Top Stories
ప్రధాన వార్తలు

ఒక్కో బిల్డింగ్కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు
సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్ స్టార్ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్ బిల్డింగ్కు మార్చేశారు. చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్ మార్బుల్స్తో ఫైవ్ స్టార్ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–రూ.4,500కు మించదని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అప్పు తెచ్చిన సొమ్ముతో...ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం (ఐదు ఐకానిక్ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల (క్వార్టర్స్) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు. మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ.. టెండర్ డాక్యుమెంట్ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. ఐఏఎస్ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771 రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ ⇒ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత ⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్ృజెనిసిస్ ప్లానర్స్ృడిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు (ఆకృతులు) రూపొందించాయి. ⇒ ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తులతో.. ఐదో టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

‘ఆపరేషన్ సింధూర్’ గర్వకారణం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో భారత సైనికులు చూపిన శౌర్యపరాక్రమాలు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్(Mann Ki Baat)’ 122వ ఎపిసోడ్(మే 25)లో ప్రధాని నరేంద్ర మోదీ తన మసుసులోని మాటను వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలిచిందని, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందన్నారు.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ‘ఆపరేషన్ సిందూర్’ కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, పలు కుటుంబాలు దీనిని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారని అన్నారు. ప్రతి భారతీయుని సంకల్పం ఉగ్రవాదాన్ని నిర్మూలించడమేనని అన్నారు. సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమయ్యాక దేశంలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం బీహార్లోని కతిహార్, యూపీలోని కుషినగర్ తదితర ప్రాంతాల్లో జన్మించిన చిన్నారులకు ‘సిందూర్’ అనే పేరు పెట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక జారీ చేశారు. ఈ దారుణ చర్యకు పాల్పడినవారు, కుట్రదారులకు కఠినమైన ప్రతిస్పందన ఎదురవుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడిని కలచివేసిందన్నారు.ఉగ్రవాదంపై జరిగిన ఈ యుద్ధానికి దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు సంఘీభావం ప్రకటించారని ప్రధాని గుర్తుచేశారు. కాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కటేఝరి గ్రామానికి బస్సు రాకతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారన్నారు. ఈ గ్రామం మావోయిస్టుల హింసకు గురైందని, గ్రామానికి తొలిసారిగా బస్సు చేరుకున్నప్పుడు ఘనంగా స్వాగతించారని అన్నారు. గత మన్ కీ బాత్లో ప్రధాని మోదీ భారత స్వాతంత్ర్య పోరాటంలో ఏప్రిల్, మే నెలల ప్రాముఖ్యతను తెలియజెప్పారు. నాటి స్వాతంత్ర్య సమరయోధులు(Freedom fighters) చేసిన త్యాగాలను వివరించారు.ఇది కూడా చదవండి: Happy Africa Day: మూడొంతుల భాషలు ఇక్కడివే..

కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ తో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం. కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్లోనూ బలంగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలహీన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ ఉధ్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలన దక్షతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వస్తుంది. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలమైన పార్టీలుగా మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు.కేసీఆర్తోనే ఉనికి..కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉంది. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదు. కేసీఆర్తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు.బీజేపీకి ప్లస్ అవుతోంది..తండ్రి కూతురుగా కవిత లీడర్గా ఎదిగారు. కేసీఆర్ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం?. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉంది.కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉంది. కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపర్చేలా ఉంది. కవిత డిప్రెషన్లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనిచేస్తాయి కానీ.. మీ మనుగడ దెబ్బతీస్తుందనే విషయం మర్చిపోతే ఎలా?. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలి అని హెచ్చరించారు. కవితకు అవగాహన లేదు..బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం మేము అమలు చేయాలి. దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతాను. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్దం కావడం లేదు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తాడు. పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉంది. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుంది. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదు.. కానీ చర్చల వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత. కవిత లేఖలు.. మా శత్రువు బీజేపీకి ఉపయోగపడుతాయనే మా బాధ’ అంటూ కామెంట్స్ చేశారు.

IPL 2025: శ్రేయస్ ఖాతాలో చెత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అనవసర రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో 200 ప్లస్ లక్ష్యాలను డిఫెండ్ చేసుకునే క్రమంలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న కెప్టెన్గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.శ్రేయస్ ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. శ్రేయస్ తర్వాత ఈ చెత్త రికార్డును ఎంఎస్ ధోని, ఫాఫ్ డుప్లెసిస్, శుభ్మన్ గిల్ సంయుక్తంగా షేర్ చేసుకున్నారు. వీరు ముగ్గురు తలో మూడు సందర్భాల్లో 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు.ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవం తర్వాత శ్రేయస్ ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో శ్రేయస్ సారథ్యం వహించిన పంజాబ్.. 207 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ మరో 3 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.శ్రేయస్ సారథ్యంలో 200 ప్లస్ టార్గెట్ను నిలువరించుకోలేకపోయిన సందర్భాలు..2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్పై 223 పరుగులు (కేకేఆర్ కెప్టెన్గా)2024 సీజన్లో పంజాబ్ కింగ్స్పై 261 పరుగులు (కేకేఆర్ కెప్టెన్గా)2025 సీజన్లో ఎస్ఆర్హెచ్పై 245 పరుగులు (పంజాబ్ కెప్టెన్గా)2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 206 పరుగులు (పంజాబ్ కెప్టెన్గా)జట్ల విషయానికొస్తే.. 200 ప్లస్ లక్ష్యాలను అత్యధిక సార్లు నిలువరించుకోలేకపోయిన జట్టుగా పంజాబ్ కింగ్స్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఏడు సందర్భాల్లో 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోలేకపోయింది. పంజాబ్ తర్వాత ఆర్సీబీ, సీఎస్కే అత్యధిక సార్లు ఈ అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి.200 ప్లస్ లక్ష్యాలను అత్యధిక సార్లు కాపాడుకోలేకపోయిన జట్లు..పంజాబ్- 7ఆర్సీబీ- 6సీఎస్కే- 5కేకేఆర్- 4గుజరాత్- 4రాజస్థాన్- 2ఎస్ఆర్హెచ్- 2ఢిల్లీ- 2ఎల్ఎస్జీ- 2నిన్నటి పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పంజాబ్ 200 ప్లస్ లక్ష్యాన్ని సెట్ చేసిన కూడా కాపాడుకోలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్తో కలిసి నాటౌట్గా నిలిచాడు.ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది.

మిస్ వరల్డ్ పోటీలపై మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. కేటీఆర్ డిమాండ్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది!. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ.. మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మిల్లా మాగీ ఒక బలమైన మహిళ, మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నాము. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాము, గౌరవిస్తాము, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాము. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారే.దురదృష్టవశాత్తు, మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నాను. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.It takes a lot of guts to stand up and call out misogynistic mentality, especially on international forums like the Miss WorldYou are a very strong woman, Milla Magee and I am truly sorry you had to go through this in our state of TelanganaTelangana has a rich culture of… pic.twitter.com/c7Gla3x3yI— KTR (@KTRBRS) May 25, 2025ఇదిలా ఉండగా, అంతకుముందు.. వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ తాజాగా ‘ద సన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కల్పించారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్ పర్పస్కు అనుగుణంగా లేవని.. అదంతా డొల్లేనని దుయ్యబట్టారు. పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్ వేసుకోవాలని ఆదేశించారని.. అల్పాహారం సమయంలోనూ బాల్ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. ‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు.ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’ అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది.మారాలనుకున్నా... నా వల్ల కాలేదు.. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని.. దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది.‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్ వరల్డ్ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించా’ అని మిల్లా మాగీ చెప్పింది.

అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
జీవితం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు.. ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి నిచ్చెనెక్కించి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఊహించని విధంగా కిందకు పడేస్తుంది. ఉన్నత స్థాయికి చేరి ఉత్తమ జీవనం గడుపుతున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే అన్నింటికీ సిద్ధమై ఉండాలి. ఏది ఎదురైనా ఆనందంగా స్వీకరించాలి.. సంతోషంగా ఆస్వాదించాలి.. ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగి జీవితం చెబుతున్న పాఠం ఇదే..ఒక ఫుడ్ డెలివరీ రైడర్ తనకు ఆహారం మాత్రమే కాదు.. జీవిత పాఠాన్ని అందించారంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన కథను ఫేస్బుక్లో షేర్ చేశారు పుణెకు చెందిన శ్రీపాల్ గాంధీ. ఈ జీవితగాథ సోషల్ మీడియాలో నెటిజనులను హత్తుకుంటోంది. ప్రశంసలు వెల్లువను అందుకుంటోంది. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఆహారం తెప్పించుకుంటుంటారు. ఏదైనా మిస్ అయినా, పొరపాటు జరిగినా ఆ తెచ్చిన వ్యక్తి మీద అరుస్తుంటారు. కానీ శ్రీపాల్ గాంధీ డెలివరీ రైడర్ను మెల్లగా కదిలించి అతని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.శ్రీపాల్ గాంధీ సబ్వే నుండి లంచ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ డెలివరీ రైడర్ ఆహారాన్ని తీసుకొచ్చాడు. కానీ పాకెట్ చూడగానే అందులో శాండ్విచ్ మాత్రమే ఉందని, మిగిలిన పదార్థాలు మిస్ అయ్యాయని శ్రీపాల్ గుర్తించి డెలివరీ రైడర్కు చెప్పారు. కాసేపు కంగారు పడిన డెలివరీ రైడర్ "రెస్టారెంట్ లేదా జొమాటోకు కాల్ చేయండి సార్" అంటూ వినయంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీపాల్ సబ్వే వారిని సంప్రదించగా క్షమాపణలు చెప్పి 'రైడర్ ను వెనక్కి పంపగలరా?' మిస్ అయిన వాటిని తిరిగిపంపుతాం.. అతనికి రూ.20 చెల్లిస్తాం' అని బదులిచ్చారు.ఎంత వినయం?ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ జొమాటో ఆదేశిస్తే తప్ప డెలివరీ భాగస్వాములు రెస్టారెంట్కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ రైడర్లకు చెల్లించేది జొమాటో. రెస్టారెంట్ కాదు. అయినా ఈ డెలివరీ ఏజెంట్ ఏమాత్రం వెనుకాడలేదు. "సార్, అది నా బాధ్యత. కస్టమర్ సంతోషమే తాను కోరుకుంటాను" అంటూ మళ్లీ రెస్టారెంట్కు వెళ్లి మిస్ అయిన వాటిని తిరిగి తీసుకొచ్చాడు. సబ్వే వాళ్ల నుంచి రూ.20 పరిహారాన్ని కూడా ఆయన తీసుకోలేదు. "దేవుడు నాకు ఎ౦తో ఇచ్చాడు. ఒకరు చేసిన పొరపాటుకు నేను ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలి? అంటూ అతను శ్రీపాల్ను ఆశ్చర్యానికి గురిచేసింది.జీవిత గమనాన్ని మార్చిన కారు ప్రమాదంరైడర్ తన గతం గురించి శ్రీపాల్ గాంధీ వద్ద ఓపెన్ అయ్యాడు. షాపూర్జీ పల్లోంజీలో కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తూ నెలకు రూ.1.25 లక్షల జీతం అందుకునేవారు. కానీ ఒక కారు ప్రమాదం అతని జీవిత గమనాన్ని మార్చేసింది. ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. తన ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని, కొంతకాలానికి ఆశను కోల్పోయాడు. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అతనికి తోడ్పాడు అందించింది. ఫుడ్ డెలివరీ పార్ట్నర్గా అవకాశమిచ్చింది.తన కుమార్తె ఇప్పుడు దంతవైద్యం చదువుతోందని శ్రీపాల్తో ఫుడ్ డెలివరీ రైడర్ అన్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా తన కలను సజీవంగా ఉంచుకోవడానికి ఆయన రైడ్ చేస్తున్నారని శ్రీపాల్ గాంధీ తన పోస్ట్లో పేర్కొన్నారు. "అతను జీవితాన్ని నిందించలేదు. ఫిర్యాదులు చేయలేదు. సాకులు చెప్పలేదు" అని రాసుకొచ్చారు. స్వామి సమర్థ్ను విశ్వసించే అతను 'దేవుడు నాతో ఉన్నాడు. నేనెందుకు కంగారు పడాలి?" అని నవ్వుతూ అన్నాడని శ్రీపాల్ వివరించారు."ఈ రోజు నాకు శాండ్ విచ్ వచ్చింది. కానీ కృతజ్ఞత, స్థిరత్వం, ఆశావాదం నా దగ్గరే నిలిచిపోయాయి" అంటూ తన పోస్ట్ ను ముగించారు. అతనికి ఉపాధి కల్పించిన జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్గా మారి నెటిజనుల ప్రశంసలు అందుకుంది. అలాంటి వారికి సెల్యూట్.. వావ్, అద్భుతం.. నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెట్టారు.

ఢిల్లీలో కుండపోత వర్షం.. నీటి మునిగిన కార్లు, బస్సులు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు.. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలో ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు అధికారులు.వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు కాలనీల్లో చెట్లు విరిగిపోయి పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా చాలా రోడ్లు, అండర్పాస్లు నీటితో నిండిపోయాయి. ఇక, వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్లు పంపించాయి.VIDEO | Delhi rains: The road leading Terminal 3 of IGI Airport is still waterlogged causing inconvenience to travellers. #Delhi #DelhiWeather #Delhirains pic.twitter.com/01O0Q018Dv— Press Trust of India (@PTI_News) May 25, 2025ఇదిలా ఉండగా.. శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి కలిపే అండర్ పాస్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో, డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీటమునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షం కారణంగా ఇప్పటికే ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Bengaluru, Mumbai, Delhi, divided by language, united by turning into river rafting spots within 15 minutes of rain.This is an underpass in Delhi Cantt. Doesn’t seem like an old construction. Wonder why we don’t focus much on drainage and stormwater management. pic.twitter.com/NJ6wqfXJnx— THE SKIN DOCTOR (@theskindoctor13) May 25, 2025 Congratulations delhi This is the condition of Modi's Triple Engine project. Delhi drainage were choked.... in the first rain.@AtishiAAP @Saurabh_MLAgk @AamAadmiParty pic.twitter.com/KapywCZEwc— Himanshu Chauhan (@Himanshu_Aap_) May 24, 2025DELHI IN A DEPLORABLE CONDITION AFRET HEAVY RAINS⚡️⛈️Roads waterlogged even the highways, underpass blocked, even the lamp posts broken & fallen, blocking the roads; are common scenarios.#Delhi #DelhiWeather #DelhiNCR #delhirain pic.twitter.com/6me4kpSbMn— Barbarik (@Sunny_000S) May 25, 2025रात को आए तूफान में सफदरजंग एयरपोर्ट पर अधिकतम 82 किलोमीटर प्रति घंटे तक की रफ्तार वाली हवाएं चलीं।#DelhiRains pic.twitter.com/eex2EgTNmh— Hemant Rajaura (@hemantrajora_) May 25, 2025

పాకిస్తాన్కు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్
మనామా: దాయాది దేశం పాకిస్తాన్పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఓ విఫల దేశమని ఘాటు విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా ప్రపంచమే ముప్పును ఎదుర్కొంటోందన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం.. ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల అఖిల బృందం శనివారం బహ్రెయిన్కు చేరుకుంది. ఈ బృందంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా బహ్రెయిన్లో ఎంపీ అసద్ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాలుగా భారత్ ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేసేలా మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ కారణంగా మేము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం, స్పాన్సర్ చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలను పాకిస్తాన్ ఆపకపోతే ఉగ్రవాద సమస్య తొలగిపోదు.ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు, మర్నిని దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి ప్రతిదాడి మామూలుగా ఉండదు. పాకిస్తాన్కు సరైన బుద్ధి చెబుతాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ భారత్ సంయమనం పాటించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది విషయమై అందరూ ఆలోచించండి. ఆరు రోజుల క్రితం వివాహం చేసుకున్న ఒక మహిళ ఏడో రోజున వితంతువు అయ్యింది. కేవలం రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది. ఇలాంటి దారుణాలు పాకిస్తాన్ వల్లే జరుగుతున్నాయి.మేమంగా వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ దేశం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. దేశ సమగ్రత విషయానికి వస్తే అందరం ఒక్కటయ్యాం. పాకిస్తాన్ను FATF గ్రే లిస్ట్లోకి తీసుకురావడంలో బహ్రెయిన్ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.#WATCH | Manama, Bahrain: During an interaction with the prominent personalities, AIMIM MP Asaduddin Owaisi says, "...Our govt has sent us over here...so that the world knows the threat India has been facing since last so many years. Unfortunately, we have lost so many innocent… pic.twitter.com/ckukFxpGAc— ANI (@ANI) May 24, 2025ఇదిలా ఉండగా.. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నేత నిశికాంత్ దూబేలు ఒక అంశంలో కలిసి పనిచేయాల్సి రావడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది. భిన్న ధ్రువాలుగా ఉండే ఈ ఎంపీలు పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎండగట్టేందుకు పాక్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
నిజానికి గుండెదడ ఒక జబ్బు కాదు. కాకతే కొన్ని సాధారణ లేదా తీవ్రమైన గుండె సమస్యల తాలూకు ఓ లక్షణంగా భావించవచ్చు. ఒక్కోసారి గుండె దడదడలాడుతున్న విషయం బాధితులకు ఏ ఉపకరణం లేదా ఏ టెస్ట్ సహాయం లేకుండానే తెలిసిపోతుంటుంది. ఆందోళనతో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన గుండె జబ్బులకు అదో సూచన కావచ్చు. అందుకే గుండెదడ గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. అలాంటి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. గుండెదడను వైద్యపరిభాషలో పాల్పిటేషన్ అంటారు. చాలామంది జీవితకాలంలో ఏదో ఒకసారి అనుభవించే సాధారణ లక్షణం ఇది. చాలా సందర్భాల్లో ఏదో ఒక మానసిక ఆందోళన లేదా ఉద్విగ్నత వంటి కారణాలతో కనిపించే అత్యంత మామూలు సమస్య ఇది. చాలా వరకు తీవ్రమైన సమస్య కాకపోయేందుకే అవకాశాలెక్కువ. కాకపోతే చాలా అరుదుగానే ఏదైనా తీవ్రమైన గుండె సమస్యకు సూచన అయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు.పాల్పిటేషన్స్ అంటే...? గుండె నిత్యం స్పందిస్తున్నప్పటికీ... అది కొట్టుకుంటున్న తీరు సాధారణంగా మన అనుభవంలోకి రాదు. కానీ కొన్నిసార్లు వేగంగా స్పందించే ఆ స్పందనలు వ్యక్తుల అనుభవంలోకి వస్తాయి. కొట్టుకుంటున్న వేగాన్ని బట్టి వాటిని ఇంగ్లిష్లో సాధారణంగా ఫ్లట్టరింగ్, పౌండింగ్ లేదా రేసింగ్గా చెబుతుంటారు. కొన్నిసార్లు వ్యక్తులు వేగంగా పరిగెత్తడం, తీవ్రమైన భావోద్వేగాలకు గురికావడం, ఉద్విగ్నతకూ, తీవ్రమైన ఆందోళనకూ గురికావడం, అలాగే తీవ్రమైన జ్వరం లేదా గర్భధారణ సమయంలో గుండెదడ (పాల్పిటేషన్స్) అనుభవంలోకి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువసార్లు కాఫీ తాగడం, కొన్ని సందర్భాల్లో పొగతాగడం, మద్యం తీసుకోవడం లేదా నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు కూడా పాల్పిటేషన్స్కు దారితీయవచ్చు. సాధారణ జీవక్రియల్లో భాగంగానే ఇలా గుండెదడ రావచ్చు. అలాంటప్పుడు గుండెదడ పెద్దగా హానికరం కాదు.మరి పట్టించుకోవాల్సిందెప్పుడంటే... గుండెదడ (పాల్పిటేషన్ ) అకస్మాత్తుగా స్పష్టమైన కారణం లేకుండా వచ్చినప్పడు. తలతిరుగుతుండటం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ తప్పడం వంటివి జరిగినప్పుడు.గుండె లయ తప్పడం (అబ్నార్మల్ రిథమ్ లేదా అరిథ్మియా) వంటి లక్షణాలు కనిపించినప్పుడు...పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని కొంత సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ గుండె లయతప్పడంలో ఒక ప్రత్యేకమైన రకం గురించి చెప్పుకోవాలి. గుండె లయబద్ధంగా స్పందించడానికి వీలుగా సయనో ఏట్రియల్ నోడ్ అనే చోట ఎలక్ట్రిక్ సంకేతాలు వెలువడుతుంటాయి. వీటి కారణంగానే గుండె ఒకే రకమైన లయతో స్పందిస్తుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఆ ఎలక్ట్రిక్ స్పందనలు అసాధారణంగా ఎక్కడపడితే అక్కడ (అంటే నిర్దిష్టమైన ట్రాక్లో కాకుండా ఒకదానిని మరొకటి బైపాస్ చేస్తూ) వెలువడుతున్నప్పుడు... గుండె తన నిర్దిష్టమైన లయతో... లయబద్ధంగా కాకుండా ఎలా పడితే అలా కొట్టుకుంటూ ఉండేందుకు అవకాశముంది. దాంతో గుండె రిథమ్ దెబ్బతినడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశముంది. అయితే ఇలా జరిగినప్పుడు అదృష్టవశాత్తు శస్త్రచికిత్స వంటి సంక్లిష్టమైన ప్రక్రియలు అవసరం లేకుండానే ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఏ)’ అని పిలిచే రక్తనాళాల్లోకి పైప్ను పంపే క్యాథెటర్ ప్రోసిజర్స్తోనే ‘ఎలక్ట్రో ఫిజియాలిస్ట్లు’ అనే నిపుణులు ఈ సమస్యను చక్కదిద్దే అవకాశం ఉంది.గుండెదడతో ఎవరెవరికి ముప్పు...?స్థూలకాయం (ఒబేసిటీ), అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ లేదా గుండె జబ్బులున్నవారు గుండెదడ లక్షణాన్ని కాస్త సీరియస్గానే పరిగణించాలి. అందునా మరీ ముఖ్యంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా అనే ‘అరిథ్మియా’ (గుండె లయ తప్పడం) లేదా ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఉన్నవారిలో గుండెదడ ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకెళ్లి కార్డియాక్ అరెస్ట్ లేదా పక్షవాతం (స్ట్రోక్) వంటి ప్రాణహాని కలిగించేంత తీవ్రమైన ముప్పునకు కారణమయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఇక్కడ పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు గుండెదడ విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక మరో రకమైన ముప్పు ఎవరిలోనంటే... కొందరి కుటుంబాల్లో అకస్మాత్తుగా గుండె΄ోటు వచ్చి మరణించిన (సడన్ కార్డియాక్ డెత్) దాఖలాలు ఉన్న వైద్య చరిత్ర గలవారైతే... అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు గుండెదడను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇక కార్డియో మయోపతి (గుండె కండరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య) లేదా వంశపారంపర్యంగా గుండె ఎలక్ట్రిక్ స్పందనల్లో తేడాలు కనిపించే ఛానెలోపతీస్) వంటి వారిలోగుండెదడ ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివారు ఎలక్ట్రోఫిజియాలజిస్టుల ఆధ్వర్యంలో తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.ఆధునిక కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ భూమిక... కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ అనేది గుండె లయ (హార్ట్ రిథమ్) సమస్యలను గుర్తించడం, నిర్ధారణలతో పాటు ఆ సమస్యలకు తగిన చికిత్స అందించడానికి రూపొందిన గుండె చికిత్స విభాగం. గుండె సమస్యల నిర్ధారణ కోసం ఈసీజీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రో ఫిజియోలాజికల్ స్టడీస్, అత్యాధునిక ఇమేజింగ్ వంటి ప్రక్రియల సహాయం తీసుకుంటారు. వాటి సాయంతో ఎలక్ట్రోఫిజియాలజిస్టులు ఈ తరహా సమస్యలను గుర్తిస్తారు. ఇక అత్యధికంగా ముప్పు ఉన్న బాధితులకు ముందుగానే ప్రమాదాలను నివారించేందుకు దేహంలో అమర్చే ఇంప్లాంటబుల్ కార్డియో–వెర్టర్ డీఫిబ్రిలేటర్స్ (ఐసీడీ) వంటి ఉపకరణాలను అమర్చుతారు. ఈ ఉపకరణాలు గుండె లయతప్పినప్పుడుల్లా చిన్న ఎలక్ట్రిక్ షాక్ను వెలువరించడం ద్వారా గుండె లయను మళ్లీ క్రమబద్ధీకరిస్తాయి. దాంతో గుండెనొటు వంటి ప్రాణాంతక పరిస్థితులు నివారితమవుతాయి. చివరగా... సాధారణగా గుండెదడ అన్నది అంత హానికరం కాదనే చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ముప్పు ఉన్నవారిలో అవి కొంత ప్రమాద హెచ్చరికలు (వార్నింగ్ సిగ్నల్స్)గా పరిగణించవచ్చు. కాబట్టి ఆ హెచ్చరికల ఆధారంగా వైద్యులను సంప్రదించడం వల్ల ఒక రకంగా గుండెదడ మేలే చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలూ, ఆధునిక చికిత్సల వల్ల ప్రమాదాలను నివారించుకునేందుకు, చికిత్సతో నయం చేసుకునేందుకు వీలుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు. కాకతే తగిన జాగ్రత్త మాత్రం అవసరమంటూ గుండెదడ ఓ వార్నింగ్ బెల్లా పనిచేస్తుందని చెప్పవచ్చు. (చదవండి: బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?)

ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్
న్యూయార్క్: ‘నేను ప్రభుత్వం కోసం పనిచేయను. ప్రతిపక్ష పార్టీ కోసం పని చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ పత్రికలలో పహల్గామ్ ఘటన అనంతరం వ్యాసాలు రాశాను. ఉగ్రవాదాన్ని తెలివిగా తిప్పితిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని, భారత్ సరిగ్గా అదే చేసిందని వాటిలో పేర్కొన్నాను’ అని ఎంపీ శశిధరూర్(MP Shashi Dharur) వ్యాఖ్యానించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచానికి తెలియజెప్పేందుకు, దీనిపై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం వివిధ దేశాలలో పర్యటిస్తోంది. ప్రస్తుతం ఈ బృందం న్యూయార్క్లో ఉంది. దీనిలో సభ్యునిగా ఉన్న ఎంపీ శశిధరూర్ భారత కాన్సులేట్లో ప్రసంగించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్పై ఎలా ప్రతీకారం తీర్చుకుందో, తొమ్మిది ఉగ్రస్థావరాలను ఏ విధంగా నేలమట్టం చేసిందో ఎంపీ శశిథరూర్ వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రపంచమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూయార్క్లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం అఖిలపక్ష బృంద సభ్యులకు మొదటి మజిలీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఉమ్మడి సమస్య అని, బాధితులకు సంఘీభావం ప్రకటించేందుకు తాము వచ్చామని అన్నారు.అఖిలపక్ష ప్రతినిధి బృందం సందర్శన లక్ష్యం గురించి థరూర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం, ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలపై విభిన్న వర్గాలతో చర్చించడమే తమ ఆలోచన అని అన్నారు. ప్రతి దేశంలోని కార్యనిర్వాహక సభ్యులను, విదేశాంగ విధాన నిపుణులను కలవడం, మీడియాతో సంభాషించడం దిశగా తమ ప్రయాణం సాగుతుందని అన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి(Pahalgam terror attack) గురించి ప్రస్తావించిన ఆయన మతాల ఆధారంగా ప్రజలను గుర్తించి, వారిని అంతమొందించడానికి కొందరు తిరుగుతున్నారని అన్నారు. బాధితుల్లో ఎక్కువగా హిందువులు ఉన్నారని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నదని థరూర్ పేర్కొన్నారు.పహల్గామ్లో దారుణం జరిగిన ఒక గంట సేపటికే రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దీనికి బాధ్యతను ప్రకటించుకున్నదని, ఈ సంస్థ కొన్నేళ్లుగా నిషేధిత లష్కరే తోయిబాకు సహకరిస్తున్నదన్నారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా), జి.ఎం. హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ), శశాంక్ మణి త్రిపాఠి, తేజస్వి సూర్య, భువనేశ్వర్ కె. లత (బీజేపీ), మల్లికార్జున్ దేవ్డా (శివసేన), అమెరికాలోని మాజీ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స
తాజ్ మహల్కు బాంబు బెదిరింపు
బాలకృష్ణ–గోపీచంద్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..?
సమతకు డాక్టరేట్
IPL 2025: టాప్-3 జట్లకు షాక్లు.. ముంబై ఇండియన్స్కు గోల్డెన్ ఛాన్స్
‘అంతిమ’ రాగం.. భావోద్వేగం!
కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫ్యాట్ పెరిగిందా..?
ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న
గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
Stray Dog: ఊరకుక్కలకో ఊరడింపు
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
గంట సేపు సముద్రం చీలుతుంది
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
భారత్కు అండగా ఉంటాం
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్ల రొమాంటిక్ సాంగ్ విడుదల
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
పారిపోండ్రోయ్..!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
తాజ్ మహల్కు బాంబు బెదిరింపు
బాలకృష్ణ–గోపీచంద్ సినిమా ప్రకటన ఎప్పుడంటే..?
సమతకు డాక్టరేట్
IPL 2025: టాప్-3 జట్లకు షాక్లు.. ముంబై ఇండియన్స్కు గోల్డెన్ ఛాన్స్
‘అంతిమ’ రాగం.. భావోద్వేగం!
కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫ్యాట్ పెరిగిందా..?
ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న
గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
Stray Dog: ఊరకుక్కలకో ఊరడింపు
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
గంట సేపు సముద్రం చీలుతుంది
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
భారత్కు అండగా ఉంటాం
గరుడన్ తెలుగు రీమేకె 'భైరవం'.. ఏ ఓటీటీలో ఉందంటే
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, జెన్నీఫర్ల రొమాంటిక్ సాంగ్ విడుదల
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
పారిపోండ్రోయ్..!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. స్టేషన్లు ఇవే
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
సినిమా

అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ ఇదేనా..?
‘పుష్ప 2’తో అల్లు అర్జున్, జవాన్తో దర్శకుడు అట్లీ పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టేశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. ఈమేరకు తాజాగా దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఐకాన్, సూపర్హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది. గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్తో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు ‘ఐకాన్’ టైటిల్ను ఆయన అనుకున్నారు. అయితే, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అట్లీ సినిమాకు ‘ఐకాన్’ టైటిల్ అయితే ఎలా ఉంటుందని బన్నీ ఆలోచిస్తున్నారట. అట్లీ కూడా బాగానే ఉందని చెప్పారట. దాదాపు ఇదే టైటిల్ను ఫిక్స్ చేస్తారని సమాచారం.ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్తో అభిమానులను అలరిస్తారు అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ లుక్లో కనిపించిన బన్నీ ఇప్పుడు అట్లీ సినిమా కోసం సరికొత్తగా తన లుక్ను మార్చుకోనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్ను ప్రయత్నించినట్లు సమాచారం. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.

వెండితెరపై ఆపరేషన్స్ ఖుక్రీ
మేజర్ జనరల్ రాజ్పాల్ పునియా జీవితం వెండితెరపైకి రానుంది. బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా ప్రధానపాత్రధారిగా హిందీలో ‘ఆపరేషన్స్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది. ఈ మిలటరీ వార్ డ్రామా సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘ఆపరేషన్స్ ఖుక్రీ: ది అన్స్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్కీపింగ్ మిషన్స్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ పుస్తకం హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. 2000లో వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రాలియోన్లో జరిగిన ఆపరేషన్స్ ఖుక్రీ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.యునైటెడ్ పీస్కీపింగ్ మిషన్స్ లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు, అక్కడి రెబల్ ఫోర్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. ఈ సైనికుల రక్షణ రెస్క్యూ ఆపరేషన్స్ ను రాజ్పాల్ పునియా లీడ్ చేశారు. ఈ రాజ్పాల్ పునియాగానే రణ్దీప్ హుడా నటించనున్నారు. మరోవైపు హిందీలో ‘బదాయి హో, మైదాన్స్ ’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు అమిత్ శర్మ కూడా ‘ఆపరేషన్స్ ఖుక్రీ’ ఘటనల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సెట్స్లో సూపర్స్టార్
సూపర్ స్టార్ సూర్యకుమార్ సెట్స్కు వచ్చారు. రామ్ హీరోగా పి. మహేశ్బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో సినీ సూపర్స్టార్ సూర్యకుమార్పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు.ఈ సూర్యకుమార్ అభిమానిగా హీరోగా రామ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యారు ఉపేంద్ర. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. హీరో, ఆ హీరో అభిమానికి మధ్య జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాకు సంగీతం: వివేక్–మెర్విన్.

వన్స్ మోర్...
ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్లు, హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్, ఫ్రాంచైజీల కోసం హీరో–దర్శకుల కాంబో రిపీట్ అవుతోంది. సీక్వెల్, ఫ్రాంచైజీలకు అదే కాంబినేషన్ కుదరడం కామన్గా జరుగుతుంటుంది. వీటిని పక్కన పెడితే... ఆల్రెడీ ఒక సినిమాకి కలిసి... ఇప్పుడు మరో సినిమాకి కలిసిన హీరో–డైరెక్టర్ కాంబినేషన్ ‘వన్స్మోర్’ అంటూ రిపీట్ అవుతోంది. తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండోసారి సినిమా చేస్తున్న కొందరు హీరోలపై మీరూ ఓ లుక్ వేయండి.ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్లు, హిట్ కాంబినేషన్లు రిపీట్ కావడం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సీక్వెల్స్, ఫ్రాంచైజీల కోసం హీరో–దర్శకుల కాంబో రిపీట్ అవుతోంది. సీక్వెల్, ఫ్రాంచైజీలకు అదే కాంబినేషన్ కుదరడం కామన్గా జరుగుతుంటుంది. వీటిని పక్కన పెడితే... ఆల్రెడీ ఒక సినిమాకి కలిసి... ఇప్పుడు మరో సినిమాకి కలిసిన హీరో–డైరెక్టర్ కాంబినేషన్ ‘వన్స్మోర్’ అంటూ రిపీట్ అవుతోంది. తమకు హిట్ ఇచ్చిన దర్శకులతో రెండోసారి సినిమా చేస్తున్న కొందరు హీరోలపై మీరూ ఓ లుక్ వేయండి.ఫ్యారడైజ్ ప్రపంచంనానీలోని మాస్ యాక్షన్ యాక్టింగ్ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రీన్పై చక్కగా చూపించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ ‘దసరా’ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. దర్శకుడిగా ఈ ‘దసరా’యే శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా. అయితే తన రెండో సినిమా ‘ఫ్యారడైజ్’ని కూడా నానీతో చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరియే ఈ ‘ఫ్యారడైజ్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నాని సికింద్రాబాద్ కుర్రాడిగా కనిపిస్తారని, స్క్రీన్పై ఆడియన్స్ ఓ కొత్త ప్రపంచాన్ని చూసేలా శ్రీకాంత్ ఓదెల స్క్రీన్ప్లే డిజైన్ చేశారని సమాచారం.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఓ సరికొత్త పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్లో నాని కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలోని హీరోయిన్పాత్రకు మేకర్స్ జాన్వీ కపూర్, కయాదు లోహర్ వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాని ఇంగ్లిష్, స్పానిష్లతో సహా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. ‘ది ఫ్యారడైజ్’ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై, హిట్గా నిలిచింది. సో... ఆ సెంటిమెంట్ ప్రకారం మార్చి చివరి వారంలోనే ‘ది ఫ్యారడైజ్’ సినిమా రిలీజ్ను మేకర్స్ షెడ్యూల్ చేసినట్లుగా తెలుస్తోంది.బర్త్ డేకి అనౌన్స్మెంట్? హీరో బాలకృష్ణ–దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. దీంతో బాలకృష్ణతో మరో యాక్షన్ మూవీనిప్లాన్ చేశారట గోపీచంద్. ఇటీవల బాలకృష్ణకు గోపీచంద్ ఓ కథ చెప్పగా, ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది సెప్టెంబరు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ‘అఖండ 2’ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లోని సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఊహించవచ్చు. ఈ సినిమాను కేవీఎన్ ప్రోడక్షన్స్ లేదా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.పన్నెండేళ్ల తర్వాత... పన్నెండేళ్ల క్రితం హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సూపర్హిట్గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రకటన రెండు సంవత్సరాల క్రితమే వచ్చినప్పటికీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ముందే అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాల్సి రావడం వంటి కారణాల చేత పూర్తి స్థాయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్లో తిరిగి ఫుల్ ప్లెజ్డ్గా ప్రారంభం కానున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే... ‘గబ్బర్సింగ్’ సినిమాలోపోలీస్ ఆఫీసర్గా నటించిన పవన్ కల్యాణ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోనూ పోలీసాఫీసర్గా నటిస్తుండటం విశేషం. తమిళ హిట్ మూవీ విజయ్ ‘తేరీ’కి తెలుగు రీమేక్గా ‘ఉస్తాద్ భగత్సింగ్’ సినిమా రూపొందుతుందనే టాక్ వినిపించింది. కానీ ‘ఉస్తాద్ భగత్సింగ్’ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఓ కొత్త కథను సిద్ధం చేయమని దర్శకుడు హరీష్ శంకర్కు చెప్పారని, ఆయన ఈ స్క్రిప్ట్ను మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని టాక్. ప్రస్తుతం సుజిత్ ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.మళ్లీ విలేజ్లో? రామ్చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ బ్లాక్బస్టర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు సుకుమార్తో రామ్చరణ్ మరో మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నరపైనే అవుతున్నా చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో తలమునకలై ఉన్నారు దర్శకుడు సుకుమార్. ఇటీవల విదేశాలకు వెళ్లి ఈ సినిమా స్క్రిప్ట్పై హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్లు చర్చలు కూడా జరిపారు.అయితే ఈ సినిమా ‘రంగస్థలం’ సినిమా స్టైల్లోనే విలేజ్ నేపథ్యంలో ఉంటుందా? లేక సరికొత్తగా మోడ్రన్ స్టైల్లో ఉంటుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలోని హీరోయిన్పాత్రకు రష్మికా మందన్నా, సమంత, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.19వ శతాబ్దం నేపథ్యంలో...విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ సినిమా 2018లో విడుదలై, ఆడియన్స్ను మెప్పించింది. ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ–దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మళ్లీ ఓ సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్లో 14వ చిత్రం. 19వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో ఈ మూవీ కథనం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.1854–1878 మధ్య జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నా దాదాపు ఖరారయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాలు విజయాలు సాధించిన నేపథ్యంలో, మళ్లీ విజయ్–రష్మికల కాంబోపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, విజయ్–రష్మికల కాంబోపై అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. స్పోర్ట్స్ డ్రామా! నితిన్ కెరీర్లో ‘ఇష్క్’ (2012) సూపర్ హిట్ ఫిల్మ్. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. అయితే ‘ఇష్క్’ (2012) చిత్రం తర్వాత పన్నెండేళ్లకు మళ్లీ హీరో నితిన్, దర్శకుడు విక్రమ్ కే కుమార్ల కాంబినేషన్ కుదిరింది. కొంత గ్యాప్ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్తో మళ్లీ తాను ఓ సినిమా చేస్తున్నానని, ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని, లార్జ్ స్కేల్లో ఉండబోతుందని, తెలుగు ఆడియన్స్ ఓ కొత్త సినిమాను చూసిన అనుభూతిని పొందుతారని ఇటీవల నితిన్ ఓ ఇంటర్వ్యూ వేదికగా చెప్పారు.వీళ్లే కాదు... ఇంకా మరికొందరు హీరో–దర్శకుల హిట్ కాంబో రిపీట్ కానుందని సమాచారం. – ముసిమి శివాంజనేయులు
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

సీకే నాయుడు నుంచి శుబ్మన్ గిల్ వరకు...
అంచనాలకు అనుగుణంగానే యువ ఆటగాడు శుబ్మన్గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం... గిల్ సారథ్యంలో 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకడంతో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల గిల్ను ఎంపిక చేసింది. సీకే నాయుడు భారత తొలి టెస్టు కెప్టెన్గా వ్యవహరించగా... ఇప్పుడు గిల్ 37వ కెప్టెన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహించిన ప్లేయర్ల జాబితా...

జొకోవిచ్ 100 నాటౌట్
జెనీవా: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వందో సింగిల్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. జెనీవా ఓపెన్లో చాంపియన్గా నిలవడం ద్వారా జొకో ఈ ఘనత సాధించాడు. తద్వారా ఓపెన్ ఎరాలో 100 సింగిల్స్ టైటిల్స్ సాధించిన మూడో ప్లేయర్గా జొకోవిచ్ రికార్డుల్లోకి ఎక్కాడు. జిమ్మి కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెదరర్ (103; స్విట్జర్లాండ్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 5–7, 7–6 (7/2), 7–6 (7/2)తో హబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తొలి సెట్లో పరాజయం పాలైన జొకో... హోరాహోరీగా సాగిన మిగిలిన రెండు సెట్లను టై బ్రేకర్ ద్వారా గెలుచుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో హుర్కాజ్ 19 ఏస్లు సంధించగా... జొకోవిచ్ 6 ఏస్లకే పరిమితమైనా కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టాడు. హుర్కాజ్ 112 పాయింట్లు నెగ్గగా... జొకో 121 పాయింట్లు సాధించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్లో 99వ టైటిల్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందు ‘సెంచరీ’ పూర్తి చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన అనంతరం జొకో... షాంఘై మాస్టర్స్, మియామి మాస్టర్స్ టోర్నమెంట్ ఫైనల్స్కు చేరినా టైటిల్ గెలవలేకపోయాడు. ‘వందో టైటిల్ నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం కోసం ఎతో కష్టపడ్డా. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. హబర్ట్ సర్వీస్ను బ్రేక్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అయినా ప్రయత్నించి సఫలమయ్యా’ అని జొకో అన్నాడు. 2006లో తొలి టైటిల్ నెగ్గిన జొకోవిచ్... 19 ఏళ్ల కెరీర్లో మూడంకెల సంఖ్యకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఓపెన్ ఎరాలో 20 వేర్వేరు సీజన్లలో టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే 24 గ్రాండ్స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... నేటి నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్లో మరోసారి విజేతగా నిలిచేందుకు కసరత్తు చేస్తున్నాడు. మట్టి కోర్టులో జరగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో సోమవారం మెకెంజీ మెక్డొనాల్డ్ (అమెరికా)తో జొకోవిచ్ తలపడనున్నాడు.

మరో టైటిల్ వేటలో... అల్కరాజ్
పారిస్: సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్కు నేడు తెర లేవనుంది. గతేడాది ఒలింపిక్స్లో తలపడిన టెన్నిస్ సూపర్ స్టార్లందరూ మళ్లీ పారిస్లో పోరాడేందుకు వచ్చేశారు. క్లే కోర్టులో సత్తా చాటేందుకు సై అంటున్నారు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) ట్రోఫీని నిలబెట్టుకునే పనిలో ఉంటే... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) టైటిల్ సాధించేందుకు వచ్చాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్తో సత్తా చాటుకున్న సినెర్ డోపింగ్ మరకను దాటేశాడు. ఇప్పుడిక్కడ ప్రెంచ్ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. వీరిద్దరితో పాటు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం కాచుకున్నాడు. దీనికోసం రెండేళ్లుగా పెద్ద పోరాటమే చేస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్లో సెమీస్ చేరిన నొవాక్ రోలండ్ గారోస్లో చివరిసారిగా 2023లో టైటిల్ గెలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్ (రన్నరప్) తప్ప మూడు టైటిళ్లను కైవసం చేసుకున్న జొకోవిచ్కు గత సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది.ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. దీంతో ‘గ్రాండ్స్లామ్ రజతోత్సవం’ కోసం ఈ ఫ్రెంచ్ ఓపెన్లో సెర్బియన్ స్టార్ గంపెడాశలతో బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ఇక్కడే ఒలింపిక్స్లో చాంపియన్గా నిలిచిన జొకోకు మళ్లీ కాలం కలిసొస్తే ‘గ్రాండ్–25’ సాకారం అవుతుంది. తొలి రౌండ్లలో నిరుటి విజేత అల్కరాజ్... క్వాలిఫయర్ గులియో జెప్పియెరి (ఇటలీ)తో, సినెర్... రిండెర్క్నెచ్ (ఫ్రాన్స్)తో, ఆరో సీడ్ జొకోవిచ్... షెవ్చెంకో (కజకిస్తాన్)తో ఫ్రెంచ్ సమరాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత నాదల్ లేని క్లేకోర్ట్ ఈవెంట్ జరగబోతోంది. 2005 నుంచి 2024 వరకు పోటీపడిన స్పెయిన్ దిగ్గజం 22 గ్రాండ్స్లామ్ టైటిళ్లలో 14 ఫ్రెంచ్ ఓపెన్లోనే సాధించడం విశేషం. సబలెంక, స్వియాటెక్లే ఫేవరెట్లు మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ అరియాన సబలెంక (బెలారస్), స్వియాటెక్ (పోలండ్)లు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్లు గెలిచిన సబలెంకకు ఈ ఏడాది ఆరంభ గ్రాండ్స్లామ్లో టైటిల్ పోరులో చుక్కెదురైంది. ఇప్పుడు టైటిల్ గెలిచేదాకా నిలకడైన ఆటతీరును కనబరచాలనే లక్ష్యంతో ప్రపంచ నంబర్వన్ సబలెంక బరిలోకి దిగుతోంది. మరోవైపు ‘క్లేకోర్టు రాణి’గా ఎదిగిన స్వియాటెక్ రోలండ్ గారోస్లో ఐదో టైటిల్పై కన్నేసింది. ఫ్రెంచ్ ఓపెన్లో ఆమె హ్యాట్రిక్ సహా నాలుగు (2020, 2022, 2023, 2024) ట్రోఫీలు సాధించింది. తొలి రౌండ్ పోటీల్లో రష్యన్ అన్సీడెడ్ రకిమొవాతో సబలెంక... రెబెక్కా స్రాంకొవా (స్లొవేకియా)తో స్వియాటెక్ పోటీపడనున్నారు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్, మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)... రొమేనియన్ ప్లేయర్ అన్క టొడోనితో, ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా) క్వాలిఫయర్ డెరియా సవిల్లే (ఆస్ట్రేలియా)తో... రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) అన్సీడెడ్ ఒలీవియా గడెకి (ఆ్రస్టేలియా)తో తలపడతారు.

నోరిస్కు పోల్ పొజిషన్
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్ హామిల్టన్ టైమింగ్ను తాజాగా నోరిస్ అధిగమించాడు. ఈ సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రి తర్వాత నోరిస్కు ఇదే తొలి పోల్ పొజిషన్. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్, రెడ్బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్ 133 పాయింట్లతో రెండో ప్లేస్లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.
బిజినెస్

ఐపీవోకు కేఎస్హెచ్ ఇంటర్నేషనల్
ముంబై: మాగ్నెట్ వైండింగ్ వైర్స్ తయారీ సంస్థ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా రూ.745 కోట్ల సమీకరణకు సిద్ధమైంది. ఇందుకు అనుమతులు కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచింది. కంపెనీ ఆఫర్లో భాగంగా రూ.420 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్లు రూ.325 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.226 కోట్లు రుణ చెల్లింపులకు, కొత్త యంత్రాల కొనుగోలుకు రూ.90.06 కోట్లు, రూఫ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.10.41 కోట్లు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇష్యూకు నువామా వెల్త్ మేనేజ్మెంట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ మేనేజర్లుగా, ఎంయూఎఫ్జీ ఇన్టైం ఇండియా సంస్థ రిజి్రస్టార్గా వ్యవహరించనున్నాయి. మే 27న నికితా పేపర్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.95–104 క్రాఫ్ట్ పేపర్ తయారీ సంస్థ నికితా పేపర్స్ ప్రతిపాదిత ఐపీఓ మే 27న ప్రారంభమై 29న ముగియనుంది. షేరు ధరల శ్రేణిని రూ.95–104గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ట ధర (రూ.104) వద్ద రూ.67.5 కోట్లు సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓలో భాగంగా 64.94 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ పూర్తయిన తర్వాత కంపెనీ షేర్లు ‘ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ఎమర్జ్’లో లిస్ట్ కానున్నాయి. ఐపీవో ద్వారా వచ్చే మొత్తాన్ని కొత్త ప్లాంట్ నిర్మాణానికి, కంపెనీ ఇతర కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఫాస్ట్ ట్రాక్ ఫిన్సెక్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా, స్కైలైన్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ సంస్థ రిజి్రస్టార్గా వ్యవహరించున్నాయి.

బ్యాంకింగ్కు క్వాంటమ్ కంప్యూటింగ్ కష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంటమ్ కంప్యూటింగ్తో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగానికి గణనీయంగా ముప్పు పొంచి ఉందని ఐఎస్బీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ (ఐఐడీఎస్) ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ రిస్కులను ఎదుర్కొనడానికి ఆయా రంగ సంస్థలు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. సంప్రదాయ కంప్యూటర్ల పరిధికి మించిన సవాళ్లను పరిష్కరించేందుకు క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలపై పని చేసే విప్లవాత్మకమైన కంప్యూటింగ్ విధానమే క్వాంటమ్ కంప్యూటింగ్. సంప్రదాయ కంప్యూటర్లు, బిట్స్ (0 లేదా 1)ను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి. సంక్లిష్టమైన విషయాలను ప్రాసెస్ చేయడంలో వాటి సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి. మరోవైపు క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి సమస్యలను పరిష్కరించేందుకు సూపర్పొజిషన్, టనెలింగ్, ఇంటర్ఫియరెన్స్లాంటి క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలను కూడా ఉపయోగిస్తాయి. ఈ విభాగంలో పలు కొత్త ఆవిష్కరణలు వస్తున్నప్పటికీ, ఎర్రర్ రేట్లను తగ్గించడం, పెద్ద స్థాయిలో విస్తరించడం వంటి అంశాల్లో సవాళ్లు ఉంటున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లు స్వభావరీత్యా సున్నితమైనవిగా ఉంటాయి. దీంతో చుట్టుపక్కల ఏ కాస్త గందరగోళ పరిస్థితి ఉన్నా, అవి ప్రభావితమై తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సామర్థ్యాలు పెరిగే కొద్దీ హ్యాకర్లు ఎలాంటి సంక్లిష్టమైన ఎన్క్రిప్షన్నైనా ఛేదించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా బీఎఫ్ఎస్ఐ సంస్థలకు ముప్పులు పొంచి ఉన్నాయి. దేశీయంగా బీఎఫ్ఎస్ఐ రంగానికి క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల పొంచి ఉన్న ప్రత్యేకమైన సవాళ్లను అర్థం చేసుకునేందుకు, వాటిని అధిగమించేందుకు తీసుకోతగిన చర్యల గురించి ఈ నివేదిక కీలకంగా ఉంటుందని ఐఎస్బీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ర ప్రొఫెసర్ మనీష్ గంగ్వార్ తెలిపారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → ఈ అధ్యయనానికి సంబంధించిన సర్వేలో పాల్గొన్న వారిలో 57.5 శాతం మంది వచ్చే మూడేళ్లలో క్వాంటమ్ కంప్యూటింగ్ గణనీయమైన ముప్పుగా పరిణమించవ్చచని భావిస్తున్నట్లు తెలిపారు. అత్యంత సాధారణంగా ఎదురయ్యే ముప్పుల్లో ఫిషింగ్ దాడులు (65 శాతం), డీడీవోఎస్ దాడులు (47.5 శాతం), సోషల్ ఇంజినీరింగ్ (40 శాతం) ఉండొచ్చని వారు పేర్కొన్నారు. → బీఎఫ్ఎస్ఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లలో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అవగాహన ఒక మోస్తరుగానే ఉంది. క్వాంటమ్ కంప్యూటర్ల ముప్పులను కూడా అధిగమించగలిగే క్రిప్టోగ్రఫీని (పీక్యూసీ) అమలు చేసే సన్నద్ధత అంతంతమాత్రంగానే .. 5 పాయింట్లకు గాను సగటున 2.4 శాతం స్థాయిలో ఉంది. ఫైర్వాల్స్లాంటి సర్వసాధారణంగా ఉండే భద్రతా చర్యలను విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ చొరబాట్లను గుర్తించే అధునాతన సిస్టంలు, బలహీనతలను సమర్ధవంతంగా అధిగమించగలిగే సాధనాలను వినియోగం తక్కువగానే ఉంటోంది. → టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్లో పురోగతి సాధించడంతో సైబర్సెక్యూరిటీ రిస్క్ ల తీరుతెన్నులు మారాయి. క్వాంటమ్ కంప్యూటింగ్తో వ్యాపార వృద్ధి అవకాశాలు పెరిగినా, ప్రస్తుత పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ (పీకేసీ) అల్గోరిథంలకు గణనీయంగా ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సవాళ్లను అధిగమించేందుకు పీక్యూసీ వినియోగాన్ని వేగవంతం చేయడం, ప్రభుత్వం స్పష్టమైన ప్రమాణాలు .. మార్గదర్శకాలకు ప్రాధాన్యమివ్వడం, సైబర్సెక్యూరిటీపై అవగాహన పెంచడం, క్వాంటమ్ను నిలువరించే టెక్నాలజీలపై పరిశోధనలకు నిధులు సమకూర్చడం, పరిశ్రమవర్గాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కేంద్రం ప్రకటన
2024 - 25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ రేటును ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సిఫార్సు చేశాయి.ఈపీఎఫ్ వడ్డీ రేటు.. దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా జీతం పొందే చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. 2023-24 సంవత్సరానికి అందించే రేటునే.. ఈ ఏడాది కూడా కొనసాగించారు. 2022-23 సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండేది.ఈపీఎఫ్వోలోకి 14.58 లక్షల సభ్యులుఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో 14.58 లక్షల మంది సభ్యులు మార్చిలో చేరారు. వీరిలో సగం మంది (7.54 లక్షల మంది) కొత్త సభ్యులే కావడం గమనార్హం. అంటే మొదటివారి వీరు ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చారు. సంఘటిత రంగంలో పెరిగిన ఉపాధి అవకాశాలను ఇది ప్రతిఫలిస్తోంది. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా 2 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు మార్చి నెల పేరోల్ గణాంకాలు విడుదలయ్యాయి.పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..మిస్డ్కాల్తో పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ నెంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎమ్ఎస్ రూపంలో వస్తుంది.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీపీఎఫ్ బ్యాలెన్స్ మీకు ఎస్ఎమ్ఎస్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు రావాలంటే.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అంతే కాకుండా మీ నెంబర్ UANకు లింక్ అయి ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉంటేనే మీరు పీఎఫ్ బ్యాలెన్సును మెసేజ్ రూపంలో తెలుసుకోగలరు. 7738299899 నెంబర్కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు.

ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి.. కొత్త టోల్ పాలసీపై కసరత్తు చేస్తోంది. టోల్ ప్లాజా గుండా వెళ్లిన ప్రతిసారీ టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఏడాదికి ఒకేసారి చెల్లించే విధంగా ప్లాన్ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఏడాదికి ఒకేసారి 3000 రూపాయలు టోల్ ఫీజు(యాన్యువల్ ప్యాకేజీ)ను చెల్లించడం ద్వారా.. డ్రైవర్లు/వాహనదారులు ఏడాది పొడవునా అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, స్టేట్ ఎక్స్ప్రెస్వేలలో అపరిమిత దూరం ప్రయాణించవచ్చు. ప్రతి టోల్ గేటు దగ్గర టోల్ ఫీజును ప్రత్యేకించి చెల్లించాల్సిన అవసరం లేదు.యాన్యువల్ ప్యాకేజీ కోసం.. వాహనదారులకు లేదా డ్రైవర్లకు అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఫాస్ట్ట్యాగ్(FASTag)ను రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే జీవితకాల ఫాస్ట్ట్యాగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విధానం కింద రూ. 30,000 చెల్లిస్తే.. 15 సంవత్సరాలు రోడ్డుపై అపరిమిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దీనిని ప్రభుత్వం అమలుచేసే అవకాశం లేదు.ఇదీ చదవండి: కారు కొనడానికి హెలికాఫ్టర్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియోవార్షిక ప్యాకేజ్ మాత్రమే కాకుండా డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానంలో 100 కిలోమీటర్ల దూరానికి రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది.
ఫ్యామిలీ

పదో తరగతి తర్వాత
పదో తరగతి తర్వాత ఏం చదవాలి? ఏం చేయాలి? ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సాధారణమైన ప్రశ్న. మీ బిడ్డకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే కార్పొరేట్ కాలేజీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఆ కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్లు వస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఐఐటీ, నీట్, ఎంసెట్ అంటూ ఆశలు చూపిస్తారు. లేదంటే సీఈసీ ప్లస్ సీఏ అంటూ వస్తారు. తమ కాలేజీల్లో చేర్పించుకుంటారు. చాలామంది ఇలాగే స్నేహితులు, పొరుగింటివాళ్లు, బంధువులు, సమాజం ప్రభావం వల్ల ‘అందరూ ఎంచుకునే దారి’లోనే ప్రయాణిస్తుంటారు. ఆ తర్వాత అక్కడ ఒత్తిడి భరించలేక నానా అవస్థలు పడుతుంటారు. అనేకమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలాంటి సమస్యలతో కౌన్సెలింగ్ కోసం వస్తుంటారు. కొందరు కోరుకున్నది సాధించలేక తీవ్ర మానసిక సమస్యల్లో పడిపోతుంటారు. ఈ పరిస్థితులు మారాలంటే, మార్చాలంటే కావాల్సింది– కెరీర్ కౌన్సెలింగ్. కెరీర్ కౌన్సెలింగ్ అంటే...పదో తరగతి తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత దశ, దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ దశలో కెరీర్ కౌన్సెలింగ్ ఒక గేమ్ చేంజర్గా నిలుస్తుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆసక్తి, సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు ఎదిగే దారి మరొకరికి సరిపోదు. కెరీర్ కౌన్సెలింగ్లో ‘ఏది ఫేమస్’ అని కాకుండా, ‘ఏది మీకు బెస్ట్’ అనే ప్రశ్నకు శాస్త్రీయమైన, మానసికమైన సమాధానం దొరుకుతుంది. ఇది గూగుల్ మ్యాప్ లాంటిది. మీ లక్ష్యానికి సులువైన దారి చూపిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్తే హెచ్చరిస్తుంది.ఉదాహరణకు ఏనుగు, కోతి, చేపకు చెట్టెక్కమనే పరీక్ష పెడితే? ఒక్క కోతి మాత్రమే గెలుస్తుంది. మిగతావన్నీ ఓడిపోతాయి. అలాగని అవన్నీ పనికిరానివి అనగలమా? దేని బలం దానిదే, దేని ప్రత్యేకత దానిదే! అలాగే పదో తరగతి తరువాత ఏం చదవాలనే నిర్ణయం కూడా వ్యక్తిగతంగా ఉండాలి.కెరీర్ కౌన్సెలింగ్ ఎందుకు అవసరమంటే... ∙మనకు తెలియని అంతర్గత శక్తులను బయటకు తేవడానికి ∙మనకున్న ఆసక్తి, వ్యక్తిత్వం, సామర్థ్యానికి సరిపడే కోర్సు ఏదో కనుగొనడానికి ∙‘అందరూ చేస్తున్నది నేనూ చేయాలి’ అనే ఉచ్చులోంచి బయటపడడానికి ∙భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, సవాళ్లు, రిస్క్లు తెలుసుకోవడానికి ∙మన లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు స్పష్టత కోసం.పదో తరగతి తర్వాత విద్యావకాశాలు... పదో తరగతి తర్వాత అందరికీ తెలిసింది ఇంటర్మీడియట్ చదవడం. దానిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉంటాయి. ఇవి కాకుండా హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత ఇంజినీరింగ్ చేసే అవకాశమూ ఉంది. తక్షణ ఉద్యోగావసరం ఉన్నవాళ్లు ఐటీఐ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇవి కాకుండా అరుదుగా తెలిసిన, భవిష్యత్తులో హై డిమాండ్ ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. ఇవి ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. కాని, వీటిలో ఆసక్తి, సామర్థ్యం, ప్యాషన్ ఉంటే చాలా గొప్ప కెరీర్ అవకాశాలున్నాయి. ఉదాహరణకు, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్లో డిప్లొమా, సైబర్ ఫోరెన్సిక్ డిప్లొమా, గేమింగ్ డిప్లొమా, రోబోటిక్స్, ఏఐ డిప్లొమా, ఫైర్ ఇంజినీరింగ్, పారామెడికల్ కోర్సులు. కౌన్సెలింగ్ లేకుండా నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలు∙తల్లిదండ్రులు, ఇతరుల మాటలు విని తీసుకున్న కోర్స్ మధ్యలోనే బోర్ కొడుతుంది. ∙మనకు సామర్థ్యం లేని సబ్జెక్టుల వల్ల పరీక్షల్లో తప్పే అవకాశాలు పెరుగుతాయి. ∙‘నాక్కావాల్సింది ఇది కాదు’ అని గుర్తించినప్పుడు మళ్ళీ రీ–స్టార్ట్ చెయ్యాలి. ∙విలువైన సంవత్సరాలు, డబ్బు, మెంటల్ ఎనర్జీ వృథా అవుతాయి. ∙చివరికి వృత్తి, ఉద్యోగం, జీవితంలో అసంతృప్తికి దారితీస్తుంది.కౌన్సెలింగ్ తీసుకుంటే వచ్చే లాభాలు∙మీకు సరిపడే స్ట్రీమ్ లేదా కోర్స్ను గుర్తించగలుగుతారు. ∙స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వస్తాయి. ∙‘అందరూ వెళ్తున్న దారి’ కంటే ‘నాకు సరిపోయే దారి’ఎంచుకునే ధైర్యం వస్తుంది. ∙భవిష్యత్తులో ఉండే కెరీర్ అవకాశాలపై పూర్తి అవగాహన పెరుగుతుంది. ∙ప్రవేశ పరీక్షలు, అందుకు కావాల్సిన నైపుణ్యాల గురించి ముందే తెలుసుకుని సిద్ధంగా ఉంటారు.

ఈ వారం కథ: పూలమ్మి
ఒక పూల పరిమళం నన్ను ఆవహించిన వేళ– ఒక శూన్యం, నా నుంచి వీడ్కోలు తీసుకునే సమయం నేను ఊహించని సంఘటన– ఘటన. ఒక నటన, నన్ను పూలమ్మికి దగ్గర చేసింది. వేసవి సాయంకాలం, సముద్రం ఒడ్డున సేదతీరే సమయం. అలలు అప్పుడప్పుడు వచ్చి పాదాలను పలకరిస్తూ, వెనక్కి వెళ్తూ, మళ్ళీ అల్లరిగా ముందుకు వస్తూ దోబూచులాడుతున్నాయి.ప్రతిరోజు చీకటి పడగానే బీచ్కు రావడం రామకృష్ణకు ఆనవాయితీ.బీచ్తో రామకృష్ణకు, రామకృష్ణ (ఆర్కే) బీచ్కి అనుబంధం పెరిగిపోవడానికి కారణం పూ..ల...మ్మి..పెళ్లికాని రామకృష్ణకు పెళ్ళైన పూలమ్మితో పరిచయం. రామకృష్ణకి పెళ్లి కాకపోవడానికి కారణం రామకృష్ణే!అతని జీవితంలో పెళ్లి అనే పదాన్ని వివిధ రూపాల్లో చూశాడు. పెళ్లితో ఒక్కటైనా అమ్మానాన్నల గొడవలు మొదలు, స్నేహితుల కష్టాలు, స్వేచ్ఛ కోల్పోవడాలు చూశాడు.‘సరదాగా స్నేహితులతో మందు కొట్టడానికి కూడా స్వేచ్ఛలేని పెళ్లి’ అని తరచూ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు రామకృష్ణ.ఆడవాళ్ళు పెళ్లి కాకముందు, మగవాళ్ళు పెళ్లయ్యాక భర్తలుగా మారాక, అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించి అబద్ధాలు చెప్పడం, నేర్చుకోవడం మొదలు పెడతారని చెబుతాడు. ఇలాంటి చాలా కారణాలకు తోడు అతడిని ఇంప్రెస్ చేసే అమ్మాయి తారసపడలేదు. అందుకే బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని డిసైడయ్యాడు. ఆఫీస్ వదలగానే, ‘ఎక్కడికెళ్లారు? ఎప్పుడొస్తారు? ఏం చేస్తున్నారు? ఎవరితో ఉన్నారు? వాట్సాప్ వీడియో కాల్ చెయ్’..లాంటి సమస్యలు లేవు కాబట్టి, పెళ్ళైన ఫ్రెండ్స్ బుద్ధిగా, భయంగా ఆఫీస్ వదలగానే ఇంటిముఖం పడతారు కాబట్టి, తనకు అలాంటి బాదరబందీలు లేవు కాబట్టి, ఆఫీస్ వదలగానే ‘ఓ రోజు అలా జగదాంబ సెంటర్కు, మరో రోజు గుడికి, ఇంకో రోజు రామకృష్ణ బీచ్కు వెళ్తూ ఉంటాడు.అలా ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది పూలమ్మి. పరిచయం అయ్యింది అనడం కన్నా తారసపడింది అనాలేమో!సాధారణంగా రామకృష్ణకు గుడికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు కాని, ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. నిండుగా చీర కట్టుకుని, ఒద్దికగా పూలసజ్జతో గుడికి వచ్చే అమ్మాయిలను చూస్తుంటే, ఒక మంచి పెయింటింగ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.పెందరాళే ఇంటికి వెళ్లి ఒరగబెట్టే రాచకార్యాలు లేకపోవడం వల్ల ఇలా చేస్తాడు. తన ఫ్రెండ్ తమ్ముడు శ్రీధర్ దీనికి పెట్టిన పేరు ‘టీపీ టైం’– టైం పాస్ టైం.అలా ఆ రోజు సాయిబాబా గుడికి వచ్చాడు. గుడి బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అతని దృష్టి పూలు అమ్మే అమ్మాయి మీద పడింది.గుడికి వచ్చిన అమ్మాయిల అందమంతా ఆమెలోనే కనిపించింది. వైజాగ్ అమ్మాయిల నవ్వులన్నీ ఆమె పెదవుల్లో కనిపించాయి. కాటన్ చీరలో, చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేంత అందం.అలాంటి అందం పూలమాల కట్టి అమ్ముతుంటే, ఆమె అందమే పువ్వుల్లో చేరి పరిమళాలు వెదజల్లుతుందేమో అనిపించింది.మాట్లాడుతున్న ఫోన్ను మధ్యలో కట్ చేశాడు. చేతిలోని స్మార్ట్ఫోన్ జేబులోకి వెళ్ళింది. అతని కాళ్ళు ఆమె వైపు కదిలాయి.‘రండి సర్, రండి మేడం’ అంటూ వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తోంది. పొడవాటి సన్నటి చేతివేళ్ళు పువ్వులను మాలగా కడుతుంటే, ఆ పువ్వులు పులకరించి పోతున్నట్లు వుంది.‘సర్ పూలు కావాలా?’ అడిగింది రామకృష్ణను చూసి.‘వద్ద’ంటూనే పర్స్లో నుంచి డబ్బులు తీశాడు.‘ఎన్ని మూరలు సర్...’ అంటూనే చేత్తో మూరలు కొలుస్తుంటే, తన మనసును కొలుస్తున్నట్టు అనిపించింది.శనివారం వేంకటేశ్వరస్వామి గుడిలో కనిపించింది. శుక్రవారం మరో గుడిలో– ఎప్పుడు కలిసినా పూలు కొంటూనే వున్నాడు.ఇంటికి వెళ్ళాక అతని మంచం పక్కనే ఆ పూలు టీపాయ్ మీద పేరుకు పోతూనే ఉన్నాయి.ఆమె మెడలో మెరిసే పసుపుతాడు, నుదుట సిందూరం, కాలివేళ్లకు మెట్టెలు, ఆమెకు పెళ్లయిందని చెప్పకనే చెబుతున్నాయి. అయినా ఆమెను చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్.ఒకరోజు నవ్వుతూ అన్నాడు. ‘నీ దగ్గర పూలు కొనడానికి రోజుకో గుడి దగ్గరికి రావలసి వస్తోంది’ అని.ఆమె ఏమాత్రం అతడిని నొప్పించకుండా ‘బీచ్లో అయితే రోజూ సాయంత్రం నుంచి చీకటి పడే వరకు ఉంటాను. మేడం కోసం పూలు కొనాలనుకుంటే అక్కడికి రండి’ అంది అదే చిరునవ్వుతో.అలా అతనికి ఆమె ద్వారా, బీచ్తో మరింత అనుబంధం పెరిగింది.సాయంత్రం ఆఫీస్ వదలగానే బీచ్కు వెళ్లడం ఆమెతో కాసేపు మాట్లాడ్డం, పూలు కొనడం.‘రోజూ మేడంకు పూలు తీసుకువెళ్తారు. మేడంను ఒకసారి తీసుకురండి సర్’ అంది కాస్త చనువు పెరిగాక.నవ్వి ఊరుకున్నాడు రామకృష్ణ. పెళ్ళైన అమ్మాయి పట్ల తాను ఏర్పరచుకున్న ఫీలింగ్ ఏమిటో అతనికే అర్థం కాలేదు.ఒకరోజు అడిగాడు, ‘నీ పేరేమిటి?’ అని ధైర్యం చేసి.‘అందరూ పూలమ్మి అంటారు. అదే నా పేరనుకోండి’ అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వు ఆమె అమ్మే పూల కన్నా ఎక్కువ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది.ఆమె దృష్టిలో అతను వివాహితుడు. అతను అలాగే నటించేశాడు. బీచ్లో జంటలను చూసినప్పుడు ఒకప్పుడు ఏమీ అనిపించేది కాదు. కాని, ఇప్పుడు కొద్దిగా ఏదో ఫీలింగ్. పూలమ్మి పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె జడలోని సన్నజాజులు అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేసున్నాయి.సరిగ్గా అపుడే అతని జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది.ఆ రోజు పూలమ్మి రాలేదు. ఆ రోజే కాదు మరుసటి రోజు కూడా రాలేదు. మూడవరోజు, నాలుగో రోజు...పూలమ్మితో పరిచయం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు పూలమ్మి పూలు అమ్మని రోజు లేదు. వర్షం వచ్చినా సరే, గొడుగు వేసుకుని మరీ బీచ్కు వచ్చేది.రామకృష్ణ కుదురుగా ఉండలేకపోయాడు. పూలమ్మి పూలు అమ్మే ప్రతి గుడికి వెళ్ళాడు. సాయిబాబా గుడికి, వేంకటేశ్వరస్వామి గుడికి, దుర్గ గుడికి– ఎక్కడా కనిపించలేదు. బీచ్కు రావడం లేదు.పూలమ్మికి ఏమైంది?రామకృష్ణ అన్వేషణ మొదలైంది. గుడిలో పూలు అమ్మే వాళ్ళను, బీచ్లో పూలు అమ్మే వాళ్ళను ఎంక్వయిరీ చేశాడు. ఎట్టకేలకు పూలమ్మి చిరునామా సంపాదించాడు. ఆఫీస్ వదలగానే పూలమ్మిని వెతుక్కుంటూ బయలుదేరాడు.∙∙ పూలమ్మి ఇల్లు ఊరికి చివర వుంది. పూలమ్మి ఇంటిని సమీపిస్తున్న కొద్ది రామకృష్ణలో ఉద్వేగం, పూలమ్మిని చూడబోతున్నానన్న ఉద్వేగం ఓ వైపు, ‘ఎందుకొచ్చారు?’ అని అడిగితే ఏం చెప్పాలి? కాళ్ళు పూలమ్మి ఇంటి ముందు ఆగాయి.చిన్న ఇల్లయినా పర్ణకుటీరంలా వుంది. చుట్టూ చెట్లతోనే ప్రహరీ, చిన్న చెక్క గేటు. దానికి అల్లుకున్న మల్లెతీగ. రెండువైపులా చామంతి, బంతి, గులాబీ మొక్కలు. కనకాంబరాలు ఓ పక్క, మరువం ఇంకో పక్క మల్లెతీగలు ఇంటిని అల్లుకుని...ఒక ఉద్యానవనంలోకి వచ్చినట్టు వుంది.చెక్క గేటు తీసుకుని లోపలి అడుగు పెట్టగానే మంచం మీద పడుకుని ఉన్న నాలుగేళ్ల పాప కళ్ళు తెరిచింది. పూలమ్మిని చూసినట్టే వుంది. తన అడుగుల శబ్దం విని కప్పుకున్న దుప్పటి తొలిగించి లేవబోయింది. కాళ్లు చచ్చుబడి సహకరించడం లేదు.రామకృష్ణ మనసు చివుక్కుమంది. పూలమ్మి కూతురికి ఈ కష్టమా?‘అమ్మ లేదా పాపా?’ అడిగాడు రామకృష్ణ. ఛ పాపకు ఏమైనా కొని తీసుకు రావాల్సింది. అయినా తనకు తెలిస్తే కదా, పూలమ్మికి ఓ పాప ఉందని. తానెప్పుడూ అడగలేదు. పూలమ్మి చెప్పనూ లేదు.‘అమ్మ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది అంకుల్’ అంటూ హాలు వైపు చూసింది.రామకృష్ణ లోపలికి అడుగుపెట్టాడు.అప్పుడే పూలమ్మి లైటు వేసింది. లైటు వెలుతురులో పూలమ్మిని అలానే చూస్తూ ఉండిపోయాడు. పూలమ్మి తన మెడలోని మంగళసూత్రం తీసి, ఎదురుగా ఉన్న దేవుని పటం ముందు పెట్టింది. మెట్టెలు తీసేసింది. నుదుట సిందూరం చెరిపేసింది. వెనుతిరిగింది.ఎదురుగా రామకృష్ణ .‘సర్ మీరా? ఇక్కడ.. నా కోసం?’‘నీ అనుమతి లేకుండా నీ ఇంటికి వచ్చాను. సారీ పూలమ్మి’ తలొంచుకుని అన్నాడు రామకృష్ణ.చిన్నగా జీవంలేని నవ్వు నవ్వింది పూలమ్మి.‘మనల్ని సృష్టించిన ఆ దేవుడు మన అనుమతి లేకుండా, మన తలరాతలు తన ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. నా తలరాత చూడటానికి వచ్చారా?’ ఆమె కంట్లో సన్నటి కన్నీటిపొర.‘కాళ్లు చచ్చుబడి పోయిన నా కూతురు, వైధవ్యాన్ని శాపంగా భరిస్తున్న నేను– ఇదీ నా కుటుంబం, తాగుబోతు భర్త, తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరి చావుకు కారణమై, తనూ చచ్చాడు. ఆ పాపం, ఏ పాపం తెలియని నా బిడ్డను వెంటాడింది. నా బిడ్డ కాళ్ళు చచ్చుబడ్డాయి. ఆపరేషన్ చేస్తే తిరిగి నా కూతురు మామూలుగా అవుతుందని చెప్పారు. నా బిడ్డ కాళ్ళు బాగుపడడం కోసం పూలమ్మిగా కొత్త పాత్రలోకి వచ్చాను. ఒకప్పుడు ఇష్టంగా వ్యాపకంగా పెంచుకున్న చెట్లు, నాకు జీవనాధారం అయ్యాయి. గుడిలో దేవుని పాదాల చెంతకు, బీచ్లో అమ్మాయిల జడల్లో కొలువుతీరే పువ్వులు అమ్మే ఈ పూలమ్మి, నుదుట కుంకుమ లేకుండా, వైధవ్యంతో పూలు అమ్మితే అపశకునం అనుకోవచ్చు. అందుకే సుమంగళిగా నటించాను. మోసం చేయడానికి కాదు. నా బిడ్డను బతికించుకోవడానికి నటించాను. ఇంతకు మించి నా కథలో ఏ మలుపులు లేవు’ కళ్ళు తుడుచుకుని చెప్పింది పూలమ్మి.‘ఇప్పుడు ఆ నటనను నిజం చేయొచ్చుగా! నేను సూటిగా చెబుతున్నాను. నాకు పెళ్లి కాలేదు. నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు. నిన్ను చూశాక, ఎందుకో ఒక అందమైన భావం, నీకు పెళ్లయిందని తెలిసినా నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నీ కథ తెలిశాక, జాలితో కాదు, మరింత ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’ రామకృష్ణ మనసులో మాట చెప్పాడు.‘క్షమించండి. మీ మంచి మనసుకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఈ పొగచూరిన మనసును ఇవ్వలేను. నా బిడ్డ కాళ్లు బాగైతే, నా నటనకు స్వస్తి చెప్పి, మరో దారి చూసుకుంటాను. ఈ పూలమ్మిని మర్చిపోండి’ చెప్పింది.‘పోనీ కొన్నాళ్ళు నేను నీకు భర్తగా కాకుండా, నీ బిడ్డకు తండ్రిగా నటిస్తాను. మన బిడ్డకు, సారీ.. నీ కూతురికి కాళ్ళు వచ్చేవరకు. నీకు భర్తగా జీవించే అవకాశం లేనప్పుడు, ఇలా నటించే అవకాశాన్ని కోరడం తప్పు కాదు కదా! ఊహ తెలియకముందే నాన్న విదేశాల్లో ఉన్నాడని నమ్మించి నటించావు. ఆ నాన్నను నేనే అని చెప్పు. ఆ సంతోషంతో త్వరగా నడుస్తుంది. కొన్నాళ్ళైనా నాకు ఇష్టమైన నిన్ను నా జీవితంలోకి నటిగా ఆహ్వానించే అవకాశం ఇవ్వు’ అన్నాడు రామకృష్ణ.అప్పటికే కూతురు వాకింగ్ స్టిక్ సహాయంతో అక్కడికి వచ్చి, ‘ఎవరమ్మా.. నాన్నా.. నాన్నొచ్చాడా? ఆ చిన్నారి కళ్ళలో వెలుగు.కూతురు కళ్ళలో వెలుగు చూసి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక పోయింది. అప్పటికే రామకృష్ణ ఆ పాపను దగ్గరకు తీసుకున్నాడు.‘భలే కనిపెట్టావ్.. ఎంతైనా నా కూతురువి కదా..’ అన్నాడు పూలమ్మి వైపు చూడకుండా.‘నేనంతే నాన్నా!’ అప్రయత్నంగా అంది. ఆ పిలుపుకు చిన్నప్పటి నుంచి దూరమైన ఆ పాప.‘మరి నీ బట్టలు తెచ్చుకోలేదు. నా కోసం ఏమీ తేలేదు. నువ్వు బోల్డు గిఫ్టులు తీసుకు వస్తావని చెప్పింది అమ్మ’ అంది అమాయకంగా.‘ఆఫీస్ పని మీద వచ్చాను. నీ కాళ్ళు బాగయ్యాక మిమ్మల్ని పెద్ద ఇంట్లోకి తీసుకు వెళతాను’ చెప్పాడు. ఆ పాప ఆ నటన నిజమేనని నమ్మి బయటకు వెళ్లి పూలతో మాట్లాడుతోంది.‘మా నాన్నొచ్చాడ’ని చెబుతూ మురిసిపోతోంది.ఆలా అతని పాత్ర నటన మొదలైంది. కానీ అతను జీవిస్తున్నాడు.అతని దినచర్య మారిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాప కోసం బొమ్మలు తీసుకురావడం, పాపను బయటకు తీసుకు వెళ్లడం– అనివార్యంగా పూలమ్మి కూడా అతనితో పాటు వెళ్ళక తప్పడం లేదు.ఒకరోజు బీచ్కి వెళ్లారు. మొదటిసారి బీచ్కి వచ్చిన పాప అక్కడ ఉన్న పిల్లలను చూసి కేరింతలు కొట్టింది. ఇద్దరి చేతులు పట్టుకుని ఇద్దరి భుజాల మీద ఆడుకుంది. సినిమాకు తీసుకువెళ్లాడు. అమ్మ ఒడిలో కూర్చుంది. పూలమ్మి భుజం తాకుతుంటే, రామకృష్ణ మనసులో చిన్నపాటి ఉద్వేగం.పాపకు రామకృష్ణకు మధ్య బంధం పెరిగింది. అయినా తన పరిధిని మించి ఎప్పుడూ పూలమ్మి ఇంట్లోకి, ఆమె గదిలోకి అడుగు పెట్టలేదు. పాప ఎన్నోసార్లు ‘ఎందుకు నాన్న లోపలికి రావు’ అంటే ఏదో కారణం చెప్పేవాడు.పూలమ్మి రామకృష్ణ కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.తర్వాత వంట చేసి క్యారేజీ ఇవ్వడం మొదలైంది.ఆ తర్వాత అతనికి కోసం ఎదురు చూడటం అలవాటైంది. ఒకరోజు వర్షంలో తడిసి వస్తే (అ)ప్రయత్నంగా అతని తల తుడిచింది తన చీర కొంగుతో. అతని బట్టలు ఉతికి ఆరేసింది. ఇస్త్రీ చేసింది.తాను పాప కోసం నటిస్తోందా? అతని మీద ప్రేమతో జీవిస్తోందా? అర్థం కాలేదు పూలమ్మికి.పాపకు ఆపరేషన్ అయ్యింది. కాళ్లు బాగుపడ్డాయి. లేచి నడుస్తోంది. పరుగెత్తుతోంది. ఆ రోజు పాప పుట్టినరోజు. పెద్ద కేక్ తెచ్చాడు. కొత్త బట్టలు తెచ్చాడు. పాపతో కేకు కట్ చేయించాడు. పెద్ద సందడి. అతని మనసులో చిన్న అలజడి.హడావుడి ముగిసింది. అర్ధరాత్రి కావస్తోంది. అప్పటి వరకు ఆడుకుని అలిసిపోయిన పాప నిద్రలోకి జారుకుంది. గడప లోపల పూలమ్మి. గడపకు ఇవతల రామకృష్ణ.‘నేను వెళ్తున్నాను’ చెప్పాడు రామకృష్ణ.‘రేపు కొద్దిగా పెందరాళే రావొచ్చుగా! మీకు ఇష్టమైన మినప్పప్పు మిక్సీకి వేశాను. మినప వడలు, సాంబారు, మీకిష్టమైన పల్లీ చట్నీ’ అని, ‘పోనీ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చుగా...’ ఆశగా అంది పూలమ్మి.‘వెళ్లిపోతానని అంటున్నది ఈ వూరి నుంచి. పాపకు కాళ్లు వచ్చాయి. నా జ్ఞాపకాలకు సరిపడా అనుభూతి దొరికింది. ఇంకా నటించి, ఒక నటుడిగా బతకలేక పోతున్నాను. ఎప్పుడైనా సినిమా పూర్తయితే, పాత్రను, పాత్ర నటనను వదిలి వెళ్ళిపోవలిసిందేగా! అందుకే, ఇప్పుడే ఇక సెలవని...’ రామకృష్ణ గొంతు గాద్గదికం అవుతోంది.‘పాపకు నాన్న ఆఫీస్ పనిమీద మళ్ళీ వెళ్లాడని చెప్పు. నువ్వు జాగ్రత్త పూలమ్మి’ వెనుదిరిగాడు. పూలమ్మి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి వెళ్లలేక.పూలమ్మి అలాగే నిలబడి పోయింది.మొదటిసారి రామకృష్ణ తెచ్చిన చీర కట్టుకుంది.మొదటిసారి మనస్ఫూర్తిగా జడలో రామకృష్ణకు ఇష్టమైన పువ్వులు పెట్టుకుంది.మొదటిసారి నటించడం మాని జీవించింది.‘వెళ్ళండి ... ఎంతైనా మగ మహారాజులు కదా! కూతురి పుట్టినరోజు కూడా బలాదూర్ తిరగండి. ఇంట్లో భార్య ఉంది. అది తన కోసం ఎదురుచూస్తుంది అని ఆలోచించకుండా వెళ్ళండి’ పూలమ్మి ఉక్రోషంగా అంది. గొంతులో దుఃఖం తన్నుకు వస్తోంది.ఒక్కసారిగా గిరుక్కున వెనక్కి తిరిగాడు. గుమ్మం ముందు నిలబడి తాను తెచ్చిన చీర కట్టుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, తన పూలమ్మి, కళ్ళనుండి నీళ్లు ఒంపుకొని... మనసు నిండా ప్రేమ నింపుకొని... రెండు చేతులు చాచి, గుమ్మానికి అడ్డు తొలగి లోపలి గది లోపలికి, తన మనసు గదిలోకి ఆహ్వానిస్తూ...నుదుట కుంకుమ చెదిరి, తలలో పూలు అలసి, ఒంటిమీద ఉన్న ఆచ్ఛాదనలు చెదిరి, దేహాలు ఒక్కటై, తెల్లవారు ఝామున వినిపించే కువకువల సుప్రభాతం వింటూ... ఒకరినొకరు చుట్టుకుని... నిన్నటి వరకు నటించిన పాత్రలకు జీవం పోసి, నటన వదిలి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.మరోసారి పూలమ్మిని చుట్టేస్తూ ‘అవును నీ పేరేమిటి పూలమ్మీ’ అడిగాడు.‘మీరు ప్రేమతో పిలిచే పేరే. పూలమ్మి...’ అతని గుండెలో ఒదిగిపోతూ చెప్పింది పూలమ్మి.

మన ముచ్చట: పుస్తకానికి గుడి
దేవుళ్లు, దేవతలకు ఆలయాలు నిర్మించడం అందరికీ తెలిసిందే. అదే మనుషులకైతే ఒకింత ఆశ్చర్యమే మరి! అప్పుడెప్పుడో తమిళనాడులో నటి ఖుష్బూకు అభిమానులు గుడి కట్టించారు. అదే రాష్ట్రంలోని అరియలూర్ జిల్లాలో భార్యపై గల ఇష్టంతో ఓ భర్త ప్రేమ మందిరం నిర్మించాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఓ భార్యామణి మరణించిన భర్త జ్ఞాపకాలను పదిలపరుస్తూ గుడి కట్టారు. ఆమధ్య శ్రీకాకుళంలో ఓ పుత్రుడు తల్లికి, విశాఖపట్నంలో ఇంకో కొడుకు తండ్రికి ఆలయాలు నెలకొల్పి వార్తల్లోకెక్కారు. వీటన్నింటినీ పక్కన పెడితే, కేరళ రాష్ట్రంలో విశేషమైన జ్ఞాన ఆలయం ఒకటుంది. కన్నూర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో చెరుపుళ పట్టణ సమీపంలోని ప్రపోయిల్ అనే చిన్న గ్రామంలో పుస్తకానికి గుడి కట్టారు. లోపల దేవుళ్లుండరు. పుస్తకమే దేవత. దానికే పూజాదికాలు నిర్వహిస్తారు. నైవేద్యంగా సమర్పించిన పుస్తకాలనే తిరిగి ప్రసాదంగా వితరణ చేస్తారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఈ గుడికి వెళ్లి పూజలు చేయవచ్చు. ఇక్కడ పూజారులు ఉండరు, హుండీలు కనిపించవు. ఇది నవపురం మతాతీత ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు.తొలి అడుగు...జ్ఞానం కంటే ఉన్నతమైన మతం మరొకటి ఉండదని భావించిన విద్యావేత్త, చెరుపుళ విన్నర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.నారాయణ ఈ పుస్తకాలయ రూపశిల్పి. సహజ సిద్ధమైన పెద్ద రాతిపై విగ్రహ రూపంలో పుస్తకం దర్శనమిస్తుంది. దీన్ని కాసర్గోడ్ జిల్లా కంబల్లోర్ గ్రామానికి చెందిన సంతోష్ మానసం అందంగా చెక్కారు. 2021 మార్చి 4న ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా, అక్టోబరులో విగ్రహ ప్రతిష్ఠాపన జరిపి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయం చుట్టూ పచ్చదనం పరచుకుని ఉంటుంది. సందర్శకులు ప్రవేశ ద్వారం గుండా లోపలికి అడుగిడగానే నిశ్శబ్దం రాజ్యమేలుతోందా అన్నట్లు ఉంటుంది. ప్రవేశ ద్వారం గోడలు కేరళ రాష్ట్ర సాహితీ సాంస్కృతిక వారసత్వాలను వివరించే శిల్పాలతో నిండి ఉంటాయి. ఒకవైపు బుద్ధుడి చిత్రం, మరో చిహ్నంగా రాతి దీపం కనిపిస్తుంటాయి. ఆలయ ప్రధాన దేవత ఒక భారీ కాంక్రీటు పుస్తకం. 30 అడుగుల ఎత్తులో సహజమైన రాయిపై ఉంది. దాని చుట్టూ అనేక పొత్తాలు చిత్తాన్ని దోచే రీతిలో అందంగా అలంకరించి ఉంటాయి. ఒకవైపు పాత, కొత్త పుస్తకాల వాసన, మరోవైపు చందన పరిమళాలు, ఇవి చాలవన్నట్లు వేసిన ధూపం తాలూకు గుబాళింపు నాసికా రంధ్రాలకు చేరి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.ఆలయానికి రూ.7.6 కోట్లువారసత్వ ఆస్తిగా రెండెకరాల భూమి దక్కించుకున్న నారాయణ స్వయంకృషితో సంపాదించిన ప్రతి రూపాయి ఈ ఆలయం కోసం వెచ్చించారు. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి ఫర్వాలేదు. గుడి కోసం ఇప్పటి వరకు రూ.7.6 కోట్లకుపైగా ఖర్చుచేశారు. ఇందులో కొద్ది శాతం మాత్రమే విరాళాలుగా స్వీకరించారు. ఈ నాలుగేళ్లలో భక్తులు నైవేద్యంగా సమర్పించిన పుస్తకాల సంఖ్య ఐదు వేలకు చేరుకుంది. ఆలయం ఆవరణలో రచయితలు చక్కగా కూర్చుని రాసుకునేందుకు వీలుగా మూడు షెడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా రెండు ప్రధాన ఉత్సవాలను నిర్వహిస్తారు. సాహిత్య చర్చలు, నృత్య ప్రదర్శనలు, పుస్తకావిష్కరణలు, సెమినార్లు, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా రచయితలకు అవార్డులు ప్రదానం చేస్తారు. జ్ఞానోదయం దైవత్వానికి నిజమైన మార్గమని ఈ ఆలయం దర్శించుకున్నవారికి అనుభూతి కలుగుతుంది. జ్ఞానం, విద్య, మానవ పురోగతి, ఆధ్యాత్మిక ప్రగతికి ఈ ఆలయం పునాది అనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జ్ఞానారాధన కేంద్రం. ∙

‘స్టెమ్’లో జెమ్స్ లేరా?
యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ ‘జెమ్’ నివేదిక ప్రకారం స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్) ఫీల్డ్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్స్లో మహిళలు కేవలం 35 శాతం మాత్రమే ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ జెండర్ గ్యాప్ను తగ్గించడంలో ఎలాంటి పురోగతీ లేదు.మ్యాథ్మేటిక్స్లాంటి సబ్జెక్ట్లో బాలురతో సమానంగా అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ తమ మీద తమకు విశ్వాసం లేక΄ోవడం నుంచి మొదలు రకరకాల ఆటంకాలు ‘స్టెమ్’లో మహిళలప్రొతినిధ్యం తక్కువ ఉండడానికి కారణం అవుతున్నాయి.‘జెమ్’ డేటా ప్రకారం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 26 శాతం మంది ప్రొఫెషనల్స్ మాత్రమే మహిళలు. ‘క్లౌడ్ కంప్యూటింగ్’లాంటి స్పెషలైజ్డ్ ఫీల్డ్లలో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది.‘స్టెమ్’ ఎడ్యుకేషన్కి సంబంధించి 68 శాతం దేశాలు ్ర΄ోత్సాహక విధానాలు రూపొందించినప్పటికీ వాటిలో సగం మాత్రమే మహిళలను ఎంకరేజ్ చేసే ప్రత్యేక విధానాలు ఉన్నాయి. స్టెమ్ ఎడ్యుకేషన్లో మహిళల ప్రొతినిధ్యాన్ని పెంచడానికి ‘జెమ్’ కొన్ని సూచనలు చేసింది.ఉదా: లింగవివక్షతను గుర్తించి, అరికట్టడానికి అవసరమైన శిక్షణను టీచర్లు, స్కూల్ లీడర్లకు ఇవ్వాలి. ∙మహిళల నాయకత్వంలో ‘స్టెమ్’ క్లబ్లను ఏర్పాటు చేయాలి క్లాస్రూమ్లో జెండర్–న్యూట్రల్ లాంగ్వేజ్ని ఉపయోగించేలా చూడాలి అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ‘స్టెమ్’ ఎక్స్పర్ట్లతో క్లాసులో ఉపన్యాసాలు ఇప్పించాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

కాన్స్ ఫిలిం ఫెస్టివల్పై కుట్ర!
పారిస్: ఫ్రాన్స్లో ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సమయంలోనే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. దక్షిణ ఫ్రాన్స్లోని అల్పిస్–మారిటైమ్స్ ప్రాంతంలో శనివారం ఉదయం 1.60 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఇదే ప్రాంతంలో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. కరెంటు లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలు రద్దు చేయాల్సి వచ్చింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలు యథాతథంగా జరిగాయి. కరెంటు సరఫరా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి కాన్స్ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల విద్యుత్ గ్రిడ్లో సమస్యలు తలెత్తాయి. హై–ఓల్టేజీ కరెంటు లైన్ ఒకటి కూలిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. దీనివల్ల అల్పిస్–మారిటైమ్స్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అయితే, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం జరగడం వెనుక కుట్ర ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్కు అంతరాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు.

