1,95,799 మంది ఓటర్లు పెరిగారు | 1,95,799 voters increased | Sakshi
Sakshi News home page

1,95,799 మంది ఓటర్లు పెరిగారు

Published Sat, Jan 25 2014 2:02 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

1,95,799  voters increased

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్ : జిల్లాలో శుక్రవారం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 1,95,799 ఓట్లు కొత్తగా  పెరిగాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఎన్నికల్లో భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఇటీవల నిర్వహించిన ఓటర్ల నమోదు కార్యక్రమానికి జిల్లా నుంచి మంచి స్పందన వచ్చింది.
 
 రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి జిల్లాలో 2,66,457 మంది కొత్త ఓటర్లు చేరారు. ఎన్నికల సంఘం పలు దఫాలుగా నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమంతో అనేక మంది ఓటర్లుగా చేరడానికి ముందుకొచ్చారు. ప్రత్యేకించి ఈ దఫా యువతను లక్ష్యం గా చేసుకుని నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు, చిరునామాల మార్పులకు కూడా దీర్ఘ కాలం సమయం ఇచ్చారు. గతేడాది జనవరి 15వ తేదీ ప్రచురించిన ఓటర్ల తుది జాబితాలో జిల్లాలో 19,87,244 మంది ఓటర్లు ఉన్నారు. శుక్రవారం నాటికి కొత్తగా 2,66,457 మంది ఓటర్లు చేరగా, పాత జాబితాల్లోని 70,659 మందిని తొలగిం చారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 21,83,042కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement