తీసుకువచ్చింది మంగళ. కాగితం, కాన్వస్పైకి తీసుకురావడం ద్వారా బైగ టాటూ ఆర్ట్ పునర్జీవానికి కొత్త మార్గాన్ని కనిపెట్టింది.అంతర్జాతీయ స్థాయిలో... ఆహా!మారుమూల ఆదివాసీ పల్లెలకే పరిమితమైన బైగ టాటూ ఆర్ట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఆహా అనిపిస్తోంది మంగళ. ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’లో జరిగిన గ్లోబల్ ఎగ్జిబిషన్లో మంగళ ఆర్ట్వర్క్కు మంచి స్పందన లభించింది. ‘మా సంప్రదాయ కళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం గర్వంగా ఉంది. ఇది మా కళ అని ప్రతి ఆదివాసీ గర్వపడేలా చేసింది’ అంటుంది మంగళ.అనేక అంశాల ప్రతీక... బైగమోడ్రన్ బాడీ ఆర్ట్తో పోల్చితే బైగ డెకరెటివ్ కాదు. రియలిస్టిక్గా ఉంటుంది. ఆధ్యాత్మిక స్ఫూర్తి, ప్రకృతిలో తమకు ఉన్న అనుబంధం, జీవితంలోని వివిధ దశలు ఈ కళలో ప్రతిఫలిస్తాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ పల్లెల్లో అమ్మాయిలలో కొందరికి ‘బైగ’పై ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ్ర పోత్సహించడం అరుదు. ‘బైగ’ వల్ల పిల్లల చదువు దెబ్బతింటుందని వారి భయం. ‘ఈ కాలం పిల్లలు మోడ్రన్గా ఉండాలనుకుంటున్నారు. సంప్రదాయ కళలలోని గొప్పదనం వారు గ్రహించడం లేదు’ అంటుంది మంగళ. గల్లీ నుంచి దిల్లీ వరకు ‘బైగ’ కళ గురించి విస్తృత ప్రచారం చేస్తున్న మంగళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందలేదు. అయితే దాని తాలూకు అసంతృప్తి ఏదీ ఆమె మాటల్లో వినిపించదు.ఎంతోమంది దృష్టికి వచ్చేలా...నిరాశపరిచే మాటలు ఎన్ని వినబడినా బైగ కళపై ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు మంగళ. తాను ఊహించని స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బైగకు ఆదరణ లభించింది. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వలన ‘బైగ’ ఆర్ట్ను విద్యావంతులు, ఆంత్రోపాలజిస్ట్లు, ఆర్ట్ కలెక్టర్ల దృష్టికి వచ్చేలా చేసింది. ‘నా లక్ష్యం బైగకు సంబంధించి ఘనమైన గతాన్ని గుర్తుకు తేవడం కాదు.భవిష్యత్ తరాలకు దాని విలువ తెలియజేయడం. దాన్ని కాపాడుకునేలా చేయడం’ అంటుంది మంగళ. ‘మన దేశంలో బైగ ఆర్ట్ అంతరించి పోకుండా ఉండడానికి మంగళ ఎంతో కృషి చేశారు. ఈ కళను బతికించుకోవడానికి ధైర్యం, శక్తి కావాలి. అవి మంగళలో ఉన్నాయి’ అంటున్నాడు మంగళ బాయ్ అసిస్టెంట్ అమిత్.మార్పు వస్తుందిమోడ్రన్ టాటూలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సంప్రదాయ టాటూలకు ఉన్న విలువ వేరు. అవి మన చరిత్ర, సంస్కృతి, పురాణాలతో ముడిపడి ఉన్నవి. ప్రతి ప్రతీకకు ఒక అర్థం ఉంటుంది. బైగ అనేది మన మూలాలను గుర్తుకు తెచ్చే కళ. నా చిన్నప్పుడు అమ్మ ఊరూరికీ వెళుతూ మహిళలకు బైగ టాటూ వేసేది. ఒంటిమీద బైగ టాటూ ఆర్ట్ కనిపిస్తే ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఉండేది. బైగను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం వలన వారిలో మార్పు వస్తుందని, ‘ఇది మా కళ’ అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది అని ఆశిస్తున్నాను. – మంగళ బాయ్

Dusting challenge : 19 ఏళ్ల యువతి బలి, అసలేంటిది, లక్షణాలేంటి?
‘డస్టింగ్’ పేరుతో మరో సోషల్మీడియా భూతం అమాయక యువతీ యువకుల పారిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. మృతురాలిని రెన్నా ఓరూర్కేగా గుర్తించారు.ది ఇండిపెండెంట్ ప్రకారం, 19 ఏళ్ల రెన్నా ఓ'రూర్కే (Renna O'Rourke) ఏరోసోల్ వకారణంగా గుండెపోటుకు గురైంది. ఆ తరువాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అపస్మారక స్థితిలో నాలుగు రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్గావైద్యులు ప్రకటించారు. ప్రియుడితో కలిసి రెన్నా తమకు తెలియకుండానే ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్ను ఆర్డర్ చేశారని,రెన్నా తల్లిదండ్రులు చెప్పారు. "ఆమె ఎప్పుడూ, 'నేను ఫేమస్ అవుతాను నాన్నా.. చూడండి. ' అని తరచూ చెప్పేదని అమ్మాయిల తండ్రి ఆరోన్ ఓ'రూర్కే అన్నారు.అసలేంటీ డస్టింగ్ డస్టింగ్ - క్రోమింగ్ లేదా హఫింగ్ అని కూడా పిలుస్తారు - ఈ డస్టింగ్ చాలెంజ్ ఇపుడొక వైరల్ ట్రెండ్. ఈ ఛాలెంజ్లో సరదా, ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కుద్వారా పీల్చుతున్నారు. అమెరికా, ట్విటర్లో ట్రెండింగ్గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె పనిచేయడం మానేసి, ప్రాణాలు పోయే దాకా వస్తుంది. తాము పొందే స్వల్పకాలిక ఆనందం కన్నవాల్లకి తీరని శోకం మిగుల్చుతుందని గమనించలేకపోతున్నారు. .19 ఏళ్ల రెన్నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేదని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరోబిడ్డకు ఇలా కాకూడదనే సదుద్దేశంతో ఓరూర్కే కుటుంబం రెన్నా జ్ఞాపకార్థం, టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు 'హఫింగ్' వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. గోఫండ్మీ పేజీని కూడా ప్రారంభించారు. "లోతుగా వెతకండి. వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది" అని రెన్నా తల్లి సూచించారు.డస్టింగ్ లేదా క్రోమింగ్లో ఏమి జరుగుతుంది?క్రోమింగ్ చేసేటప్పుడు, ప్రజలు మెటాలిక్ పెయింట్స్ ఇతర ఉత్పత్తులలోని హైడ్రోకార్బన్లను పీల్చడానికి ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారి తీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది.మాదకద్రవ్యాల వినియోగం, ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది - ముఖ్యంగా టీనేజర్లు - ప్రతి సంవత్సరం ఇన్హేలెంట్లను ఉపయోగిస్తారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 -17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు.డస్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏరోసోల్ పెయింట్, పెయింట్ థిన్నర్, ఇంజీన్ ఫ్యూయల్, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. తీవ్ర లక్షణాలు : ఊపిరాడకపోవడం, గుండె ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరి, కోమా, మూర్ఛలు , ప్రాణాంతక గాయంనిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్ను పూర్తిగా తొలగిస్తుంది. ఊపిరాడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కూడా ప్రభావితం చేస్తుంది. పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది.