ఉగ్రవాదుల వేటకు భారత్-నేపాల్ సంయుక్త ఆపరేషన్
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్తానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందిన దరిమిలా ఇరు దేశాలు సంయుక్తంగా పెట్రోలింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. పాకిస్తానీ ఉగ్రవాదులను(Pakistani terrorists) గుర్తించేందుకు నేపాలీ దళాలతో కలిసి ఎస్ఎస్బీ అధికారులు భారత-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించారని ఇండియా టుడే పేర్కొంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం భారతదేశ సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ),నేపాల్కు చెందిన సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్)లు సరిహద్దుల్లోని దట్టమైన అడవులలో సంయుక్తంగా గాలింపు చేపట్టాయని సమాచారం. భారత్-నేపాల్ 1,700 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఎస్ఎస్బీ కమాండెంట్ గంగా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము జరిపిన ఉమ్మడి పెట్రోలింగ్(Joint patrolling)లో నేపాల్ సైనికులు ఉగ్రవాదంపై పోరాటానికి తమతో సహకరించారని అన్నారు. నేపాలీ సైనిక దళాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రతి నెలా రెండు దేశాల సరిహద్దు దళాల సమన్వయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. నేపాల్ సైనికాధికారులు తమ నిఘా సమాచారాన్ని భారత్తో పంచుకున్నారని, తాము కూడా వారితో సమాచారాన్ని షేర్ చేసుకున్నామన్నారు.నేపాల్గంజ్ ప్రాంతంలో ఒక మర్కాజ్ (ఇస్లామిక్ సంస్థ) ఉందని, అక్కడనిర్వహించే కార్యక్రమాలకు పాకిస్తానీలు తరచూ వచ్చేవారని సింగ్ తెలిపారు. ఎస్ఎస్బీ దళాలు నేపాల్ సరిహద్దుల్లో వాచ్ టవర్ల నుండి నిఘా సారించాయని చెప్పారు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో నేపాల్ ప్రభుత్వం భారత్కు సంఘీభావం ప్రకటించింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ‘ఉగ్రవాదంపై పోరాటంలో నేపాల్ అందరితో కలిసి పనిచేస్తుందని’ పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతిచెందగా, వారిలో ఒక నేపాలీ జాతీయుడు కూడా ఉన్నారు.ఇది కూడా చదవండి: ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్

ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్
న్యూఢిల్లీ: గడచిన నాలుగు దశాబ్ధాలలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు 20 వేల మందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి(United Nations)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన దరిమిలా పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఐక్యరాజ్య సమితిలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూయార్క్లోగల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నదని, అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించే వరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ఈ ఒప్పంద అంశాన్ని లేవనెత్తిన తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది. #IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 202565 ఏళ్ల క్రితం భారత్ సింధు జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని, అయితే పాకిస్తాన్ భారత్పై మూడు యుద్ధాలు జరిపి, లెక్కకుమించిన ఉగ్రవాద దాడులను చేయడం ద్వారా ఆ ఒప్పందపు స్ఫూర్తిని ఉల్లంఘించిందని హరీష్ పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ పాకిస్తాన్ విషయంలో అసాధారణ సహనం, ఉదారతను ప్రదర్శించిందని హరీష్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం
జాతీయం

షెంజెన్ వీసా దరఖాస్తుల తిరస్కరణ
న్యూఢిల్లీ: యూరోపియన్ దేశాల్లో 3 నుంచి ఆర్నెల్ల పాటు ఉండేందుకు వీలు కల్పించే షెంజెన్ వీసాలు భారతీయులకు నానాటికీ తగ్గుతున్నాయి. 2024లో 1.65 లక్షల వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ జాబితాలో అల్జీరియా, టర్కీ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. దరఖాస్తు రుసుం రూపేణా మనవాళ్లు రూ.136.6 కోట్లు కోల్పోయారు. ఇండియా నుంచి 11.08 లక్షల మంది దరఖాస్తు చేయగా, ఇందులో 5.91 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందాయి. 1.65 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. మిగతా దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెంజెన్ వీసాతో యూరప్లోని 26 దేశాల్లో పర్యటించవచ్చు.

సైనిక వితంతువుల సంక్షేమ నిధికి ప్రీతి జింటా రూ.1.10 కోట్ల విరాళం
జైపూర్: క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, సినీ నటి ప్రీతీ జింటా సైనిక వితంతువుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కి రూ.1.10 కోట్ల విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)నిధిలోని జింటా వాటా నుంచి ఈ విరాళాన్ని ఆమె ప్రకటించారు. ఈ మొత్తాన్ని సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నారు. శనివారం జైపూర్లో జరిగిన ఏడబ్ల్యూడబ్ల్యూఏ సమావేశంలో ప్రీతీ జింటా ఈ విరాళాన్ని ప్రకటించారు. ‘సాయుధ బలగాల కుటుంబాలకు సాయంగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు తగు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేం. కానీ, మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దాం’అని ఆమె పేర్కొన్నారు.

భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా... ఉగ్రవాదులపై తిరగబడాల్సింది
భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ‘‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగి్నవీర్ల వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’’ అన్నారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపీందర్సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.

అధైర్యపడొద్దు..
పూంచ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం జమ్మూకశ్మీర్లోని పూంచ్ పట్టణంలో పర్యటించారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ దాకా పాకిస్తాన్ సైన్యం దాడు ల్లో మృతిచెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. గంటకుపైగా బాధితులతో మాట్లాడారు. వారి ఆవేదన విని చలించిపోయారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. బాధితుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని, అందరికీ తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నియంత్రణ రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంచ్ టౌన్లో క్రిస్ట్ స్కూల్ను రాహుల్ సందర్శించారు. మే 7న ఉదయం పాక్ సైన్యం దాడుల్లో ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. అయాన్, అరూబా అనే 13 ఏళ్ల ఇద్దరు కవలలు, రమీజ్ ఖాన్ అనే మరో విద్యార్థి మరణించాడు. తమ మిత్రులు దూరం కావడాన్ని ఈ స్కూల్ విద్యార్థులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. రాహుల్ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతా త్వర లోనే సర్దుకుంటుందని అన్నారు. ‘‘మీకు ఎదురైన సమస్యలకు ప్రతిస్పందనగా చదువులపై దృష్టి పెట్టండి’’అని సూచించారు. చక్కగా చదువుకోవాలని, చక్కగా ఆడుకోవాలని, ఎంతోమంది స్నేహితులను సంపాదించుకోవాలి అంటూ విద్యార్థులను ఓదార్చారు. పూంచ్ నుంచి ఓ కుటుంబం కారులో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతుండగా పాకిస్తాన్ క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో కారులో ఉన్న 13 ఏళ్ల బాలుడు విహాన్ భార్గవ్ ప్రాణాలు కోల్పోయాడు. విహాన్ భార్గవ్ కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శించారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

రెండు దుర్ఘటనల్లో.. ఏడుగురు బలి!
చింతకొమ్మదిన్నె/సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన దుర్ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. విజయవాడలోని ఓ అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ ముగ్గురు బలయ్యారు. వివరాలివీ.. కారుపైకి లారీ దూసుకొచ్చి.. వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన బసినేని శ్రీకాంత్రెడ్డి, బి. కోడూరుకు చెందిన కోగటం తిరుపతిరెడ్డి కుటుంబాలు బెంగళూరులో ఉంటున్నాయి. వీరిలో శ్రీకాంత్రెడ్డి బెంగళూరులో.. తిరుపతిరెడ్డి జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తిరుపతిరెడ్డి ఇటీవలే స్వదేశానికి వచ్చి వారం రోజుల కిందట తిరిగి జర్మనీకి వెళ్లాడు. ఈ క్రమంలో.. శ్రీకాంత్రెడ్డి (32), తన భార్య శిరీష (28), కుమార్తె త్రిషికారెడ్డి (3).. తిరుపతిరెడ్డి భార్య శశికళ (35), కుమార్తె సాయి హర్షిత (9), కుమారుడు రిషికేశవర్రెడ్డి (8), శశికళ సోదరి స్వర్ణ (38) కడప జిల్లా బద్వేలుకు శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి బయల్దేరారు. సమీప బంధువులైన వీరంతా తమ స్వగ్రామం బద్వేలు మండలం చిన్న పుత్తాయపల్లెలోని శ్రీరాముల దేవాలయంలో జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వీరి కారు కడప–చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్.. చింతకొమ్మదిన్నె రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చిoది. అదే సమయంలో ఎరువుల లోడుతో విల్లుపురం నుంచి హైదరాబాదుకు వెళ్తున్న లారీ వెనక నుంచి వేగంగా వచ్చి, కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో శ్రీకాంత్రెడ్డి, శిరీష, రిషికేశవర్రెడ్డి, సాయిహర్షిత అక్కడికక్కడే మరణించారు. ప్రమాదాన్ని పసిగట్టి శ్రీకాంత్, శిరీషలు తమ కుమార్తె చిన్నారి త్రిషికారెడ్డిని కారు నుంచి బయటకు తోసేయగా మట్టి కుప్పలపై పడి గాయపడింది. చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్, డీటీఆర్బీ (డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో) సీఐ మహమ్మద్ బాబా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్రేన్ సాయంతో కారు, లారీని వేరుచేశారు. కారులో ఇరుక్కుపోయిన నాలుగు మృతదేహాలను బయటికి తీసేందుకు గంటన్నరసేపు శ్రమించాల్సి వచి్చంది. క్షతగాత్రులను కడప రిమ్స్కు తరలించి మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారు.దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీ సాయిటవర్స్ అపార్ట్మెంట్లో కాకినాడు జిల్లా సామర్లకోటకు చెందిన చలాది రామదుర్గా ప్రసాద్ (55), రాధ (45) ఉంటున్నారు. ప్రసాద్ లారీడ్రైవర్గా పనిచేసేవారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రసాద్ చెల్లి ఊటుకూరి ముత్యావళి (42) ఇంటి ముందు ఇనుప తీగపై దుస్తులు ఆరేసేందుకు వెళ్లింది. కరెంట్ వైరు, కేబుల్ వైరు, దుస్తులు ఆరేసే తీగ అన్నీ కలిపి ఉన్నాయి. వర్షాలతో ఎర్త్వైర్కు విద్యుత్ సరఫరా అవడంతో తీగపై దుస్తులు వేయగానే ముత్యావళి విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన ప్రసాద్, రాధ షాక్కు గురయ్యారు. ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఫ్లాట్ ఖాళీచేస్తున్న తరుణంలో.. కుటుంబ తగాదాల నేపథ్యంలో ప్రసాద్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఖాళీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ముత్యావళి రెండ్రోజుల క్రితం కడియం నుంచి వచ్చింది. సామగ్రిని తరలించేందుకు అన్నీ సర్దుకుని మరికొన్ని గంటల్లో బయల్దేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి ఇంట్లో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా రాజమహేంద్రవరంలోని వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రమాదం జరిగిన ఇంటికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రచ్చకెక్కిన డాక్టర్బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్ను హ్యాక్ చేసి ఆమె డీప్ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.

భర్తతో విడిపోయేందుకు పసికందును చంపేసింది.. ...
దుబ్బాక(మెదక్): మావనత్వం మంటగలిసింది.. నవమాసాలు మోసి.. పేగు తెంచుకొని పుట్టిన రెండు మాసాల పసికందును ఆ కర్కశ తల్లి బావిలో వేసి కడతేర్చింది.. ఆపై తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారంటూ డ్రామాకు తెరలేపింది.. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కర్కశ తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే బావిలో వేసి చంపానంటూ ఒప్పుకుంది. ఈ అమానుషమైన ఘటనకు సంబంధించి శుక్రవారం దుబ్బాక సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన రామగల శ్రీమాన్, నంగునూర్ మండలం నర్మెట్టకు చెందిన కవిత మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసకున్నారు. వీరికి రెండు నెలల కిందట కుమారుడు పుట్టడటంతో దీక్షిత్ కుమార్ పేరు పెట్టారు. భర్త శ్రీమాన్ దొంగతనం కేసుల్లో రెండు సార్లు జైల్కు వెళ్లడం.. తనను సరిగ్గా చూసుకోకుండా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ రావడంతోపాటు తల్లిదండ్రులకు దూరం కావడంతో కవిత కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతూ వస్తుంది. భర్తతో ఉండటం ఇష్టం లేక కవిత ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. పది రోజుల కిందట అత్తగారిల్లు పుల్లూరులో గొడవపడి శ్రీమాన్ అమ్మమ్మ గారింటికి దుబ్బాక మండలం అప్పనపల్లికి వచ్చారు. శ్రీమాన్ 17వ తేదిన పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లి అక్కడే ఉన్నాడు. భర్తతో ఉండటం ఇష్టం లేక ఎలాగైన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు రెండు నెలల పసికందు దీక్షిత్ అడ్డుగా ఉన్నాడని భావించి ఓ పథకాన్ని వేసింది.కిడ్నాప్ డ్రామా..ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో దీక్షిత్ను బావిలో పడేసింది. ఏం తెలియనట్లుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తన బిడ్డను ఎత్తుకెళ్లారంటూ కిడ్నాప్ డ్రామా ఆడి తన భర్తతో కలిసి బుధవారం రాత్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు, ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి కవితను అదుపులోకి తీసుకొని విచారించగా తనకు భర్తతో ఉండటం ఇష్టం లేకనే పసికందును బావిలో వేసినట్లు తెలపడంతో గురువారం బావిలో గాలించి పసికందు మృతదేహాన్ని వెలికితీసినట్లు సీఐ తెలిపారు. ఈ వ్యవహారంలో శ్రీమాన్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కవితను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు.

‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్లోని జైపూర్లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు.. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.వైశాలీ నగర్లోనూ .. జైపూర్లోని వైశాలీనగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు.