Top Stories
ప్రధాన వార్తలు

‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్బీఐ ట్వీట్ వైరల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను గెలుచుకోవడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ విజయంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు దేశం అంతటా ఈ సంబరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ ఈ వేడుకల్లో ఆసక్తిగా నిలిచింది.భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త, ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆర్సీబీ జట్టును అభినందించిన మాల్యా ‘18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్ నిలిచింది. 2025 టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే’ అని ట్వీట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది. అందుకు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025‘దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్లోని ఎస్బీఐ బ్రాంచికి ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్..’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా మాల్యా ట్వీట్కు ఎస్బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లై (సర్, భారత్కు రండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం)ను జోడిస్తూ అందుకే ఎక్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.That’s why I like X pic.twitter.com/hR3QIEwJWV— Harsh Goenka (@hvgoenka) June 4, 2025ఇదీ చదవండి: మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రిఎస్బీఐ ట్వీట్ నిజమేనా?వైరల్గా మారుతున్న మాల్యా ట్వీట్కు వస్తున్న రిప్లైలు ఆసక్తిగా మారుతున్న తరుణంలో ఎస్బీఐ నుంచి వచ్చిన రిప్లైను ధ్రువీకరించాలని ఏఐ అసిస్టెంట్ గ్రోక్ను ఓ యూజర్ కోరాడు. దానికి ప్రతిస్పందనగా ఇది కల్పితమై ఉండొచ్చని గ్రోక్ సూచించింది. ఏదేమైనా #EeSalaCupNamde అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అయింది.

జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్
బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది!. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది? అనే చాలా విషయాలు చెప్పినవి చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా.. ఈవిడలాగే జపాన్లోనూ ఒకావిడ ఉంది. ఆమె పేరు రియో టాట్సుకి(Ryo Tatsuki). ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. జపనీస్ కాలజ్ఞాని రియో టాట్సుకి (Japanese fortune teller Ryo Tatsuki) 2025, జూలై 5న విపత్తు సంభవించబోతోందని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన రియో టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్- ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ సంభవించవచ్చని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు ఏడాదికి 50 శాతం మేరకు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్లు 83శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్ సమయంలో 50శాతం మేరకు బుకింగ్ల తగ్గుదల ఉందని హాంకాంగ్లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency) తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దీని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.చెప్పినవి చెప్పినట్లే జరిగాయి1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు.2011 తోహోకు భూకంపం, సునామీ: టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది.టాట్సుకి రాసిన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో 2020లో ఓ వైరస్ జపాన్తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అది కోవిడ్-19నేనని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఇది కూడా చదవండి: ‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’

కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్-2 కంటే వరస్ట్గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్గా ఉందంటున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్గా అనిపించాయని ఓ నెటిజన్స్ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025

‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’
బెంగళూరు: ఆర్సీబీ జట్టు విజయోత్సవాల మాటేమోగానీ.. 11 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో తన ఒక్కగానొక్క కొడుకును పొగొట్టుకున్న తండ్రి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కొడుకు శవానికి పోస్ట్మార్టం వద్దని, అలాగే అప్పగించాలని వేడుకుంటూ మాట్లాడిన మాటలవి. ‘‘నాకు ఒక్కగానొక్క కొడుకు. 22 ఏళ్లు గారాభంగా పెంచుకున్నా. నాకు చెప్పుకుండా ఇక్కడికి వచ్చి వాడు ప్రాణం పొగొట్టుకున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరొచ్చి పరామర్శించినా నా కొడుకును బతికించలేరు. దయచేసి వాడి శరీరాన్ని ముక్కలు చేయకండి. అలాగే అప్పగించండి. మీకు దణ్ణం పెడతా..’’ అంటూ మీడియా ముఖంగా ఆయన కన్నీళ్లతో చేసిన అభ్యర్థన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. Credits: NDTVఅయితే అధికారులు ఆయన విజ్ఞప్తికి ఎలా స్పందించారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తొక్కిసలాట మృతదేహాలకు ఈరోజు(గురువారం) ఉదయం పోస్టుమార్టం(Postmortem) పూర్తిచేశారు. అనంతరం కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించారు.18 ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. ఈ నేపథ్యంతో మరుసటిరోజే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సమీపంలో ర్యాలీ, విధాన సౌధలో ఆర్సీబీ జట్టుకు ప్రభుత్వం సన్మానం చేయాలని భావించింది. అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావడం, అదే సమయంలో గందరగోళం నెలకొని తొక్కిసలాట జరగడం, పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోవడంతో ప్రాణ నష్టం జరిగింది. ఇది కూడా చదవండి: భారత్-పాక్ వివాదంపై ట్రంప్-పుతిన్ చర్చ

పాడైన మిక్చర్ పెడతావా?.. కోర్టు ఉద్యోగికి జడ్జి లీగల్ నోటీసులు
అధికారి తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అలాగే న్యాయస్థానం వాళ్ళు అనుకోవాలిగానీ ఏ అంశం మీదైనా నోటీసులు ఇవ్వగలరు.. చొక్కా గుండీలు పెట్టుకోలేదని.. నల్లకళ్లజోడు పెట్టుకున్నావని.. టిప్ టాప్ గా తయారై కోర్టుకు వచ్చావని కూడా శిక్ష విధించగలరు.. నోటీసు ఇవ్వగలరు. పాపం ఉత్తరప్రదేశ్ లోని గొండా జిల్లాలో ఇలాగే ఓ కోర్టు అటెండర్ తనకు తాజా స్నాక్స్ పెట్టలేదని.. చెడిపోయిన మిక్చర్ ఇచ్చాడన్న కారణంతో సదరు జడ్జి కోపానికి వచ్చి ఏకంగా ఆ ఉద్యోగికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా కోర్టులో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి నాలుగురోజుల క్రితం మధ్యాహ్న విరామ సమయంలో, గోండాలోని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో కలిశారు. వారిద్దరూ కాసేపు ఛాంబర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అతిథికి చాయ్ బిస్కెట్స్ అందించాలని కోర్టు అటెండర్ ను సెషన్స్ జడ్జి చెప్పారు.అయితే పాపం ఆ ఉద్యోగి కేవలం చాయ్ తీసుకొచ్చాడు. దీంతో జడ్జిగారు కోపంతో బిస్కెట్స్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ అటెండర్ పరుగెత్తుకువెళ్లి బిస్కెట్స్ బదులు దాల్మోత్ అనే మిక్చర్ లాంటిది తెచ్చి ఇచ్చాడు. అయితే అది నాణ్యత లేకపోగా చెడిపోయిన వాసనా వచ్చింది. దీంతో జడ్జిగారికి చిర్రెత్తుకొచ్చింది.. వెంటనే టింగ్ టింగ్ అని బెల్లు కొట్టి టైపిస్టును పిలిచి ఈ అటెండర్ నాకు సరిగా స్నాక్స్ ఇవ్వలేదు.. ముందు ఆయనకు నోటీస్ టైప్ చేసివ్వు.. అయన దానికి సమాధానం ఇచ్చుకుంటాడో ఉద్యోగం మనుకుంటాడో చూద్దాం అని హుకుం జారే చేసారు. అయన ఆదేశించిన మరుక్షణం ఉద్యోగి పేరిట నోటీస్ సిద్ధమైంది. ఇంతకూ ఆ నోటీసులో ఏముందంటే..“నేను బిస్కెట్లు తీసుకురమ్మన్నాను. కానీ నీవు బిస్కెట్లు తీసుకురాకుండా, బదులుగా చెడిపోయిన దాల్మోత్ను సర్వ్ చేసావు. అయితే, రెండు డబ్బాల్లో మంచి నాణ్యత గల బిస్కెట్లు క్యాబినెట్లో సిద్ధంగా ఉండగా కూడా, నీవు అవన్నీ విస్మరించి, బయటపడేయాల్సిన స్థితిలో ఉన్న దాల్మోత్ను ఇచ్చావు. ఇది గౌరవానికి భంగం కలిగించే చర్యగా, తీవ్రమైన నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. దీనికి నువ్వు వివరణ ఇవ్వాల్సిందే అంటూ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.. అయ్యో జడ్జిగారికి కోపం వస్తే ఏమవుతుందో చూసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు-సిమ్మాదిరప్పన్న

ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఇరాన్ సహా 12 దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పెద్ద షాకిచ్చారు. ఆ దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రావెల్ బ్యాన్(Travel Ban) విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. రాబోయే సోమవారం(జూన్ 9వ తేదీ) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ జాబితాలో ఇరాన్(Trump Travel ban on Iran), లిబియా, అఫ్గనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, హైతీ, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా సైతం ఉన్నాయి. వీటితో పాటు మరో ఏడు దేశాలపైనా ఆయన తాత్కాలిక నిషేధం విధించారు. ఇందులో.. బూరుండి, వెనిజులా, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, టుర్కిమేనిస్తాన్ ఉన్నాయి.ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వీసా పొందుతున్న వ్యక్తుల సమాచారాన్ని తగిన విధంగా పరిశీలించే అవకాశాలు తక్కువగా ఉండడం, అదే సయమంలో వీసా గడువు ముగిసినా కూడా తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోతుండడం.. ఈ రెండు కారణాల వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరమైన విదేశీ శక్తుల నుంచి అమెరికన్లను రక్షిస్తానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆయన ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు అని వైట్హౌజ్ అధికార ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలో ఉండడం, ఇరాన్ క్యూబా దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలే ప్రోత్సాహిస్తుండడం, చాద్.. ఎరిత్రియాలాంటి దేశాల పౌరులు వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోతుండడం.. లాంటి కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ ‘విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడం కోసమే’ అంటూ ప్రకటించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా ట్రంప్ తన తొలి టర్మ్లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 2017లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధించారు. అయితే ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక 2021లో దానిని ఎత్తివేశారు.

మాటలు రావడం లేదు.. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విరుష్క
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విక్టరీ పరేడ్ సెలబ్రేషన్స్ తీవ్ర విషాదాన్ని నింపాయి. బుధవారం నగరంలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ స్టార్ప్లేయర్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది‘ అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పందించింది. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ‘‘చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేం తీవ్రంగా కలత చెందాం. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమిగూడారు. అయితే మీడియా ద్వారా మేం ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతీ ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణ నష్టం మమ్మల్ని మరింత కలిచి వేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేసాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం.’’అని తెలిపింది. మరోవైపు ఇదే ప్రకటనను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఐపీఎల్లో 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి, ఆర్సీబీ తొలిసారి టైటిల్ కప్ కైవసం చేసుకోవడంతో అసంఖ్యాక అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని ఒక అంచనా. ఈ అంచనా పోలీసుల అంచనాని మించిపోయి వాళ్ల చేతులు దాటిపోయింది. అదే సమయంలో.. ఏడో నెంబర్ గేటు దగ్గర విపరీతమైన రద్దీ, ఫ్రీ టికెట్ పుకార్లు, వర్షం, స్టేడియంలో జనాల బరువుకు కాలువ పైకప్పు కుప్పకూలిపోవడం.. ఇలా ఒకేసారి అన్నింటితో పరిస్థితి అదుపుతప్పడంతో తీవ్రమైన తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) కారణమనే విమర్శ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఘటనపై కేఎస్సీఏ విచారం వ్యక్తం చేసింది. ’చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్ట ఘటనపై ఆర్సీబీ, కేఎస్సీఏ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.’అని ఓ ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేస్తామని కేఎస్సీఏ ప్రకటించింది. ఇక.. ఈ దుర్ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. అది తమ ఈవెంట్ కాదని, అయితే నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు. "పూర్తి వాస్తవాలు తెలియకుండా నేను ఇప్పుడు ఎవరినీ నిందించదలచుకోలేదు. గత ఏడాది వెస్టిండీస్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ముంబైలో బీసీసీఐ విజయోత్సవ సభ నిర్వహించినప్పుడు, స్థానిక క్రికెట్ సంఘం, ముంబై పోలీసులు, అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలతో కలిసి పక్కా ప్రణాళిక రచించాం. లక్షలాది మంది హాజరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అన్ని నిబంధనలు పాటించాం" అని సైకియా తెలిపారు.

భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..)

పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్నగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.
కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్బీఐ ట్వీట్ వైరల్
నిరసన హోరెత్తి.. వెన్నుపోటుపై గళమెత్తి!
ఉన్నది ఒకటే అన్న భావనే అద్వైతం
మిస్టర్ వరల్డ్ పోటీలు: మిస్టర్ గ్లో..మిస్టర్ స్లో..
ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
పోలీసులు నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించవచ్చా?
‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
మెల్లగా వేగాన్ వైపు..! దావత్ ఈద్ పేరుతో..
చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
పీఓకేలో నిరసనల హోరు
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
మనది నేషనల్ లెవల్ సార్! వెన్నుపోటులో మనది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!!
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్స్ట్రైక్- రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
నేను ఆల్కహాల్ తీసుకుంటా.. మా పేరేంట్స్కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
దీపికా పదుకొణె కండీషన్స్ వైరల్ వేళ మద్ధతుగా మణిరత్నం వ్యాఖ్యలు
చదువు పేరుతో సహజీవనం..!
ప్రకాశం: మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్
కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్బీఐ ట్వీట్ వైరల్
నిరసన హోరెత్తి.. వెన్నుపోటుపై గళమెత్తి!
ఉన్నది ఒకటే అన్న భావనే అద్వైతం
మిస్టర్ వరల్డ్ పోటీలు: మిస్టర్ గ్లో..మిస్టర్ స్లో..
ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
పోలీసులు నడిరోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించవచ్చా?
‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
మెల్లగా వేగాన్ వైపు..! దావత్ ఈద్ పేరుతో..
చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?
పీఓకేలో నిరసనల హోరు
ఈసారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే: వీరేంద్ర సెహ్వాగ్
ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
పనికిమాలిన ప్రచారం ఎందుకు చేతనైతే మాకు బస్సులో ఉచిత ప్రయాణం ఇమ్మనండీ!
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్తో టెస్టు డ్రా
మనది నేషనల్ లెవల్ సార్! వెన్నుపోటులో మనది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!!
చాలా బాధగా ఉంది.. అతడే మ్యాచ్ను టర్న్ చేశాడు: శ్రేయస్ అయ్యర్
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి ధనలాభం
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
అడుక్కుంటుంటే మిత్ర దేశాలు హర్షించడం లేదు - పాక్ ప్రధాని ఆవేదన
ఆదునిక చరిత్రలో అతిపెద్ద సర్జికల్స్ట్రైక్- రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
నేను ఆల్కహాల్ తీసుకుంటా.. మా పేరేంట్స్కు కూడా తెలుసు: టాలీవుడ్ నటి
దీపికా పదుకొణె కండీషన్స్ వైరల్ వేళ మద్ధతుగా మణిరత్నం వ్యాఖ్యలు
చదువు పేరుతో సహజీవనం..!
ప్రకాశం: మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్
సినిమా

కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్-2 కంటే వరస్ట్గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్గా ఉందంటున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్గా అనిపించాయని ఓ నెటిజన్స్ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025

సినిమా ఒకటి... క్లైమాక్స్లు రెండు
ఒకప్పుడు ప్రేక్షకులకు వినోదం అంటే థియేటర్స్లో సినిమాయే. కానీ అభివృద్ధి చెందిన సాంకేతికత వల్ల ప్రేక్షకులకు పలు రకాల వినోద మాధ్యమాలు (ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఓటీటీ వంటివి) ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకురావడం హీరోలు–దర్శక–నిర్మాతలకు పెద్ద సవాల్గా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్ప స్టార్ హీరోల సినిమాలూ ఎక్కువ రోజులు థియేటర్స్లో ఆడే పరిస్థితులు లేవు ఇప్పుడు. ఇక రిపీట్ ఆడియన్స్ అన్నమాట దాదాపుగా కనుమరుగైపోతోంది. స్టార్ హీరోల సినిమాలకు సైతం రిపీట్ ఆడియన్స్ ఉండటం లేదు. ఎలాగూ నెల రోజులు తిరిగే లోపు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా స్ట్రీమింగ్ ఉంటుందనేమో ప్రేక్షకులు నచ్చిన సినిమాను మరోసారి థియేటర్స్లో చూసేందుకు ఏమాత్రం సిద్ధపడటంలేదు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే రెండోసారి ప్రయత్నిస్తుండవచ్చు కానీ సగటు ప్రేక్షకుడు ఒకే సినిమాను థియేటర్స్లో రెండోసారి చూస్తున్న సందర్భాలు చాలా తక్కువైపోయాయన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హీరోలు–దర్శక–నిర్మాతలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ని ఆకర్షించే సరికొత్త వ్యూహాలను రచిస్తూనే ఉన్నారు. తాజాగా హిందీ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ యూనిట్ ప్రేక్షకులను ఆకర్షించే ఓ సరికొత్త వ్యూహానికి ప్రణాళిక సిద్ధం చేసింది. 5ఏ అండ్ 5బీ హిందీ చిత్రపరిశ్రమలో ఉన్న సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీస్లో ‘హౌస్ఫుల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు నాలుగు సినిమాలొచ్చాయి. ఐదో సినిమా ‘హౌస్ఫుల్ 5’ ఈ నెల 6న విడుదలకు సిద్ధమైంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్... ఇలా ప్రముఖ తారలు ‘హౌస్ఫుల్ 5’ సినిమాలో నటించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాని ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’ అంటూ రిలీజ్ చేస్తున్నారు. కానీ... ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావడం లేదు. ఒకే సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్లు ఉంటాయన్నమాట. అంటే... ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమాలో ఒక క్లైమాక్స్ ఉంటే, ‘హౌస్ఫుల్ 5బీ’లో మరో డిఫరెంట్ క్లైమాక్స్ ఉంటుంది. అలాగే ‘హౌస్ఫుల్ 5ఏ, హౌస్ఫుల్ 5బీ’... ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలవుతున్నాయి. ఈ విషయాన్ని ఈ చిత్రంలో హీరోలుగా నటించిన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ ఇన్స్టాలో ఓ వీడియోతో అధికారికంగా ధ్రువీకరించారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా ‘హౌస్ఫుల్ 5’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘హౌస్ఫుల్ 5’ కూడా సిద్ధమైంది. ‘హౌస్ఫుల్ 5’ సినిమా రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో రాబోతోంది. మరి... మీరు ‘హౌస్ఫుల్ 5ఏ’ చూస్తారా? లేక ‘హౌస్ఫుల్ 5బీ’ చూస్తారా? లేదా రెండూ చూస్తారా?’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు అక్షయ్ అండ్ రితేష్. ఇదిలా ఉంటే... ‘హౌస్ఫుల్ 5’ సినిమా కథాంశం ఓ కిల్లర్ను కనుక్కునే నేపథ్యంలో సాగుతుంది. దీంతో ‘హౌస్ఫుల్ 5ఏ’లో కిల్లర్ ఒకరైతే, ‘హౌస్ఫుల్ 5బీ’లో కిల్లర్ మరొకరు ఉంటారట. తొలి ఇండియన్ సినిమా! కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచి ఆకట్టుకున్నా క్లైమాక్స్లో మాత్రం ఆడియన్స్ను నిరాశపరుస్తాయి. కానీ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారికి ఈ సమస్య ఉండకపోవచ్చు. ‘హౌస్ఫుల్ 5ఏ’ సినిమా చూసిన ఆడియన్స్ ‘హౌస్ఫుల్ 5బీ’ సినిమా క్లైమాక్స్ కోసం మళ్లీ ఆ సినిమాను చూసేందుకు థియేటర్స్కు వెళ్లొచ్చు. అలాగే ‘5బీ’ చూసినవాళ్లు ‘5ఏ’ క్లైమాక్స్ ఇంకా బాగుందని వింటే... ఆ వెర్షన్ చూడ్డానికి వెళ్లే అవకాశం ఉంది. ఇలా ప్రేక్షకుల్లో ‘హౌస్ఫుల్ 5’ సినిమా గురించి ఓ రకమైన చర్చ మొదలవుతుంది. ఈ చర్చ సినిమాకు మౌత్టాక్గా మారి, ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. ఇదే జరిగితే థియేటర్స్కు వచ్చే ఆడియన్స్ సంఖ్య మెల్లిగా పెరుగుతుంది. వసూళ్లకు ఇదో కొత్త మార్గం అవుతుంది. రిపీట్ ఆడియన్స్తో థియేటర్లు హౌస్ఫుల్ అయితే... హౌస్ఫుల్ టీమ్ వ్యూహం సక్సెస్ అయినట్లే లెక్క. మరి... ఈ ‘హౌస్ఫుల్ 5’ టీమ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే... రెండు డిఫరెంట్ క్లైమాక్స్లతో ఒకేసారి విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ‘హౌస్ఫుల్ 5’ అంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి.

చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్
ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేమంటారు. అలాంటిది దిగ్గజ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) వరుసగా నోరు జారుతూనే ఉన్నాడు. ఆ మధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్ను, ఇటీవల కమెడియన్ అలీని తిట్టాడు. సీనియర్ నటుడు మురళీ మోహన్పైనా నోరు పారేసుకున్నాడు.నాకు ప్రేమలే తెలుసుపదేపదే మాట తూలుతూ రాజేంద్రప్రసాద్ తన పరువు తనే గంగలో కలిపేసుకుంటున్నాడని అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై రాజేంద్రప్రసాద్ స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్గా ఎలా ఉంటాను?నా చివరి శ్వాస వరకు..కానీ నాపై వచ్చిన విమర్శలు చూసి ఈ సారి చాలా హర్టయ్యాను. జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నాను. నందమూరి తారకరామారావు పిల్లలనుంచి పెద్దలవరకు అందరినీ మీరు అనే సంభోదించేవారు. నేను కూడా ఇకపై అలాగే మాట్లాడతాను. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను. జీవితంలో ఇంకెప్పుడూ ఏకవచనంతో మాట్లాడను. కెమెరాలు చూసుకోలేదు..ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను. కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే.. వాళ్లందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాతరోజుల్లోలాగా ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదు. లిమిట్స్లో ఉండటం బెటర్ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవర్నీ నువ్వు అనను, మీరు అనే అంటాను అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్

'బిగ్బాస్' శోభాశెట్టి షాకింగ్ నిర్ణయం.. అదే కారణమా?
సీరియల్ నటి శోభాశెట్టి విరామం ప్రకటించింది. 'కార్తీకదీపం' సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వచ్చింది. కానీ ఆ సీజన్ టైంలో చాలా నెగిటివిటీ మూటగట్టుకుంది. దీని నుంచి బయటకొచ్చిన తర్వాత గతేడాది కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొంది. కానీ అనారోగ్య కారణాలతో మధ్యలోనే బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి సైలెంట్గానే ఉన్న ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?)కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు శోభాశెట్టి తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో శోభాకు ఏమైందా? అని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాబోయే భర్తతో ఏమైనా వాగ్వాదం జరిగిందా? లేదా మరేదైనా కారణమా అని మాట్లాడుకుంటున్నారు.బిగ్బాస్ షోలో పాల్గొన్న టైంలోనే తన ప్రియుడిని పరిచయం చేసింది. తనతో పాటు సీరియల్లో నటించిన యశ్వంత్ రెడ్డిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అందుకు తగ్గట్లే షో నుంచి బయటకొచ్చిన కొన్నాళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకుంది. తర్వాత మరికొన్నాళ్లకు కొత్తింట్లోనూ అడుగుపెట్టింది. ఈ రెండు జరిగి చాలా రోజులు అయిపోయాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించిందని అనుకుంటున్నారు. మరి శోభాశెట్టి చెబితే తప్పితే ఈ విషయంపై క్లారిటీ రాదేమో?(ఇదీ చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్) View this post on Instagram A post shared by Shobha Shetty (@shobhashettyofficial)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్ క్లీన్స్వీప్
లండన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరిదైన మూడో వన్డేలో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 40 ఓవర్లలో 9 వికెట్లకు 251 పరుగులు చేసింది. షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (71 బంతుల్లో 70; 9 ఫోర్లు, 2 సిక్స్లు), గుడకేశ్ మోతీ (54 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్స్లు), అల్జారీ జోసెఫ్ (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించడంతో విండీస్ గౌరవప్రద స్కోరును సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీయగా... సాఖిబ్ మెహమూద్, బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 246 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ ధనాధన్ ఆటతీరుతో కేవలం 29.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు జేమీ స్మిత్ (28 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్లు), బెన్ డకెట్ (46 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు అవుటయ్యాక జో రూట్ (49 బంతుల్లో 44; 1 ఫోర్), హ్యారీ బ్రూక్ (36 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), జోస్ బట్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. జేమీ స్మిత్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా... జో రూట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టి20 సిరీస్ శుక్రవారం మొదలవుతుంది.

శ్రేయస్ అయ్యర్... సారథిగా సూపర్
ధోనీ మాదిరిగా వ్యూహరచనలో మేటి... కోహ్లి తరహాలో దూకుడులో ఘనాపాటి... రోహిత్ను అనుకరిస్తున్నట్లు అనిపించినా... అతడికి అతడే సాటి! ‘అతడి చేయి పడితే రాయి కూడా రత్నంలా మెరుస్తుంది’... అన్న రీతిలో దశాబ్ద కాలానికి పైగా ‘ప్లే ఆఫ్స్’ మొఖం చూడని జట్టును తుదిపోరుకు చేర్చిన ఘనుడతడు! ఐపీఎల్ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని విధంగా మూడు వేర్వేరు జట్లను తుదిపోరుకు తీసుకెళ్లిన మొనగాడతడు! అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపించడంలో నేర్పరి అతడు! మనం ఇంతసేపు చెప్పుకున్నది... ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా తన నాయకత్వ చతురతతో అందరి మనసులు గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ గురించే!! ధోనీ, రోహిత్ కూడా కెప్టెన్లుగా మూడు కంటే ఎక్కువ ఐపీఎల్ ఫైనల్స్ ఆడినా... ఆ ఇద్దరూ ఒకే జట్టును నడిపించారు. కానీ గత ఐదేళ్లలో అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంఛైజీలకు తుదిపోరు మజా చూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక ఫైనల్ శ్రేయస్ సారథ్యంలోనే కాగా... పదేళ్ల విరామం అనంతరం గతేడాది కోల్కతా నైట్రైడర్స్కు ముచ్చటగా మూడో కప్పు అందించింది కూడా అయ్యరే. పంజాబ్కు ట్రోఫీ కట్టబెట్టలేకపోయినా... సారథిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘బాధ్యత సగం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది తప్పక కప్పు గెలుస్తాం’ అని ఫైనల్ అనంతరం ధీమా వ్యక్తం చేసిన అయ్యర్... భారత జట్టు భవిష్యత్తు నాయకత్వంపై భరోసా పెంచుతున్నాడు!!సాక్షి, క్రీడావిభాగం : 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసి... కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడోసారి కప్పు కైవసం చేసుకుంది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకున్నా... ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్గా ఉండటంతో క్రెడిట్ అంతా అతడికే దక్కింది. తదనంతర పరిణామాల్లో గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా ఎదగగా... సమర్థ నాయకుడిని కేకేఆర్ వేలానికి వదిలేసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా జట్టు... ఈసారి లీగ్ దశ దాటలేకపోవడమే గాక... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంటే... వేలంలో భారీ ధర పెట్టి శ్రేయస్ను దక్కించుకున్న పంజాబ్ రెండోసారి రన్నరప్గా నిలిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు శ్రేయస్ సారథ్య సామర్థ్యాన్ని వివరించేందుకు.దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిర్లక్ష్యం వహించినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం... అపార ప్రతిభ ఉన్నా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక కాకపోవడం ఇవన్నీ పక్కన పెడితే... అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడని తాజా ఐపీఎల్ నిరూపించిందింది. ఆటగాడిగా అదుర్స్... ఈ సీజన్లో 17 మ్యాచ్లాడిన శ్రేయస్ 50.33 సగటుతో 604 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి 175.07 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టాడు. అతడి గణాంకాలను అంకెల్లో కొలవడం కష్టమే! సీజన్ ఆరంభంలో గుజరాత్తో జరిగిన పోరులో సెంచరీకి సమీపించినా... జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే అయ్యర్ తీరు అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది. అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి సమీపించాడు. చివరి ఓవర్లో స్ట్రయికింగ్లో ఉన్న శశాంక్ సింగ్ దగ్గరకు వెళ్లి ‘నా శతకం గురించి ఆలోచించకు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయి’ అని దిశానిర్దేశం చేశాడు. ఆ ఓవర్ మొత్తం ఆడిన శశాంక్ 23 పరుగులు రాబట్టగా... అయ్యర్ అజేయంగా నిలిచాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడతాడనే గుర్తింపును మరింత పెంచుకుంటూ... ఈసారి మిడిల్ ఓవర్స్లో భారీ షాట్లతో విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. అందుకే సీజన్ మొత్తంలో 43 ఫోర్లే కొట్టిన అయ్యర్... 39 సిక్స్లతో అత్యధిక సిక్స్లు కొట్టిన వారి జాబితాలో నికోలస్ పూరన్ (40) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ముంబైపై అసమాన పోరాటం ఇక క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్పై శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా యార్కర్లను ఎదుర్కొనేందుకు మహామహులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు దాన్ని షార్ట్థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన తీరు చూసి తీరాల్సిందే. ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటం కనబర్చిన ఈ ముంబైకర్... జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.‘అయ్యర్ అవుట్ అయినప్పుడే... పంజాబ్ పరాజయం ఖాయమైంది’ బెంగళూరుతో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట ఇదే. అంతలా అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్న శ్రేయస్... చేతి వరకు వచ్చిన కప్పు చేజారుతున్నా కాస్త కూడా చలించలేదు. చిరకాల కల నెరవేరడంతో ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే... సుదీర్ఘ కాలం ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించినా.. జట్టును విజేతగా నిలపలేకపోయిన ఏబీ డివిలియన్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ప్లేయర్లు సంబరాల్లో భాగమైపోయారు. ఇక ఆర్సీబీ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు! తన చుట్టూ ఇంత జరుగుతున్నా కనీసం ముఖ కవలికల్లో సైతం మార్పు కనబడని అయ్యర్ నింపాదిగా వచ్చే ఏడాది చూసుకుందాం అన్నట్లు ముందుకు సాగిపోయాడు. భవిష్యత్తు వన్డే కెప్టెన్! మైదానం బయట నుంచి పాంటింగ్ జట్టును తీర్చిదిద్దితే... ఆ వ్యూహాలను గ్రౌండ్లో ఆచరణలో పెట్టడంలో అయ్యర్ విజయవంతమయ్యాడు. బౌన్సీ పిచ్పై కైల్ జెమీసన్తో బ్యాక్ ఆఫ్ ది లెంత్ బంతులు వేయించడం... ముంబైతో మ్యాచ్లో వైడ్ యార్కర్లు వేసే విధంగా విజయ్ కుమార్ వైశాఖ్కు దిశానిర్దేశం చేయడం... అవసరమైనప్పుడు ‘నకల్ బాల్స్’ వేసే విధంగా ప్రోత్సహించడం ఇలా... ఒకటా రెండా సీజన్ ఆసాంతం శ్రేయస్ కెప్టెన్సీలో తనదైన పదును చూపాడు. క్వాలిఫయర్–2లో శశాంక్ సింగ్ నిర్లక్ష్యంతో రనౌట్ అయన సందర్భంలో సారథిగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యర్... ప్రియాన్‡్ష, ప్రభ్సిమ్రన్ వంటి యువ ఆటగాళ్లను పెద్దన్నలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయగా... అందులో అయ్యర్ పేరు లేకపోవడం చూసి పంజాబ్ కోచ్ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోని శ్రేయస్... గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు... ఫలితం గురించి ఆలోచించకు’ అన్న రీతిలో ఐపీఎల్పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం టెస్టు, టి20 జట్లలో రెగ్యులర్ ఆటగాడు కాని 30 ఏళ్ల అయ్యర్... వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నాయకత్వ రేసులో ముందు నిలవడం ఖాయమే!

‘ఈ విజయం మీ అందరిది’
సాక్షి, బెంగళూరు: తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ హోం గ్రౌండ్లో వేడుకలు జరుపుకుంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జట్టు సభ్యులంతా పాల్గొని అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఈ సాల కప్ నమ్దు’ అంటూ విరాట్ కోహ్లి తనదైన శైలిలో ఫ్యాన్స్లో జోష్ నింపాడు. ‘ఈ విజయం మీ అందరిదీ. అభిమానులు, ఈ నగరానికి చెందినవారు, కష్టాల్లోనూ జట్టుకు మద్దతునిచ్చిన వారందరికీ గెలుపులో భాగం ఉంది. ప్రపంచంలో ఏ ఫ్రాంచైజీ జట్టుకు కూడా ఇంతటి వీరాభిమానులు ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. సీజన్ ఆరంభం నుంచి జట్టులోని ఆటగాళ్లంరికీ తగిన బాధ్యతలు అప్పగించామని, ఇప్పుడు వారందరి ప్రదర్శనతోనే టైటిల్ విజయం ఖాయమైందని కెప్టెన్ రజత్ పాటీదార్ చెప్పాడు. అంతకుముందు ఆర్సీబీ టీమ్ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరిగింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాంప్రదాయ రీతిలో వారిని సత్కరించారు. ఆర్సీబీ టీమ్ తమ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని, 18 ఏళ్లు టైటిల్ కోసం పోరాడటం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. విజయాన్ని అలవాటుగా మార్చుకోవాలి... ఒక్క టైటిల్ విజయంతో ఆర్సీబీ జట్టు ఆగిపోరాదని, వచ్చే ఏడాది కూడా ఇదే జోరును కొనసాగించి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమ్ డైరెక్టర్ మొ బొబాట్ అన్నారు. ఫైనల్లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు చేసుకుంటూ ఆయన టీమ్ సభ్యుల్లో మరింత స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు.‘ఈ అద్భుత విజయంలో అందరూ తమవంతు పాత్ర పోషించారు. దీని విలువ ఏమిటో రాబోయే రోజుల్లో ఇంకా మీకు అర్థమవుతుంది. గతంలో ఒక జట్టు వరుసగా రెండుసార్లు టైటిల్ గెలవడం రెండుసార్లు మాత్రమే జరిగింది. వచ్చే ఏడాది ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది. అప్పుడు అక్కడా మనం ఉండాలంటే విజయాలను అలవాటుగా మార్చుకోవాలి. ఈ టైటిల్ మీలో గెలుపు ఆకలిని ఇంకా పెంచాలి’ అని బొబాట్ వ్యాఖ్యానించారు.‘బౌలింగ్ వల్లే గెలిచాం’ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ తొలిసారి గెలవడంలో బౌలర్లే ప్రధాన పాత్ర పోషించారని జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నారు. వేలంలో కూడా మంచి బౌలర్లను సొంతం చేసుకోవడంపైనే దృష్టి పెట్టామని... గెలుపు దిశగా అక్కడే తమ తొలి అడుగు పడిందని ఫ్లవర్ వ్యాఖ్యానించారు. ‘పేరున్న బ్యాటర్లపై భారీ మొత్తాలు వెచ్చించడంకంటే గుర్తింపు ఉన్న బౌలర్లను ఎంచుకోవడం ముఖ్యమని భావించాం. తొలిరోజు వేలం ముగిశాక మాపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే రెండో రోజు వేలంలో భువనేశ్వర్, కృనాల్, సుయాశ్ శర్మలను తీసుకున్నాం. వీరు ఎలాంటి ప్రభావం చూపించారో ఇప్పుడు కనిపిస్తోంది’ అని ఫ్లవర్ విశ్లేషించారు.

భళా బొయిసన్...
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ 361వ ర్యాంకర్, ఫ్రాన్స్ ప్లేయర్ లూయి బొయిసన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ బొయిసన్ 7–6 (8/6), 6–3తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మిరా ఆంద్రీవా (రష్యా)ను బోల్తా కొట్టించింది. తద్వారా 1989 తర్వాత కెరీర్లో ఆడుతున్న తొలి గ్రాండ్స్లామ్ టోర్నీలోనే సెమీఫైనల్కు చేరుకున్న ప్లేయర్గా బొయిసన్ గుర్తింపు పొందింది. చివరిసారి 1989లో మోనికా సెలెస్ (యుగోస్లావియా), జెన్నిఫర్ కాప్రియాటి (అమెరికా) ఫ్రెంచ్ ఓపెన్లోనే ఈ ఘనత సాధించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)ను ఓడించిన బొయిసన్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో 22 ఏళ్ల బొయిసన్ మూడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా)తో బొయిసన్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ కోకో గాఫ్ 6–7 (6/8), 6–4, 6–1తో ఏడో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. సెమీస్లో అల్కరాజ్, సినెర్ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–1, 7–5, 6–0తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, అల్కరాజ్ 6–0, 6–1, 6–4తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై విజయం సాధించారు. సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ ముసెట్టి (ఇటలీ)తో అల్కరాజ్ ఆడతాడు. జొకోవిచ్ (సెర్బియా), జ్వెరెవ్ (జర్మనీ) మధ్య చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో రెండో సెమీఫైనల్లో సినెర్ తలపడతాడు.
బిజినెస్

‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ టూల్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్(గతంలో ట్విటర్) కొత్తగా ‘ఎక్స్ చాట్’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్మస్క్ తెలిపారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్లో ఈమేరకు ఎక్స్ చాట్ వివరాలు ప్రకటించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలుప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ ఫేస్ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్గా ఎక్స్ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

దేశంలోని తొలితరం సంపన్న మహిళలు
దేశంలో తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద పెరుగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘2025 కాండేర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్’ లిస్ట్ ప్రకారం పది మంది తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరింది. ప్రధానంగా సాఫ్ట్వేర్, హెల్త్కేర్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మొదటి నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారాలను నిర్మించిన మహిళలు ఈ జాబితాలో చోటు సంపాదించారు.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..లిస్ట్లో జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు రూ.55,300 కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో అమెరికాకు చెందిన అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ.48,900 కోట్ల సంపదతో ఉన్నారు. టాప్ 10 మహిళల్లో ఏడుగురు భారత్లో ఉండగా, మిగిలిన ముగ్గురు అమెరికాలో నివసిస్తున్నారు. మొత్తం సంపదలో రూ.1.11 లక్షల కోట్లతో సాఫ్ట్వేర్, సేవల రంగం ఆధిపత్యం సాగిస్తోంది. హెల్త్ కేర్, రిటైల్, ఫైనాన్స్, టెక్స్ టైల్స్, మీడియా తదితర రంగాలకు చెందినవారున్నారు.పేరు సందప(రూ. కోట్లల్లో)వయసుకంపెనీరాధా వెంబు55,30052జోహో కార్పొరేషన్జయశ్రీ ఉల్లాల్48,90063అరిస్టా నెట్ కిరణ్ మజుందార్ షా32,00071బయోకాన్ఫాల్గుణి నాయర్29,00061నైకానేహా నర్ఖేడే6,80041సంగమంకవితా సుబ్రమణియన్6,50043అప్స్టాక్స్నేహా బన్సాల్5,10043లెన్స్కార్ట్ఇంద్ర కె నూయి4,80069పెప్సికో జూహీ చావ్లా4,60057నైట్ రైడర్స్ మీనా సేథీ2,70080ఓరియంట్ ఫ్యాషన్

ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,900 (22 క్యారెట్స్), రూ.99,170 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.100, రూ.110 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,170 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.91,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.260 పెరిగి రూ.99,320 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,900 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఎఫ్డీ రేట్లు సవరించిన బ్యాంకులు
కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జూన్ 1, 2025 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై సమకూరే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై తమ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను సవరించాయి. ఈ రెండు బ్యాంకులు నిర్దిష్ట కాలపరిమితిపై రేట్లను తగ్గించగా, ఎంపిక చేసిన దీర్ఘకాలిక డిపాజిట్లపై పీఎన్బీ రేట్లను పెంచింది.కెనరా బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుకెనరా బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 4% నుంచి 7% మధ్య, సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 7.50% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తుంది. వీటిలో జూన్ 1, 2025 నుంచి కొన్ని సవరణలు చేసింది. కెనరా బ్యాంక్ ఏడాది కాలపరిమితికి ఎఫ్డీ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో ఇది 6.85% నుంచి 6.75%కి తగ్గింది. మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీ కాలపరిమితికి వడ్డీ రేటును 7% నుంచి 6.75% కు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.పీఎన్బీ ఇలా..పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.3 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు జూన్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి 3.50% నుంచి 6.90% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 7 శాతం వడ్డీని ఆఫర్ చేసేవారు.ఇదీ చదవండి: విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపుఏడాది నుంచి 390 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 390 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.90 శాతానికి సవరించారు. 391 రోజుల నుంచి 505 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి, 506 రోజుల కాలపరిమితిపై 6.70 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గించారు. 507 రోజుల నుంచి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించారు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది.వడ్డీరేట్లు పెంపు వీరికే..సీనియర్ సిటిజన్లకు పీఎన్బీ బ్యాంక్ ఇప్పటివరకు 4% నుంచి 7.40% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సవరించిన తర్వాత 4.30% నుంచి 7.70% వరకు వడ్డీ ఇస్తుంది.
ఫ్యామిలీ

లాస్ట్ మీల్ ఎన్నింటికి తింటున్నారు..? నటి కరీనా కపూర్ ఏకంగా..
సాయంత్రం కాస్త ఎర్లీగా భోజనం తినేయమని చెబుతుంటారు నిపుణులు. అదే ఆరోగ్యకరమని పదే పదే నొక్కి చెబుతుంటారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం అదే మాట అన్నారు. తాను కూడా అలానే తింటానని చెప్పారు కూడా. పైగాఅదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పారామె. ఆరోగ్యప్రదాత సూర్యుడి గమనం ఆధారంగానే మన జీవక్రియ పనిచేస్తుందని..దానికనుగుణంగా తింటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు కూడా. సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్న ఈ హెల్దీ ట్రిక్ గురించి సవివరంగా చూద్దామా..!.నాలుగు పదుల వయసులో ఉన్న కరీనా కపూర్ సైతం సౌందర్యపరంగానే కాకుండా ఫిట్నెస్ పరంగా చాలా మంచి జీవశైలికి పేరుగాంచిన నటి. ఈ ఏజ్లో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా కట్టిపడేసే గ్లామర్ కరీనా సొంతం. ఆమె చాలా క్రమశిక్షణాయతమైన జీవనశైలిని ఫాలో అవుతానని పలు ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారామె. పోషకాహారంతో కూడిన డైట్, బాడీకి తగిన వర్కౌట్లు, త్వరిత గతిన నిద్రకు ఉపక్రమించడం వంటి మంచి అలవాట్లనే అనుసరిస్తారామె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చివరి మీల్ కచ్చితంగా సాయంత్రం 6.30 కల్లా పూర్తి అయిపోయేలా చూసుకుంటానన్నారామె. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంత త్వరగానే అని అనుకున్నారు కూడా. కానీ కరీనా మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇది తప్పనిసరని చెబుతోంది.అలానే మంచిదా అంటే.. సూర్యదోయం వేళ మన శరీరం చాలా చురుకుగా ఉంటుందట. ఆ సమయంలోనే మన జీవక్రియలు యాక్టివ్గా ఉంటాయట. అంటే పగలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా..సులభంగా అరిగిపోతుందట. పైగా మనం మేల్కోనే ఉంటాం కాబట్టి సులభంగా ఆ ఎనర్జీ అంతా బర్న్ అయిపోతుందట. ఇక సూర్యాస్తమయ వేళ్లకు మన శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాబట్టి ఆ టైంలో జీర్ణమవ్వడానికి అధిక సమయం తీసుకునే ఫుడ్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైగా అది కూడా సూర్యస్తమయంలోపే ఫినిష్ చేస్తే మంచిదట. దానివల్ల మనం పడుకునే సమయానికి అరిగిపోయి..త్వరితగతిన మేల్కొనడానికి ఉపకరిస్తుంది. మన శరీరధర్మానికి అత్యంత అనువైన జీవన విధానం ఇదేనని నిపుణులు నొక్కి చెబుతున్నారు. మన పూర్వీకులు దీన్ని బాగా అనుసరించేవారని చెబుతున్నారు. ఇలా సాయంత్రం 6.30 కల్లా భోజనం తినేస్తామో..అప్పుడు మనం దాదాపు 12 నుంచి 14 గంటలు అడదడపా ఉపవాసం ఉన్నట్లువతుంది. పైగా ఉదయమే చక్కటి లెమన్ విత్ హనీ వాటర్తో రోజుని మొదలుపెట్టి, నచ్చిన ప్రూట్ సలాడ్ వంటి పోషకాహారాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మంచిదట. ఈ విధానంలో మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ దూరంగా ఉండటం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలు..జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందికడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉండదుఇలా ముందుగా తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది కూడాదీనివల్ల విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయిబరువు అదుపులో ఉంటుందినిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందటరోజంతా చురుగ్గా ఉంటారట మరీ అంత తొందరగా తినలేకపోయినా..కనీసం సాయంత్రం 7.30 గంటల లోపు భోజనం ఫినిష్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి..సత్ఫలితాలను పొందండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ)

జస్ట్ 10 నిమిషాలు అదొక్కటి చాలు! నాసా స్టడీ
అందరూ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి అనుకుంటారు. కానీ మధ్యలోనే వదిలేసేవాళ్లు కొందరైతే, మరికొంతమంది మన వల్ల కాదు అని చేతులేత్తుస్తుంటారు. అస్సలు హెల్దీగా ఉండాలంటే..అది చాలా తేలిగ్గా తెలివిగా చేసే పని అంటోంది నాసా. అందరూ బిజీ షెడ్యూల్తో శారీర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. పైగా వర్కౌట్లు కొన్ని రోజుల తర్వాత విపరీతమైన వొళ్లు నొప్పులుగా అనిపించి స్కిప్ చేసేస్తుంటారు. దాంతో చాలామంది కంటిన్యూ లేదా దైనందిన జీవితంలో ఆ వ్యాయామాలను భాగం చేసుకోలేక విఫలమవుతుంటారు. అలాంటివాళ్లు ఒక్క పదినిమిషాలు ఈ వ్యాయమానికి కేటాయించండి చాలు అని చెబుతోంది నాసా పరిశోధన. ఇది ఎంత ప్రభావవంతమైన ప్రయోజనాలందిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారని అంటోంది. పైగా మధ్యలో వదిలేయరు, అది మీ జీవితంలో ఓ భాగమైపోతుందని నమ్మకంగా చెబుతోంది. మరీ ఆ వ్యాయామం ఏంటంటే..ఎక్కువ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారికి ఈ వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది నాసా. ఇది ఒక చిన్న ట్రాంపోలిన్పై చేసే జంపింగ్ లాంటి వ్యాయామం. పిల్లలు అమిత ఇష్టంగా చేసే జంపింగ్ క్రీడ. ఇది గనుక చేస్తుంటే తెలియకుండానే ఒక విధమైన ఆనందం..పైగా అమితోత్సాహంతో మరింతగా చేస్తారట కూడా. ఇది తెలియకుండానే బాడీలోని కేలరీలను తగ్గిస్తుందట. ఇందుకోసం కావాల్సిందల్లా..మినీ-ట్రాంపోలిన్ ఉంటే చాలు. దీంతో జంపింగ్ జాక్లు చేస్తుంటే..బరువు అదుపులో ఉండటమేగాక..బాడీ కూడా ఫిట్గా ఉంటుందని చెబుతున్నారు. పోనీ ఈ జంపింగ్ కుదరకపోతే..ఓ 30 నిమిషాలు మీకు నచ్చిన మ్యూజిక్తో నచ్చినట్లుగా గంతులు వేయండి. ఓ పద్ధతి అవసరం లేదు బాడీ అంతా ఊగేలా ఎంజాయ చేస్తూ నచ్చినట్లుగా డ్యాన్స్ చేయండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి చాలు అని చెబుతోంది నాసా. ఇది పరుగు, జాగింగ్ కంటే కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుందట. కచ్చితంగా మెరుగైన ఫలితాలు పొందగలరని చెబుతోంది నాసా పరిశోధన. ఇది శరీరంపై అధిక ఒత్తడిని కలిగించదు. అదీగాక ఎవ్వరైనా హాయిగా సులభంగా చేయగలిగేవే ఈ వ్యాయమాలని పేర్కొంది నాసా. ఆరోగ్య లాభాలు..సరదాగా ఉండే ఈ వ్యాయమాం కిల్లర్ ఫుల్ బాడీ వ్యాయామంకీళ్లపై సున్నితంగా ఉంటుంది. అయితే మోకాళ్లు, చీలమండలంపై కఠినంగా ఉంటుంది. శోషరస వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. పైగా ఇది మంచి కార్డియో వర్కౌట్ల పనిచేస్తుంది. ఆరోగ్యానికి బెస్ట్ వ్యాయామం కూడా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్టాపిక్గా హర్ష్గోయెంకా ప్రసంగం)

మరోసారి హాట్టాపిక్గా పని జీవిత సమతుల్యత..! వైరల్గా హర్ష్గోయెంకా ప్రసంగం
పని జీవిత సమతుల్యత అనే టాపిక్ మాత్రం ప్రతిసారి రసవత్తరమైన అంశంగా మారిపోతోంది. దీనిపై ఒక్కొక్కరిలో ఒక్కో అభిప్రాయం ఉంది. ఇది వారి వారి హోదాల రీత్యా సరైనది కావొచ్చు. అందరికీ వర్తించాలంటే మాత్రం కష్టమే. ఉద్యోగి శరీర తత్వం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు తదితరాల దృష్ట్యా మారుతూ ఉంటుందనేది నిపుణుల వాదన. అంగీకరించక తప్పని వాస్తవం కూడా. బహుశా ఈ విషయాన్నే సూటిగా చెప్పే ఉద్దేశ్యంతో మరోసారి వివరణ ఇచ్చినట్లుగా ఉంది నెట్టింట వైరల్ అవుతున్న హర్ష్ గోయెంకా ప్రసంగం. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎప్పటికప్పుడూ నెటిజన్లతో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి తన ఉద్యోగుల నుద్దేశించి ప్రసంగించిన వీడియోని షేర్ చేసుకుని..నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఆ వీడియోలో హర్ష్ గోయెంకా..తాను ఆదివారాల్లో పనిచేయడం గురించి, జీవిత భాగస్వాములను చూస్తుండటం గురించి మాట్లాడటం లేదు. అందువల్ల కాసేపు శ్రద్ధతో నా మాటలు ఆలకించండి అన్నారు. అంతే ఆ సభా ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. ఉద్యోగులంతా ఆయన ప్రసంగానికి కడుపుబ్బా నవ్వుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోలో. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి మీ సంస్థలో ప్రతి ఉద్యోగి పనిలో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఐతే ఇంతకమునుపు ఇదే హాలులో ఎల్ అండ్ టి అనే కంపెనీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడిన మాటలతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. నిజానికి సుబ్రహ్మణ్యన్ మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగుల పోటీతత్వం గురించి చెబుతూ ఆయన..వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. అయినా ఎంత సేపు భార్యను చూస్తుంటారు, ఆదివారం కూడా ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్నారు. ఎందుకంటే తాను కూడా ఆదివారాల్లో పనిచేస్తానని చెప్పారు. పైగా అలా చేయడం వల్ల తాను మరింత సంతోషంగా ఉన్నానని సుబ్రహ్మణ్యన్ అన్నారు. అంతే ఒక్కసారి పనిజీవిత సమతుల్యతకు ఆస్కారం ఏముందని న్యూట్రిషన్లు, ప్రముఖులు భగ్గుమన్నారు. ఇది సరైనది కాదంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పైగా ఈ అంశం హాట్టాపిక్గా మారి చర్చలకు దారితీసింది. ఇక మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ..తాను పని నాణ్యతను నమ్ముతానని, ఎని గంటలు చేశామన్నది లెక్కలోకి తీసుకోనని చెప్పారు. అలాగే పనినాణ్యతపై దృష్టి పెట్టాలే గానీ, పరిమాణంపై కాదని తేల్చి చెప్పారు. ఆఖరికి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ సైతం పని గంటలు కాదు, నాణ్యతే ముఖ్యం అని చెప్పారు. ఇక వ్యాపరవేత్త హర్ష్ గోయెంకా కూడా గతంలో వారానికి 90 గంటల పనా? అని ఖండించారు. సండే అనేది సూర్యుడి డ్యూటీగా భావించి డే ఆఫ్గా ఎందుకు భావించకూదని అన్నారు. అయినా జీవితాన్ని శాశ్వతమైన ఆఫీస్ పనిగా మార్చేస్తే విజయం మాట దేవుడెరగు..అనర్థాలే తెచ్చిపెడుతుందన్నారు. ఆయన కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఆప్షన్ కాదు, అది మన అవసరం అని నొక్కి చెప్పారు. వర్క్ని చాలా తెలివిగా స్మార్ట్గా చేసేందుకు ప్రాముఖ్యత ఇస్తానన్నారాయన. సో పనిజీవిత సముతుల్యత అన్నది ఎంత ముఖ్యమో అర్థమైంది కదా..కాబట్టి బిజీకి ఛాన్స్ ఇవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుందామా మరీ..!.Concluding part of my annual RPG townhall address to all my colleagues 😀 pic.twitter.com/sIbC34dqU2— Harsh Goenka (@hvgoenka) June 3, 2025 (చదవండి: నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!)

Obesity పోషకలోపం.. ఊబకాయం!
డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్తో బాధపడుతున్న తెలంగాణ యువతపురుషులతో పోలిస్తే మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం అధిక బరువుతో ఇబ్బందిపడుతున్న 18.8% మంది అతివలు ధనవంతుల ఇళ్లలో స్థూలకాయం... పేదల్లో పోషకాహార లోపం చదువుకోని/చదువుకున్న తల్లులు ఉన్న ఇళ్లలోనూ స్పష్టమైన తేడా యంగ్ లైవ్స్ సర్వే–2023లో కలవరపెట్టే గణాంకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 22 ఏళ్ల యువతలో ఒకవైపు స్థూలకాయం పెరుగుతుండగా మరోవైపు పోషకాహార లోపం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్’గా పేర్కొంటున్నారు. తెలంగాణ యువత ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్లు ‘యంగ్ లైవ్స్’రౌండ్–7 సర్వే (2023–24) ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల యువతలో 19 శాతం మంది అధిక బరువు/ఒబేసిటీతో ఉండగా 29 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2016తో పోలిస్తే స్థూలకాయం రెండింతలైంది. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా (18.8%) కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 14 శాతంగా ఉంది. మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రమాదాలకు దీన్ని కేంద్రంగా నిపుణులు గుర్తించారు. ఇప్పటికే 22.7% మహిళలు హై కార్డియోవ్యాసు్కలర్ రిస్్కలో ఉన్నారని హెచ్చరిస్తున్నారు. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో 29 శాతంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. అందులో గ్రామీణ యువతలో తక్కువ బరువు ఉన్నవారి శాతం 30.9% కాగా.. పట్టణాల్లో ఇది 23.8% శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, తల్లులు తక్కువ చదువుకున్న కుటుంబాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.మానసిక ఒత్తిడిలో యువత తెలంగాణలో వివిధ కారణాల వల్ల యువతలో 2023 నాటికి 71.3 శాతం మోస్తరు స్థాయి ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో వెల్లడైంది. పెద్దల్లో ఇది 68 శాతంగా ఉంది. వారిలో పురుషులు 66.7 శాతంగా ఉంటే మహిళలు 75.9 శాతంగా ఉన్నారు. ఇక 22.6% మందిలో మితమైన ఆందోళన, 17.47% మందిలో మితమైన డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. మహిళలకంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్లు గణాంకాల ద్వారా తేలింది. పట్టణ యువతలో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్ తరువాత భావోద్రేకం లక్షణాలు 1.5 శాతం పెరిగినట్లు సర్వే తేల్చింది. కరోనా తర్వాత ఆరోగ్యంగా ఉండాలనే అభిలాష ప్రజల్లో పెరిగిందని.. గతంలో 23 శాతం మందే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోగా ఇప్పుడు వారి సంఖ్య 37 శాతానికి చేరినట్లు పేర్కొంది.అక్కడలా.. ఇక్కడిలా..’సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. సామాజికంగా దిగువస్థాయి వర్గాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండగా ఆరోగ్యంపై సరైన అవగాహన, వైద్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏటా ఎక్కువవుతోంది. అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంటుండగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అని తేలింది. 2016లో ధనవంతుల ఇంటి యువతలో స్థూలకాయం 30.6% ఉండగా.. పేదల్లో ఇది 14.0% మాత్రమే. అలాగే పేదల్లో తక్కువ బరువుతో 36.1 శాతం మంది ఉండగా ధనవంతుల్లో అది 21.5 శాతంగా ఉంది.
ఫొటోలు
అంతర్జాతీయం

పాకిస్తాన్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్
కరాచీ: పాకిస్తాన్లోని కరాచీలో మాలిర్ జైలు నుంచి 216 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో 80 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. కరాచీ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం రాత్రి మాలిర్ జైలు నుంచి ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించాడు. ముగ్గురు భద్రతా సిబ్బందితోపాట జైలు అధికారి ఒకరు గాయపడ్డారు. భూకంపం తర్వాత జైలు బ్యారక్ల నుంచి 600 మందికిపైగా ఖైదీలను బయటకు తీసుకురాగా, 216 మంది పరారయ్యారు. 80 మందిని మళ్లీ అదుపులోకి తీసుకోగలిగారు. పరారీలో ఉన్న మిగతా ఖైదీల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా 136 మందిని పట్టుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన మాలిర్ జైలులో మొత్తం 6,000 మంది ఖైదీలు ఉన్నారు.

అమెరికా.. భయం భయం
వాషింగ్టన్: సమఉజ్జీలుగా మాత్రమేకాదు అమెరికా, రష్యాలకు సువిశాల భూభాగం విషయంలోనూ సారూప్యత ఉంది. రష్యాపై ఉక్రెయిన్ ‘స్పైడర్ వెబ్’ డ్రోన్ల దాడి తర్వాత అమెరికాకు ఇదే తరహా ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇప్పుడు అమెరికా పౌరుల భయాందోళనలను పెంచేస్తున్నాయి. అమెరికా సొంత భూభాగంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాల పరిధిలోని అమెరికా నేవీ, వైమానిక స్థావరాలపై డ్రోన్ల మెరుపుదాడి తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘‘ తమకు ఇలాంటి ముప్పు లేదని అమెరికా రాజకీయ శ్రేణులు, సైనిక వర్గాలు చెప్పడానికి లేదు. రష్యా మాదిరే అమెరికా సైతం బుల్లి డ్రోన్ల దాడులను ముందే పసిగట్టడం చాలా కష్టం. వైమానిక స్థావరాల్లోని బాంబర్ విమా నాలు బాగా బలిసిన బాతుల్లా అక్కడే తిష్టవే స్తాయి. వీటిని సులభంగా డ్రోన్లతో నాశనంచేయొచ్చు’’ అని గతంలో యుద్ధక్షే త్రాల నుంచి ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేసిన మాజీ డిఫెన్స్ జర్నలిస్ట్ టైలర్ రోగోవే వ్యాఖ్యా నించారు. టైలర్ ప్రస్తుతం ‘ది వార్ జోన్’ అనే పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సైనిక, భద్రతా వ్యవహా లపైనే ఈ పత్రిక ప్రధానంగా కథనాలు వెలువర్చుతుంది. చైనాలో 400.. అమెరికాలో 22అమెరికాలో యుద్ధవిమానాలకు రక్షణ ఏర్పా ట్లు ఏపాటివో ‘అమెరికా కాంగ్రెషనల్’ నివేది కలే స్పష్టంచేస్తున్నాయి. యుద్ధ విమానాలు షెల్టర్ల కోసం చైనా ఏకంగా 400 వరకు అత్యంత పటిష్టమైన హ్యాంగర్వంటి నిర్మాణా లను పూర్తిచేసింది. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో ఇలాంటివి కేవలం 22 ఉన్నాయి. డ్రోన్లు లోపలిదాకా వచ్చి నేరుగా విమానంపైనా పడకుండా ఇలాంటి నిర్మాణా లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. తైవాన్ విషయంలో చైనాతో అమెరికా గగనతల యుద్ధానికి దిగితే చైనా డ్రోన్ల ఆధిపత్యం తప్పదని ఓ నివేదిక పేర్కొంది. వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయ నాల కేంద్రం(సీఎస్ ఐఎస్) 2023 నివేదిక ప్రకారం చైనా డ్రోన్లు/ క్షిపణులు అమెరికా విమానాలు గాల్లోకి లేచేలోపే పార్కింగ్ స్థలాల్లోనే నాశనంచేసి అక్కడే సమాధి చేస్తా యని ఆ నివేదిక సారాంశం. ‘‘ఇన్నాళ్లూ అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ)లుగా పిలుచుకునే వస్తువులు వాస్తవానికి శత్రు నిఘా డ్రోన్లు అయి ఉండొచ్చు. ఇన్నాళ్లూ వాటిని గుర్తు తెలియని ఎగిరే వస్తువులుగా పొరపడ్డారు. దశాబ్దాలుగా ఈ ఎగిరే వస్తువులు చాలా వరకు అమెరికా వ్యూహాత్మక ప్రదేశాలపైనే చక్కర్లు కొట్టడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది’’ అని టైలర్ రోగోవే అన్నారు.

పాక్లో మరో ఘోరం.. ఎవరీ సనా యూసఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఘోరం చోటు చేసుకుంది. సనా యూసఫ్(Sana Yousuf) అనే టీనేజర్ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఇస్లామాబాద్ సుంబల్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. సనాతో మాట్లాడుతూనే.. వెంట తెచ్చుకున్న రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు. నిందితుడిని ఉమర్ హయత్(Umar Hayath) అలియాస్ కాకాగా నిర్ధారించారు. సనాను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు ఉమర్ అంగీకరించాడు. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తెలుస్తోంది. నేరానికి పాల్పడిన ఉమర్ కూడా టిక్టాకరేనని పోలీసులు ధృవీకరించారు. అయితే.. నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సనా(17) మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి, సోషల్ యాక్టివిస్ట్ కూడా. తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. ఘటన సమయంలో ఆమె దగ్గరి బంధువు ఒకరు ఇంట్లో ఉన్నారు. ఈ కేసులో ఆ బంధువే ప్రత్యక్ష సాక్షి. కాగా, పాకిస్తాన్(Pakistan)లో ఈ మధ్యకాలంలో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్(Social Media Teenager) సనా కావడం గమనార్హం. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు. సనా కేసు అక్కడి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ కేసును పరువు హత్య, ప్రేమ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏకాంత వీడియోలు ఒక్కొటిగా బయటకు..

అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్పై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వంపై అపరకుబేరుడు, మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్)చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (elon musk) షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్ మస్క్కు డోజ్ నుంచి బయటకు వచ్చారు. అయితే, తొలిసారి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించారు. ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్రంగా మండిపడ్డారు బిగ్,బ్యూటిఫుల్’ (Big Beautiful Bill) అంటూ ట్రంప్ (donald trump) చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాళా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ భారీ, దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. మీరు తప్పు చేశారని మీకు తెలుసు’ అని పేర్కొన్నారు. I’m sorry, but I just can’t stand it anymore.This massive, outrageous, pork-filled Congressional spending bill is a disgusting abomination.Shame on those who voted for it: you know you did wrong. You know it.— Elon Musk (@elonmusk) June 3, 2025ట్రంప్ నిర్ణయం మారదుఅయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్కు తెలుసు. అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారు’ చెప్పారు.గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్ స్పందించారు. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్కు పెంచుతుంది. అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచిందిమస్క్ ఈ బిల్లుపై డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ)కు రాజీనామా అనంతరం సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతోంది. ఇది డోజ్ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండటం నాకు తెలియదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు.
జాతీయం

న్యాయ వ్యవస్థలో అవినీతి అరికట్టాలి!
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వంటివి ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. అంతిమంగా న్యాయ వ్యవస్థలో నిజాయతీ, సమగ్రతపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ సుప్రీంకోర్టులో ‘న్యాయ వ్యవస్థ సమగ్రత, ప్రజల విశ్వాసం కొనసాగింపు’ అనే అంశంపై తాజాగా జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని, ప్రభుత్వ పదవులు స్వీకరించడాన్ని తప్పుపట్టారు. ఇది నైతికతకు సంబంధించిన అంశమని, ప్రజల పరీక్షకు గురి కావాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో దక్కబోయే పదవులను దృష్టిలో పెట్టుకొని జడ్జీలు తీర్పు లు ఇస్తారని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై సందేహాలు తలెత్తుతా య న్నారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి పదవు లు స్వీకరించబోమంటూ తనతోపాటు మరికొందరు సహచరులు ప్రమాణం చేసినట్లు వెల్లడించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, విశ్వసనీయతను పరిరక్షించాలన్న ధ్యేయంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. అలాగే న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వెలుగులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ జోక్యం వద్దు...కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో రాజకీ య, ప్రభుత్వ జోక్యం ఉండరాదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థను ఆయన సమర్థించారు. ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం ఉండడం లేదన్న వాదనను ఖండించారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో న్యాయ మూర్తుల స్వతంత్రత అనేది అత్యంత కీలకమని స్పష్టంచేశారు. శాసన లేదా కార్యనిర్వాహక వ్యవ స్థల చట్టబద్ధత బ్యాలెట్ ద్వారా ఏర్పడుతుందని గుర్తుచేశారు. కానీ, జ్యుడీషియరీ చట్టబద్ధత రాజ్యాంగ విలువల పరిరక్షణతో అనుసంధానమై ఉంటుందన్నారు.

బీజేపీ ‘ఆపరేషన్ బిహార్’
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్న బిహార్పై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం వినూత్నంగా ‘దేశవ్యాప్త’ వ్యూహం రూ పొందించింది. ఉపాధి కోసం దేశవ్యాప్తంగా వలస వెళ్లి న 2.75 కోట్ల మంది బిహారీల ఓట్లను సాధించడమే లక్ష్యంగా పథకరచన చేసింది. ఇందులో భాగంగా పార్టీ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించి వా రందరినీ వ్యక్తిగతంగా కలుసుకోనున్నారు. బిహార్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కనీసం 15 వేల నుంచి 20 వేల మంది వలసదారులున్నట్టు చెబుతు న్నారు. వారిలో కనీసం ఐదేసి వేల మందైనా బీజేపీకి ఓటేసే లా ప్రభావితం చేయాలన్నది టార్గెట్. ఈ దిశ గా బిహారీ వలసదారుల సమాచారాన్ని సేకరించను న్నా రు. ‘ఆమ్ బిహారీ ప్రవాసీ కీ జాన్కారీ’ పేరు తో 14 ప్రశ్నలతో కూడిన జాబితాను బీజేపీ సిద్ధం చేసు కుంది. పేరు, చిరునామా, ఫోన్ నంబర్, వృత్తి, అసెంబ్లీ నియోజకవర్గం, బీజేపీ మద్దతుదారుడా కాదా, ఓటరు గుర్తింపు కార్డు ఉందా లేదా వంటి సమాచారాన్ని సేక రించనున్నారు. ఈ ఏడాది బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిహారీ దివస్కు కొనసాగింపుగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జూలై 21 నుంచి ఆగస్టు 12 దాకా వర్షాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు దొరికిన ఉదంతంలో ఆయన అభిశంసనకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. జూలై 21 నుంచి ఆగస్టు 12 దాకా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సారథ్యంలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై సమగ్ర చర్చ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్తో పాటు 16 విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారమే లేఖ రాయడం తెలిసిందే. ఈ డిమాండ్పై రిజిజు స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రతి సమావేశాలూ ప్రత్యేకమేనన్నారు. విపక్షాలు కోరుతున్న అన్ని అంశాలనూ వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టవచ్చని సూచించారు. కానీ పార్లమెంటు ప్రత్యేక భేటీ నుంచి మోదీ సర్కారు పారిపోయిందని కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఎద్దేవా చేశాయి. అందుకే వర్షాకాల భేటీల తేదీలను ఏకంగా 47 రోజుల ముందు వెల్లడించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. కేంద్రానికి పార్లమెంటోఫోబియా పట్టకుందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ విమర్శించారు. ఏకగ్రీవంగా ‘అభిశంసన’ జస్టిస్ వర్మ అభిశంసనకు వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం లభిస్తుందని రిజిజు ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘న్యాయవ్యవస్థలో అవినీతిని రాజకీయ దృక్కోణం నుంచి చూడలేం. అందుకే అభిశంసన తీర్మానాన్ని పార్టీలన్నీ ఏకగ్రీవంగా ప్రవేశపెట్టాలన్నది కేంద్రం ఉద్దేశం. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయతి్నస్తున్నాం. ప్రధాన పార్టీలకు ఇప్పటికే నేను స్వయంగా మేరకు సమాచారమిచ్చా. చిన్న పార్టీలను కూడా సంప్రదిస్తున్నా’’అని మంత్రి తెలిపారు. తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలో నిర్ణయించాల్సి ఉందన్నారు. న్యాయమూర్తుల (విచారణ) చట్టం ప్రకారం తీర్మానాన్ని సభ అనుమతించాక అభియోగాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో సభాపతి ఒక కమిటీని నియమిస్తారు. అందులో భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రఖ్యాత న్యాయ కోవిదుడు సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీ సమరి్పంచే నివేదికపై సభ చర్చించిన అనంతరం అభిశంసన ప్రక్రియ చేపడుతుంది. అయితే జస్టిస్ వర్మ ఉదంతంపై సీజేఐ కమిటీ ఇప్పటికే నివేదిక సమరి్పంచిందని రిజిజు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామన్నారు.

2027 మార్చి 1నుంచి జన గణన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జన గణనతోపాటే కుల గణన దిశగా అడుగులు పడుతున్నాయి. 2027 మార్చి ఒకటో తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జనాభా లెక్కల సేకరణలో అంతర్భాగంగా కులాల వారీగా జనాభా గణాంకాలు కూడా సేకరించాలని నిర్ణయించడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈసారి రెండు దశల్లో జన గణన నిర్వహించనున్నారు. హిమా లయ పర్వత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2026 అక్టోబర్ 1న జన గణన ప్రారంభించాలని నిర్ణయించారు. జన గణన, కుల గణన అంశాన్ని ఈ నెల 16వ తేదీన గెజిట్లో ప్రచురించే అవకాశం ఉంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జన గణన సెన్సెస్ యాక్ట్–1948, సెన్సెస్ రూల్స్–1990 ప్రకారం దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. దేశంలో 121 కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు అప్పట్లో తేలింది. జనాభా వృద్ధి రేటు 17.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. 2021లో మళ్లీ జన గణన జరగాల్సి ఉండగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల అనివార్యంగా వాయిదా పడింది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈసారి జరిగే జన గణనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. కులాల జనాభా లెక్కల కూడా సేకరించబోతున్నారు. కుల గణన కోసం వివిధ రాజకీయ పారీ్టలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. బిహార్, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కుల గణన నిర్వహించాయి. దీంతో దేశమంతటా ఈ ప్రక్రియ ప్రారంభించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కుల గణన వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తే ఆయా వర్గాలకు మేలు జరుగుతుందని మేధావులు, నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కుల గణనకు ఆమోదం తెలిపింది. 1971 నుంచి లోక్సభ సీట్ల సంఖ్య యథాతథం దేశంలో లోక్సభ నియోజకవర్గాలు, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం పెండింగ్లో ఉంది. జన గణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో జనాభా దాదాపు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. అయితే, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా? లేదా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల సేకరణ జరిగిన ప్రతిసారీ నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాలి. 1976 నుంచి నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా నిలిపివేశారు. జనాభాను నియంత్రణను ప్రోత్సహించాలన్నదే దీని అసలు ఉద్దేశం. వాస్తవానికి నియోజకవర్గాల సంఖ్య పెంపుపై నిషేధం 2001 దాకానే అమలు కావాలి. కానీ, 2026 దాకా పొడిగించారు. 2001 తర్వాత నియోజకవర్గాల సరిహద్దులు, ఎస్సీ, ఎస్టీల రిజర్వ్డ్ స్థానాల్లో మార్పులు జరిగినప్పటికీ మొత్తం నియోజకవర్గాల సంఖ్య మారలేదు. ఈ సంఖ్య 1971 నుంచి 543గానే కొనసాగుతోంది. అప్పటితో పోలిస్తే దేశ జనాభా రెండు రెట్లకు పైగానే పెరిగింది. నియోజకవర్గాల సంఖ్యలో మాత్రం మార్పులేదు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మరోవైపు జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య పెంచితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరాదిన జనాభా పెరగడం, దక్షిణాదిన తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను యథాతథంగా కొనసాగించి జనాభా లెక్కల ఆధారంగా పునరి్వభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు 26 సీట్లు కోల్పోతాయని, ఉత్తరాది రాష్ట్రాలకు అదనంగా 31 సీట్లు లభిస్తాయని అంచనా. ఒకవేళ 2019లో ప్రతిపాదించినట్లుగా లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 848కు పెంచి, పునరి్వభజన చేపట్టినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది.
ఎన్ఆర్ఐ

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)

ట్విటర్ గాలం : ఇండో-అమెరికన్ సీఈవోకి గూగుల్ రూ. 855 కోట్ల ఆఫర్
భారత సంతతికి చెందిన సీఈవో, యూ ట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ (Neal Mohan Youtube CEO) ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రముఖ సెర్చ్ ఇంజీన్ గూగుల్ను వీడి ట్విటర్లో చేరకుండా ఉండేందుకు గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో నీల్ మోహన్ తన అనుభవాలను, విశేషాలను పంచుకున్నారు. Zerodha సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఇటీవల తన 'People by WTF' పాడ్కాస్ట్ తాజా ఎపిసోడ్లో నీల్ మోహన్తో సంభాషించారు. రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం నుండి ప్లాట్ఫామ్ అల్గోరిథంను ఛేదించే చిట్కాల వరకు ఇద్దరూ అనేక అంశాలపై చర్చించారు.సుదీర్ఘకాలంగా యూట్యూబ్లో ఎగ్జిక్యూటివ్గా సేవలు అందించి 2023నుంచి గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫాం సీఈవోగా ఉన్న ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్విటర్ (ఎక్స్)లో చేరకుండా ఉండేందుకు 2011లో 15 ఏళ్ల క్రితం గూగుల్ మీకు 100 మిలియన్ డాలర్లు (దాదాపు 855 కోట్ల రూపాయలు) చెల్లించిదటగా అని ప్రశ్నించాడు నిఖిల్ కామత్ వాదనను ఖండించకపోవడంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. అయితే 2011 టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం అనేక సంవత్సరాలు కొనసాగే పరిమిత స్టాక్ యూనిట్ల రూపంలో , గూగుల్ ఆఫర్ ఇచ్చిందట నీల్మోహన్కు. అలా నీల్ మోహన్కు దూకుడు కళ్లెం వేసిందని తెలిపింది. అప్పటికే గూగుల్ ఉత్పత్తి అభివృద్ధి వ్యూహంలో కీలకంగా ఉన్న నీల్మోహన్ను వదులుకోవడానికి ఇష్టపడని గూగుల్ యూట్యూబ్ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చర్య దీర్ఘకాలంలో గూగుల్కు మంచి ఫలితాలను అందించింది. అంతేకాదో సుందర్ పిచాయ్ను బోర్డులోకి తీసుకురావడానికి ట్విటర్ ప్రయత్నించిందట. దీంతో పిచాయ్కి కూడా 50 మిలియన్ల స్టాక్ గ్రాంట్ ఆఫర్ ఇచ్చింది గూగుల్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ,స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఆ తరువాత నీల్ మోహన్, ఆండర్సన్ కన్సల్టింగ్ (ఇప్పుడు యాక్సెంచర్)లో తన కెరీర్ను ప్రారంభించారు. అక్కడినుంచి అంచలంచెలుగా ఎదుగుతూ చివరికి బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తరువాత . 2007లో గూగుల్ డబుల్ క్లిక్ను 3.1 బిలియన్డాలర్లకు కొనుగోలు చేయడంతో గూగుల్ యాడ్స్ విభాగంలో ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ అయ్యారు. 2023లో సుసాన్ వోజ్సికి తర్వాత నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితులయ్యారు.ఇదీ చదవండి: ‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్ లుక్ : స్పిరిట్పై ఫ్యాన్ కామెంట్ వైరల్అప్పట్లో హిందీ రాదు, తలచుకుంటే నవ్వొస్తుంది...తన తండ్రి ఇండియాలో ఐఐటీలో చదవి పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లారని మోహన్ తెలిపారు. తన తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా ఉన్నప్పుడే తాను పుట్టానని, తన బాల్యంలో ఎక్కువ భాగం అమెరికాలో గడిచిందని చెప్పుకొచ్చారు. అయితే 1986లో భారతదేశానికి తిరిగి వచ్చా.. ఆ సమయంలో లక్నోలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చేరినపుడు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు హిందీమీద అంత పట్టు లేదు, ఏడో తరగతిలో అదో పెద్ద సవాల్ అంటూ గుర్తు చేసుకున్నారు.చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్కి సర్ప్రైజ్
క్రైమ్

హైదరాబాద్లో దారుణం.. ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం
సాక్షి, మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్తో ఉన్న మృతురాలికి 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలనగర్ జోన్ డీఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎంత పని చేశావ్ బ్రహ్మయ్య!
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: తోపూరి నరసింహంను దారుణంగా హత్య చేసిన చలంచర్ల బ్రహ్మయ్యను అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హజరుపరిచినట్లు గుడ్లూరు సీఐ మంగారావు చెప్పారు. బంగారు ఉంగరం కోసమే బ్రహ్మయ్య హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. వివరాలను సీఐ మంగళవారం వెల్లడించారు. పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామానికి చలంచర్ల బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో పదేళ్ల నుంచి పెంట్రాల ఎస్టీ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. గత నెల 30వ తేదీన నరసింహం నిమ్మతోటకు కంచె వేసేందుకు బ్రహ్మయ్యను తీసుకెళ్లాడు. పని చేస్తుండగా నరసింహం చేతికున్న పచ్చరాయి బంగారపు ఉంగరాన్ని చూసి దానిని ఎలాగైనా దక్కించుకోవాలని బ్రహ్మయ్య భావించాడు. నరసింహంను మొద్దుకత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఉంగరాన్ని తీసుకుని కందుకూరులో విక్రయించాడు. రాత్రి మృతదేహాన్ని పక్క పొలంలోకి లాక్కెళ్లి ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. బ్రహ్మయ్యను విచారించగా తాను బంగారు ఉంగరం కోసమే నరసింహంను హత్య చేసినట్లు అంగీకరించాడని సీఐ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కందుకూరు కోర్టులో హాజరుపరచగా మేజి్రస్టేట్ రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.

నన్ను ప్రేమించి.. మరో వ్యక్తితో చాటింగ్ చేస్తావా?
అన్నానగర్: పొల్లాచ్చిలో మంగళవారం పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. కోయంబత్తూరు జిల్లా, పొల్లాచ్చి సమీపంలోని వడుగపాళయంలోని పొన్ముత్తునగర్కు చెందిన కన్నన్. ఇతను కార్ వర్క్షాప్లో ఉద్యోగి. ఇతని భార్య వనిత. వీరికి అశ్విక (19) సహా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అశ్విక కోవైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదేవిధంగా పొల్లాచ్చి–ఉడుమలై రోడ్డులోని అన్నామలైకు చెందిన రాజన్ కుమారుడు ప్రవీణ్కుమార్ (23). ఇతను ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో ఉద్యోగి. ఈక్రమంలో అశ్విక, ప్రవీణ్కుమార్ ప్రేమించుకుంటున్నారు. అశ్విక కొన్ని రోజులుగా ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసిందని తెలిసింది. ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ సోమవారం మధ్యాహ్నం అశ్విక ఒంటిరిగా ఉందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే కుటుంబసభ్యులకు, పొల్లాచ్చి తాలూకా పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి రక్తపుమడుగులో పడివున్న అశ్వికను పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు గాలిస్తున్నారని తెలిసి ప్రవీణ్కుమార్ పొల్లాచ్చి సిటీ వెస్ట్ పోలీస్స్టేన్లో లొంగిపోయాడు. పోలీసుల విచారణలో అశ్విక మరొక స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. ఇది చూసిన ప్రవీణ్కుమార్ అశ్వికను ప్రశించాడు. దీంతో ఆమె ప్రవీణ్కుమార్తో మాట్లాడడం మానేసింది. దీంతో ఆగ్రహించిన ప్రవీణ్కుమార్ అశ్వికను హతమార్చినట్లు తెలిసింది.

చదువు పేరుతో సహజీవనం..!
సాక్షి, చెన్నై: సహజీవనం చేస్తూ వచ్చిన ఓ జంట మధ్య వివాదం ప్రేమోన్మాదానికి దారి తీసింది. రక్తగాయాలతో ప్రియురాలి మృతిచెందగా, ఉరి వేసుకున్న స్థితిలో ప్రియుడి మృతదేహం బయట పడింది. ఐసీఎఫ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. చెన్నై ఐసీఎఫ్ సమీపంలోని రాజీవ్గాందీ నగర్లో కొంత కాలంగా ఓ జంట చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. తామిద్దరం భార్యభర్తగా వీరు పరిసర వాసులకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి కిటికీ వద్ద ఆ ఇంట్లోని యువకుడి మృతదేహం ఉరివేసుకుని శవంగా వేలాడుతుండడాన్ని పొరుగున ఉన్న వారు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లోపల గడియపెట్టి ఉన్న ఇంటి తలుపులు పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా రక్తగాయాలతో యువతి మరణించి ఉండడం, అక్కడే యువకుడు కిటికీకి ఉరి వేసుకుని మృతిచెంది ఉండడం వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఆ ఇంట్లో లభించిన గుర్తింపు కార్డులు, ఇతర కార్డుల ఆధారంగా ఆ ఇద్దరి వివరాలను పోలీసులు సేకరించారు. ఈకేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు మృతదేహాలను కీల్పాకం మార్చురీకి తరలించారు. చదువు పేరుతో సహజీవనం మృతులు ఇరువురు చదువుకుంటూ ప్రాజెక్టు వర్క్ పేరిట వచ్చి ఇక్కడ సహజీవనం చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. విల్లుపురం అన్నా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న ఆకాశ్, అభినయగా గుర్తించారు. అభినయ ఇంగ్లిష్ లిటరేచర్లో బీఏ, ఆకాష్ బీఎస్సీ చదువుతున్నారు. కళాశాలలో ప్రేమించుకుంటూ వచ్చిన ఈ ఇద్దరు ఒక ప్రాజెక్టు వర్క్ పేరిట చెన్నైకు వెళ్తున్నట్టు తల్లిదండ్రులకు చెప్పి వచ్చేశారు. ఐసీఎఫ్ ఆవరణలో ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాభర్తలా సహజీవనం చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా అప్పుడప్పుడు ఇంటికి, కళాశాలకు వెళుతూ వచ్చినట్టు విచారణలో వెలుగు చూసింది. గత పది రోజులుగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండడం ఇరుగు పొరుగు గమనించారు. అయితే గొడవ ఎందుకు జరిగింది, అందుకు గల కారణాలు బయటకు రాలేదు. సోమవారం కూడా వీరు గొడవపడినట్టు తెలిసింది. ఆవేశంలో అభినయను కొట్టి చంపేసి, ఆ తర్వాత భయంతో ఆకాశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న ఆకాశ్, అభినయ బంధువులు, కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. ఇరు తరఫు బంధువులను, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు చదువుల్లో రాణిస్తూ ఉండడంతోనే ప్రాజెక్టు కోసం చెన్నైకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టుగా కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అయితే, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ జంట సహజీవనం పేరిట ముందుకు సాగి చివరకు ఉన్మాదంతో కూడిన వివాదం రూపంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.