హోమ్లీ పెట్ ఉంటే ఒత్తిడి సెట్.. ఇంట్రస్టింగ్ సర్వే
ఈ ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక శాతం మంది నగరవాసులు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో మానవులకు మానసిక ప్రశాంతత ఒక విలాసంగా మారుతోంది. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువులే మిత్రులుగా ఎంతో సహాయ పడుతున్నాయి. ఈ విషయం ఇటీవల మార్స్ పెట్కేర్, మెడిటేషన్ యాప్ కామ్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. 20 దేశాల్లో 31 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో భారత్కు చెందిన వెయ్యి మంది పెంపుడు జంతువుల యజమానుల అభిప్రాయాలు విశేషంగా వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం – సాక్షి, సిటీబ్యూరో పెంపుడు జంతువుల కారణంగా భారతీయుల్లో 92 శాతం మంది తమ స్క్రీన్ టైమ్ తగ్గిందని చెబుతుండగా, 93 శాతం మంది రోజువారీ పనుల మధ్య బ్రేక్ తీసుకోడానికి పెంపుడు జంతువులే ప్రేరణగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే, 82 శాతం మంది పెంపుడు జంతువులతో మాట్లాడటం ద్వారా రిలాక్సేషన్ పొందుతున్నామని, ఒంటరి తనానికి దూరం అవుతున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా భాగస్వామ్యమైంది. సర్వే విశేషాలివే.. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 79 శాతం మంది భారతీయులు నిద్ర బాగా పడుతోందని చెబుతుండగా, అదే అమెరికాలో ఇది కేవలం 55 శాతం మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు, 88 శాతం మంది ఆలోచనల్లో ఆవేశం తగ్గిందని, 76 శాతం మంది ఆ క్షణాలను ఆస్వాదించే పరిస్థితుల్లో ఉన్నామని వెల్లడించారు. ఈ డేటా కేవలం గణాంకాలుగా కాకుండా, మానవుల మానసిక శ్రేయస్సులో పెంపుడు జంతువుల ప్రభావాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ సందర్భంగా మార్స్ పెట్కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ మూర్తి చెప్పినట్లు, ‘పెంపుడు జంతువులు కేవలం మనిషికి ఆనందం కలిగించడమే కాక, మెదడుకు విశ్రాంతినిచ్చే సహచరులుగా నిలుస్తున్నాయి.’ కామ్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ గ్రెగ్ జస్టిస్ మాట్లాడుతూ.. ‘పెంపుడు జంతువులు మెడిటేషన్ లాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. మానవ సంబంధాల్లో మానవ–జంతు అనుబంధం ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది’ అన్నారు. పెంపుడు జంతువులకు అనుకూలంగా హైదరాబాద్లోని మార్స్ కార్యాలయంపెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతతఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్ఫుల్నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్ అసోసియేట్స్తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి.. చదవండి: టూరిస్టులకూ నో : మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరం ఇదే..!ఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్ఫుల్నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్ అసోసియేట్స్తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి.. ఇదీ చదవండి: Beauty Tips: బ్లాక్ హెడ్స్కు చెక్, ముఖాన్ని మెరిపించే స్క్రబ్స్

Bonalu ఉత్సవాల రాజు.. పోతరాజు
బోనాలు.. పోతురాజులు.. ఈ రెండింటికీ విడదీయరాని అనుబంధం. శతాబ్దాలుగా బోనాలు, పోతురాజుల పేర్లు ఒకదానికొకటి పోటీపడుతూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల ముందు పోతురాజుల విన్యాసాలు కళ్లప్పగించి చూడాల్సిందే. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే బోనాల ఊరేగింపుకు పోతురాజుల విన్యాసాలు హైలెట్గా నిలుస్తాయి. ఒళ్లు గగుర్పొడిచే వీరి విన్యాసాలు బోనాల ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి గీంకారాలతో ఆ ప్రాంతంలో నిశబ్దం ఆవహిస్తుంది. చూసేవారంతా భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ముఖ్యంగా పోతురాజు నిమ్మకాయలతో చేసే విన్యాసం చూడ ముచ్చటగా అనిపిస్తుంది. రెండు చేతుల్లో కోరడాలతో సై..సై అని చప్పుడు చేస్తూ పోతురాజుల వీరంగం భలే ఆకట్టు కుంటుంది.– గోల్కొండ పోతురాజుల ప్రత్యేక ఆకర్షణ.. పోతురాజు వేషంలో తయారవడమే ఒక ప్రత్యేక కళ. బోనాలలో పోతురాజులది ప్రత్యేక ఆకర్షణ. శరీరం మొత్తం వివిధ రకాల రంగులు, కాళ్లకు గల్లు గల్లు మనే గజ్జెలతో పోతురాజులు ఆకట్టుకుంటారు. మెడలో మాలలు, రెండు చేతుల్లో కోరడాలతో, నాలుక బయటకు తీస్తే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. కాగా గోల్కొండ కోట బోనాలలో గత దశాబ్ద కాలంగా పోతురాజుగా ప్రజలను ఆకట్టుకుంటున్నాడు తల్వార్ శివ. పోతురాజు వేషంలో స్థానిక ప్రజల అభిమానాన్ని పొందాడు. అమ్మమీద భక్తితోనే బోనాల ఉరేగింపులో పోతురాజు వేషం వేస్తున్నానని తల్వార్ శివ అంటున్నాడు. ఒక్క రోజు వేషానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఊరేగింపులో విన్యాసాలు చేస్తుంటే ప్రజలు తమను ఆదరిస్తారని, ఇది తమకు ఎంతో గర్వంగా అనిపిస్తుందని అంటున్నారు.
ఫొటోలు
అంతర్జాతీయం

#Axiom4: శుభాంషు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా
యాక్సియమ్ స్పేస్ సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి చేపట్టిన నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఈ నెల 10న సాయంత్రం 5.52 గంటలకు (భారత కాలమానం ప్రకారం) నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రతికూల వాతావరణంతో రెండు రోజులు వాయిదా వేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ యాత్ర కోసం చేపట్టనున్న నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర భారత్కు చెందిన కెప్టెన్ శుభాంశు శుక్లాను(shubhanshu shukla) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కావాల్సి ఉంది. వాస్తవానికి యాక్సియం-4 మిషన్ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది. అయితే, దాన్ని తొలుత ఈ నెల 8కి, అనంతరం 10కి మార్చారు. తాజాగా మరోసారి వాయిదా పడింది.Launch Of Axiom-4 Mission To ISS Postponed To June 11 Due To Bad Weather#Axiom4 #ShubhanshuShuklahttps://t.co/wsEgLTMx4R— NewsMobile (@NewsMobileIndia) June 9, 2025తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీన ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఈ మిషన్ ప్రారంభం కానుంది. 28 గంటల ప్రయాణానంతరం ఐఎస్ఎస్ చేరుకుని, అక్కడ 14 రోజులు గడుపుతారు. శుభాంశు శుక్లా (భారతదేశం), పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) ఈ యాత్రలో పాల్గొంటారు. యాక్సియమ్ స్పేస్ (Axiom Space) ద్వారా చేపట్టబడిన ఈ మిషన్, "ఏఎక్స్-4" (AX-4) అని పిలుస్తారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం ఇస్రో తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) మన వ్యోమగామి పంపించడం విశేషం. ఐఎస్ఎస్లో శుక్లా చేపట్టబోయే ప్రయోగాలు గగన్యాన్కు ఎంతో ఉపకరిస్తాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది. ఇక.. 1984లో రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్ ద్వారా రోదసీ యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కావడం గమనార్హం.

ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ
కొలరాడో: మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. జననం ఆవలి మరణంలో ఏముందో తెలుసుకోవాలని మనిషి కొన్ని వేల ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పలు ఊహాగానాలు పుట్టుకువస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు ఉండటం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ ‘స్ఫృహ’కు ఆవతలివైపు ఏముందో చూశానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు.ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను. ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను. అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు. అయినప్పటికీ అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం కష్టం అని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మానవ మెదడు మరణం అంచుకు చేరినప్పడు, జీవితంలో ముఖ్య ఘట్టాలను గుర్తుచేసుకుంటుంది. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో జీవులన్నీ జీవితాంతం తమ చుట్టూ ఒక కాంతిని వెదజల్లుతాయని, అయితే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: రాజ్తో సంబంధం.. రాజాతో పెళ్లి?.. ‘హనీమూన్ జంట’కథలో అసలు నిజం

11న ఇమ్రాన్ ఖాన్ విడుదల?
హైదరాబాద్: అల్–ఖాదిర్ ట్రస్ట్ కేసులో బెయిల్ లభిస్తే జూన్ 11వ తేదీన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యే వీలుందని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గోహర్ అలీఖాన్ ప్రకటించారు. దాదాపు రూ.2,200 కోట్ల అల్–ఖాదిర్ యూనివర్సిటీ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీలకు పడిన శిక్షలను రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇస్లామాబాద్ హైకోర్టు జూన్ 11న నిర్ణయం తీసుకోనుందని అలీఖాన్ ఆదివారం చెప్పారు. పదవి కోల్పోయాక 72 ఏళ్ల ఇమ్రాన్ 2023 ఆగస్ట్ నుంచి రావల్పిండి నగరంలోని అడియాలా జైలులో గడుపుతున్నారు.

గ్రెటా థన్బర్గ్కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత
గాజా: యుద్ధంతో మరుభూమిగా మారుతున్న గాజాపై ఇజ్రాయెల్ మరోమారు తన ప్రతాపాన్ని చూపింది. స్వీడిష్ పర్యావరణ కార్యకర్త, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో ఉద్యమాన్ని ఉద్యమాన్ని నడుపుతున్న గ్రెటా థన్బర్గ్తో పాటు పలువురిని గాజా స్ట్రిప్కు తీసుకువెళుతున్న మానవతా నౌక(హ్యూమానిటేరియన్ షిప్)ను ఇజ్రాయెల్ కమాండోలు అడ్డుకున్నారు.ఈ నౌకలో పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి (ఎఫ్ఎప్సీ)కి చెందిన కార్యకర్తలలో పాటు యూరోపియన్ పార్లమెంట్ (ఎంఈపీ) సభ్యురాలు రిమా హసన్ కూడా ఉన్నారు. తాజాగా లైఫ్ జాకెట్లు ధరించి, చేతులు పైకెత్తి కూర్చున్న కొందరి ఫోటోను ఇజ్రాయెట్ పోస్ట్ చేసింది. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా సిబ్బందిని ఇజ్రాయెల్ సైన్యం అంతర్జాతీయ జలాల్లో తెల్లవారుజామున అరెస్టు చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది. మానవతావాద సమూహాల కూటమి(ఎఫ్ఎప్సీ)టెలిగ్రామ్ యాప్లో మాడ్లీన్తో సంబంధం కోల్పోయామని, ప్రయాణికులను ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయని పేర్కొంది. The crew was arrested in international waters. pic.twitter.com/ydjA9yZHSC— Rima Hassan (@RimaHas) June 9, 2025శుక్రవారం సిసిలీ నుంచి బయలుదేరిన ఈ నౌక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు నుంచి గాజాపై ఇజ్రాయెల్ నావికా దిగ్బంధనను సవాలు చేస్తూ వస్తోంది. అలాగే బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఎఫ్ఎప్సీ తెలిపింది. తాజాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నౌకను సెలబ్రిటీల సెల్ఫీ నౌకగా పేర్కొంది. అది ఇజ్రాయెల్ తీరానికి సురక్షితంగా చేరుకుంటుందని, ఓడలో ప్రయాణిస్తున్న కార్యకర్తలు ప్రచారం పొందడానికి, మీడియాను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించింది.గడచిన రెండు వారాల్లో 1,200కు పైగా సహాయ ట్రక్కులు ఇజ్రాయెల్ నుండి గాజాలోకి ప్రవేశించాయని, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గాజాలోని పౌరులకు దాదాపు 11 మిలియన్ల ఆహారాన్ని పంపిణీ చేసిందని ఇజ్రాయెల్ ఒక పోస్టులో పేర్కొంది. మాడ్లీన్ గాజాకు చేరుకోకుండా, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశించిన దరిమిలా ఈ ఓడను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. గాజాలోని హమాస్ ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా నిరోధించడానికే ఇటువంటి చర్యలు చేపడుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇది సహాయం కాదని, ప్రచార స్టంట్ అని, వారి వద్ద 100 పౌండ్ల కంటే తక్కువ విలువచేసే సహాయక సామగ్రి ఉందని, ప్రతిరోజూ గాజాకు పంపిణీ అవుతున్న దాని కన్నా ఇది చాలా తక్కువ మొత్తం అని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గై నిర్ మీడియాకు తెలిపారు.అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ఈ సముద్ర దిగ్బంధం చట్టవిరుద్ధమని ఎఫ్ఎప్సీ పేర్కొంది.గాజాకు చేరుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునే హక్కు ఇజ్రాయెల్కు లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఎప్సీ నౌక కాన్సైన్స్ గత మేలో మొదటిసారి గాజాకు చేరుకోవడానికి ప్రయత్నించింది. అయితే మాల్టా తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై డ్రోన్ దాడి జరగడంతో ప్రయాణం రద్దయ్యింది.ఇది కూడా చదవండి: హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
జాతీయం

భారత విద్యార్థిపై అమెరికా అరాచకం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: భారత విద్యార్థిని నేలపై పడేసి, పెడరెక్కలు వెనక్కు విరిచి కట్టి బేడీలు వేయడాన్ని అమెరికా సమర్థించుకుంది. ‘‘అతనిపై అలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అమెరికాలోకి అక్రమ ప్రవేశాలను, వీసా ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు’’ అని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాకపోతే బాధిత విద్యార్థి ఎటువంటి వీసా ఉల్లంఘనకు పాల్పడిందీ వివరించలేదు.శనివారం రాత్రి భారత్కు తిప్పి పంపించే క్రమంలో సదరు విద్యార్థి పట్ల నెవార్క్ విమానాశ్రయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అత్యంత అనుమాషంగా వ్యవహరించడం తెలిసిందే. తాను నేరగాన్ని కాదని బాధితుడు అరుస్తున్నా పట్టించుకోలేదు. కునాల్ జైన్ అనే ప్రవాస భారతీయుడు దీన్నంతటినీ వీడియో తీసి ఎక్స్లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిస్సహాయుడైన ఒక అమాయకున్ని కరడుగట్టిన నేరస్తునిలా చూశారంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా అమెరికా మాత్రం సమర్థించుకోవడం గమనార్హం.I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025‘‘చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే పర్యాటకులకు ఎప్పుడూ స్వాగతం పలుకుతాం. కానీ ఎవరికైనా సరే, మా దేశంలోకి ప్రవేశం ఒక హక్కు కాదని గుర్తుంచుకోవాలి’’ అంటూ దౌత్య కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ఉదంతంపై న్యూయార్క్లోని భారత కాన్సులేట్ స్పందించింది. ‘‘దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను చూశాం. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నాం’’ అని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పేర్కొన్నారు. భారతీయుల సంక్షేమానికి కాన్సులేట్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ సర్కారు కొన్నాళ్లుగా కొరడా ఝళిపిస్తుండటం తెలిసిందే. ట్రాఫిక్ ఉ ల్లంఘనల వంటి చిన్నాచితకా కారణాలకు కూడా కనీసం ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండానే వీసాలు రద్దు చేసి స్వదేశాలకు పంపించేస్తోంది. వీటిపై అక్కడి కోర్టులో న్యాయ పోరాటాలు కూడా సాగుతున్నాయి.Yes, I offered to help pacify the situation, but unfortunately, they called more police and humiliated that poor guy. pic.twitter.com/kHBGoAG8fk— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ట్రంప్తో మోదీ మాట్లాడాలి: కాంగ్రెస్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత విద్యార్థులపై అమెరికాలో నిర్బంధం నానాటికీ పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ గడ్డపై భారత్, భారతీయుల గౌరవ మర్యాదలను కాపాడటంతో మోదీ ప్రభుత్వం వరుసగా విఫలమవుతూ వస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి. తక్షణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి వీటికి ఫుల్స్టాప్ పెట్టించాలి’’ అని డిమాండ్ చేశారు.

‘డిప్యూటీ స్పీకర్ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్ చేశారు.‘లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారి. సంప్రదాయంగా లోక్సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారని... లోక్సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.మొదటి లోక్సభ నుంచి పదహారవ లోక్సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు.

అమ్ములపొదిలోకి తేజస్ 2.0
పాకిస్తాన్తో ఉద్రిక్తలు తారస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాటవం మరింత బలోపేతం కానుంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్ ఈ నెలాఖరుకల్లా ఎయిర్ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎల్రక్టానికలీ స్కాన్డ్ అరే) రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ.ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్ ఎంకే1–ఏ సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాదే అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న మిగ్–21, జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలుంటాయి. ఇవీ ప్రత్యేకతలు ⇒ తేజస్ ఎంకే1–ఏలో అమర్చిన అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు చెందిన ఎల్టా సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ⇒ తేజస్లో అమర్చిన అధునాతన ఎల్రక్టానికల్ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాయే సరఫరా చేసింది. ⇒ ఇజ్రాయెల్కే చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ⇒ ఏఈఎస్ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేశారు. ⇒ తేజస్ ఎంకే1–ఏకు ఇజ్రాయెల్ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధవిమానాల్లో కూడా లేకపోవడం విశేషం. ⇒ రఫేల్ యుద్ధ విమానాల్లోని రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ఎంకే1–ఏకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధపాటవం ఎన్నో రెట్లు పెరగనుంది. ⇒ తేజస్ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానార్డ్ వింగ్స్, ఎల్రక్టానిక్ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్ వంటివాటిని సంతరించుకోనున్నట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ⇒ తేజస్ మూడో వెర్షన్లను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిత్యం శ్రమిస్తోంది. ⇒ ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు పోటీపడుతున్నాయి.

‘జాతీయ భద్రతా సలహా మండలి’సభ్యుడిగా సతీశ్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్ రెడ్డిని జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ‘జాతీయ భద్రతా సలహా మండలి’లో సభ్యుడిగా మంగళవారం నుంచి రెండేళ్ల పాటు, అంటే 2027 జూన్ 9వ తేదీ వరకు సతీశ్రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయ డిప్యూటీ సెక్రటరీ పుష్పేందర్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలోని మహిమలూరులో 1963 జూలై 1న జన్మించిన సతీశ్ రెడ్డి 1986లో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు.ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో అనంతపురం జేఎన్టీయూ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు.పరిశోధనా సంస్థ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా పనిచేశారు. ఈ కాలంలో ఐఆర్ సీకర్స్, ఇంటిగ్రేటెడ్ ఏవి యానిక్స్ మాడ్యూల్స్, ఇతర వినూత్న వ్యవస్థల అభి వృద్ధిని పర్య వేక్షించారు. 2015 లో రక్షణ మంత్రి సాంకేతిక సలహా దా రుగా నియమి తులయ్యారు.2018 ఆగస్టు లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల ప్మెంట్ ఆర్గనై జేషన్ (డీఆర్ డీవో) 13వ చైర్మన్గా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల అభివృద్ధి డైరెక్టర్ జనరల్గా ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ను పర్యవేక్షించారు. నాగ్, క్యూఆర్ఎస్ఏఎం, రుద్రమ్, దీర్ఘశ్రేణి గైడెడ్ బాంబ్ల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. విజయవంతమైన పృథ్వీ డిఫెన్స్ వెహికిల్ తొలి పరీక్షను పర్యవేక్షించారు. 2018 నుంచి 2022 డీఆర్డీవో చైర్మన్గా సేవలందించారు.
ఎన్ఆర్ఐ

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్

న్యూజిల్యాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం లో “న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ “ ఆధ్వర్యం లో జై తెలంగాణ నినాదాలతో “తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక”లను ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.అసోసియేషన్ అధ్యక్షులు “కోడూరి చంద్రశేఖర్” అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా “Dr.మోహన్ కుమార్ సేథి” ముఖ్య అతిధి గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారుఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించడం జరిగిందిప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమం లో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు “పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మేకల ప్రసన్న కుమార్ తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి,సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం,జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల,విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ,కిరణ్మయి పద్మ,విశ్వనాథ్ అవిటి,సందీప్ నాగుల,పవనకుమార్ చారుకొండ,సలీం మహమ్మద్,హరీష్ గోపాల్,మనోహర్ కన్నం,కిరణ్ కుమార్ కొమ్ముల,రమేష్ రెడ్డి రామిండ్ల,శ్రీరామ్ విజయ్,శ్రీనివాస్ గాజుల,ప్రమోద్ ఇరుగు,అనిల్ మెరుగు,రమేష్ ఆడెపు,రవి కుమార్ వట్టం,విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరుల తో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.

అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అబుదాబి :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అబు ధాబిలోని ఇండియా ఎంబసీ వేదికగా ఎంతో వైభవంగా నిర్వహించబడింది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ - అబుధాబి ఆధ్వర్యంలో జయప్రదంగా సాగిన ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వేడుకకు ప్రేం చంద్, కాన్సులర్(కౌన్సిలర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గౌరవ అతిథులుగా కుమారి ఆయుషి సుతారియా, సెకండ్ సెక్రటరీ (పాలిటికల్) పాల్గొన్నారు. వీరి సమక్షంలో దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది.తెలంగాణ పిల్లలు భారత మరియు యుఏఈ జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి దేశభక్తిని ప్రతిబింబించారు. అనంతరం తెలంగాణ బాలికలు మరియు మహిళలు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వేడుకకు కొత్త అందాన్ని తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో, ధరావత్ రాజ్కుమార్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పేరిణి శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజు, మరియు ఇతర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సంపదను మధురంగా ప్రతిబింబించాయి.ప్రత్యేకంగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు - పావని, అర్చనా, లక్ష్మి తమ కృషితో తెలంగాణ కళా సంపదను ప్రతిబింబించే చిత్ర ప్రదర్శన వేడుకలకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ఎంబసీ ప్రాంగణం తెలంగాణను తలపించేలా అలంకరించబడింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇంతే కాదు, డప్పు కళాకారుల దరువు వేడుక లో మరింత ఉత్తేజం నింపింది. డప్పు కళాకారులు, పోతరాజు కళాకారులు, గుస్సాడీ కళాకారులు మరియు పేరిణి శివ తాండవం కళాకారులు కలిసి చేసిన జుగల్ బంది ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఎంబసీ అధికారులను ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సంబరాలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల సంఘాల నాయకులను మరియు ఇతర సాంఘిక సేవ సంఘం నాయకులను శాలువా కప్పి మరియు మొమెంటో ప్రధానం చేసి సత్కరించారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు.. ఈ వేడుక అబూదాబి లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవలసిన జ్ఞాపకంగా మారింది అని అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు తెలియ జేశారు.వేడుకల తదనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిదులందరికి, కార్య క్రమ నిర్వాహకులు తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, మరియు భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంతో ఈ వేడుక మరింత వైభవంగా జరిగింది. వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంబసీ అధికారులకు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను సింగపూర్ ఈస్ట్ కోస్ట్ పార్క్ (ECP)లో మే 31, 2025న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో సుమారు 200 ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయఆటలను భావి తరాలకు అందించాలని TCSS సభ్యులు.. సంచి దుంకుడు, కచ్చకాయలు, ఇతర వినోద భరిత ఆటలు అంత్యాక్షరి, స్పూన్ మార్బుల్, డం చరాడ్స్ , తంబోలా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారుద. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ మాట్లాడుతూ ఎలాంటి హంగు ఆర్భాటాలు, లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమాలు ఆదర్శప్రాయం, అభినందనీయం అన్నారు.టీసీఎస్ఎస్ (TCSS) లైఫ్ మెంబెర్స్ ఫామిలీ డే - 2025 ఇంతలా విజయవంతమయ్యేలా సహకరించి వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి రమేష్ గడప, రాము బొందుగుల మరియు వెంకటరమణ నంగునూరి, కల్వ లక్ష్మణ్ రాజు మొదలగు వారు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.(చదవండి: అమెరికా అంతటా గులాబీ మయం..!)
క్రైమ్

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య
తొగుట (సిద్ధిపేట జిల్లా): ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బండారుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇల్లు మంజూరైనట్టు గ్రామంలోని కొందరు నాయకులు తెలపడంతో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అందుతాయన్న ఆశతో తెలిసిన వారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకుని బేస్మెంట్ వరకు నిర్మించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత మంజూరైన ఇళ్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందంటూ బాధితుడికి నాయకులు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ రవికాంత్రావు తెలిపారు.

నాన్నా.. వదిలిపెట్టు, భయమేస్తోంది!
అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశంలో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మొత్తం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య వివాహేతర సంబంధంలో ఉందన్న అనుమానంతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ భర్త.. కొన్ని గంటల్లోనే నలుగురు కొడుకులతో కలిసి పట్టాలపై శవమై కనిపించాడు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫరిదాబాద్కు చెందిన మనోజ్ మాహట్టో(45) భార్య ప్రియతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఆ భర్త తన నలుగురు పిల్లలు పవన్(10), కరు(9), మురళి(5), చోటు (3)లను తీసుకుని బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నాం దాకా సమీపంలోని ఓ పార్క్లో సేదతీరాడు. పిల్లలకు చిప్స్, కూల్డ్రింక్స్ కొనిచ్చి సరదాగా గడిపాడు. ఆపై వాళ్లను తీసుకుని సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. భుజాలపై చెరోవైపు.. చెరోకరిని, మిగతా ఇద్దరిని రెండు వైపులా చేతులు పట్టుకుని పట్టాలపై నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పిల్లలకు అప్పటిదాకా అర్థం కావడంలేదు. మరికాసేపట్లో భల్లాబ్గఢ్ స్టేషన్కు గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సి ఉంది. స్టేషన్ మరో కిలోమీటర్ దూరం ఉందనగా.. పట్టాలపై నలుగురు పిల్లలతో మనోజ్ నిల్చున్నాడు. అయితే పట్టాలపై పిల్లలతో వ్యక్తి నిల్చున్న విషయం గమనించిన లోకో పైలట్ హారన్ కొడుతూ రైలును ఆపే ప్రయత్నం చేశాడు. అయినా మనోజ్లో చలనం లేదు. రైలు దగ్గరగా వస్తుండడంతో భయంతో ఆ పిల్లలు రోదించ సాగారు. తమను వదిలిపెట్టమని పవన్, కరులు గింజుకుంటున్నారు. అయినా ఆ తండ్రి చలించలేదు. వాళ్లను బలంగా అదిమి పట్టుకున్నాడు. చివరకు రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఆ ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆపై కాస్త దూరంలో రైలు ఆగడంతో.. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు వచ్చి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మనోజ్ జేబులో సూసైడ్ నోట్ లభించగా.. అందులో తన భార్యే కారణమని రాసి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

భార్యతో విసుగు చెంది భర్త ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది. గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

నువ్వు నాకు వద్దు.. చచ్చిపో!
బోయినపల్లి (కరీంనగర్): భార్య వివాహేతర సంబంధంతో అవమానంగా భావించిన ఓ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది.వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. కాగా అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు. ఈ క్రమంలో కావేరి ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్తోనే ఉంటా’అని భర్తతో తేల్చిచెప్పింది.దీంతో మనస్తాపం చెందిన హరీశ్ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆదేశాలతో బావిలోని నీటిని మోటార్లతో తోడేయగా, హరీశ్ మృతదేహం లభ్యమైంది. హరీశ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి, రక్షణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.