Voters list
-
ప్రైవేట్ వ్యక్తి చేతిలో ‘పోలింగ్’ ప్రక్రియ
సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ పర్యవేక్షణ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్గా ప్రైవేట్ వ్యక్తి బోడపాటి అనిల్ను నియమించడం చర్చ నీయాంశమైంది. తొలుత ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో నెలకు రూ.1.40 లక్షల వేతనంతో ఈయన పని చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపిక కమిటీ సిఫారసుతో ఈయన్ను నియమించామని తెలిపారు. ఎంపిక కమిటీలో ఎవరున్నారనేది ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్–నెట్ను ఐటీ ప్రాజెక్టు మేనేజర్ అమలు చేస్తారని తెలిపారు. ఈవీఎంలు, సాప్ట్వేర్ ట్రాకింగ్తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్వం ఇకపై బోడపాటి అనిల్ పర్యవేక్షణలో ఉంటాయి. తద్వారా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పాతర వేయడమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.ఐటీ ప్రాజెక్టు మేనేజర్ విధులు ఇలా.. » ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏటా నిరంతర నవీకరణ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ–సేవా, మీ–సేవా కేంద్రాల ద్వారా ఎలక్టోరల్ రోల్స్లో పేరు చేర్చడం, పీవీసీ కార్డుల జారీ కోసం పౌర సేవల దరఖాస్తు అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం. » రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పర్యవేక్షించడం. » ఎస్ఎంఎస్ గేట్వే ఏకీకరణ, ఎస్ఎంఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ అమలు పర్యవేక్షణ. ఐటీ అప్లికేషన్స్ (ఇఆర్ఓ–నెట్, సైబర్ సెక్యూరిటీ, ఈ–రోల్ పర్యవేక్షణ), ఫామ్ 1–8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ల పర్యవేక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, కౌంటింగ్ అండ్ ఇండెక్స్ కార్డు అప్లికేషన్ల పర్యవేక్షణ. » కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో ఆన్లైన్ కార్యకలాపాలు, ఐటీ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణ. వీటితో పాటు ఓటర్ల జాబితా సవరణకు ముందు తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేయడం. -
తెలంగాణ ఓటర్ల సంఖ్య 3,35,27,925
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925కి పెరిగింది. వీరిలో 1,68,67,735 మంది మహిళలు, 1,66,41,489 మంది పురుషులు, 2,829 మంది ట్రాన్స్జెండర్లు, మరో 15,872 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025లో భాగంగా తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్రెడ్డి ప్రకటించారు. కొత్తగా 2,19,610 ఓటర్లను జాబితాలో చేర్చగా, మరో 1,17,932 ఓటర్లను తొలగించారు. 2024 ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నారు. 2024తో పోల్చుకుంటే–2025లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ పోలింగ్ కేంద్రాల వారీగా 119 శాసనసభ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను వెబ్సైట్ (https://ceotelangana.nic.in)లో ఉంచినట్టు సుదర్శన్రెడ్డి వెల్లడించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టు ద్వారా ఇళ్లకు ఉచితంగా పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు, వివరాల దిద్దుబాటు నిరంతర ప్రక్రియ అని, ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov.in)లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు సైతం ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారిని18 ఏళ్లు నిండిన తర్వాత జాబితాలో చేర్చుతామని వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, ప్రవాస ఓటర్లకు ఫారం–6ఏ, స్వచ్ఛందంగా ఆధార్ వివరాలు ఇవ్వడానికి ఫారం–6బీ, ఓటర్ల తొలగింపు కోసం ఫారం–7, వివరాల దిద్దుబాటు/నవీకరణ కోసం ఫారం–8 ఉపయోగించాలని చెప్పారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,356 నుంచి 35,907కి పెరిగింది. పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 14,464 నుంచి 14,750కి, గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,892 నుంచి 21,157కి పెరిగింది. మొత్తం 551 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కానుండగా, అందులో 286 పట్టణ, 265 గ్రామీణ పోలింగ్ కేంద్రాలున్నాయి. 90 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. కేవలం 29 స్థానాల్లోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని చోట్లా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. -
ఇదేం విచిత్రం.. 138 మందికి ఒక్కడే తండ్రి..
ఎవరైనా ఒకరు, ఇద్దరికీ తండ్రి అనడం కామన్. లేదంటే నలుగురు, ఆరుగురుకి తండ్రిగా ఉంటారు. కానీ ఓచోట ఓ వ్యక్తి 100 మందిపైగా తండ్రి అయ్యాడు. బిహార్లోని ముజఫర్పూర్లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 138 మందికే ఒకే తండ్రి ఉన్నారు. ఈ వార్త తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. దీని వెనుక అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.బిహార్లోని తిర్హుట్ పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం అధికారులు ఓటర్ల జాబితా తయారు చేశారు.ఔరాయ్ బ్లాక్లోని బూత నంబర్ 54లో 724 ఓటర్లు ఉన్నారు. అందులో 138 మంది ఓటర్ల తండ్రి పేరు మున్నా కమార్ అంకిత్గా ఉంది. వీరిలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జేడీయూ అభ్యర్థి అభిషేక్ ఝా ఓటర్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు.ఓట్లు తనకు పడకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీదనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
‘మహా’ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లే అధికం
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్(ఎన్సీపీ), షిండే(శివసేన), ప్రతిప్రక్షాల మహా వికాస్ అఘాడీ కూటమి (కాంగ్రెస్, ఠాక్రే (శివసేన), శరద్ పవార్ (ఎన్సీపీ) ప్రచారంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇక.. తుది ఓటర్ల జాబితా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4 కోట్లమంది పురుష ఓటర్లు, 4.7కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన అక్టోబర్ 15, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమోదుకు చివరి తేదీ అక్టోబర్ 19 మధ్య సుమారు 6.55 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. కూటమి పార్టీల గెలుపులో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారని ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
గ్రామీణ ఓటర్లు @ 1,67,33,584
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తాజాగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రచురించింది. దీనికి సంబంధించి ఇదివరకే ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారం, ఆ మేరకు ఓట్ల తొలగింపు తర్వాత మండల, పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై డిస్ప్లే చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 1,67,33, 584 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. రాష్ట్రంలోని మొత్తం 538 మండలాలు, వాటి పరిధిలోని 12,867 గ్రామ పంచాయతీలు, 1,13,722 వార్డుల్లో ఈ మొత్తం ఓటర్లలో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతరులు (ట్రాన్సజెండర్లు) ఉన్నారు. నల్లగొండ జిల్లా టాప్.. మేడ్చల్ లాస్ట్ గ్రామీణ ఓటర్ల పరంగా చూస్తే నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలోని 31 మండలాల్లోని 856 గ్రామపంచాయతీల్లో 7,392 వార్డుల్లో మొత్తం 10,42,545 ఓటర్లున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యల్ప గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో గతంలో ఐదు మండలాలు ఉండగా వాటిలో కీసర, ఘట్కేసర్ మండలాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మేడ్చల్ జిల్లా 3 మండలాల్లోని 34 గ్రామపంచాయతీలు..320 వార్డుల్లో మొత్తం 64,397 ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. -
4,85,729 మంది డూప్లికేట్ ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్) 2025లో భాగంగా రాష్ట్రంలో 4,85,729 మంది ఓటర్ల పేర్లు, ఇతర సమాచారం ఒకే రీతి(సిమిలర్ ఎంట్రీ)లో ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. ఒకే నియోజకవర్గం ఒకే పార్ట్ పరిధిలో 52,586 మంది, ఒకే నియోజకవర్గం వేర్వేరు పార్ట్ల పరిధిలో 1,10,994 మంది, వేర్వేరు నియోజకవర్గాల పరిధిలో 3,22,149 మంది ఇలాంటి ఓటర్లున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 21,432 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగించామని చెప్పారు. బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన నిర్వహిస్తున్నారని, గత నెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 3,33,11,347 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 70,60,288 (21.19 శాతం) మంది ఓటర్లను గుర్తించి నిర్ధారించినట్టు తెలిపారు. 10,224 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని, 23,220 మంది వలస వెళ్లారని, 21,465 మంది చనిపోయారని, 12,763 మంది ఫొటోలు సరిగ్గా లేవని, 5,677 మందికి రెండు ఓట్లున్నట్టు గుర్తించినట్టు సీఈఓ తెలిపారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్రెడ్డి తెలిపారు. నాటి నుంచి నవంబర్ 28 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖా స్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 2025 జనవరి 1కి కనీసం 18 ఏళ్లు కలిగి ఉండేవారు ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సైతం ఒక పర్యాయంలో 10 దరఖాస్తులు, అభ్యంతరాలు చొప్పున 3 పర్యాయాల్లో 30 దరఖాస్తులు, అభ్యంతరాలను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమరి్పంచవచ్చునని చెప్పారు. -
శాంతిభద్రతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తనిఖీలు, ఆస్తుల జప్తు జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 3న సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద కనీసం ఒక కెమేరాతో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్ను ఉంచాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సేవల్లో ఉండే 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి తప్పనిసరి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ఘటనలకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫారం–7, వివరాలు సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించొద్దన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేంధిరప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ ఈనాడు కుట్రవార్తలు
-
ఓటర్ల జాబితాపై ఎల్లో మీడియా నోరు మూయించిన సుప్రీంకోర్టు
-
ఓటర్ల జాబితాలపై ‘సుప్రీం’ సంతృప్తి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులపై నిత్యం అడ్డగోలు ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేస్తున్న ఎల్లో మీడియా నోళ్లు మూయిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఓటర్ల జాబితాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం చర్యలు సంతృప్తికరంగా ఉన్నందున ఈ వ్యవహారంలో తదుపరి తమ నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారిన ఓటర్లు లేదా మరణించిన ఓటర్లు లేదా డూప్లికేట్గా నమోదైన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే విషయంలో చట్ట నిబంధనల మేరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు, ఓటర్ల జాబితా సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకతతో చేపడుతున్నామన్న సీఈసీ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు చట్ట ప్రకారం వారికి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక తదుపరి ఆదేశాలతో పనేముందని విచారణ సందర్భంగా పిటిషనర్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసిందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యంతో తదుపరి విచారణ అవసరం లేదంది. ఓటర్ల జాబితా విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ప్రతివాదులుగా చేర్చడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ ‘సన్సద్ బాచావో ట్రస్ట్’ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన విసృ్తత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సన్సద్ బచావో ట్రస్ట్ పిటిషన్పై విచారణ రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం సవరణ ఓటర్ల జాబితాలను తయారు చేసేలా ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించాలని, అలాగే చిరునామా మారిన, మరణించిన, డూప్లికేట్గా నమోదైన ఓటర్ల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ సన్సద్ బాచావో ట్రస్ట్ 2023లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆరోరా వాదనలు వినిపిస్తూ.. డూప్లికేట్ ఓటర్ల విషయంలో ఎన్నికల అధికారులు సరిగ్గా స్పందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అమిత్ శర్మ స్పందిస్తూ.. డూప్లికేట్ ఓటర్లతో సహా ఓటర్ల జాబితా విషయంలో తాము తీసుకుంటున్న అన్ని చర్యలనూ వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ‘చట్టానికి లోబడే చేస్తున్నాం’ ఈ నేపథ్యంలో అమిత్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఓ నోట్ కూడా ధర్మాసనం ముందుంచారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు సుప్రీం ధర్మాసనం ఆ నోట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. చిరునామాలు మారడం, మరణించడం, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో తీసుకుంటున్న చర్యలను ఎన్నికల సంఘం తన కౌంటర్లో వివరించింది. చట్టానికి లోబడి తాము చేస్తున్న పనులన్నింటినీ కోర్టుకు తెలియచేసింది. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించదలచుకుంటే వారికి నోటీసులు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి ఆ తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సవివరంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ప్రతి దశలో ఏం చేస్తున్నాయో తెలియజేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయాన్ని కూడా చెప్పింది. లోపాలన్నింటినీ సవరించిన తరువాతే తుది జాబితాను ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఎల్లో మీడియా నిత్య రాద్ధాంతం ఏపీలో ఓటర్ల జాబితాల విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు చేసిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ ప్రతిరోజూ ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివారుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న ఆందోళనను ప్రజల్లో కలిగించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొంతకాలంగా ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తోంది. ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో స్వచ్ఛత లేదని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అడ్డగోలుగా ఓటర్ల జాబితా నుంచి తొలగింపులు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎల్లో మీడియాకు గట్టిగానే షాకిచ్చేవిగా ఉన్నాయి. మొత్తం ఓటర్లు 96.85కోట్ల మంది 2024 ఫిబ్రవరి 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 96,85,01,358 మంది ఓటర్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇందులో 49.70 కోట్లు పురుషులు కాగా.. 47.13 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారని వివరించింది. 48,057 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, దివ్యాంగ ఓటర్లు 88.24 లక్షలు ఉన్నారని వివరించింది. 18–19 సంవత్సరాల వయసు మధ్య 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 80 సంవత్సరాల పైబడిన వారు 1.86 కోట్లు ఉన్నారని వివరించింది. 100 ఏళ్లు దాటిన ఓటర్లు 2.40 లక్షల మంది ఉన్నారని తెలిపింది. 2024 స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)లో కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లుగా చేరారని వివరించింది. ఇందులో 1.41 కోట్ల మహిళలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. కొత్తగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చామని వివరించింది. 2024 ఎస్ఎస్ఆర్లో 1.65 కోట్ల మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 67.82 లక్షల మంది చనిపోయారని, 75.11 లక్షల మంది శాశ్వతంగా చిరునామాలు మారారని, 22.05 లక్షలు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపింది. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా సుప్రీం కోర్టుకు వివరించింది. పిటిషనర్ లేవనెత్తిన సందేహాలనూ నివృత్తి చేసింది. బహుళ ఎంట్రీలు, ఏకరూప ఫొటోలు, భౌగోళికంగా ఓ ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంది. ఈ ఉత్తర్వులతో సన్సద్ బచావో ట్రస్ట్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రొసీడింగ్స్ను మూసివేస్తున్నట్టు తెలిపింది. -
పచ్చ మీడియా పిచ్చి రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పచ్చ మీడియా పైత్యం హద్దులు దాటుతోంది. రాజ్యాంగ వ్యవస్థలను సైతం తన కుట్రల్లోకి లాగుతూ అడ్డగోలుగా బురద జల్లుతోంది. ఎన్నికల సంఘంలో డేటా నిర్వహణ ప్రొటోకాల్స్పై అవగాహన లేకుండా పిచ్చిరాతలతో బొక్కబోర్లాపడింది. పబ్లిక్ డొమైన్లో ఎవరైనా సులభంగా యాక్సెస్ చేయగల డేటాను.. వైఎస్సార్సీపీ కోసం ఐప్యాక్ సభ్యులు దొంగలించారంటూ మంగళవారం ‘ఈసీలో దొంగలు పడ్డారు’ పేరుతో కథనాన్ని అచ్చేసి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈఓ) తీవ్రంగా స్పందించింది. సీఈఓ పనితీరు, ఐటీ వ్యవస్థ నిర్వహణపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం, తమ నుంచి ఎలాంటి స్పష్టత తీసుకోకుండానే ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వార్తను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు సీఈఓ కార్యాలయ సమగ్రతను, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. ఈ డేటాను ఎవరైనా తీసుకోవచ్చు.. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వో నెట్ 2.0ను అమలుచేస్తోంది. దేశంలోని మొత్తం డేటాబేస్ను సైబర్ సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తూ ఈసీఐ తన సర్వర్ ద్వారా నిర్వహిస్తుంది. అంతేగానీ.. ఈసీఐ సర్వర్ ఒక రాష్ట్ర సీఈఓ నిర్వహణలో ఉండదు. ఇక్కడ ఈసీఐ నిర్దేశించిన అత్యాధునిక భద్రతా చర్యలు, అత్యంత పారదర్శకంగా ఉండే డేటాఫ్రేమ్ వర్క్లోనే సీఈఓ కార్యాలయం పనిచేస్తుంది. వాస్తవానికి.. రాష్ట్ర సీఈఓ కార్యాలయంలోని ఈఆర్వో నెట్లో రెండు రకాలుగా డేటా అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రస్తుత ఓటర్ల జాబితా డేటా, ఓటర్ల జాబితాలో మార్పులు–చేర్పులు, తొలగింపులకు వచ్చిన దరఖాస్తు ఫారాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. ఇది పబ్లిక్ డొమైన్లో.. అంటే సీఈఓ వెబ్సైట్ ద్వారా సాధారణ ప్రజలు సైతం చూడొచ్చు. మరోవైపు.. ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ లకు హార్డ్డిస్్కలలో దీనిని అందిస్తుంది. ఈ డేటాను సీఈఓ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా ఓటర్లు తమ ఓటులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సవరించిన జాబితా సైతం సీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దీనిని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ప్రతీవారం ఈఆర్వో, డీఈఓలు అన్ని రాజకీయ పార్టీలతోనూ పంచుకుంటారు. వాస్తవానికి.. ఈసీఐ నియంత్రణలో ఉన్న ఈఆర్వోనెట్ సర్వర్కు సీఈఓ, డీఈఓ, డీఆర్వోకి పరిమితంగా యాక్సెస్ ఉంటుంది. ఓటర్ల జాబితా, మార్పులుచేర్పులు అభ్యర్థనలు.. ఈ రెండురకాల డేటా మినహా మరే ఇతర డేటాను సీఈఓ స్థాయిలో యాక్సెస్ చేయలేరు. సీఈఓ సైతం ఈసీఐని అడగాల్సిందే.. ఏప్రిల్ 2023లో ఈసీఐ ఈఆర్వో నెట్ 2.0ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈసీఐ ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితా మొత్తాన్ని తన సర్వర్లో భద్రపరిచింది. ఏ రాష్ట్ర సీఈఓ కార్యాలయం అయినా పాత డేటా కావాలంటే ఈసీఐ దృష్టికి తీసుకెళ్లాల్సిందే. అలాంటిది.. అంతభద్రంగా దాచిన డేటాను తొలగించడం అనేది అసాధ్యం. కానీ, పచ్చమీడియా మాత్రం 2021, 22 సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సాయంతో కొంతమంది దొంగలించారని బరితెగించి అసత్య ఆరోపణ చేస్తోంది. ఎవ్వరూ ఈసీఐ సర్వర్ను యాక్సెస్ చేయలేనప్పుడు ఆ డేటా ఎలా దొంగిలిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
మీ ఓటును సరిచూసుకోండి!
సత్తెనపల్లి: తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.. దానిని ఆన్లైన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచింది. జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. వెంటనే సరిచూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ జాబితాలో మీ ఓటు లేకపోతే.. ఫారం–6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. మీ ఓటును సంబంధిత పోలింగ్ కేంద్రం బూత్ లెవల్ అధికారి వద్ద గానీ, స్మార్ట్ఫోన్, వెబ్సైట్ల ద్వారా గానీ సులభంగా తెలుసుకోవచ్చు. ‘స్మార్ట్’గా తెలుసుకోండిలా.. https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళితే పైభాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ తుది జాబితా–2024పై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం నమోదు చేయాలి. ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్లో వస్తాయి. మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకొని.. మీ ఓటు ఉందో? లేదో? చూసుకోవచ్చు. అలాగే https://voterportal.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ను నమోదుచేస్తే జాబితాలో మీ పేరు ఉందో..? లేదో..? ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది? సీరియల్ నంబర్ ఎంత? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ తెలియకపోతే.. ‘అడ్వాన్స్ సెర్చ్’ విభాగంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, శాసనసభ నియోజకవర్గం వివరాలు పొందుపరిచి జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. అలాగే www. nvsp.in వెబ్సైట్లోకి వెళితే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డీటెయిల్స్,’ ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు నమోదు చేసి లేదా ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ యాప్తో చిటికెలో.. గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకొని.. లాగిన్ కావాలి. యాప్లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఓటు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. కార్టు నంబర్ ఉంటే ఎపిక్ నంబర్ ద్వారా సరిచూసుకోవచ్చు. లేకపోతే మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపరచడం ద్వారా తెలుసుకునే వీలుంది. పోలింగ్ కేంద్రంలోనూ అవకాశం.. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ అధికారి ఉంటారు. వారి వద్ద ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా ఉంటుంది. అందులో మీ ఓటు ఉందో? లేదో? సరిచూసుకోవచ్చు. ఓటు లేకపోతే వెంటనే బీఎల్వో ద్వారా గానీ వెబ్సైట్ ద్వారా గానీ ఫారం –6 పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. -
AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది శుభపరిణామమని తెలిపింది. బుధవారం సాయంత్రం సీఈసీ రాజీవ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలకాంశాలను వివరించారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు రాజీవ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. సీఈసీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. చదవండి: రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్! ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది. ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి. ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలి. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి.(పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం’ అని సీఈసీ పేర్కొన్నారు. -
‘దొంగ’ నాటకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెర పడింది! వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు మూడింతలు అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్లు వీటిల్లో 80 నుంచి 90 శాతం వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. నాడు సేవామిత్ర.. నేడు మైపార్టీ డ్యాష్ బోర్డ్ గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా మైపార్టీ డ్యాష్ బోర్డ్ డాట్కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్న వారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతోపాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా, స్థానికంగా నివాసం ఉంటున్నా శాశ్వతంగా వలస వెళ్లినట్లు పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని రెండు ప్రదేశాల్లో రెండు ఓట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహం రచించింది. కుప్పలు తెప్పలుగా అందిన ఫారం 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80 శాతం తప్పుడువేనని తేల్చుతూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేకంగా గురి పెట్టి అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది. నెల్లూరులో సింహభాగం నకిలీ ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లు తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోనేరు సురే‹Ùతో కలిసి ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 85 శాతానికి పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే కథ. విజయనగరం 4 నియోజకవర్గాల్లో ♦విజయనగరం జిల్లాలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన 19,407 మంది ఓట్లు తొలగించాలని కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7లను ఎన్నికల సంఘానికి సమర్పించాడు. ♦ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన విజయనగరం జిల్లా కలెక్టర్ 8,318 ఫారం 7లు తప్పుడువని తేల్చుతూ నివేదిక ఇచ్చారు. కర్నూలులో 88 శాతం బోగస్ ♦కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 67,370 ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశాడు. వీటిలో అత్యధికంగా కోడుమూరులో 17,576, ఆదోనిలో 13,968, ఆలూరులో 11,581 బోగస్ దరఖాస్తులున్నాయి. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీటిపై బీఎల్వోలు, డిప్యూటీ తహసిల్దార్లు, తహసిల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా 59,054 ఫారం 7లు బోగస్ అని తేలింది. అంటే 88 శాతం తప్పుడు ఫారం 7లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. 11,935 మంది బతికే ఉన్నా వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అన్నమయ్య.. అక్రమ మార్గంలో ♦ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 40,358 మంది ఓట్లు తొలగించాలంటూ కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి అందచేశాడు. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ 25,097 దరఖాస్తులు నకిలీవని నిర్థారించారు. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి టీడీపీ తప్పుడు దరఖాస్తులు సమర్పించినట్లు బహిర్గతమైంది. -
ఓట్ల..కేటుగాళ్లు
ప్రజాస్వామ్యమంటే... ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. ప్రజలే ప్రభువులు!ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ కీలకమే. ఒకే ఒక్క ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంది. ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజాతీర్పు అంత స్పష్టంగా ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజల ఆశీస్సులతో కాకుండా.. అడ్డదారుల్లో అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని ఏమంటారు? కేటుగాడనే కదా! ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాటి నుంచి ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ ‘డూప్లికేటు’ వేషాలు వేస్తున్నారు! సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటమికి ఇప్పట్నుంచే సాకులు వెతుక్కుంటున్నారు. ఒకవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెడుతున్న ఆయన మరోవైపు నిబంధనలను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17, 18 ప్రకారం దేశంలో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. రాజకీయాల్లో 1978 నుంచి ఉన్న చంద్రబాబుకు ఇది తెలిసినా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. తెలంగాణలోనూ, ఏపీలోనూ రెండు చోట్లా ఓట్లు ఉన్న వారు (డూప్లికేట్లు) 4,30,264 మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరుల పేర్లను ఏపీలోనూ సరిహద్దు నియోజకవర్గాల్లో చేర్పించారు. వాటిని తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలని ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మర్నాడే.. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న పూర్తయింది. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 1 నుంచే హైదరాబాద్లో ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా చేర్పించేందుకు ఆ పార్టీ భారీ ఎత్తున శిబిరాలు నిర్వహించింది. కూకట్పల్లి, నిజాంపేట, వనస్థలిపురం, మణికొండ, భరత్నగర్ తదితర ప్రాంతాల్లో శిబిరాల ఇన్ఛార్జ్లను నియమించిన టీడీపీ ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ ఓటర్లుగా చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ సానుభూతిపరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వయసు, చిరునామా ధ్రువీకరించే ఆధార్ కార్డును వాట్సప్లో పంపితే తామే ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేయిస్తామని, ఎన్నికల సంఘానికి తామే ఫారం 6 సమర్పిస్తామంటూ సందేశాలు పంపింది. టీడీపీని భుజానికెత్తుకునే మోసే ఓ సామాజిక వర్గం నాయకులు ఈ ప్రచారంలో ప్రధాన భూమిక పోషించారు. ఇలా హైదరాబాద్, తెలంగాణలో నివాసం ఉంటున్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరులను ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చేందుకు ఫారం 6 దరఖాస్తులను ఆన్లైన్లో ఇప్పటికే సమర్పించారు. ఈ ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పవన్ కుటుంబం బరి తెగింపు.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనే తరహాలో డూప్లికేటు ఓట్లు చేర్చడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాట పట్టారు. ఆయన సోదరుడు కొణిదల నాగేంద్రరావు(నాగాబాబు)కు హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబరు 168లో సీరియల్ నెంబరు 323 ఎఫ్వైవై 6038202 ఓటరు కార్డు నెంబరుతో ఓటు ఉంది. నాగేంద్రరావు సతీమణి పద్మజ కొణిదలకు సీరియల్ నెంబరు 324, వారి కుమారుడు కొణిదెల సాయివరుణ్ తేజ్కు సీరియల్ నెంబరు 325తో అక్కడ ఓట్లున్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అంటే డిసెంబరు 4న ఏపీలోనూ ఓటు హక్కు కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగా నగర్ మూడో వీధి 5–263 డోర్ నెంబర్ ఇంటిలో తాము నివాసం ఉంటున్నామంటూ కొణిదల నాగేంద్రరావు, పద్మజ, సాయివరుణ్ తేజ్ ఓటర్లుగా నమోదు కోసం ఫారం 6 దరఖాస్తు సమర్పించడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేనను స్థాపించిన సినీనటుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి జత కట్టడం ద్వారా దీన్ని రుజువు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు బేషరతుగా మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి మేలు చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. డూప్లికేటు ఓట్లకు సాక్ష్యాలు ఇవిగో..: ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (టీజెడ్టీ 2164002)తో దీపిక సైలాడకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎఫ్జెడ్జెడ్ 8526691)తో పి.వెంకటేష్ తండ్రి పి.రామారావుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (కేవైటీ 2765246)తో మారెమ్మ తురపాటి భర్త మారయ్యకు తెలంగాణలోని సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా ఎనీ్టఆర్ జిల్లా మైలవరం నియోజవకర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎస్డబ్ల్యూడీ 1814962)తో భరణి బిళ్లపాటి భర్త వెంకట రమణమూర్తి బిళ్లపాటికి హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాష్ట్రంలో అనకాపల్లి నియోజకవర్గంలో రెండు పోలింగ్ బూత్ల పరిధిలో రెండు ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం మూడు ఓట్లు ఉన్నట్లు. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (జేహెచ్జీ 1224126)తో 70 ఏళ్ల వంకదారి నారాయణస్వామి తండ్రి వి.కృష్ణయ్యకు గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ జడ్పీహెచ్ఎస్ పోలింగ్ బూత్ పరిధిలో సీరియల్ నెంబరు 750తో ఒక ఓటు ఉండగా వయసును 72 ఏళ్లుగా మార్చి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో సీరియల్ నెంబరు 197తో మరో ఓటు ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రరావు కొణిదల, ఆయన భార్య పద్మజ, కుమారుడు సాయి వరుణ్ తేజకు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయనడానికి ఆధారం ఇదీ ఓటరు కార్డు నెంబరు ఆర్డీవీ0159780తో కొసరాజు సాంబశివరావు తండ్రి సూర్యప్రకాశరావుకు తెలంగాణలో కూకటిపల్లిలో ఒక ఓటు.. రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గంలో మరో ఓటు ఉందనడానికి ఆధారం ఓటరు కార్డు నెంబరు ఆర్ఎస్యూ0326876తో నూతలపాటి కృష్ణచైతన్య తండ్రి పేరు ఎన్ఎస్ఆర్ ప్రసాద్కు తెలంగాణలో పటాన్చెర్వు నియోజకవర్గంలో ఒక ఓటు.. రాష్ట్రంలో నూజివీడు నియోజకవర్గంలో మరో ఓటు కలిగి ఉన్నారనడానికి సాక్ష్యం -
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2019 జనవరి 15వ తేదీ ప్రారంభమైంది. 2024 జనవరి 16వ తేదీతో తెలంగాణ అసెంబ్లీ గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30వ తేదీ గురువారం నాడు ఒకే దఫాలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ.. ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను అక్టోబర్ 9వ(సోమవారం) తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తక్షణమే ఎన్నికల కోడ్ను అమలులోకి తెచ్చింది. ఆపై నవంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాసేపటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. వారంపాటు సాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన చేపట్టారు రిటర్నింగ్ అధికారులు. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రం ముగిసింది. మొత్తం ఓటు హక్కు ఉన్నవాళ్ల సంఖ్య.. ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1.62 కోట్లు, మహిళా ఓటర్లు 1.63 కోట్లు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది,సర్వీస్ ఓటర్లు(సాయుధ దళాల సిబ్బంది, దేశం వెలుపలా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే వ్యక్తులు) 15, 406 మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు (18-19ఏళ్ల వయసు) 9,99,667 మంది ఉన్నారు. వీళ్లలో పురుష ఓటర్లు 5,70,274 మంది, మహిళా ఓటర్లు 4,29,273 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 120 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు(పీడబ్ల్యూడీ) 5,06,921 మంది ఉండగా.. ఇందులో పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్జెండర్ ఓటర్లు ఒకరు ఉన్నారు. ఓవర్సీస్ ఓటర్లు.. పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్జెండర్ ఓటర్లు 1 మొత్తంగా 2,944 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 59 ఏళ్లలోపు వాళ్లు 86 శాతం ఉన్నారు. వయసు 80 ఏళ్లు దాటిన వాళ్లు 4,40,371 మంది ఉన్నారు. 80ఏళ్ల వయసు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో ఈసీ తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,26,18,205. తెలంగాణలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించారు. ఈ వెసులుబాటుతో 27,178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాజ్ రాజ్ ప్రకటించారు. అందులో 15,000 మంది సీనియర్ సిటిజన్లు, 9,374 మంది వికలాంగులు, 1,407 మంది నిత్యావసర సేవా సిబ్బంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అత్యధికం.. అత్యల్పం అత్యధికంగా హైదరాబాద్లో 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో(హైదరాబాద్ జిల్లా) 7 లక్షల 32 వేల 560 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) నియోజకవర్గంలో లక్షా 48 వేల 713 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. బరిలో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 2,898 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరకు 2,290 మంది అభ్యర్థులు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీ నగర్(రంగారెడ్డి జిల్లా)లో 48 మంది, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్లో 44 మంది.. కామారెడ్డిలో 39 మంది పోటీలో మిగిలారు. అత్యల్పంగా నారాయణపేట(నారాయణపేట జిల్లా)లో ఏడుగురు, బాన్సువాడలో(కామారెడ్డి జిల్లా)లోనూ ఏడుగురు చొప్పున అభ్యర్థులు, బాల్కొండ(నిజామాబాద్)లో 8 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. సాధారణంగా.. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో ఎన్నికల అధికారులు జాబితా తయారు చేస్తారు. వాటి ఆధారంగానే బ్యాలెట్ రూపొందిస్తారు. పార్టీ ప్రతినిధుల నుండి క్లియరెన్స్ తర్వాత(నవంబర్ 29) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35,655 పోలింగ్ కేంద్రాల్లో తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో వెబ్క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,097 (78శాతం), 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 67 మంది జనరల్ అబ్జర్వర్లను, 39 మంది పోలీస్ అబ్జర్వర్లను తెలంగాణ ఎన్నికల కోసం నియమించింది ఈసీ. మొత్తంగా ఎన్నికల విధుల కోసం 2.08 లక్షల మంది సిబ్బందిని నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. వాళ్లను రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతాలకు తరలించింది. 35,655 పోలింగ్ కేంద్రాలు పోలింగ్: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్ కేంద్రాల వల్ల 144 సెక్షన్ అమలు 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో.. 4,400 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ముగింపు పోలింగ్ ముగిసే టైం వరకు లైన్లో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటింగ్కు అనుమతి భద్రత కోసం 375 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో 45 వేలమంది పోలీసులు ఏజెన్సీ ఏరియాల్లో భద్రత మరింత కట్టుదిట్టం నవంబర్ 30వ తేదీ ఉదయం 5.30ని. పోలింగ్ సిబ్బందికి అవగాహన కోసం మాక్ పోలింగ్ ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల కౌంటిగ్.. అదే రోజు ఫలితాల వెల్లడి అవుతాయి. మొత్తంగా ఈసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. -
ఏపీ ఓటర్ల జాబితా ముసాయిదా.. మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఏపీలో మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉండగా ఇందులో పురుషులు 1,98,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. జాబితా ఇదే.. మొత్తం ఓటర్లు- 4,01,53,292 పురుషులు- 1,98,31,791 మహిళలు - 2,03,85,851 ట్రాన్స్ జెండర్లు - 3808 సర్వీస్ ఓటర్లు- 66,158 ఇక, 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది. -
ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించామని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్లు వెల్లడించారు. తొలిసారి రాష్ట్రంలో వృద్ధులు ఇంటివద్దే ఓటు వేయడానికి ఫామ్ 12d ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. 2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మరణాలు ఉన్నా ధృవీకరణ ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని అన్నారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు. . పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో 35, 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉన్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7.689 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 8,11,640 లక్షల యువత ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీలు, సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించింది. బుధవారం రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే ► యంగెస్ట్ స్టేట్ తెలంగాణ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ► ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ►రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి ►అక్రమ నగదు - మద్యం ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ► అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు. ►119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. ►80ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షలు ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7689 ఉన్నారు. ► 22లక్షల ఓట్లను 2022-23 డిలీట్ చేశాం. ►తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉంది. ► రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం. ►ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ► ఈ సారి 8.11లక్షల మొదటిసారి ఓటర్స్ను నమోదు చేశాం. ►యువత - మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేశాం. సక్సెస్ అయ్యాము. ► 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి. ► థర్డ్ జెండర్స్ తో సమావేశాలు పెట్టాం. ► 35వేల పీస్లు, ప్రతీ పీఎస్కు 897 ఉన్నారు. ►మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం. ►అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే c vigil యాప్లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ► ప్రతీ ఒక్కరూ ఓటర్ helpline app డౌన్లోడ్ చేసుకోవాలి. ►suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు. ► KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు. ► సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు. ► అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ► ఆన్లైన్ లో నగదు బదిలీల పై EC నిఘా ఉంటుంది. ► ఎలిప్యాడ్స్, ఎయిర్పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా. ►ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం. ► ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి. ► ప్రకటనలు - సోషల్ మీడియా లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ►ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు ► ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక సమీక్ష సారాంశం కోసం క్లిక్ చేయండి -
Telangana: రాష్ట్ర ఓటర్లు 3,17,17,389
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389 కాగా, ఇందులో 1,58,71,493మంది పురుషులు, 1,58,43,339మంది మహిళలు, 2557 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలతుదిఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి(సీఈఓ) వికాస్రాజ్ బుధవారం ప్రకటించారు. 2023 జనవరితో పోల్చితే తుది ఓటర్ల జాబితాలో మొత్తం 5.8 శాతం ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో 15,338 మంది సర్వీసు ఓటర్లు, 2780 మంది ప్రవాస ఓటర్లున్నారు. 18–19 ఏళ్ల వయసు గల 5,32,990 మంది యువఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. దీంతో 18–19 ఏళ్ల వయస్సు గల ఓటర్ల సంఖ్య 8,11,640కి చేరింది. దీంతో జాబితాలో యువ ఓటర్ల శాతం 2.56 శాతానికి పెరిగింది. కొత్త ఓటర్లు 17,01,087 మంది ఓటర్ల జాబితా రెండో సవరణలో చివరి గడువు సెప్టెంబర్ 19 నాటికి 57,617 దరఖాస్తులను పరిష్కరించామని, త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించామని సీఈఓ వికాస్రాజ్ ప్రకటించారు. కొత్తగా 17,01,087 మంది ఓటర్లు జాబితాలో చోటు పొందగా, 6,10,694 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. 5,80,208 మంది ఓటర్లు పేరు, ఇతర వివరాలు సరిదిద్దుకోవడం లేదా కొత్త చిరునామాకు ఓటు బదిలీ చేసుకున్నారు. స్త్రీ, పురుష ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 992 నుంచి 998కి మెరుగు పడిందని సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. 18–19 ఏళ్ల వయసు గల ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 707 నుంచి 743కి మెరుగైందన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 43,943కి, దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,06,493కి, థర్డ్జెండర్ ఓటర్ల సంఖ్య 2557కి పెరిగిందన్నారు. ఓటర్ల నమోదుకుఇంకా అవకాశం కొత్త ఓటర్ల నమోదు నిరంతరంగా కొనసాగుతుందని, 2023 అక్టోబర్ 1తో 18 ఏళ్లు నిండిన వారు, గతంలో దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుంటే, అర్హులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తామన్నారు. https://voters.eci.gov.in/ వెబ్సైట్/ఓటర్ హెల్ప్లైన్ యాప్/బీఎల్ఓ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ పోలింగ్స్టేషన్, పేరు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉంటే ఫారం–8 దరఖాస్తు ఆన్లైన్/ యాప్/బీఎల్ఓ ద్వారా సమర్పించాలని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఓటరు హెల్ప్లైన్ నంబర్ 1950కి సంప్రదించాలన్నారు. 4లక్షల ఓటర్ల చిరునామాలు మార్పు ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే స్వయంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లను ధ్రువీకరించే కసరత్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4,15,824 మంది ఓటర్ల చిరునామాలు సవరించారు. 3,94,968 మంది ఓటర్లను ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి, 64,661 మంది ఓటర్లను ఒక అసెంబ్లీ స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ చేశారు. ఈఆర్వో నెట్ ద్వారా 73,364 మంది ఓటర్ల చిరునామాలు, ఇళ్ల నంబర్లు సవరించారు. 4605 బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో 757 బృందాలు తనిఖీ చేసి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు 50,907 దరఖాస్తులు స్వీకరించి వారికి ఓటుహక్కు కల్పించాయి. రెండేళ్లలో 22 లక్షల ఓటర్ల తొలగింపు ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా గత రెండేళ్లలో 22,02,168 మంది చనిపోయిన, డూప్లికేట్, వలస పోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో 4,89,574 మంది ఓటర్లు జీహె< చ్ఎంసీ పరిధిలోని వారే. ఈ ఏడాది 2,47,756 మంది చనిపోయిన ఓటర్లను తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తీవ్రంగా శ్రమించామని, 14,24,694 ఓటర్ల వివరాలను సవరించామని సీఈఓ తెలిపారు. అప్పుడు ఓటర్లు ఇలా... గత ఆగస్టు 21న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్లు మొత్తం కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,06,42,333 ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సర్వీసు ఓటర్లు ముసాయిదాలో ఉన్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. ఓటర్ల జాబితా తొలి ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, రెండో సవరణ నాటికి 3,17,32,727 మందికి పెరిగారు. -
తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులపాటు ఎన్నికల సన్నాహాక భేటీలు వరుసగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తుది ఓటర్ల జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ డేటా ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ వరకు.. కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉండగా.. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడదలు చేయాలని కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తిని ఈసీ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు - ఎస్పీలు, సీపీలతో ఇప్పటికే EC మీటింగ్ మొదలైంది. ఇవాళ రెండు సెషన్లుగా ఈ భేటీ జరగనుంది. మొదటి సెషన్లో అధికారులు చెప్పే అంశాల్ని కేంద్ర బృందం విననుంది. ఇక రెండో సెషన్లో అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేస్తుంది. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్రం ఎన్నికల సంఘ బృందం పరిశీలించింది. -
మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. ఓటు లేకపోతే తక్షణం నమోదు చేయించుకోండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 21 వరకు అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. ఓటర్ల జాబితాను పరిశీలించి సవరణలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోలతో కలిసి ఓటర్ల పరిశీలనలో పాల్గొంటాయి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 22 నుంచి రాజకీయ పార్టీల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30కి పూర్తి చేసి అక్టోబరు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. శనివారం, ఆదివారం అయిన అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. డిసెంబరు 26 కల్లా క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వీటి నమోదుపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర జనాభా ప్రకారం 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు కనీసం 12 లక్షలు ఉండాలి. కానీ 3.50 లక్షల ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. 2024 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో వీరి నమోదుపైనా దృష్టి సారిస్తున్నారు. వీరు ఫారం 6ను వినియోగించి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. చనిపోయిన వారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఫారం 7ను వినియోగించుకోవాలి. చిరునామా, నియోజకవర్గం మార్చుకోవడానికి ఫారం 8 ఇవ్వాలి. ప్రవాసాంధ్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారం 6 ఏను ఇవ్వాలి. పరిశీలనకు తీసుకొనే అంశాలు ♦ ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉంటే వారి అభీష్టం మేరకు ఒక చోట ఉంచి మిగిలిన ఓట్లను తొలగిస్తారు. ♦ నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తిస్తారు. ♦ డోర్ నంబర్లు లేకుండా ఉన్నా, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లను పరిశీలిస్తారు. ♦ ఇంటి నంబరు లేనివి, ఒకే ఇంటి నంబరు, వీధి పేరుపై వందలాది ఓట్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తారు. ♦ దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఒక్క ప్రాంతంలోనే ఉంచుతారు ♦ ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ సిఫారసు చేస్తారు. దొంగ ఓట్ల దొంగ బాబే! 2019 ఎన్నికల్లో గెలవడానికి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని హామీలేదు. అయినా నమ్మకం కుదరక ఇష్టానుసారంగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒకే ఇంట్లో 40–50 మొదలు.. ఏకంగా 600–700 ఓట్ల వరకు గంపగుత్తగా ఓట్లు ఉన్నట్లు సృష్టించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం ముందు తట్టుకోలేక తల వంచారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటి లీలలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే ఉలిక్కిపడుతున్నారు. గంపగుత్తగా ఉన్న దొంగ ఓట్లను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. విచారించగా ఆ దొంగ ఓట్లన్నీ నాటి బాబు పాలనలో రికార్డుల్లోకి ఎక్కినవేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ప్రజల్లో ఇంకా చులకనవుతానని భావించి ఎల్లో మీడియాను రంగంలోకి దింపారు. తను చేసిన తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై వేసి.. తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. రోజుకో రీతిన తప్పుడు కథనాలు వండి వార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారు. ఇది కూడా బెడిసి కొడుతోంది. బాబు తీరు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుంది. -
ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేకదృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గాల పరిశీలకులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడి దొంగ ఓట్లను చేర్పించారని గుర్తుచేశారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని ఎత్తిచూపారు. ఆ దొంగ ఓట్లను గుర్తించి, వాటి తొలగింపునకు కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకులు మరింత కీలకంగా, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసిన మేరకు 175 నియోజకవర్గాలకు 175 గెల్చుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గాలపై అవగాహన పెంచుకోవాలని, స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం, అక్కడి ప్రతిపక్షాల పాత్ర వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. వారంలో కనీసం రెండురోజులు నియోజకవర్గాల్లో ఉండి పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా పార్టీ సమన్వయకర్తకు తలలో నాలుకలాగా మెలుగుతూ కీలకంగా ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే సమన్వయంతో పరిష్కరించడానికి కృషిచేయాలని సూచించారు. స్థానిక నేతల అభిప్రాయాలు విభిన్నంగా ఉంటే వాటిని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ల దృష్టికి, పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. జగనన్న సురక్ష పథకం నియోజకవర్గాల్లో ఏ విధంగా జరుగుతోంది.. ప్రజలకు సంబంధించి అన్ని సమస్యల పరిష్కారం, పథకాలను లబ్దిదారులకు అందించేలా సమన్వయం చేయడం వంటి వాటిపైన కూడా దృష్టిపెట్టాలని కోరారు. గృహసారథులు, గ్రామ, వార్డు సచివాలయాల కన్వి నర్లు.. మండల, డివిజన్ పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ పట్ల ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉన్నారని.. రానున్న ఎన్నికలలో పార్టీ విజయం త«థ్యమని చెప్పారు. అయినప్పటికి నియోజకవర్గాలలో పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
వరస తప్పిన ముఖ్యమైన లెక్క
దేశ జనన, మరణాల రిజిస్టర్ను ఓటర్ల జాబితాతో అనుసంధానించేలా త్వరలోనే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. దేశ పౌరులెవరికైనా సరే 18 ఏళ్ళు నిండగానే వారి పేరు ఓటర్ల జాబితాలో చేరిపోయేలా ఆ బిల్లుతో వీలు కల్పించాలని భావిస్తోంది. సోమవారం ఢిల్లీలో భారత జనగణన కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించిన ఈ సంగతి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మంచి ఆలోచనే. మరణించినవారి పేర్లను తక్షణం తొలగించడానికీ, ఓటుహక్కు వయసు రాగానే జాప్యం లేకుండా కొత్త ఓటర్లు జాబి తాలో చేరడానికీ ఈ అనుసంధాన ప్రక్రియ ఉపకరిస్తుంది. అయితే, అదే సమయంలో పదేళ్ళకోసారి నిర్వహించాల్సిన కీలక జనగణనను ఈ దఫా ఎప్పుడు జరిపేదీ ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం. నిజానికి, 1948 జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. అలాగని ప్రతి పదేళ్ళకూ జనగణన చేయాలని చట్టమేమీ లేదు. ఎప్పుడు జనగణన చేయాలో, ఫలితాలెప్పుడు వెల్లడించాలో నిర్ణీత కాలవ్యవధి అందులో లేదు. అయితే, ఈ లెక్కల ప్రయోజనం అపారం. బ్రిటీష్ ఇండియాలో 1881లో వందల మంది శ్రమించి, 25 కోట్లకు పైగా జనాభా నుంచి జవాబులు సేకరించారు. అప్పటి నుంచి 130 ఏళ్ళ పాటు యుద్ధాలు సహా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, మన పాలకులు ఒక క్రమం తప్పని యజ్ఞంగా ఈ జనగణన ప్రక్రియను సాగించారు. తీరా ఈసారి ఆక్రమం తప్పింది. దేశంలో తాజా జనగణన 2021లో జరగాల్సి ఉంది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా అందులో తొలి దశ జరపాలని భావించారు. కరోనాతో అది నిరవధిక వాయిదా పడింది. జనం లెక్కను ప్రోదిచేసి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలతో ఒక సమాచార గనిగా, ప్రభుత్వ – ప్రజా కార్యాచరణకు కీలక సూచికగా ఉపకరించాల్సిన ఆ ప్రక్రియ ఈసారి అలా ఆలస్యమైంది. జాప్యానికి కరోనాయే కారణమన్న ప్రభుత్వ వాదన తర్కానికి నిలవదు. అత్యధికులు కరోనా టీకాలు వేయించుకున్నా, 2022లో మూడో వేవ్ ముగిసి జనజీవనం కుదుటపడినా, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం సాగుతున్నా సరే... సర్కార్ ఎందుకనో ఇప్పటి దాకా మళ్ళీ జనగణన ఊసే ఎత్తలేదు. జిల్లాలు, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల పాలనా సరిహద్దుల్ని స్తంభింపజేసే తుది గడువును ఈ జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది గనక లెక్కప్రకారం ఆ తర్వాత మూడు నెలలైతే కానీ జనగణన చేపట్టరాదు. అంటే, కనీసం ఈ సెప్టెంబర్ దాకా జనగణన లేనట్టే. ఇక, సాధారణంగా జనసంఖ్యను లెక్కించడం జనగణన చేసే ఏడాది ఫిబ్రవరిలో చేస్తారు. మార్చి 1కి ఇంత జనాభా అంటారు. కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 చివర ఎప్పటికో కానీ ప్రక్రియే మొదలు కాకపోవచ్చు. పైకి మామూలు గానే అనిపించినా, ఈ ఆలస్యం విస్తృత పర్యవసానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే, పుష్కరకాలం గడిచిపోయినా ఇప్ప టికీ మన విధాన రూపకర్తలు పాత 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాల నుంచి సాయాల దాకా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం విచిత్రం, విషాదం. అసలు కరోనాతో ఆలస్యమవడానికి ముందే ఈ 2021 జనగణన వివాదాస్పదమై కూర్చుంది. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించేలా జనాభా సర్వే చేపడతామంటూ ప్రభుత్వం తేనెతుట్టె కదిల్చింది. అప్పటికే, ముస్లిమ్లే లక్ష్యంగా వివాదాస్పద ‘పౌరసత్వ చట్టం–2019’ తెచ్చారంటూ, దేశవ్యాప్తంగా నెలల తరబడి నిరసనలు సాగాయి. ఆ చట్టానికి, ఇప్పుడు భారతీయులమని నిరూపించుకోవాల్సిన ఈ ‘ఎన్పీఆర్’ జత చేరిందని విమర్శలు రేగాయి. మరో పక్క ఇప్పటికే ప్రతిపక్షాల్లోని అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు దేశంలో కులగణన సాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ లెక్కలు కూడా తీస్తే తమ ఓటుబ్యాంకులో చీలికలు రావచ్చనీ, అది తమకు దెబ్బ కావచ్చనీ అధికార పార్టీ భయపడుతోంది. వివిధ వర్గాల నుంచి ప్రత్యేక కోటాలకు డిమాండ్లు తలెత్తుతాయని ఆందోళన చెందుతోంది. అయిన ఆలస్యం ఎలాగూ అయింది గనక వచ్చే ఎన్నికల్లో లెక్క తప్పకుండా ఉండాలంటే, ఈ లెక్కలు పక్కనపెట్టాలనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. జనగణన అంటే కేవలం భౌగోళిక ప్రాంతాల్లో తలకాయలు లెక్కపెట్టడం కాదు. సమాజంలోని భిన్న వర్గాల ఆకాంక్షలకు పునాదిగా నిలిచే ప్రక్రియ. గ్రామీణ – పట్టణ జనాభా వాటా, వలసలు, మాతృభాష, ఆయుఃప్రమాణం, గృహవసతులు వగైరా అనేక గణాంకాలను అందించే సమాచార నిధి. ఆర్థిక జీవిత అంశాలపై దృష్టి పెట్టే అనేక సర్వేలకు మాతృకైన ‘జాతీయ శాంపిల్ సర్వే’, ఆరోగ్యం – సామాజిక స్థితిగతులపై ఇంటింటి సర్వే అయిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వగైరాలు శాంపిల్స్ తీసుకోవడానికి జనగణనే ఆధారం. ఇంతటి ముఖ్యమైన వ్యవహారంపై ఈ సుదీర్ఘ అనిశ్చితి సమంజసం కాదు. జనగణన ప్రక్రియ ఎప్పుడు జరిగినా – ఆధునికతనూ, ఎప్పటి కప్పుడు లెక్కల్లో మార్పుల్ని పొందుపరుచుకొనే లక్షణాన్నీ సంతరించుకోవాలన్న ప్రభుత్వ యోచన ఆహ్వానించదగినదే. కాకపోతే ఎప్పుడో డిజిటల్ వేదికల్ని ఆశ్రయిస్తామనీ, వ్యక్తులు తమకు తామే ఎలక్ట్రానిక్గా సమాచారం పూర్తిచేసే హక్కు కల్పిస్తామనీ, అందులో సామాజిక – ఆర్థిక హోదాను లెక్కించే 35కు పైగా పరామితులు ఉంటాయనీ అంటూ... ఇప్పుడు అమితమైన జాప్యం చేయడం అర్థరహితం. అసలుకే మోసం. అయితే, జనగణన ఎప్పుడు చేస్తామో చెప్పకున్నా, ఎలా చేయాలను కుంటున్నదీ పాలకుల నోట వినపడడమే ప్రస్తుతానికి దక్కిన సాంత్వన. -
ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఐదుగురు సిట్టింగ్ సభ్యులు వచ్చే ఏడాది మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వారి నియోజకవర్గాలకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలపై డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించి తుది జాబితాలను డిసెంబర్ 30న విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్రాఫ్ట్ రోల్లో నమోదు చేసుకోలేకపోయిన అర్హులందరూ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కోసం ఫారం–18, ఉపాధ్యాయుల నియోజకవర్గం కోసం ఫారం–19లో నమోదుకు దరఖాస్తులను దాఖలు చేయవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే ఓటర్లు ఫారం–7, సవరణల కోసం ఫారం–8లో దాఖలు చేయవచ్చని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల సాయం ముసాయిదా జాబితాలో సవరణల కోసం బూత్ స్థాయి ఏజెంట్ల సాయం తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఏజెంట్ల బాధ్యతలను కూడా వివరించింది. చనిపోయిన, మారిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా, ఇతర మార్గాల ద్వారా గుర్తించి ఒక జాబితా తయారు చేసి, నిర్ణీత ఫార్మాట్లో అధికారులకు అందించవచ్చని తెలిపింది. ఇలా ఏజెంట్లు ఒక రోజులో 10కి మించకుండా దరఖాస్తులను ఫైల్ చేయవచ్చని చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని ఆదేశించింది. -
మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.96 కోట్ల పురుష ఓటర్లుండగా 2.01 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 24 జిల్లాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలుగా ఉన్నారు. విశాఖపట్టణం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే మహిళలకన్నా పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగతా 24 జిల్లాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 9.65 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9.60 లక్షలు, అనంతపురం జిల్లాలో 9.56 లక్షలు, విశాఖ జిల్లాలో 9.38 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 9.10 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం సాధారణ ఓటర్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19.12 లక్షల ఓటర్లు ఉండగా ఆ తరువాత అనంతపురం జిల్లాలో 19.11 మంది, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 18.98 లక్షల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 12.61 లక్షల ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 7.68 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7.15 లక్షల ఓటర్లు ఉన్నారు. -
అవ్వ... ఓటర్ల డేటా చోరీ
త్వరలో బెంగళూరు పాలికె ఎన్నికలు, ఆపై అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఓటర్ల సమాచారం చోరీ అనే అంశంపై వేడి పుట్టించింది. సీఎం బొమ్మై ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ బెంగళూరులో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని కాంగ్రెస్ ఘాటుగా ఆరోపించింది. ఇవి నిరాధార ఆరోపణలని సీఎం తిరస్కరించారు. శివాజీనగర: ఓటర్ల సమాచారాన్ని బీజేపీవారు ప్రైవేట్ సంస్థతో అక్రమంగా సేకరించారని, ఇందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బాధ్యుడని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. గురువారం కేపీసీసీ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ డేటా చౌర్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేయాలన్నారు. చెలుమ అనే ప్రభుత్వేతర సంస్థ సిబ్బందికి నకిలీ ఐడీ కార్డులిచ్చి ప్రభుత్వ అధికారుల్లా ప్రవర్తించి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థ అయిన చెలుమ ఓటర్ల సమాచారాన్ని సేకరించడం ఎందుకు?, బూత్ స్థాయిలో అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనకున్న వ్యక్తులు ఓ మంత్రికి సన్నిహితులని పరోక్షంగా మంత్రి అశ్వత్థ నారాయణపై ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కాంగ్రెస్ నాయకులు పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డికి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు: సీఎం ఓటర్ల డేటా చోరీపై కాంగ్రెస్ ఆరోపణ నిరాధారమని, ఫిర్యాదుపై తక్షణమే విచారణ జరుగుతుందని సీఎం బొమై్మ తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కార్యాన్ని ఎన్నికల కమిషన్, బీబీఎంపీ, స్థానిక సంస్థలు ఎన్జీఓలకు ఇస్తారు. 2008లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు ఇలాగే ఇచ్చారని చెప్పారు. ఒక ఎన్జీఓకు ఎన్నికల కమిషన్, బీబీఎంపీ అనుమతినిచ్చింది. వారు దురి్వనియోగం చేశారనే ఆరోపణపై విచారణ చేయాలని సూచించానని తెలిపారు. కాంగ్రెస్వారు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్వేకు అనుమతి ఇవ్వలేదు: ఈసీ బీబీఎంపీ వ్యాప్తిలో ఓటర్ల సర్వే నిర్వహించేందుకు ఏ సంస్థకు అనుమతి ఇవ్వలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా చెప్పారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏ సంస్థకు సమీక్ష కు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వేతర సంస్థ చెలుమ కు ఓటర్ల జాగృతి అభియాన జరపడానికి అనుమతివ్వగా, ఆ సంస్థపై ఫిర్యాదు రావటంతో తక్షణమే బీబీఎంపీ ఎన్నికలాధికారి రద్దు చేశారని తెలిపారు. బూత్ స్థాయి అధికారి గుర్తింపు కార్డు దుర్వినియోగం ఘటనలో మహాదేవపుర ఓటర్ల నమోదు అధికారి వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. (చదవండి: మంటల్లో బ్యాంకు అధికారి...మొబైల్ ఫోన్ పేలడమా? ఆత్మహత్య?) -
ఓటరు జాబితాలో చేర్చండి లేదా డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి
చండూరు: తమకు సమాచారం లేకుండానే ఓటరు జాబితాలో తమ పేర్లను తొలగించారని మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీ లకినేనిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన పలువురు బాధితులు గురువారం చండూరులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓట్లను వినియోగించుకునేలా ఓటర్ లిస్టులో పేర్లనైనా చేర్చండి.. లేదంటే తమకు డెత్ సర్టిఫికెట్ అయినా ఇప్పించాలని కోరారు. తాము గ్రామంలోనే నివసిస్తున్నా తమ పేర్లను ఓటరు జాబితా నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కారింగు శివలింగం, షేక్ ఖాసీంబీ, అలివేలు, దోమలపల్లి జంగయ్య ఉన్నారు. -
మునుగోడు పాలి‘ట్రిక్స్’..పెండింగ్ ఓటర్ లిస్టును నిలిపేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు.. మునుగోడు ఓటర్ల జాబితాపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓటర్ లిస్ట్లో కొత్త ఓటర్ల నమోదుపై బీజేపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, విచారణ సందర్భంగా హైకోర్ట్ ఓటర్ల జాబితాను కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో, ఈసీ ఓటర్ జాబితాను కోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా 25వేల ఓట్లలో 12వేలు నిర్ధారించినట్టు, మరో 7వేలు తిరస్కరించినట్టు ఈసీ పేర్కొంది. దీంతో, పెండింగ్లో ఉన్న ఓటర్ జాబితాను నిలిపేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
మునుగోడు ఓటర్ల జాబితాలో అక్రమాలు
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితాలో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఇటీవల ఓటర్ల జాబితా లో చేరినవారి వివరాలను పరిశీలించాలని, అక్రమాలను అడ్డుకొనేందుకు వెంటనే పరిశీలకుడిని పంపించాలని కోరింది. అనంతరం కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ సారంగి, తెలంగాణ బీజేపీ నాయకుడు రామచందర్రావులతో కలిసి తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడులో 25వేల కొత్త ఓటర్ల నమోదు జరిగింది. సాధారణంగా కొత్త ఓటర్ల నమోదు సమయంలో ఎన్నడూ ఈ నియోజకవర్గంలో 2,000 మంది దాటలేదు. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? 25 వేల కొత్త ఓటర్లు అంటే.. 40 వేల మందికిపైగా జనాభా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టు భావించాలి. అంత భారీగా వలస ఎలా సాధ్యం? దీనిపై చర్యలు చేపట్టాలని ఈసీని కోరా’ అని తరుణ్ ఛుగ్ వెల్లడించారు. అధికారులను బదిలీ చేయాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు మునుగోడు ప్రాంతంలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఈసీ అనుమతి లేకుండా అక్కడికి వెళ్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరామని తరుణ్ ఛుగ్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని మునుగోడుకు మార్చి అక్కడ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేశారని.. అధికార యంత్రాంగం, మంత్రులు మొత్తం అక్కడే ఉన్నారని విమర్శించారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం రాజగోపాల్రెడ్డిపై కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. కాగా మునుగోడు లో ఓటర్ల నమోదు వ్యవహారంలో గోల్మాల్ ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేర్కొన్నారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఎన్నికల పర్యవేక్షకులను నియమించి అవకతవకలకు అడ్డుకట్ట వేయా లని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. -
మునుగోడులో మరో ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రెండు నెలల్లోనే పాతిక వేలు దాటిందని పేర్కొంది. ఈ తతంగంపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందు 7 నెలల కాలంలో 1,474 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు 6 నెలల్లోనే పెద్ద మొత్తంలో 24,781 దరఖాస్తు రావడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని చెప్పింది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోరారు. ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారని రచనారెడ్డి తెలపడంతో.. ఈ నెల 13న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. -
Munugode Bypoll 2022: దృష్టంతా ఓటర్ల జాబితాలపైనే...!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కౌంట్డౌన్ మొదలుకావడంతో ప్రధాన రాజకీయపక్షాల దృష్టంతా ఇప్పుడు ఓటర్ల జాబితాపై కేంద్రీకృతమైంది. నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయి.. ఏయే సామాజిక వర్గాల ఓట్లు ఎన్నెన్ని ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి.. తదితర అంశాలపై పార్టీలు సమాలోచనలు సాగిస్తున్నాయి. మునుగోడు ఓటర్లుగా ఉంటూ నియోజకవర్గం బయట.. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై ఆరా తీయడం ప్రారంభించాయి. వచ్చేనెల 3.. పోలింగ్ తేదీన వారందరిని పోలింగ్ స్టేషన్లకు రప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. నియోజకవర్గం వెలుపల ఉన్న ఓటర్లను కలసి వారి మద్దతును కూడగట్టేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో ఉండని వారిలో ఎక్కువ శాతం మంది ఎల్బీనగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా పార్టీ నేతలు గుర్తించారు. ఆ ఓటర్లు, వారి అడ్రస్లను వెలికితీసే బాధ్యతలను ఎల్బీ నగర్, ఇతర కార్పొరేటర్లకు అప్పగించినట్లు సమాచారం. ఓటింగ్ రోజున వారిని మునుగోడుకు తరలించే ఏర్పాట్లపై సైతం పార్టీ నాయకులు దృష్టి పెట్టా రు. ఇదిలాఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు శనివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన భేటీ జరగనుంది. మునుగోడు ఎన్నికలపై ప్రత్యేక చర్చతో పాటు పారీ్టపరంగా చేపడుతున్న కార్యక్రమాలను సైతం సమీక్షిస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తెలిపారు. ఈ భేటీ లో పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలతో అసెంబ్లీ ఇన్చార్జీలు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో జాతీయ నేతలు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ పాల్గొంటారని వివరించారు. చదవండి: అహంతోనే వినతిపత్రం విసిరికొట్టారు -
ఇక 17ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు
-
ఇకపై 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తు.. ఈసీ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. ఏడాదిలో మూడుసార్లు అవకాశం.. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీల్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్ జాబితాను అప్డేట్ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్గా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్పీ యాక్ట్ 1950లోని సెక్షన్ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుంది ఈసీ. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. ఇదీ చదవండి: గూగుల్తో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ ఉండదటా! -
తెలంగాణలో ఓటర్లు ఎంత మందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,52,56,474 మంది పురుషులు, 1,50,98,685 మంది మహిళలు, 1,735 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం 3,03,56,894 మంది ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2022లో రూపొందిం చిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ బుధవారం ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,03,56,665 మంది ఓటర్లుండగా, సవరణలో భాగంగా 2,27,226 మంది పేర్లను కొత్తగా చేర్చారు. వివిధ కారణాలతో మరో 2,26,997 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. 18–19 ఏళ్ల వయసున్న 1,36,496 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటర్ల జాబితాలో స్థానం పొందారు. మరో 14,661 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. -
తేలిన స్థానిక సంస్థల మండలి ఓటర్ల లెక్క.. 6 స్థానాల్లో 5,326 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఆరు స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు స్థానాల్లో 2,997 మంది మహిళలు, 2,329 మంది పురుషులు.. కలిపి మొత్తం 5,326 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీలు 3,223, జెడ్పీటీసీలు 325, మున్సిపల్ కౌన్సిలర్లు 1,544, కార్పొరేటర్లు 169, ఎక్స్అఫీషియో ఓటర్లు 65 మంది ఉన్నారు. రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల అథారిటీల (12 సీట్లకు) మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, ఆరు సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన ఆదిలాబాద్, కరీంనగర్ (2 సీట్లు), మెదక్, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహించి 12న ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ స్థానాల్లో ఓటేయనున్న వారి వివరాలను పట్టికలో చూడవచ్చు.. -
37 ‘మునిసిపల్’ ఎన్నికలకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలకశాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపి మొత్తం 125 ఉండగా ఇటీవల 87 చోట్ల ఎన్నికలు జరిగాయి. కాకినాడ కార్పొరేషన్కు 2017లోనే ఎన్నికలు జరిగాయి. దీంతో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లతోసహా 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్ పనుల్ని వచ్చేనెల 15 నాటికి పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. ఓటర్ల జాబితాలను రూపొందించాలని, అవసరమైనచోట వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. అవసరమైనచోట వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రతిపాదనలను రూపొందించి, వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించమని ఆదేశించింది. సమీప గ్రామాలను విలీనం చేయడంపై ఉన్న వ్యాజ్యాలను త్వరగా పరిష్కరించాలని పురపాలకశాఖ యోచిస్తోంది. ఆ 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. అందుకు సన్నద్ధమై ఉండాలని భావిస్తోంది. -
నవంబర్ 16 నుంచి ఓటర్ల జాబితా సవరణ
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ► ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగిస్తారు. అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ► నవంబర్ 1వ తేదీ నుంచి ఫాం 1 నుంచి 8 వరకు అందుబాటులో తెస్తారు. సప్లిమెంటరీతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 16వ తేదీన ప్రకటిస్తారు. అదే రోజు నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండేవారితో పాటు ఓటర్ల జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ► డిసెంబర్ 15వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ► నవంబర్ 28, 29, డిసెంబర్ 12, 13 తేదీ (శని, ఆదివారాలు)ల్లో పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ► ఓటర్లుగా చేరేందుకు బూత్ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులుంటే వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని సరిచూసుకుంటారు. జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. -
రాష్ట్రంలో 2.99 కోట్ల ఓటర్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,99,32,943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,50,41,943 మంది పురుష, 1,48,89,410 మహిళ, 1590 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. కొత్తగా 1,44,855 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 12,639 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020లో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని ఓటర్లందరికీ ప్రామాణిక ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా జారీ చేయనున్నారు. ఓటర్లకు జీవితాంతం ఒకే విశిష్ట సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 10 ఆంగ్ల అక్షరాలు, అంకెల (ఆల్ఫా న్యూమరిక్) కలయికతో కొత్త నమూనాలో ప్రామాణిక ఓటరు గుర్తింపు (స్టాండర్డ్ ఎపిక్) కార్డులు జారీ చేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లినా.. వారి విశిష్ట ఓటరు సంఖ్య మారదు. చిరునామా మారితే అదే విశిష్ట సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయనున్నారు. -
ముందుగా మున్సిపోల్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మున్సి‘పోల్స్’ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఈలోపు ‘పుర’పోరు పూర్తిచేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదలైంది. అనంతపురం, కదిరి: మున్సి‘పోల్స్’ ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు దాదాపుగా పూర్తి చేసిన అధికారులు.. తాజాగా సోమవారం అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఏ క్షణాన నోటిఫికేషన్ విడుదల చేసినా.. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ గంధం చంద్రుడుతో పాటు ఎస్పీ సత్యయేసుబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అధికారులు భావిస్తున్నారు. వార్డుల వారీగాఓటరు జాబితా విడుదల రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే కులాలవారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తాజాగా సోమవారం మొత్తం ఓటర్ల వివరాలతో వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఇటీవల కమిషనర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని పేర్కొన్నారు. అందుకే నగర పాలక సంస్థతో పాటు మిగతా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లలో మునిగిపోయారు. కొత్తగా ఏర్పడ్డ పెనుకొండ మున్సిపాలిటీలో ఓటరు జాబితా కూడా ఇంకా ప్రకటించలేదు. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్? ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,200 మంది ఓటర్లకు ఒక బ్యాలెట్ బాక్స్ చొప్పున అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 7న వీడియో కాన్ఫరెన్స్ పోలింగ్ కేంద్రాల వివరాలను ఈ నెల 5న ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 6వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 7వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాల అందినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 10న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల ఖరారు ఇలా.. నగరపాలక సంస్థలోని అన్ని డివిజన్లతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల రిజర్వేషన్లను కలెక్టర్ నేతృత్వంలోనే నిర్ణయిస్తారు. నగరపాలక సంస్థ మేయర్ పదవితో పాటు అన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు మాత్రం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్లు ఖరారు చేస్తారు. -
‘మున్సిపాలిటీ’ ఓటర్ల తుది జాబితా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. 22న జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో 53,36,605 ఓటర్లున్నట్టు తేలింది. పురుషులు 26,71,694, మహిళలు 26,64, 557, ఇతరులు 354 మంది ఉన్నారు. ఇటీవ ల 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల వా రీగా ముసాయిదా జాబితాను ప్రకటించగా, శనివారం ఒక్కో జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓ టర్ల తుది జాబితాను ప్రకటించారు. అయితే మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాలను ఆ దివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 30న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబి తా ప్రకారం... ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 53,57,260 ఉండగా, వారిలో పురుషులు 26,72,021 మంది, మహిళలు 26,64,885 మంది, ఇతరులు 354 ఉన్నట్టు ప్రకటించా రు. శనివారం అనధికారికంగా వెల్లడించిన వి వరాల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 655 మేర తగ్గినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తుది జాబితాలో మహిళా ఓటర్ల కంటే పురుషుల ఓట్లు 7,137 అధికంగా ఉన్నాయి. -
మూడేళ్లకే ఓటు హక్కు
సాక్షి, కరీంనగర్ సిటీ: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అర్హతున్న వారికి ఓటుహక్కు ఇవ్వని అధికారులు, కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు. కరీంనగర్లో ఓటర్ ఐడీ వైఓజే 8588352 నంబర్పై నందిత మెతుకు పేరిట నమోదు అయింది. నందిత వయస్సు 35ఏళ్లుగా, ఇంటినంబర్ 5–6–434గా ప్రచురించారు. వీటిని చూసిన నందిత తండ్రి మెతుకు రమేశ్ అవాక్కయ్యాడు. తమకూతురు నందిత వయస్సు 3ఏళ్లని, ఎల్కేజీ చదువుతోందని తెలిపాడు. అధికారులు స్పందించి వెంటనే ఓటర్ లిస్ట్ నుంచి తమ కూతురుపేరు తొలగించాలని కోరాడు. -
ఓటరు పేరు.. థథ భర్త పేరు.. పప
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాల్లో అనేక తప్పులు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోమవారం విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితాలో పాదర్శకత లోపించింది. జిల్లాలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లోని ఓటరు జాబితాలను పరిశీలిస్తే అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వందల సంఖ్యలో బోగస్ ఓటర్లను నమోదు చేసి యథాతథంగా జాబితాను విడుదల చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులోనే మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్న సంకేతాల నేపథ్యంలో అంతకు ముందటి నెలజులైలో ముసాయిదా ఓటరు జాబితాలను ఆయా మున్సిపాలిటీల్లో విడుదల చేశారు. ఈ సమయంలో చోటు చేసుకున్న తప్పిదాలను గుర్తించి.. సరిచేశారు. అయినా, తాజా ముసాయిదా జాబితాలో యథాతథంగా తప్పులు పునరావృతం కావడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకే ఓటరును రెండు, మూడుసార్లు ఓటరుగా నమోదు చేసిన దృశ్యాలు ప్రతి పురపాలక సంఘం పరిధిలో కనిపించాయి. ఓటు జాబితాలో పక్కపక్కనే ఈ తరహా తప్పిదాలు చోటుచేసుకున్నా గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటరు పేరు, ఫొటోలు, ఇంటి చిరునామా, వయసు ఇలా అన్ని వివరాల్లోనూ తప్పులే ఉన్నాయి. దీంతోపాటు సామాజిక వర్గాలు సైతం మార్చేశారు. ఎస్సీలను బీసీలుగా.. బీసీలను ఓసీలుగా నమోదు చేసి ప్రచురించారు. అసలు కొన్ని చోట్ల ఓటరు, తండ్రి పేరు స్థానంలో తెలుగు అక్షరాలను ముద్రించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించలేదు. కుప్పలుగా బోగస్ ఓటర్ల పేర్లు బోగస్ ఓటర్ల జాబితా చాంతాడంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో రెండు ఇంటి నంబర్లపై మొత్తం 160 మందిని ఓటర్లుగా నమోదు చేశారు. గతంలో ఇలాంటి తప్పిదాలను గుర్తించిన అధికారులు.. వందల సంఖ్యలో బోగస్ ఓటర్లను తొలగించారు. ఇంకా వందల సంఖ్యలో ఈ తరహా ఓటర్లు ఉన్నట్లు తాజా ముసాయిదా జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. ఇంకొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానికంగా నివసించిన వారికి ఓటు హక్కు కల్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇంటింటికి తిరిగి ఓటర్ల సమగ్ర వివరాలు సేకరించాల్సిన అధికారులు దాన్ని మరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా కొందరు వ్యక్తులను నమ్ముకుని ఓటర్ల వివరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే జాబితాలో పారదర్శకత లోపించినట్లు అర్థమవుతోంది. ఈ తరహా పరిస్థితి మీర్పేట, నార్సింగి మున్సిపాలిటీల్లో నెలకొంది. కొన్ని నెలల కిందట ఓటరు కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయాలన్న నిబంధన వచ్చింది. ఇది చాలా చోట్ల పకడ్బందీగా అమలు కాలేదు. దీంతో ఒకరి వివరాలు పలుచోట్ల నమోదైనా.. గుర్తించడం కష్టంగా మారింది. దీని కారణంగానే డుప్లికేట్ ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయని ఓ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. చాలా వరకు తామే స్వయంగా గుర్తిస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే స్థానికులు, రాజకీయ పార్టీల నుంచి వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. వీటి ఆధారంగా తప్పులను సవరించడంతోపాటు బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఈనెల 4న ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తామంటున్నారు. ఒకరికే రెండుసార్లు చోటు.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో ఒకరినే రెండుచోట్ల ఓటర్లుగా నమోదు చేశారు. సీరియల్ నంబర్ 1024పై సంతోష బిజ్జాల (తండ్రి జగన్)కు ఓటు హక్కు కల్పించగా.. 1025 నంబర్పైనా ఆమె పేరునే జాబితాలో చేర్చారు. ఇక్కడ భర్త వీరేశంగా పేర్కొన్నారు. అలాగే 1027 సీరియల్ నంబర్పై రిజ్వానా బేగంకు ఓటు కల్పించిన అధికారులు.. 1028 సీరియల్ నంబర్పై ఆమె పేరును మరోసారి నమోదు చేశారు. ఒకచోట భర్త పేరు షమీం అలీ ఉండగా.. మరోచోట మహ్మద్ షమీం అలీగా పేర్కొన్నారు. ఇక్కడ ఒకరి ఫొటోనే రెండుసార్లు ముద్రించారు. ఓటరు పేరు థథ షాద్నగర్ పట్టణంలోని 1–7–152/1/అ నంబర్ గల ఇంట్లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఓటరు పేరు ‘థథ’ అని ముసాయిదా జాబితాలో ప్రచురించారు. ఆమె భర్త పేరును ‘పప’గా నమోదు చేయడం గమనార్హం. అంతేగాక చాలా మంది ఓటర్ల సామాజిక వర్గాలను తారుమారు చేశారు. ఓసీలను.. బీసీలుగా, ఎస్సీలను.. బీసీలుగా మార్చారు. రెండు ఇళ్లలో 160 మంది ఓటర్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు స్పష్టమవుతోంది. రెండు ఇంటి నంబర్లపై(6–54, 6–71/ఏ) మొత్తం 160 మందిని ఓటర్లుగా జాబితాలో చేర్చారు. -
4న తుది ఓటర్ల జాబితా.. 6వరకు ఓటు నమోదుకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సూచించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం అసాధ్యమని తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టంలోని 195, 197 సెక్షన్లకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతితోనే ఈనెల 24న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశామని.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని స్పష్టంచేశారు. షెడ్యూల్ జారీ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కొత్త పద్థతి పాటించిందని, నోటిఫికేషన్ను వచ్చేనెల 7న బహిర్గతం చేయాల్సి ఉండగా, షెడ్యూల్ను ముందుగానే 24న విడుదల చేసిందని.. తద్వారా పార్టీలు, ఓటర్లను ముందుగానే ఎన్నికలకు సిద్ధం చేసినట్టు అయిందన్నారు. ఎస్ఈసీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంతో కుమ్మక్కై తొందరపాటుతో షెడ్యూల్ జారీ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చట్టం, ఎస్ఈసీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. జనవరి 6 వరకు ఓటు నమోదు.. అసెంబ్లీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రాతిపదికన మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధమైందని నాగిరెడ్డి తెలిపారు. ఎస్ఈసీ వెబ్సైట్లో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకుని, ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి 2 వరకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మున్సిపల్ ఓటర్ల జాబితాలో లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తే మున్సిపల్ కమిషనర్లు సరిచేస్తారని వివరించారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు లేకున్నా.. జనవరి 6 వరకు ఫారం–6, 7, 8 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జనవరి 4న వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాలు ఎస్ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయన్నారు. 7న నోటిషికేషన్ విడుదల తర్వాత 8న ఓటర్ల జాబితాలను రిటర్నింగ్ అధికారులు నోటీ సు బోర్డులపై ప్రదర్శిస్తారని, అదే రోజునుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అన్ని అంశాలూ వెబ్సైట్లో... మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను టీ పోల్ సాఫ్ట్వేర్తో పాటు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరిచినట్టు నాగిరెడ్డి తెలిపారు. ఓటరు స్లిప్పులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం వచ్చేనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లు... మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ డైరెక్టర్, మున్సిపాలిటీల వార్డులకు జిల్లా కలెక్లర్లు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని వివరించారు. జనవరి 4న సాయంత్రానికి రిజర్వేషన్లను పూర్తి చేసి 5న వెల్లడిస్తామన్నారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేశారు. సోమవారమిక్కడి ఓ ప్రైవేటు హోటల్లో మున్సిపల్ ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు పరిశీలకులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల విషయంలో వ్యయ పరిశీలకులు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. -
రిజర్వేషన్లు తేలకముందే మున్సిపోల్స్కు షెడ్యూలా?
సాక్షి, హైదరాబాద్: వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ఖరారు చేయకుండానే పురపాలిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై టీపీసీసీ కోర్కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేయకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడాన్ని తప్పుపట్టింది. గురువారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కోర్ కమిటీ భేటీ అయింది. ఇందులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్కృష్ణన్, సంపత్, వంశీచందర్రెడ్డి పాల్గొన్నారు. కనీసం వారమైనా ఇవ్వాల్సింది.. భేటీలో భాగంగా ఈనెల 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ నిర్వహణ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేత లు చర్చించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్పై చర్చించిన నేతలు ఎన్నికల సంఘం తీరును ఆక్షేపించారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వా త అభ్యర్థులను ఎంపిక చేసుకుని, వారు నామినేషన్ దాఖలుకు వీలుగా అన్ని పత్రాలు సిద్ధం చేసుకునేందుకు కనీసం వారం సమయం కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడం సరైంది కాదని, దీనిపై హైకో ర్టుకు వెళ్లాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను నిలిపేయాలని అడగటం లేదని, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం తగిన సమయం ఇవ్వాలని మాత్రమే కోర్టును కోరాలని అభిప్రాయపడ్డారు. పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికల సమాయత్తంపై కూడా నేతలు చర్చించారు. స్థానికంగా అవసరమైన స్థానాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకునే అధికారం స్థానిక నాయకత్వానికే ఇవ్వాలని కోర్కమిటీ నిర్ణయించింది. డీజీపీని అడిగితే డీసీపీ స్పందిస్తారా? నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తాము డీజీపీని కోరితే స్థానిక డీసీపీ స్పందించి ర్యాలీకి అనుమతి లేదనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన ర్యాలీ నిర్వహించి తీరాల్సిందేనని కోర్కమిటీ నిర్ణయించింది. వేదిక పంచుకునేది లేదు.. ఇక నిజామాబాద్లో యునైటెడ్ ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27న ఎన్ఆర్సీకి వ్యతిరేకం గా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనడంపై కూడా కోర్కమిటీ సమావేశంలో చర్చించా రు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ తనకు ఫోన్ చేశారని టీపీసీసీ కోశాధికారి గూడూరు దృష్టికి తెచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్లు పాల్గొనే ఏ వేదికను కాంగ్రె స్ పంచుకునేది లేదన్నారు. కోర్కమిటీ సమావేశం అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్రెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి ఈనెల 28న తాము నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతినివ్వాలని కోరారు. -
మీ పేరు చూసుకోండి..
సాక్షి, హైదరాబాద్: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఓటర్లు.. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఎన్నికలు జరనున్న పురపాలక సంస్థల పరిధిలోని సంబంధిత అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో తమ పేరు రిజిస్టరై ఉందో లేదో పరిశీలించుకోవాలని ఎస్ఈసీ కార్యదర్శి అశోక్కుమార్ కోరారు. ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు లేవని ఎన్నికల రోజు నిరాశకు గురికాకుండా ముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే విజ్ఞప్తి చేస్తున్నామాని, తర్వాత పేర్లు చేర్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ప్రాతిపదికనే మున్సిపల్ ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నందున ఆ జాబితాలు సరిచూసుకోవాలని సూచించారు. ఇప్పటికే మున్సిపల్ సంస్థలు వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి గత జూలై 16న ప్రచురించిన నేపథ్యంలో మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా లేదా ఓటర్లు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. జాబితాలో పేర్లుంటేనే.. వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉన్న వారే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులని, ఫొటో ఓటరు కార్డు కలిగి ఉన్నంత మాత్రాన, ఇటీవలి ఎన్నికల్లో ఓటు వేసినంత మాత్రాన మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసే వీలుండదని వివరించారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాల్లో పేర్లుంటేనే ఓటేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎస్ఈసీ వెబ్పోర్టల్ (్టట్ఛఛి.జౌఠి.జీn)లో ఓటర్ పోర్టల్ మాడ్యూల్లో ఓటర్స్లిప్ను డౌన్లోడ్ చేసుకుని తమ ఓటు స్టేటస్ను పరిశీలించుకోవచ్చు. సంబంధిత అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉండేలా చూసుకోవచ్చు. ఛ్ఛిౌ.్ట్ఛ ్చnజ్చn్చ వెబ్సైట్ ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఏ ఓటరైనా తన ఓటు ఉందో లేదా తెలుసుకోవచ్చు. అసెంబ్లీ జాబితాల్లో పేర్లు లేనివారు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికార్లకు నిర్ణీత ఫార్మాట్లో తగిన పత్రాలు లేదా ఆన్లైన్లో కూడా సమర్పించొచ్చని ఎస్ఈసీ తెలిపింది. -
ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా..
ఇబ్రహీంపట్నం పురపాలికలో 8–120 ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటుండగా.. 144 ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు. 8–119 ఇంటిలో నివసిస్తున్న నలుగురిలో ఒకరికే ఓటు ఉండగా.. ఈ ఇంటి పేరు మీద ఏకంగా 60 ఓట్లను ఎక్కించారు. 6–72లో 102 ఓట్లు, 6–28లో 105 ఓట్లు ఎక్కించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో 6వ వార్డులో ఉండాల్సిన ఓట్లు 7వ వార్డులో, 9వ వార్డులో ఓట్లు 10వ వార్డులో చేర్చారన్న ఆరోపణలున్నాయి. 6, 7, 9, 10, 11 వార్డుల ఓటర్ల జాబితాల తయారీలో అవకతవకలు జరిగాయన్నది స్థానికుల వాదన. ఇది వార్డులు రిజర్వేషన్ల ఖరారుపై కూడా ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఓటరు జాబితా అవకతవకలపై 26 దరఖాస్తులు అందగా, వందల సంఖ్యలో ఓటర్లు తమ ఓట్లు ఎక్కడున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సాక్షి, హైదరాబాద్ : ఈ రెండు పురపాలికల్లోనే కాదు రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇల్లు కట్టని ప్లాట్లలో కుటుంబాలకు కుటుంబాలే జీవిస్తున్నట్లు ఓ గందరగోళ జాబితా తయారీలో అధికారులు, రాజకీయ నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఓపెన్ ప్లాటే కాదు.. ఆఖరికి సర్వే నంబర్లలోనూ ఓటర్లున్నట్లు నమోదు చేశారు. పెద్ద అంబర్పేట పురపాలక సంఘం పరిధిలోని 7వ నంబర్ వార్డులో మొత్తం 1,615 మంది ఓటర్లలో ఏకంగా 588 మంది ఒకే సర్వే నంబర్, ఓపెన్ ప్లాట్లో నివాసమున్నట్లు జాబితాలో పొందుపరిచారు. అదే మున్సిపాలిటీలోని 15 వార్డులో ఒక కంపెనీలో పనిచేస్తున్న 211 మంది స్థానికేతరులను కూడా సర్వే నంబర్ ఆధారంగానే జాబితాలోకి ఎక్కించారు. ఆఖరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపులోనూ ఇలాంటి సిత్రాలెన్నో జరిగాయి. ఇంటింటికి తిరగకుండానే కార్యాలయాల్లో కూర్చొని ఓటర్ల జాబితా కూర్పు చేయడంతో ఓసీలు బీసీలుగా.. బీసీలు కాస్తా ఎస్సీలుగా నమోదయ్యారు. హడావుడితో ఆగమాగం! సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వార్డుల విభజన, ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా రూపొందించారు. వార్డుల విభజనలో తప్పులు దొర్లడం.. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడమే కాకుండా.. ఆఖరికి భార్యాభర్తల ఓట్లను కూడా విడగొట్టడంతో పురపాలక శాఖ పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఓటర్ల జాబితా షెడ్యూల్ను తరచూ కుదింపు.. పొడిగింపు చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. వార్డుల ఖరారులో శాస్త్రీయత పాటించకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీలో చోటుచేసుకున్న అక్రమాలపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఇప్పటికే శంషాబాద్, భైంసా, ఇబ్రహీంపట్నం, మీర్పేట, బండ్లగూడ జాగీర్, మహబూబ్నగర్, మిర్యాలగూడ మున్సిపాలిటీల ఎన్నికలపై స్టే విధించింది. ఈ కోవలోనే మరికొందరు కోర్టు మెట్లెక్కేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థలకు ఆగస్టు రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ ఒత్తిళ్లు.. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితాలో ఏకంగా ఓపెన్ ప్లాట్, సర్వే నంబర్లలో స్థానికేతరుల పేర్లను నమోదు చేస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఎన్నికల తంతును త్వరితగతిన పూర్తి చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మున్సిపల్ యంత్రాంగంపై ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో నమోదవుతున్న పేర్లను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా యథాతథంగా అచ్చేస్తుండటం ఈ ఆరోపణలకు అద్దంపడుతోంది. -
లెక్క తేలలేదు..
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓటర్ల లెక్క పూర్తిగా తేలలేదు. ఓటర్ల తుది జాబితా వెల్లడించినప్పటికీ కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని మిగతా మున్సిపాల్టీల్లో ఓటర్ల తుది జాబితాను కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించినా నగరపాలక సంస్థలో బుధవారం నాటికి వాయిదా పడింది. కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి మంగళవారం 60 డివిజన్లకు చెందిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. విడుదల చేసిన తుది ఓటర్ జాబితాను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. నగరంలో ఉన్న వివిధ పార్టీల కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులకు నగరపాలకసంస్థ తరఫున 60 డివిజన్ల ఓటర్ల జాబితాను అందజేశారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి న్యాయబద్ధమైనవి పరిష్కరించినట్లు వెల్లడించారు. తుది జాబితాలో పెరిగిన ఓటర్లు 18,941 కరీంనగర్ నగరపాలక సంస్థలో పునర్విభజన తర్వాత చేపట్టిన ఓటర్ల సర్వే ఆధారంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,56,845 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,29,273 మంది కాగా, మహిళలు 1,27,572 మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. తుదిజాబితా ప్రకారం ఓటర్లు 2,75,786 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా కంటే ప్రస్తుత జాబితాలో 18,941 ఓటర్లు పెరిగారు. ముసాయిదా జాబితా తయారీ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఎక్కడ గల్లంతయ్యాయో... సర్వే చేపట్టిన వారికే తెలియాలి. వెల్లడించని కుల, మహిళా ఓటర్ల సంఖ్య.. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓటర్ల తుది జాబితాను వెల్లడించినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన సంఖ్యను ప్రకటించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కుల, మహిళా ఓటర్ల సంఖ్యను ప్రకటించినా కరీంనగర్లో ప్రకటించికపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు, ఈ నెల 14 తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం మరో రెండు రోజుల గడువు పెంచి 16న తుది జాబితా ప్రకటించాలని సమయం ఇచ్చినప్పటికీ అధికారులు గణన పూర్తి చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కులాల వారీగా ఓటర్ల జాబితాల్లో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా... అంటూ విపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా కులాల గుర్తింపు... నగరపాలక సంస్థలో పలు డివిజన్లలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన సమయంలో ఇష్టం వచ్చినట్లు ఒక కులం వారికి మరో కులంగా గుర్తించారు. నగరంలోని 3–7–188/1 ఇంటిలో రెడ్డి కులానికి చెందిన రాజిరెడ్డి కుటుంబంలోని ఓటర్లను ఎస్సీలుగా లెక్కించారు. ఇది ఒక్క ప్రాంతంలోనే కాదు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ.. ఓటర్ల జాబితాలో కుల గణనను వెల్లడించికపోవడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడడం లేదు. కుల గణనను ప్రకటిస్తే ఆ లెక్క ప్రకారం రిజర్వేషన్లను లెక్కించుకునే అవకాశం ఉండేది. అధికారులు కుల గణనను ప్రకటించకపోవడంతో రిజర్వేషన్లపై సందిగ్ధం నెలకొంది. ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఏ డివిజన్ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే ఎవరూ తేల్చలేని పరిస్థితి నెలకొంది. కుల గణన ప్రకటిస్తే తప్ప రిజర్వేషన్లపై ఉత్కంఠత వీడే అవకాశం లేదు. మున్సిపాల్టీల వారీగా.. ► చొప్పదండి మున్సిపాల్టీలో మొత్తం 12,554 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,253, మహిళలు 6,301 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 48 మంది అధికంగా ఉండడం గమనార్హం. కొత్త మున్సిపల్ చట్టంపై చట్టసభల్లో ఆమోదం పొందాకే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ► కొత్తపల్లి మున్సిపాల్టీ తుది ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేశారు. కమిషనర్ గాలిపల్లి స్వరూపారాణి, టీపీఓ శ్రీహరి తదితరులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. 12 వార్డులకు గాను 9,421 మంది ఫొటోలతో కూడిన ఓటరు జాబితా విడుదల చేశారు. 117 ఓట్లు డబుల్గా నమోదైనట్లు వచ్చిన అభ్యర్థనలను తదుపరి చర్యల నిమిత్తం ఆర్డీఓకు నివేదించారు. ► జమ్మికుంట పురపాలక సంఘం ఓటర్ల తుది జాబితా వెలువడింది. కమిషనర్ అనిసూర్ రషీద్ ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మొత్తం 29,087 ఓటర్లుండగా.. ఇందులో 14,596 మంది మహిళలు, 14,491 పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. బీసీలు 18,920, ఎస్సీలు 5,704, ఎస్టీలు 210, ఓసీలు 4,253 ఉన్నట్లు వివరించారు. ► హుజూరాబాద్ పట్టణంలోని 30 వార్డులకు సంబంధించిన ఓటరు తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 25,406 మంది ఉండగా.. పురుషులు 12,659, మహిళా ఓటర్లు 12,747 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 234, ఎస్సీలు 4,583, బీసీలు 16,305, ఓసీ ఓటర్లు 4,284 మంది ఉన్నారు. -
‘ప్రత్యేక’ పాలనలోకి..
సాక్షి, మండపేట(పశ్చిమ గోదావరి) : జిల్లా, మండల పరిషత్తులు ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి రానున్నాయి. ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం, 4వ తేదీతో జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్నాయి. జిల్లాలో 1,102 మంది ఎంపీటీసీ సభ్యులు, 63 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జిల్లాలోని ఎటపాక, చింతూరు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో అవి మినహా మిగిలిన మండలాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 3న ముగియనుంది. పరిషత్తులకు ఎన్నికలు జరిగి, కొత్త పాలక వర్గాలు ఏర్పడేంత వరకూ జిల్లా, మండల పరిషత్తులు ప్రత్యేక పాలనలో ఉండనున్నాయి. గతంలో మాదిరిగా జిల్లా పరిషత్తుకు కలెక్టర్ను, మండల పరిషత్తులకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికారులు అంటున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ నుంచి సీఎం కార్యాలయానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు రెండు రోజుల్లో జిల్లా, మండల పరిషత్తుల పదవీ కాలం ముగియనుండగా ‘పరిషత్ పోరు’కు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) వారీగా జూలై 3వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను ఎంపీడీఓ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈఓ సిద్ధం చేయాలని సూచించింది. ఇప్పటికే పంచాయతీల్లో ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఓటర్ల ఫొటోలు, డోర్ నంబర్లతో అధికారులు జాబితాలను సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీ పరిధి మేరకు అధికారులు జాబితాలను రూపొందిస్తున్నారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీన వీటిని అందుబాటులో ఉంచనున్నారు. -
తెలుగు తమ్ముళ్లలో ‘స్థానిక’ భయం
చంద్రబాబు టీడీపీ గెలుపు నల్లెరు మీద నడకేనంటూ పదేపదే చెప్తూ మేకపోతు గాభీర్యం ప్రదర్శించారు. దీంతో ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి రావటం తథ్యమని ఆపార్టీ నాయకులు బలంగా నమ్మారు. ఎన్నికల అనంతరం ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో ఆంధ్రా ఆక్టోపస్గా పేరుపొందిన లగడపాటి రాజ్గోపాల్ సర్వే పేరిట టీడీపీ అనుకూలంగా రిపోర్టు చెప్పటంతో వాళ్ల మాట విన్న టీడీపీ నేతలు లక్షల రూపాయల్లో బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా నష్టపోయారు. సాక్షి, యద్దనపూడి (ప్రకాశం): ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ ప్రభంజనంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయారు. గత ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీలో వర్గాలుగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో తాము నష్టపోవాల్సివస్తుందన్న ఉద్దేశ్యంతో ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే టీడీపీ నాయకులు మాత్రం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా లేనట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అధికారులు స్థానిక ఎన్నికలకు కులాలవారీగా ఓటర్ల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఆరుమండలాల పరిధిలో 95 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2,29,742 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. ఇతరులు (థర్డ్జండర్లు) 10 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామపంచాయతీలకు అందజేశారు. ఇక పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. స్థానిక ఎన్నికల ఖర్చుపై చర్చ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు అభ్యర్థులు ఖర్చుచేశారు. దీనిని బట్టి రేపు జరగనున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఓటర్లకు ఇదే రీతిలో పంపిణీ చేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలే టీడీపీ నాయకులు బెట్టింగ్లో ఆర్థికంగా నష్టపోవటం, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఫుల్ జోష్లో ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటం మావల్ల కాదని స్థానిక నేతలు చేతులెతేస్తున్నారు. ఒకవేళ పోటీచేయాల్సి వస్తే స్థానిక ఎమ్మెల్యేనో లేక పార్టీ అధిష్ఠానమో భారీమెత్తంలో ఆర్థిక సాయం అందిస్తే తప్ప తాము పోటీచేసే ప్రసక్తే లేదని స్థానిక నేతలు తెగేసి చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే వైఎస్సార్ సీపీ తరపున స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆపార్టీ ఆశావాహులు అధికంగా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇలా స్థానిక ఎన్నికలైన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘం వంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మిన్నకుండిపోతే భవిష్యత్లో తమ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఎదురవుతుందని కొందరు టీడీపీ సినీయర్ నాయకులు వాపోతున్నారు. మెత్తం మీద స్థానిక ఎన్నికల్లో పోటీపై కొందరు టీడీపీ నాయకులు ఎటూ తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామపంచాయతీ కార్యాలయం -
రేపే ప్రజాతీర్పు
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ప్రజాతీర్పు రేపు వెలువడనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని అటు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమదాలవలసలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉండడంతో రాష్ట్రంలో అందరి చూపు ఆమదాలవలస నియోజకవర్గం పైనే ఉంది. పోలింగ్ జరిగి ఫలితాల వెల్లడికి మధ్య సుమారు 40 రోజుల విరామం ఉండడంతో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండడంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రజాతీర్పుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. అని చర్చించుకుంటున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూన రవికుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డేపల్లి సత్యవతి, బీజేపీ అభ్యర్థిగా పాతిన గడ్డియ్య, జనసేన అభ్యర్ధిగా పేడాడ రామ్మోహన్రావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తూలుగు సతీష్కుమార్ బరిలో నిలిచారు. అయితే వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పోలింగ్ సరలి బట్టి ఇక్కడ విజయం సాధిస్తారనేది స్పష్టత రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అధిక శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి పడ్డాయని, ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం గెలుపు తద్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేయగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రజలు మరోసారి కూన రవికుమార్కు పట్టం కడతారని టీడీపీ వర్గీయులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 78.8 శాతం పోలిగ్ జరగడంతో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, పసుపు కుంకుమ వంటివి లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. జగన్ పాదయాత్ర, నవరత్నాలు తమను గెలిపిస్తాయని వైఎస్సార్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ప్రజలు నాడి పట్టుకోవడం కష్టతరంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ – టీడీపీకి పోలైన ఓట్లు వివరాలు మండలం వైఎస్సార్సీపీ టీడీపీ మెజార్టీ ఆమదాలవలస రూరల్ 12048 13095 1047 ఆమదాలవలస పట్టణం 7541 8947 1403 బూర్జ 10825 11059 234 సరుబుజ్జలి 9616 8912 704 పొందూరు 19168 22,686 3518 2019 ఎన్నికల పోలింగ్ వివరాలు ఆమదాలవలస నియోజకవర్గం కోడ్నెంబర్–06, మండలాలు 4 ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జలి, బూర్జ మొత్తం పోలింగ్ కేంద్రాలు: 259, ఆమదాలవలస–82, పొందూరు–77, సరుబుజ్జలి–45, బూర్జ–55 ఓటర్లు వివరాలు: పురుషులు 94,224 స్త్రీలు 93,403 ఇతరులు 46 మొత్తం 1,87,673 -
నారాయణా.. తగునా!
సాక్షి, అనంతపురం అర్బన్: రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ల జాబితా అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో అందించాలి. అయితే ఈ విషయం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు కొందరు తిరకాసు తంతుకు తెరతీశారు. టీడీపీ నేతలతో ఉన్న స్నేహంతో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గంలోని టీడీపీకి నేతలకు మూడు రోజులు ముందుగానే ఓటరు జాబితాను అందజేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల తహసీల్దారుగా వ్యహరిస్తున్న సి.భాస్కర్నారాయణ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను ఉన్నతాధికారులు కొనసాగిస్తుండడం విమర్శులు ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాలకు ఎలా వెళ్లింది.? ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ల జాబితాను అందజేస్తామని సమాచారం ఇవ్వాలని ఆర్ఓ, ఈఆర్ఓలకు జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు మార్చి 31న వాట్స్ప్ మెసేజ్ పెట్టారు. దీంతో అభ్యర్థులు ఏప్రిల్ ఒకటిన జాబితా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు విరుద్ధంగా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గం టీడీపీ నాయకులకు మూడు రోజుల ముందేగా జాబితా చేరిపోయింది. దాన్ని పట్టుకుని టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతున్నారు. ధర్మవరం నియోజకవర్గానికి ముందుగానే చేరిన ఓటర్ల జాబితా ఎన్నికల తహసీల్దారుపై ఆరోపణ.. ఓటరు జాబితా ముందుగానే టీడీపీ నేతలకు అందడం వెనుక ఎన్నికల తహసీల్దారుగా కొనసాగుతున్న భాస్కర్నారాయణపై హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ధర్మవరం టీడీపీ అభ్యర్థి జి.సూర్యానారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అంతే కాకుండా సదరు నేతకు ఆయన క్లాస్మెట్ కూడా అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గం టీడీపీ నాయకులకు షెడ్యూల్ కంటే ముందుగానే ఓటర్ల జాబితా అందించడం వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. పర్సెంటేజీ దందా: ఎన్నికల విభాగంలో ఏళ్లగా తిష్టవేసిన భాస్కర్నారాయణ పర్సెంటేజీ, కమిషన్ దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల వ్యవహారానికి సంబంధించి స్టేషనరీ, ఫ్లెక్సీలు, కరపత్రాలు, ఓటర్ల జాబితా ముద్రణ ఇలా ప్రతి దాంట్లోనూ ఆయనకు కమిషన్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నా యి. ఈ కారణంగానే ఆయన రాజకీయ అండతో ఆ సీటు వదలకుండా ఏదో ఒక రకంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగింపు: భాస్కర్నారాయణకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు ఆయన్ను ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో వాస్తవాన్ని కప్పిపెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కూడా ఉన్నతాధికారులు తప్పుదారి పట్టించినట్లు విమర్శులు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ భాస్కర్నారాయణ సేవలను ఉపయోగించుకుంటున్నారు. దీంతో భాస్కర్ నారాయణ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. విభాగం సిబ్బందితో ఇష్టానుసారంగా మాట్లాడడం, వారిపై ప్రతి చిన్న విషయానికి ఆగ్రహించడం జరుగుతోందని కొందరు సిబ్బంది వాపోయారు. విచారణ చేయిస్తాం .. ఓటరు జాబితా కావాలనుకునే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి అర్జీ ఇస్తే...ఓటర్ల ఫొటోలు లేకుండా సాఫ్ట్ కాపీ (సీడీ) ఇస్తాం. అభ్యర్థులు వచ్చి ఓటర్ల జాబితా తీసుకోవాలని మార్చి 31న సమాచారం పంపాము. అయితే ధర్మవరం నియోజకవర్గానికి ఫొటో ఓటర్ల జాబితా ముందుగానే ఎలా ఇచ్చారు..? ఎవరు ఇచ్చారు..? అనే దానిపై విచారణ చేస్తాం. ఎస్.డిల్లీరావు,జాయింట్ కలెక్టర్ -
రాష్ట్ర ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకనే తొలిసారిగా రాష్ట్రస్థాయిలో పోలీసు, వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీసు పరిశీలకులుగా నియమించిన కేకే శర్మ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, కావాల్సిన పోలీసు బలగాల వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కేకే శర్శకు దివ్వేది అందజేశారు. శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం జరగనుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాలకు వారిగా సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులను పంపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి 2,395, పార్లమెంటుకు 344 మంది పోటీ రాష్ట్రంలో 175 మంది అసెంబ్లీ స్థానాలకు 2,395 మంది, 25 పార్లమెంటుకు 344 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు దివ్వేది తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశమైన దివ్వేది తుది ఓటర్ల జాబితాను రాజకీయల పార్టీలకు అందజేశారు. అదే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను అందజేస్తారని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన పరిశీలకులు పేర్లు, ఫోను నంబర్లను రాజకీయ పార్టీలకు అందజేస్తామని, ఏదైనా సమస్య ఉంటే వారిని సంప్రదించవచ్చని తెలిపారు. వేసిన ఓటు చూసుకోవచ్చు రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, వీటి ద్వారా ఓటరు వేసిన ఓటును ఒకసారి చూసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)లో వేసిన ఓటు ఏడు సెకన్లు కనిపించి బాక్స్లో పడుతుందన్నారు. ఒక గుర్తుకు ఓటు వేస్తే వేరే గుర్తుకు ఓటు పడుతోందన్న అపోహలను తొలగించడానికి 2017జూన్ నుంచి జరుగుతున్న ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా వీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ నియోకవర్గంలో లాటరీ విధానంలో ఒక వీవీప్యాట్ను ఎంపిక చేసి, ఇందులో స్లిప్లను లెక్కించి ఈవీంఎలో పోలైన ఓట్లతో సరిపోల్చి చూడటం జరుగుతుందన్నారు. వీవీప్యాట్ స్లిప్ ఎండలో ఎండినా, వానలో తడిసినా పాడవదని, ఐదేళ్ల పాటు ఈ స్లిప్ చెరిగిపోకుండా ఉంటుందన్నారు. 1400 ఓటర్లకు ఒక వీవీప్యాట్ను వినియోగిస్తామని, ఓటర్లు 1400 మించి ఉంటే మరో పోలింగ్ బూత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ద్వివేది తెలిపారు. ఆరు నెలల నుంచి వీవీప్యాట్లు, ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు జాయింట్ సీఈవో మార్కేండేయులు తెలిపారు. ఈ విధానంలో ఈవీఎంల మిషన్లను ట్యాపరింగ్ చేసే అవకాశమే లేదని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణ ఓటర్లు.. 2,96,97,279
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం తరఫున 2,96,97,279 మంది ఓటర్లు ఓటేయనున్నారు. ఇందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు ఉన్నారు. 18–19 ఏళ్ల వయసున్న 6,52,744 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కు పొందగా, అందులో 3,65,548 మంది పురుషులు, 2,87,103 మంది మహిళలు, 93 మంది ఇతరులున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోమవారం అనుబంధ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి 22న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో 2,95,18,954 మంది ఓటర్లున్నారు. నిరంతర ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 వరకు 3.38 లక్షల మంది కొత్త వారు ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరించి సోమవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించగా, 1,78,325 మంది కొత్త ఓటర్లకు చోటు లభించింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఓటేసే ఓటర్ల సంఖ్య 2,96,97,279కు పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 41,77,703 మంది, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 2,47,419 మంది ఓటర్లున్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 6,17,169 మంది, భద్రాచలం అసెంబ్లీ స్థానంలో అత్యల్పంగా 1,45,509 మంది ఓటర్లున్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో అత్యధికంగా 31,49,710 మంది, అత్యల్పంగా మహబూబాబాద్ లోక్సభ స్థానంలో 14,23,351 మంది ఓటర్లున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా.. -
ఓటర్ల జాబితాపై సమీక్ష
సాక్షి, కూసుమంచి: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలపై మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 22న సాయంత్రం 5 గంటలలోపు ఎంపీడీఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. తహసీల్దారు స్వర్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. వివిధ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు నిషేధమని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొల్లంపల్లి సుధాకర్రెడ్డి, ఆసిఫ్పాషా, సీపీఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, బీజేపీ నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, బీఎస్పీ మండల అధ్యక్షుడు ఉపేందర్తో పాటు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కవిరాజ్, సురేష్, ఎంసీఓ అంజిరెడ్డి పాల్గొన్నారు. తిరుమలాయపాలెం: ఎంపీటీసీల ఓటర్ల జాబితా ముసాయిదాపై మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో మండల పరిషత్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎంపీటీసీల వారీగా ప్రదర్శించిన ఓటరు జాబితా సవరణలపై రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచిన ఓటరు జాబితాపై ఈ నెల 25 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చని మండల ఈఓఆర్డీ రాజేశ్వరి తెలిపారు. ఆ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఈశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆ వివరాలు బయటపెట్టాలని ఆదేశించలేం
సాక్షి, హైదరాబాద్: డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పంచుకున్న సమాచార వివరాలను బహిర్గతం చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఒక పక్క సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకోవడం గోప్యత హక్కుకు భంగమని చెబుతున్న పిటిషనర్... మరోపక్క దాన్ని బహిర్గతం చేయాలని కోరడంలో అర్థం లేదని స్పష్టం చేసింది. ఓటరు కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొంది. ఆన్లైన్ అన్నది ఓ మాయాబజార్ వంటిదని, అందులో ఓసారి సమాచారాన్ని బహిర్గతం చేస్తే దాన్ని నిమిషాల్లో లక్షల్లో కాపీ చేసుకుంటారని, దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని తెలిపింది. ఒకవేళ ఆ సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకున్న ప్రాథమిక పరిజ్ఞానం ప్రకారం ఆ సమాచారాన్ని పునఃసృష్టించుకునే పరిజ్ఞానం ఇప్పుడు అంతటా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆధార్ కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించే అంశంపై మాత్రం లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి. రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితా తయారీ సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పుచేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన ఇంజనీర్ కొడలి శ్రీనివాస్ హైకోర్టులో గతేడాది పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇతరులు @ 38,325 మంది
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఓటర్ల జాబితాలో ‘ఇతరుల’విభాగంలో చేరిన ట్రాన్స్జెండర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం మేరకు.. ఇతరుల విభాగంలో ఇప్పటివరకు ఎన్రోల్ అయిన ఓటర్లు 38,325 మంది కాగా.. గత ఐదేళ్లలో కొత్తగా చేరిన వారు కేవలం 15,306 మందే. ట్రాన్స్జెండర్లు ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు 2012 నుంచి అనుమతించారు. తమ జనాభా కంటే చాలా తక్కువస్థాయిలో ఐదేళ్లలో ఓటరు జాబితాలో చేరారని.. ఇప్పటికీ ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు చాలా మంది వెనకాడుతున్నారని ట్రాన్స్జెండర్ల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. 2011 గణాంకాల ప్రకారం తమ వర్గానికి చెందిన వారి జనాభా 4.9 లక్షలని.. అయితే ఈ సంఖ్య కంటే ఎక్కువే తమ వారున్నారని వెల్లడించారు. ట్రాన్స్జెండర్ల కింద నమోదైతే సమాజంలో చిన్నచూపు చూస్తారని.. ఇతరుల విభాగంలో ఎన్రోల్ అయ్యేందుకు అడుగుతున్న ధ్రువపత్రాల కారణాంగా కూడా ఎక్కువ మంది ఓటు నమోదుచేసుకోలేకపోతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విషయమై ఒక్క గుర్తింపు కోసం ఎన్నో ధ్రువపత్రాలు అడుగుతున్నారని.. ఇది సరికాదని చెప్పారు. ‘ఇది ట్రాన్స్జెండర్లకు చాలా కష్టమైన పని. వీరిలో చాలా మందికి అన్నిధ్రువపత్రాలు ఉండవు..’అని ప్రత్యత్ జెండర్స్ ట్రస్ట్కు చెందిన అనింధ్య హజ్రా వ్యాఖ్యానించారు. అలాగే పాస్పోర్టుల విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని.. 2014 నల్సా తీర్పునకు విరుద్ధంగా వైద్య ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారని వాపోయారు. ఓటర్ జాబితాలో ఇదివరకు స్త్రీ లేదా పురుషుడుగా నమోదైన వారు ఇతరుల విభాగంలో చేరేందుకు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు. ‘2014లో ఇచ్చిన కోర్టు తీర్పును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అన్ని రాష్ట్రాలు ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులివ్వాలని.. వీటి మేరకే ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని చెప్పినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు..’అని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్, తెలంగాణ హిజ్రా ఇంటర్సెక్స్ ట్రాన్స్జెండర్ సమితికి చెందిన మీరా సంఘమిత్ర వాపోయారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో ‘మధ్య’ ఓట్లే కీలకం!
ఆదిలాబాద్అర్బన్: ఏప్రిల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మధ్య వయస్కుల ఓట్లే కీలకం కా నున్నాయి. ఇప్పటికే అధికారులు వయసుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. 18 ఏళ్ల యువ ఓటర్ల నుంచి 79 ఏళ్ల వయస్సు గల వారు, 80 ఏళ్లకుపైబడిన వృద్ధులు జాబితాలో ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా లెక్కతీశారు. ఉమ్మ డి జిల్లాలో గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపకల్పన కోసం గత డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వర కు ఓటరు నమోదును నాలుగు జిల్లాలో చేపట్టా రు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొం దిం చిన ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 20,63,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 10,20,320 మంది ఉండగా, మహిళలు 10,43,552 మంది ఉన్నారు. ఇతరులు 91 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,63,963 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల వయసు నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారు 12,19,180 మంది ఉండగా, 18 నుంచి 29 ఏళ్ల వయసు గల యువ ఓటర్లు 5,97,276 మంది ఉన్నారు. 60 నుంచి 79 ఏళ్ల వయసు గల వృద్ధ ఓటర్లు 2,26,047 మంది ఉండగా, 80 ఏళ్లకుపైబడిన వృద్ధులు 21,460 మంది ఉన్నట్లు జాబితాలో స్పష్టంగా ఉంది. ఇక 18, 19 ఏళ్ల వయసు గల వారు కొత్తగా ఓటరు జాబితాలో నమోదయ్యారు. ఈ లెక్కన 48,519 మంది యువకులు కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వచ్చే నెలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వయస్సుల వారీగా ఓటర్లతో పోల్చుకుంటే ఈ సారి ఎక్కువగా నమోదయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు నాలుగు జిల్లాల అధికార యంత్రాంగం గత రెండు నెలలుగా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్నికల సి బ్బంది, అధికారుల నియామకం, పోలింగ్ కేం ద్రాల్లో సౌకర్యాల కల్పన, ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకుంటున్న అధికారులు మ రోవైపు ఓటర్ల తుది జాబితాను కూడా రెడీ చేశా రు. కాగా, ఓటరు జాబితా ప్రకారం చూ స్తే.. రానున్న లోక్సభ ఎన్నికల్లో మధ్య వయస్కులు, యువత ఓట్లు కీలకం కానున్నాయి. జా బితాలో 52 శాతం మంది మధ్య వయస్కులు ఉండగా, 25 శాతం యువ ఓటర్లు ఉండడం ఇక్కడడంతో అభ్యర్థుల గెలుపు వీరి చేతుల్లో ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించి ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్కు ఎవరిని పంపాలన్నది ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఓ టు హక్కు ద్వారా నేతల తలరాతలను మార్చుతారో.. లేదో చూడాలంటే ఏప్రిల్ 11 దాకా ఆగాల్సిందే. నాలుగు జిల్లాల్లో వయసుల వారీగా ఓటర్లు ఇలా.. వయసు కుమురంభీం మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ 18 నుంచి 19 9,438 12,185 8,916 17,987 20 నుంచి 29 1,09,037 1,46,308 1,14,080 1,79,235 30 నుంచి 39 1,02,264 1,53,305 1,10,100 1,78,053 40 నుంచి 49 79,481 1,16,485 77,462 1,28,886 50 నుంచి 59 52,875 83,340 52,248 84,681 60 నుంచి 69 30,493 47,032 29,235 49,492 70 నుంచి 79 13,098 20,721 13,574 22,402 80 నుంచి ఆపైన 4,420 5,925 3,726 7,389 -
లోక్సభ ఓటర్లు 3 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో సుమారు 3 కోట్ల మందికి ఓటు హక్కు లభించనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా గత నెల 22న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,95,18,964 మంది ఓటర్లున్నారు. అందులో 1,48,42,619 మంది పురుషులు, 1,46,74,977 మంది మహిళలు, 1,368 మంది ఇతరులున్నారు. ఓటరు నమోదు కోసం ఈ నెల 15 వరకు వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలను నియమించి ఓటరు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లోక్సభ ఎన్నికలకు వారం రోజుల ముందు అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. అనుబంధ ఓటర్ల జాబితాలో మరో 5 లక్షల మంది కొత్త ఓటర్లకు చోటు లభిస్తే రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య తొలిసారిగా 3 కోట్ల మైలురాయిని దాటనుంది. మల్కాజ్గిరి టాప్! మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో అత్యధికంగా 30,98,816 మంది ఓటర్లున్నారు. 24,15,598 ఓటర్లతో చేవెళ్ల, 19,59,490 మంది ఓటర్లతో హైదరాబాద్, 19,54,813 మంది ఓటర్లతో సికింద్రాబాద్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహబూబాబాద్ పరిధిలో అతి తక్కువగా 14,14,210 మంది ఓటర్లున్నారు. -
కర్నూలు జిల్లా.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, కర్నూలు: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ప్రత్యేక సెల్ ఇన్చార్జ్ లక్ష్మిరాజు : 9704738448 మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ప్రతి శనివారం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుంది. పేరు ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఓటు ఉందో లేదో చూసుకోండి
-
ఓటు నమోదుకు ఇక ఐదు రోజులే సమయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ పేరు లేనట్లయితే ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది విజ్ఞప్తి చేశారు. ఓటరుగా చేరేందుకు ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉందని, ఆలోగా జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకుంటే.. వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, 15వ తేదీ తరువాత ఓటు లేదంటే ఏమి చేయలేమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించిన అనంతరం ద్వివేది ఆదివారం రాత్రి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్లుగా చేరడానికి సమయం ఉందని, అయితే దరఖాస్తుల వెరిఫికేషన్కు పది రోజుల సమయం పడుతుందని, అందువల్లే ఈ నెల 15లోగా పేరుందో లేదో చూసుకుని దరఖాస్తు చేసుకోమని కోరుతున్నట్లు ద్వివేది వివరించారు. ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి ఏడు రోజుల నోటీసు సమయం పడుతుందని, ఆ తర్వాత మూడు రోజులు వెరిఫికేషన్కు సమయం పడుతుందన్నారు. ఇప్పుడు ఓటర్లను తొలగించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఫారం–7లకు సంబంధించి ఇప్పటివరకు 9,27,542 దరఖాస్తులు రాగా వాటిలో 7,24,940 తనిఖీ చేశామని, అందులో 5,25,957 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. ఇంకా 1.57 లక్షల ఫారం–7 దరఖాస్తుల్ని పరిశీలన చేయాల్సి ఉందన్నారు. వీటిని వెరిఫై చేశాక కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పుడు 3.82 కోట్లకు చేరినట్లు వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది చెప్పారు. మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 9,345 పోలింగ్ కేంద్రాల్ని సమస్యాత్మకంగా గుర్తించామని, అక్కడ కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 200 నుంచి 300 వరకు పోలింగ్ కేంద్రాలు పెరిగే వీలుందని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతితోపాటు టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు, ర్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటరు స్లిప్లు ఇస్తామని చెప్పారు. అయితే ఓటర్ స్లిప్లను గుర్తింపు కార్డులుగా పరిగణించరని, ఈసీ పేర్కొన్న ప్రత్యామ్నాయ 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదుకోసం వచ్చిన 2,64,712 పెండింగ్ దరఖాస్తులున్నాయని, వాటిన్నింటినీ వెరిఫై చేసి క్లియర్ చేస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని, కొన్ని స్పీడు బోట్లను కూడా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే సామాన్యులెవరైనా సరే సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి శాఖ ఓ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి: అయ్యన్నార్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి సారిస్తున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. పది లక్షలలోపు నగదు లావాదేవీలపై పోలీసులు విచారణ చేస్తారని, అంతకుమించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని చెప్పారు. సామాన్యులెవరైనా నగదును తీసుకెళుతున్నప్పుడు సంబంధిత ధ్రువపత్రాలుంటే, అలాంటి వాటికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్నారు. ఎక్సైజ్, రవాణా, ఆదాయపు పన్ను, కస్టమ్స్ అధికారులతో కూడిన బృందాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి బృందంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో ఓ అధికారిని నియమిస్తున్నామన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అక్కడికక్కడే విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తారని తెలిపారు. ఫారం–7 దరఖాస్తులపై 446 కేసులు నమోదు చేశామని, వాటిని సిట్కు బదలాయించామని చెప్పారు. ఐపీ అడ్రస్లకోసం సి–డాక్కు లేఖ రాశామన్నారు. -
ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటన
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య: శ్రీకాకుళం 20,64,330 విజయనగరం 17,33,667 విశాఖపట్నం 32,80,028 తూర్పు గోదావరి 40,13,770 పశ్చిమ గోదావరి 30,57,922 కృష్ణా 33,03,592 గుంటూరు 37,46,072 ప్రకాశం 24,95,383 నెల్లూరు 22,06,652 వైఎస్సార్ కడప 20,56,660 కర్నూలు 28,90,884 చిత్తూరు 30,25,222 అనంతపురం 30,58,909 -
విశాఖపట్నం : మీ ఓటు ఉందా.. వెంటనే సరి చూసుకోండి..
సాక్షి, విశాఖపట్నం : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - కలెక్టరేట్లోని కాల్ సెంటర్ ల్యాండ్ లైన్ నెం : 0891–2534426 - కాల్ సెంటర్ ఇన్చార్జి : కే.పద్మ, పీడీ, డ్వామా : 9490914671 - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - సాధారణంగా ఎన్నికల నామినేషన్కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. - ఆర్డీవో ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన నంబర్: 9618827134, (ఆర్వో: జి.సూర్యనారాయణరెడ్డి) - తహసీల్దార్ కార్యాలయం ఎలక్షన్ సెల్, ఫోన్ నంబర్లు యలమంచిలి : 9100064953 అచ్యుతాపురం : 9100064943 రాంబిల్లి : 9100064952 మునగపాక : 9100064951 - మీ సమీపంలోని బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. - ఒకవేళ మీ ఓటు లేదని తెలిస్తే.. పై మూడు స్థాయిల్లోనూ అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి, ఫారం–6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లోనూ నిర్ణీత రుసుము తీసుకుని ఓటు ఉందో లేదో తెలియ చెబుతారు. అక్కడే ఓటు నమోదు చేస్తారు. - ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవల్ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఆర్డీఓ, ఎమ్మార్వో, బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలి. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్కు లింక్
సాక్షి, అమరావతి: ఓటరుతో ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు... ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్న, ఓటర్లను గందరగోళపరుస్తున్న అంశం ఇది. ఈ సమస్యకు ఎన్నికల సంఘం ఓ పరిష్కార మార్గం చూపిస్తోంది. మీ ఓటరు ఐడీని మీ మొబైల్ నంబర్తో అనుసంధానం చేసుకోవడం ద్వారా.. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్ను ఒకసారి లింక్ చేస్తే మీ పేరిట ఫామ్–7తో సహా ఏమైనా మార్పులు చేర్పులకు దరఖాస్తులు వస్తే వెంటనే మీ మొబైల్కు హెచ్చరిక (అలర్ట్) సందేశం వస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా http://ceoaperms.ap.gov.in/AP&MobileNoRegistration/MobileNoRegistration.aspx అనే లింక్లోకి వెళ్లి మీ ఎలక్టొరల్ ఫోటో ఐడీ కార్డు నంబర్ (ఎపిక్ నంబర్)ను, ఫోన్ నంబర్ను ఎంటర్ చేస్తే ఆ నంబర్కు వన్టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు ఎపిక్ నంబర్తో మీ ఫోను అనుసంధానం అయినట్లే. మీ కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే నంబర్కు ఇలా లింక్ చేసుకోవచ్చు. ఇది కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎన్నికల అక్రమాలకే డేటా చౌర్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం–7 దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడం జాతీయస్థాయిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై వివిధ వర్గాలకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును, ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు సంబంధించిన డేటా ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలకు అనధికారికంగా వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకే డేటా చౌర్యానికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులమీద ఐటీ, ఐపీసీ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగించడంపై వివిధ రంగాల నిపుణులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమాలు, డేటా చౌర్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓట్ల తొలగింపు తీవ్రమైన నేరం ఓట్ల అక్రమ తొలగింపు తీవ్రమైన నేరం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లను తొలగించాలంటూ ఫారం–7తో ఆన్లైన్లో దరఖాస్తులు చేయడమంటే పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడమే. రాజ్యాంగ విరుద్ధమైన ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సత్వరం స్పందించాలి. ప్రత్యేక పరిశీలకులను నియమించి రాష్ట్రంలో ఇంటింటికి సర్వే నిర్వహించాలి. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కేజే రావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఐపీసీ, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పథకాల సందర్భంగా సేకరించిన సమాచారాన్ని కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభంకోసం ఉపయోగిస్తుండడం, ఓటర్ల జాబితాల నుంచి ఓట్లు తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని నా దృష్టికి రాగానే దీనిపై దర్యాప్తు చేయమని ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ప్రభుత్వంపై నమ్మకంతో ఆధార్ కార్డు, ఇతర అవసరాలకోసం ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తారు. అలాంటి సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరకుండా గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరిందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల సమాచార దుర్వినియోగం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. అందుకు బాధ్యులైనవారిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి రాజకీయాలకతీతంగా చర్యలు తీసుకోవాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి చంద్రబాబు ప్రభుత్వానిది దేశ ద్రోహం అక్రమంగా ఓట్లను తొలగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఓటుహక్కును కాలరాయడంతోపాటు దేశద్రోహానికి కూడా పాల్పడింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. ఆధార్కార్డు, తదితర సమాచారం దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తులకు చేరితే తీవ్ర దుష్పలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు సీఎం చంద్రబాబుతోపాటు యావత్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. సీఎం ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ ఆధార్ ప్రాజెక్టులో కూడా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు చేరిన వ్యవహారంలో సత్యనారాయణను వెంటనే తొలగించాలి. ప్రభుత్వ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టాలి. – అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజల ఆధార్కార్డ్, ఓట్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ప్రైవేటు సంస్థలకు ఎలా చేరాయన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఆ ప్రైవేటు సంస్థలు ఎందుకోసం ప్రజల వ్యక్తిగత వివరాలను తమ వద్ద ఉంచుకున్నాయన్నది కీలకం. ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు, ఎలాంటి ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు ఈ డేటాను చౌర్యం చేశారన్నది నిగ్గు తేలాల్సి ఉంది. ఈ అక్రమాల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – డా.గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక -
డేటా లీకేజి వెనుక బ్లూ ఫ్రాగ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐటీ హబ్ అవుతుందనుకున్న విశాఖ నగరం చివరికి డేటా లీకేజి కేంద్రంగా మారింది. విశాఖ నగరాన్ని ఐటీ హబ్ చేసేస్తామని ఐదేళ్లుగా చెబుతున్న సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోక్శ్.. దీన్ని డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు తాజా సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. విశాఖ కేంద్రంగా డేటా అక్రమ వినియోగం కోసం కొన్నేళ్లుగా పక్కా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ వ్యవహారం వెనుక హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు విశాఖకు చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హస్తం ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన సేవామిత్ర మొబైల్ యాప్లో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మూడుకోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సైబరాబాద్ పోలీసులు శనివారం సాయంత్రం నుంచి సోదాలు నిర్వహించారు. కొన్ని హార్ట్ డిస్క్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేత తుమ్మల లోకేశ్వరరెడ్డి మాదాపూర్ పోలీసులకు చేసిన మరో ఫిర్యాదుతో విశాఖలోని బ్లూ ఫ్రాగ్ సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్ఫోన్ ఆధారిత సేవల పేరిట వైజాగ్లోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ రాష్ట్ర జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ప్రజల ఆధార్ కార్డులు, ఏపీ స్మార్ట్ పల్స్ సర్వే, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్తో పాటు హైదరాబాద్లోని కావ్య డేటా మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి ప్రజా సాధికార వేదిక వివరాలను సేకరిస్తోంది. ఈ డేటా మొత్తాన్ని ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థకు అందిస్తోందని లోకేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వగా.. ఇందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ యాప్లో ఓటర్ల వివరాలు ఉండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సీఎంతో హెలికాప్టర్లో వెళ్లేంత సాన్నిహిత్యం విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ ఫణిరాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సీఎంతో హెలికాప్టర్లో కూడా తిరిగేంతటి సాన్నిహిత్యం అతడికి ఉందని విశాఖ టీడీపీ నేతలు చెబుతున్నారు. పదేళ్ల కిందట సింగపూర్ నుంచి తిరిగొచ్చి.. విశాఖలో స్థిరపడిన ఫణి మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత బ్లూ ఫ్రాగ్ సంస్థను నెలకొల్పిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వారా సీఎంకు పరిచయమయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ యాప్లు, ఎన్టీఆర్ ట్రస్ట్కు సంబంధించిన ఐటీ సర్వీసులన్నీ ఆయనే చూసేవారు. ఈ క్రమంలోనే డేటా లీకేజి పనిని కూడా సదరు ఫణికే అప్పగించారన్న వాదనలకు బలం చేకూరుతోంది. -
జెడ్పీ, మండల ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మే నెల చివరికల్లా ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు అవసరమైన సంసిద్ధతను ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈ సీ) తెలియజేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 27 లోగా రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయ తీల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితా లను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీఓ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. రాష్ట్రం లోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించేలా చర్యలు తీసుకోవా లని శనివారం ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పీఆర్శాఖ ముఖ్యకార్య దర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (హైదరాబాద్ మినహా), సీఈఓలు, ఎంపీడీఓలకు సమాచారం పంపించారు. 2019 జనవరి 1 కల్లా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరున్న వారిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఈ నెల 22న ›ప్రకటించిన (2019 జనవరి 1 ప్రాతిపదికగా) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా వాటిని తయారు చేయాలని నాగిరెడ్డి సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచిం చిన మేరకు వార్డుల విభజన పూర్తి చేయాలని నిర్దేశించారు. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ను మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా మండలాల స్థాయిల్లో ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ల స్థాయిలో సీఈఓ లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఓటర్ల జాబితాలను సంబంధిత మండల, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుం ది. వచ్చేనెల 27న ఫోటోలతో కూడిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదర్శించాక, నోటిఫికేషన్ వెలువడే నాటికి అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఏవైనా చేర్పులు, తీసివేతలు లేదా సవరణల విషయంలో ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి ఆదేశాలు ఇచ్చి ఉంటే వాటిని కూడా డీపీఓలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుం దని స్పష్టంచేశారు. ఆ మేరకు సంబంధిత గ్రామపంచాయతీ వార్డుల ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని సూచించారు. జెడ్పీ,ఎంపీటీసీ ఎన్నికలు ఇలా... రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల(పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ మినహాయిం చి) ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిష త్ల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను ముం దుగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా జెడ్పీ టీసీలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించడంతో దానిపై జిల్లా కలెక్టర్లు చేసిన కసరత్తు పూర్తికావొచ్చింది. కొత్త గా ఏర్పాటైన రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణపై క్షేత్రస్థాయి పరిస్థి తులు పరిగణనలోకి తీసుకుని వీటిని పూర్తి చేస్తు న్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధం కాగానే పోలిం గ్స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత జెడ్పీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల తేదీలు ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఇదీ షెడ్యూల్ - మార్చి 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా (డ్రాఫ్ట్) ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాలి - మార్చి 17–20 తేదీల మధ్య గ్రామీణ అసెంబ్లీ ఓటర్లను వార్డులు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చడం పట్ల ఏవైనా అభ్యంత రాలుంటేస్వీకరణ - మార్చి 18న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారుల సమావేశం - మార్చి 19న మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓల సమావేశం - మార్చి 23న ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని డీపీఓలు పరిష్కరించాలి - మార్చి 27న డీపీఓలు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి - మార్చి 30న మండల ప్రజా పరిషత్ పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ పరిధిలోని జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల (జెడ్పీటీసీ) వారీగా ఫోటో ఓటర్ల జాబితాను సీఈఓలు, తయారు చేసి సంబంధిత మండల, జిల్లా పరిషత్ కార్యా లయాల్లో బహిరంగంగా ప్రదర్శించాలి. -
జిల్లా ఓటర్లు 9,68,305
ఉమ్మడి జిల్లాలోని ఓటర్ల లెక్క తేలింది. శుక్రవారం ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈసీ జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అతివలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,22,888 ఓటర్లుండగా.. మహిళలు 13,78,186, పురుషులు 13,44,634గా ఉన్నారు. మొత్తంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లు 33,552 అధికంగా నమోదయ్యారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళలు అధికంగా ఉండగా.. పెద్దపల్లిలో మాత్రం పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఇతరులు 68 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13నియోజకవర్గాలుండగా.. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి మినహాయిస్తే అన్నింటిలో మహిళాఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో నాయకులు మహిళల తీర్పుతోనే గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లు 4,81,271, మహిళలు 4,87,013, ఇతరులు 21తో కలిపి మొత్తం 9,68,305 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. జగిత్యాలలో పురుష ఓటర్లు 3,19,476, మహిళలు 3,39,479 ఓట్లుండగా.. ఐదుగురితో కలుపుకుని మొత్తం 6,58,960 ఓట్లున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 3,34,536 ఉండగా మహిళల ఓట్లు 3,31,405 ఇతరులతో 39 ఓట్లు కలపి మొత్తం 6,65,980 ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో పురుషులు అధికంగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశీలించినట్లయితే పురుషులు 2,09,351 ఉండగా మహిళలు 2,20,289 ఇతరులు ముగ్గురుతో కలిపి మొత్తం 4,29,643 ఓటర్లున్నారు. రానున్న ఎన్నికలు తుదిజాబితాతోనే.. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికల్లో తుది ఓటరు జాబితా ప్రకారమే ఓట్లు వేస్తారు. ఓటు హక్కు ప్రాధాన్యం పెరగడం, వరుస ఎన్నికలు వస్తుండడంతో ఓటు నమోదుపై ఆసక్తి చూపారు. దరఖాస్తులు కూడా ఊహించినదానికంటే ఎక్కువగానే వచ్చాయని సమాచారం. ఈనెల 14వరకు కొత్త ఓటరుగా దరఖాస్తుకు గడువు ఇచ్చి.. తుది జాబితాను శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితా ప్రకారమే రానున్న పార్లమెంట్, పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా ఎన్నికల కాంటాక్ట్ కేంద్రం ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచి చాలామంది సమస్యల పరిష్కారానికి కృషిచేసింది. ఫోన్ ద్వారా సమస్య తెలిపితే చాలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు అనుసంధానించి కొత్త ఓట్ల నమోదులో కీలకపాత్ర పోషించింది. దేశ, రాష్ట్ర స్థాయిలో కాంటాక్ట్ కేంద్రం ద్వారా చాలామంది ఓటరు దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచింది. -
తేలిన లెక్క
నిర్మల్: లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,63,963 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తుది జాబితాను శుక్రవారం వెల్లడించారు. ఇందులో 10,20,320మంది పురుష ఓటర్లు, 10,43,552మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అలాగే 91మంది ఇతరుల కింద ఓటు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా నిర్మల్లో, అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్లు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిర్మల్లోనే అధికం... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 4,01,106 మంది ఉండగా మహిళలు 1,99,795మంది, పురుషులు 2,01,300, ఇతరులు 11మంది ఉన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,85,301మంది ఓటర్లు ఉన్నారు. ఇందు లో 2,90,903మంది మహిళలు, 2,94,359మంది పురుషులు, ఇతరులు 39మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పరిధిలో 4,09,341మంది ఓటర్లు ఉన్నారు. 2,07,703మంది మహిళలు ఉండగా, 2,01,630మంది పురుషులు, ఇతర 8మంది ఓటర్లు ఉన్నారు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,45,151మంది మహిళలు, 3,23,031మంది పురుషులు, 33మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఓటర్ల నమోదు కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. మహిళలదే పైచేయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20,63,963మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో పురుషులతో పోల్చితే మహిళలే అత్యధికంగా ఉండటం గమనార్హం. జనాభా పరంగా పురుషుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లలోనూ మహిళలే పైచేయి సాధించారు. పురుషులతో పోల్చితే 23,232మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో పురుష ఓటర్లు 3,23,031మంది ఉండగా 3,45,151మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్ల జాబితాలోనూ మహిళల చైతన్యం కనిపిస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91మంది ఇతరుల విభాగంలో ఓటు నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 39మంది ఇతరుల విభాగంలో ఉన్నారు. కుమురంభీంలో స్వల్పం.. జిల్లాల వారీగా పోలిస్తే కేవలం రెండు నియోజకవర్గాల పరిధి కలిగిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువ ఓటర్లు నమోదయ్యారు. ఇక్కడ 4,01,106మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాతో పోలిస్తే కాస్త ఎక్కువగా 4,09,341మంది ఓటర్లు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనూ రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఇక అత్యధికంగా మూడు నియోజకవర్గాలు ఉన్న నిర్మల్ జిల్లాలో 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోనూ మూడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ 5,85,301మంది ఓటర్లు నమోదయ్యారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓటర్లు గల్లంతు కావడంతో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, 2కే రన్, స్పెషల్ డ్రైవ్ వంటివి నిర్వహించారు. దీంతో నిర్మల్ జిల్లాలో ఓటర్ల సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ ఈవీఎంల పరిశీలన పూర్తయింది. పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి నంబర్లను కేటాయించడం వంటి పనులు పూర్తి చేస్తున్నారు. -
‘దొంగ’దారుల్లో చిత్తూరు ‘దేశం’!
సాక్షి, చిత్తూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేకపోవడంతో అధికారం నిలుపుకోడానికి ‘దొంగ’దారులు వెతుక్కుంటోంది. ఓటర్ల మార్పులు, చేర్పులు, నమోదుల్లో చేతివాటం ప్రదర్శిస్తోంది. దీనికి ఇతోధికంగా అధికార యంత్రాంగం కూడా సహకరిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏ జిల్లాలో లేనంత ప్రహసనంగా చిత్తూరు జిల్లాలో మారింది. ఓటర్ల జాబితాలో కొత్త పేర్లు ఇష్టారీతిన చేరుతున్నాయి. ఒకొక్కరికి 2కు మించి ఓట్లు ఉంటున్నాయి. గంగాధర నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో సరైన సమాచారం లేకుండానే వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో అయితే వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించాలని ఏకంగా 10,224 దరఖాస్తులు వచ్చాయి. పోలింగ్ బూత్ల మార్పునకు ఒత్తిడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లున్న పోలింగ్ బూత్లను మార్చాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. దీనికి కోసం అధికారులపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ బూత్లను ఇప్పటికే మార్చేశారు. ఈ నియోజకవర్గంలోని పెనుమూరు మండలం పెద్దకలికిరిలోని పోలింగ్ బూత్ను మొరవకండ్రిగకు మార్చారు. కలికిరి గ్రామం మొత్తం వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారు. దీన్ని టీడీపీ నేతలు మొరవకండ్రిగకు మార్పించారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సమగ్ర సర్వే చేసిన తరువాత పోలింగ్ బూత్ పెద్ద కలికిరిలోనే ఉండాలని ఆదేశించింది. అయితే, పెనుమూరు పూర్వపు ఎమ్మార్వో రవి ఈసీ ఆదేశాలను సైతం ఖాతరు చేయలేదు. కుప్పం, శ్రీకాళహాస్తి, నగరి నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల్లోనూ మార్పులు జరిగాయి. టార్గెట్ చంద్రగిరి.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. ఓటర్లకే తెలీకుండా ఫాం–7ను నింపి అధికారులకు పంపుతోంది. ఇలా ఓట్లు తొలగించాలని ఈ ఏడాది జనవరి 12 నుంచి ఫిబ్రవరి 14 వరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 17,395 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 10,224 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తే అవి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులవేనని తేలింది. అలాగే, గత పది సార్వత్రిక ఎన్నికల్లో ఒకే బూత్లో ఓటేసిన వారి ఓట్లూ తీసేయాలని దరఖాస్తులు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఓట్లు తొలగించాలని వచ్చిన 10 వేల దరఖాస్తుల్లో ఇప్పటికే 7,983 ఓట్లను తొలగించేందుకు టీడీపీ నేతలు అధికారులతో కలిసి కుట్ర చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం నకిలీ జిత్తులు ఇదిలా ఉంటే.. సొంత జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు ‘నకిలీ’ ఎత్తులు కూడా వేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారు. కుప్పం, గంగాధర నెల్లూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అయితే, వీటి తొలగింపు ప్రక్రియలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం క్రిష్ణయ్యయానాది కాలనీ, రామకృష్ణాపురం యానాది కాలనీల్లో నివాసంలేని వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో కర్ణాటక, తమిళనాడు వాసులను ఎక్కువగా ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారు. కాగా, వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటే వారి ఓటుపై వేటు వేస్తున్నారు. అధికారులతో కుమ్మక్కయి ఓట్లను తొలగిస్తున్నారు. దీనిపై పలుమార్లు ఆందోళన చేసినా ఫలితంలేదు. నగరి నియోజకవర్గం వడమాలపేటకు చెందిన మురళీధర్రెడ్డి స్థానికంగా పేరున్న నేత. ఆయన ఓటుతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లనూ తొలగించారు. అధికారులను అడిగినా సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆయన వాపోతున్నాడు. -
ఓట్ల దొంగలు జైలుకే
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల విధుల్లో సెక్టోరల్, పోలీస్ అధి కారుల విధులు చాలా కీలకమైనవని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో మదనపల్లె డివిజన్ సెక్టోరల్, పోలీస్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పిం చిన ఓటుహక్కును జిల్లాలో ఉన్న ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 17 నుం చి 20వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటర్లందరికీ ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈవీఎంలపై ఓటర్లకున్న సందేహాలను నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. అవగాహన కోసం తీసుకెళ్లే యంత్రాలను కార్యక్రమాలు పూర్తయ్యాక తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరచాలన్నారు. ఎట్టి పరిస్థితులల్లోను ఎన్నికల యంత్రాలను ఇళ్లకు తీసుకెళ్లకూడదని తెలిపారు. ఏ చిన్నతప్పు చేసినా, పక్షపాతంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 473 మంది సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మౌలిక సదుపాయాల ఇబ్బందులుంటే నివేదికలు ఇవ్వాలన్నారు. ఆ ప్రక్రియ ఈ నెల 20 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో జరిగే ఎన్నికలను ఉత్తమ ఎన్నికలుగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసులు ఎక్కడైనా విధులు పట్ల అలసత్వం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఓటు చిత్తూరు ఓటు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున, జెడ్పీ సీఈఓ ఓబులేసు, ఈవీఎం నోడల్ అధికారి విద్యాశంకర్, ఎంసీఎంసీ నోడల్ అధికారి తిమ్మప్ప, ఈఆర్వో లు కనకనరసారెడ్డి, నాగరాజు, సెక్టోరల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
వీవీప్యాట్లు లెక్కించవచ్చు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలు 35 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో జరిగాయని, అందులో దాదాపు 200 పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు సరైన అవగాహన లేకుండా ఈవీఎంలను వినియోగించి పొర పాట్లు చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్కుమార్ తెలిపారు. మాక్ పోల్ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించే మీటను నొక్కకుండానే పోలింగ్ ప్రారంభించడంతో వాస్తవంగా పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లసంఖ్య మధ్య వ్యత్యాసం ఏర్పడిందన్నారు. ఈ సందర్భం గా నెలకొనే అనుమానాలను నివృత్తి చేసేందుకు వీవీ ప్యాట్ రసీదులను లెక్కించవచ్చన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగం గా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లా ఎన్నికల అధికారు(డీఈవో)లైన కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్తోపాటు రిటర్నింగ్ అధికారులకు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శిక్షణ అనంతరం ఆర్వోలకు పరీక్షలు నిర్వహించామని, పాసైతేనే లోక్సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ పరీక్షల్లో విఫలమైన అధికారులను ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణ తరగతులకు పంపిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఖర్చుల అధ్యయనం, నామినేషన్లను భర్తీ చేసే విధానం, వికలాంగులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, ఓటు చేసే విధానం తదితర అన్ని అంశాలపై డీఈవోలకు, ఆర్వోలకు శిక్షణనిచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో డీఈవోలు, ఆర్వోల పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న డీఈవోలు, ఆర్వోలను భర్తీ చేసే కార్యక్రమం కొనసాగుతోందని, ఇప్పుడున్న కొంతమంది ఆర్వోలను మార్చనున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని రజత్కుమార్ తెలిపారు. అన్ని టెక్ని కల్ విషయాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయపరమైన సమస్యలను కూడా చర్చించినట్లు తెలిపారు. సీ– విజిల్ యాప్, 1950 కాల్సెంటర్ కూడా ఉపయోగిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పా రు. శాంతిభద్రతల విషయంలో లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సమీక్ష లోక్సభ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఆరా తీశారు. ఏపీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్కు చేరుకుని ఇక్కడే రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో సమావేశమై లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఖాళీలున్న చోట్లలో జిల్లా ఎన్నికల అధికారుల నియామకం, అవసరమైన చోట్లలో బదిలీలు, రిటర్నింగ్ అధికారులకు శిక్షణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకునేందుకు సీఎస్ ఎస్కే జోషితో సీఈవో రజత్కుమార్ సచివాలయంలో సమావేశమై చర్చించారు. ఆ కలెక్టర్ అనుకోకుండా పొరపాటు చేశారు ‘శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్లు తీవ్రంగా కష్టపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ సైతం బాగా కష్టపడి పనిచేశారు. అయితే, ఆయన పొరపాటుగా ఈవీఎం యంత్రాలను తెరిచి చిక్కుల్లోపడ్డారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయలేదు. పొరపాటుగా ఈవీఎంలను తెరిచి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆయన్ను సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకోకతప్పలేదు’అని రజత్కుమార్ పేర్కొన్నారు. 27.31 లక్షల దరఖాస్తులు... ఓటర్ల జాబితా సవరణ కింద దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 4తో ముగిసిందని, గడువులోగా 27.31 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్కుమార్ అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, అందులో 7 లక్షల దరఖాస్తులు తొలిసారిగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నవారే ఉన్నారన్నారు. మిగిలిన పెండింగ్ దరఖాస్తులను సైతం పరిష్కరిస్తే తొలిసారిగా ఓటేయనున్న యువ ఓటర్ల సంఖ్య 12 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
-
టోల్ ఫ్రీ నెం.1950
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకై అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈ నెల 3న ఆదివారం మరోసారి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. అలాగే సలహాలు, సూచనలు ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు డయల్ చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ లొకేషన్లలో బూత్లెవల్ అధికారులు ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై హైదరాబాద్ జిల్లా ఓటర్ల నమోదు పర్యవేక్షక అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంయుక్త ఎన్నికల నిర్వహణ అధికారి అమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, జయరాజ్ కెనడిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2018 డిసెంబర్ 26వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని, ఈ జాబితాలో సవరణలు, చిరునామా మార్పిడి, 18 ఏళ్లు నిండినవారికి ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన బిఎల్ఓలు ఫారం–6, 7, 8, 8ఏ ఫారాలతో పాటు ఓటర్ల జాబితాను కలిగి ఉంటారని అన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు కూడా హాజరు కావాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా వెళ్లి విచారణ జరపాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. అందిన ప్రతి క్లెయిమ్లు, అభ్యంతరాలకు సంబంధించి పత్రాలను విచారణ జరిపినట్లు బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఇఆర్ఓలు, ఇఆర్ఓలు ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు. కాల్స్ స్వీకరించిన కమిషనర్ హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి సలహాలు, సూచనలు, సమాచారానికి సంబంధించి టోల్ ఫ్రీ నెం.1950కు ఫోన్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఓటర్లకు కమిషనర్ దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 1950 టోల్ ఫ్రీ నెంబర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 1950కు వచ్చిన కాల్స్ను స్వీకరించి వారితో మాట్లాడారు. -
ఓట్లు తొలగించడానికే సర్వే
-
ఓటు దొంగలొస్తారు జాగ్రత్త..!
మళ్లీ అధికారంలోకి రావాలని అన్నిరకాల అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను సామ... భేద... దాన... దండోపాయాలతో లొంగతీసుకోవాలని చూస్తున్నారు. మాయోపాయంతో వారిని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. సంతృప్తస్థాయి తగ్గుతోందని భావిస్తున్న సర్కారు లెక్కలేనన్ని డ్రామాలకు తెరతీసింది. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తోంది. మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించేవారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. ఇందులో భాగంగానే సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపిస్తోంది. కాల్ సెంటర్నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం:‘నమస్కారం. నేను, మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. ఉన్నామంటే ఒకటి నొక్కండి, ఫర్యాలేదంటే రెండు నొక్కండి, చాలా బాగుందంటే మూడు నొక్కండి, అసలేం బాగోలేదంటే నాలుగు నొక్కండి’... అంటూ మీకు ఫోన్ చేసి అడుగుతున్నారా.! ‘మేం ఒక సంస్థ నుంచి వచ్చాం. రాష్ట్ర రాజకీయాలపై సర్వే చేస్తున్నాం. మేం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. చంద్రబాబు, జగన్, పవన్కల్యాణ్.. ఈ ముగ్గురిలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం ఐతే బాగుంటుందనుకుంటున్నారు.’ అంటూ మీ వద్దకు వచ్చి ఎవరైనా ఆరాతీస్తున్నారా.! ఈ రెండింటికీ మీరు సమాధానంచెప్పాక ఒక సారి మీ ఓటరు లిస్టు చెక్ చేసుకోండి. ఎందుకంటే వారడిగిన ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానం టీడీపీకి వ్యతిరేకంగా ఉంటే మీ ఓటు తీసేసినా తీసేస్తారు. అవును..ఇన్నాళ్లూ దీనిపై అనుమానాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఇది నిజమేనేమోనినించేలా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. పూసపాటిరేగ మండలంలోని కుమిలి గ్రామంలో ఎన్నికల రాజకీయ సర్వే పేరిట ఓటర్ల జాబితాతో కూడిన ట్యాబ్లను తీసుకుని సర్వే చేస్తున్న వ్యక్తులను వైఎస్సార్సీపీ నేతలు గురువారం గుర్తించారు. వారిని పట్టుకుని, ట్యాబ్లతో సహా పోలీసులకు అప్పగించారు. ఏం జరిగిందంటే: గజపతినగరానికి చెందిన గొల్లు కృష్ణ, గొల్లు దేముడుబాబు, తొత్తిడి దేముడు అనే యువకులు ‘పీపుల్స్పోల్ సర్వే’ పేరిట కుమిలి గ్రామంలో గురువారం సర్వే ప్రారంభించారు. ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితా ట్యాబ్లో వుండటంతో పాటు అధికారపార్టీకి అనుకూలంగా ప్రశ్నలు చేయడంతో అక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు మహంతి శ్రీనివాసరావు, గుజ్జు సురేష్రెడ్డి, పార్టీ కార్యకర్తలకు అనుమానం వచ్చింది. అధికారపార్టీకి వ్యతిరేకంగా సమాధానాలిస్తున్న వ్యక్తుల వివరాలు ట్యాబ్లలో నమోదు చేసుకుని తర్వాత వారి ఓట్లు తొలగించే అవకాశం వుందని భావించి సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. పూసపాటిరేగలో ప్రతిపక్షానికి చెందిన సుమారు 140 ఓట్ల వరకు ఫారం–7 ఇవ్వకుండానే తొలగింపుల జాబితాలో కనిపిస్తున్నాయి. వీరంతా సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన వాయిస్ మెసేజీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానమిచ్చినవారని భావిస్తున్నారు. ఇదేమిటని తహసీల్దార్ జి.సూర్యలక్ష్మిని అడిగితే అమె తనకేమీ తెలియదన్నట్లు సమాధానమిస్తున్నారు. ఈ నేపధ్యంలో కుమిలిలో ఓటర్ల జాబితా సహా సర్వే జరుగుతుండటంతో తొలిగింపు ప్రక్రియలో భాగంగానే సర్వే జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరింది. పోలీసుల హైడ్రామా వైఎస్సార్సీపీ నేతలు అప్పగించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పూసపాటిరేగ ఎస్ఐ వి.బాలా జీరావు వారిని తూతూ మంత్రంగా విచారించి వదిలేశారు. వారిపై కేసు నమోదు చేయాలని నాయకులు కోరగా.. సర్వే చేయడం నేరం కాదంటూ తోసిపుచ్చారు. పైగా ట్యాబ్లు ఎందుకు తీసుకున్నారు... వాటిని వారికి అప్పగించేయండి... అంటూ పట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. ఈ సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాను పోలీస్ స్టేషన్ లోపలికి కూడా రానివ్వకుండా గేట్లు మూసేశారు. ‘నచ్చింది రాసుకోండి, మమ్మల్నేమీ అడగవద్దు’ అంటూ ఫోన్లలో సంప్రదించిన మీడియా ప్రతినిధులకు పోలీసులు సమాధానమిచ్చారు. సీరియస్గా తీసుకున్న వైఎస్సార్ సీపీ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రం గా స్పందించారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. పలువురు పార్టీ నేతలతో పాటు వెళ్లి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటరు లిస్టులను ట్యాబ్లలో ఉంచి, సర్వేలు చేస్తున్న వారిపైనా, వారి వెనకుండి ఈ పని చేయిస్తున్న వారిపైనా ఫిర్యాదు చేయనున్నారు. సర్వే పేరుతో ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తుందనే కోణంలో విచారణ జరిపించాల్సిందిగా ఎన్నికల కమిషన్కు, డీజీపీని కోరనున్నారు. అవసరమైతే జాతీయ ఎన్నికల కమిషన్ను కూడా కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నికల కమిషన్ పట్టించుకోవాలి ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పట్టించుకుని పారదర్శకంగా ఎన్నికలు జరిపించడానికి చర్యలు తీసుకోవాలి. సర్వేల పేరిట ఓటర్ల వద్దకు వెళ్లి వారి నాడి తెలుసుకొని అధికారపార్టీకి అనుకూలం అయితే ఓటు ఉంచుతారు. ప్రతి పక్షం అయితే వెంటనే ఓటును తీసేస్తున్నారు. అలా కుమిలి గ్రామంలో సర్వేపేరిట ట్యాబ్లలో సమాచారం సేకరిస్తుండగా ముగ్గురు వ్యక్తులు మాకు దొరికారు.– గుజ్జు సురేష్రెడ్డి, కుమిలి గ్రామం ఓట్లు తొలగించడానికే సర్వే కుమిలి గ్రామంలో జరిగిన సర్వే కేవలం ఓట్లను తొలగించడానికే. ట్యాబ్లో ఓటరు జాబితా వుంది. అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడితే ఓటు ఉంటుంది. ప్రతి పక్షానికి చెందిన వారని భావిస్తే ఓటును తీసేయడానికే సర్వే జరుగుతోంది. సర్వే చేసిన వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించాం.– మహంతి శ్రీనివాసరావు, రెల్లివలస. -
ఏపీలో అక్రమ ఓటర్లు
-
ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఓటర్ల జాబితాలో అనేక లోపాలు, అక్రమాలు ఉన్నాయని ‘ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్)’ ప్రతినిధులు తుమ్మల లోకేశ్వరరెడ్డి, నలివెల సురేష్కుమార్రెడ్డిలు అన్నారు. ఈ నెల 11న ప్రచురితమైన కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 175 నియోజకవర్గాల్లో 59,18,631 ఓటర్లు నమోదు అక్రమంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు కలిగిన వారు 20.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు. నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్ అయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్నికల అధికారిని వాస్ట్ ప్రతినిధులు కలిసి అక్రమ ఓట్ల వివరాలతో రూపొందించిన నివేదిక ఇచ్చారు. ఆ తరువాత మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. ఓ ఓటరుకు 351 ఏళ్ల వయసు ఉన్నట్టుగా జాబితాలో నమోదు చేశారని, 18 సంవత్సరాలలోపు వారిని కూడా ఓటర్లుగా చేర్చారని తెలిపారు. ఇంటి నంబర్లు లేకుండా కూడా పలువురి ఓట్లను నమోదు చేశారని తెలిపారు. నకిలీ ఓట్లను తాము 12 రకాల పద్ధతుల ద్వారా గుర్తించామని తెలిపారు. ఒకే ఓటర్ ఐడీతో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని, ఇటువంటి ఓటర్లు 9,552 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి నంబరు, జెండర్ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 52,180 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి జెండర్ మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,224 ఉన్నారని, ఇతర వివరాలు ఒకేలా ఉండి తండ్రి లేదా భర్త పేరు మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,78,868 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు ముందుకు, వెనుకకు మారిన నకిలీ ఓటర్లు (ఉదాహరణకు వరలక్ష్మి కొండేటి– కొండేటి వరలక్ష్మి) వంటివి 1,69,448 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు ఒకే విధంగా ఉండి, ఇతర వివరాలు వేరే విధంగా ఉన్న ఓటర్లు 25,17,630 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి ఇంటి నంబరులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 4,49,126 ఉన్నారని, ఓటరు పేరు పలకడానికి ఒక రకంగా, ఒకటి రెండు అక్షరాల మార్పులతో ఉండే నకిలీవి 2,36,626 ఉన్నాయని వివరించారు. ఇంటి నంబరు తప్పు ఉన్న ఓటర్లు 2,15,119 ఉన్నారని చెప్పారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతూ దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. -
బరితెగించిన టీడీపీ కార్యకర్తలు
-
ఇంటింటికీ లెక్క
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో అధిక ఓటర్లు ఉన్న ఇళ్లను అధికారులు సర్వే చేయనున్నారు. ఒకే ఇంట్లో భారీ సంఖ్యలో ఓటర్లు ఉండడం.. అనేక ప్రాంతాల్లో బోగస్ ఓటర్ల నమోదు.. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తొలగించలేదని రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఇంట్లో అధిక సంఖ్యలో ఓటర్లున్న నివాసాలను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే ఇంటి నంబర్పై 30 మంది, అంతకన్నా ఎక్కువగా ఉన్న ఓటర్లపై విచారణ చేయనున్నట్టు గురువారం ఓటరు నమోదు అధికారులు(ఈఆర్ఓ), సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తెలిపారు. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ.. నగరంలో ఒకే ఇంట్లో 30 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లున్న ఇళ్లను మరోమారు పరిశీలించాలన్నారు. తహసీల్దార్లతో ఈ సర్వే చేయనున్నట్టు తెలిపారు. బీఎల్ఓలు ఇంటింటినీ సర్వే చేస్తున్నప్పటికీ, ప్రతిసారి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై వాటికి ఆస్కారం లేకుండా చేయాలని తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. 23నుంచి 25 వరకు ప్రచార కార్యక్రమం.. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకు అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈనెల 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని దానకిషోర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రచారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా పరిధిలోని 84 మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో క్లెయిమ్స్, కొత్త ఓటర్లు దరఖాస్తుల స్వీకరణకు సిబ్బందిని నియమించామన్నారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఆయా వార్డు కార్యాలయాల్లో జనవరి 25 వరకు ఏర్పాట్లు ఉంటాయన్నారు. అయితే, ఈ కేంద్రాల ద్వారా ఒకే వ్యక్తి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందజేస్తే స్వీకరించరని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఈఆర్ఓలు చైతన్య సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు మాల్స్లోను నూతన ఓటర్ల నమోదు దరఖాస్తులు వేసేందుకు డ్రాప్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవి జనవరి 20వ తేదీ వరకు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి, అద్వైత్కుమార్ సింగ్, జయరాజ్ కెనెడీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ఓట్ల ‘పంచాయితీ’!
సాక్షి, హైదరాబాద్: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివాదానికి కారణమైన 22 లక్షల ఓట్ల గల్లంతుపై రచ్చ జరుగుతుండగానే.. పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ గల్లంతు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాతో అభాసుపాలైనా తీరుమార్చుకోని ఎన్నికల సంఘం.. ఈ జాబితా ఆధారంగానే పంచాయతీ ఓటర్ల జాబితాను రూపొందిస్తుండటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈ నెల 9వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం ఏకంగా 8,64,128 దరఖాస్తులొచ్చాయి. 2019 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులకు అవకాశం కల్పిస్తూ ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 18–19 ఏళ్ల వయస్సు గల కొత్త ఓటర్ల దరఖాస్తుల సంఖ్య వేలల్లోనే ఉండనుంది. మిగిలిన వారిలో అత్యధికులు గతంలో ఓటుండి.. ఆ తర్వాత జాబితాలో పేర్లు గల్లంతైనవారే. ఇప్పటికే ఓటర్ల నమోదుకు 8.6లక్షల దరఖాస్తులు రాగా, ఈ నెల 25తో గడువు ముగిసే నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు మించే అవకాశముందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఇందులో సగానికిపైగా గ్రామీణ ఓటర్లే ఉండనున్నారు. ఫిబ్రవరి 22న ప్రచురించనున్న కొత్త ఓటర్ల జాబితాలో వీరికి చోటు లభించనుంది. అయితే.. ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వీరికి ఉండదు. అసెంబ్లీ జాబితాతోనే.. శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను విభజించి గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలను పంచాయతీ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. డిసెంబర్ 19న తొలి అనుబంధ ఓటర్ల జాబితా ప్రచురించగా, గ్రామ పంచాయతీల్లో 1,49,52,058 మంది ఓటర్లున్నట్లు వెల్లడైంది. ఈ నెల 7న రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించిన ఓటర్ల సంఖ్యగా స్వల్పంగా పెరిగి 1.50 కోట్లకు చేరింది. శాసనసభ ఎన్నికల్లో ఓట్లు గల్లంతైన వారు ఆ తర్వాత పెద్ద సంఖ్యలో మళ్లీ ఓటరుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచడంతో రెండో అనుబంధ ఓటర్ల జాబితాలో కొద్ది మంది కొత్త ఓటర్లకు మాత్రమే చోటు లభించింది. అదే విధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కింద వచ్చిన 8.5లక్షల కొత్త ఓటరు నమోదు దరఖాస్తులను సైతం ఇంకా పరిష్కరించలేదు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితానే కాస్త.. అటు ఇటుగా మార్చి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ రెండు కార్యక్రమాలతోనే.. 2015లో చేపట్టిన నేషనల్ ఎలక్ట్రోల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్ ప్రొగ్రాం (నెర్పార్) కింద 35,00,700 ఓటర్లను, ఆ తర్వాత 2016లో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్ (ఐఆర్ఈఆర్) కార్యక్రమం కింద మరో 24,20,244 ఓటర్లు కలిపి మొత్తం 59,20, 944 ఓటర్లను తొలగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల సంఖ్యలో ఓట్ల గల్లంతుకు ఈ రెండు కార్యక్రమాలే కారణమని విమర్శలున్నాయి. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన కారణంగా.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయామని.. చాలా మంది ఔత్సాహిక అభ్యర్థుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఈ క్రమంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సైతం పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతు కావడానికి అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. -
ఆ ఓటర్లు ఇంకా బతికే ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: ఒకే ఇంట్లో 30 మందికి మించి ఓటర్లున్నారా? ఓటరు జాబితాలో పేర్లున్న 100 ఏళ్ల ఓటర్లలో బతికున్నవారెంతమంది? ఇంటి నంబరు లేని ఓటర్లు ఎవరెవరు? ఒకే విధమైన పేరు, తండ్రి పేరు, వయస్సు, ఫొటోలున్న డూప్లికేట్ ఓటర్లు ఎంత మందున్నారు? అన్న అంశంపై ఎన్నికల సంఘం లోతుగా పరిశీలన జరుపుతోంది. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా పైన పేర్కొన్న నాలుగు రకాల అనుమానాస్పద ఓటర్ల వివరాలతో నివేదికలు రూపొందించి బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ)కు అందజేయనుంది. బీఎల్ఓలు క్షేత్ర స్థాయికి వెళ్లి ఈ నివేదికల్లో పొందుపరిచిన ఓటర్ల గురించిన వివరాలపై విచారణ జరపనున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల సంఖ్యలో ఇలాంటి బోగస్ ఓటర్లున్నారని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు ఆధారాలతో సహా హైకోర్టులో కేసువేసింది. దీంతో ఎన్నికల సంఘం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ రోజు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం చెలరేగింది. ఏకంగా ఓటర్ల జాబితా నుంచి 22 లక్షల మంది అర్హుల ఓట్లు గల్లంతయ్యాయని విమర్శలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులైనా ఇంకా ఓటర్ల జాబితాలో లోపాలపై చర్చ జరుగుతుండటంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలని నిర్ణయించింది. 2019 జనవరి 1 అర్హత తేదీగా ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగానే.. ఈ ఏరివేతకు పూనుకుంది. ఒకవేళ బోగస్, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్లు అని తేలితే సంబంధిత ఓటర్లను వచ్చే ఏడాది ప్రకటించనున్న ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సిఫారసు చేయనున్నారు. బీఎల్వోలకు లోపాల చిట్టా! ఓటర్ల జాబితాలో ఇంటినంబరు ఉండాల్సిన చోట ‘నో’, ‘న్యూ’, ‘ఓల్డ్’వంటి పదాలతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లున్నాయి. కనీసం మూడంకెలులేని బోగస్ ఇంటి నంబర్లతో సైతం పెద్ద సంఖ్య లో ఓటర్లున్నారు. ఇంటి నంబర్ను పేర్కొనకుండా ఖాళీగా ఉంచడం/సున్నా రాయడం/ఒకే అంకె ఇంటి నంబరున్న ఓటర్లు వేలలోనే ఉన్నారు. దీనిపై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే ఇంటి నంబరుతో 30, అం తకు మించిన సంఖ్యలో ఓటర్లుంటే వారి జాబితాలను ఎన్నికల సం ఘం సిద్ధం చేస్తోంది. 18 ఏళ్ల లోపు, 100 ఏళ్లు మించిన వయస్సు గల ఓటర్లు సైతం వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది. చనిపోయినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ కుటుంబ సభ్యులెవరూ దరఖాస్తు చేయడం లేదు. దీంతో ఓటర్లు చనిపోయి దశా బ్దాలు గడుస్తున్నా వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగుతు న్నాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఒకే ప్రాంతం/వేర్వేరు ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటర్ల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారు. ఓటర్ల జాబితా వెబ్సైట్లో శోధించిన కొద్దీ ఒకే విధమైన వోటర్ ఐడీ, పేరు, వయస్సు, లింగం, చిరునామా, ఫొటోలు కలిగిన ఓటర్లు ఉన్నట్లు బయటపడుతున్నారు. ఈఆర్వో నెట్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ నివేదికలను ఎన్నికల సంఘం తయారు చేస్తోంది. ఇంటి నంబరు ఆధారంగా.. నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్ (https://electoralsearch.in)లో ఇంటి నంబర్ ఆధారంగా శోధించే సదుపాయం ఉండేది. శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సదుపాయాన్ని తీసేశారు. కేవలం ఓటరు పేరుతో మాత్రమే శోధించే అవకాశముంది. అయితే భారీ స్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మళ్లీ ఇంటి నంబరు ఆధారంగా ఓటర్లను శోధించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రజత్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడన్నా సక్కగవుతదా? తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో చేపట్టిన నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్ ప్రోగ్రాం (నెర్పార్) కింద 35,00,700 బోగస్ ఓటర్లను తొలగించారు. 2016లో చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ (ఐఆర్ఈఆర్) కార్యక్రమం కింద మళ్లీ 24,20,244 ఓటర్లను తీసేశారు. జనవరి 2015 నాటికి రాష్ట్ర ఓటర్ల జాబితాలో 2.84 కోట్ల మంది ఓటర్లుండగా, ఈ రెండు కార్యక్రమాల కింద ఏకంగా 59,20,944 ఓటర్లను తొలగించారు. దీనికి అదనంగా వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద గత నాలుగేళ్లలో ప్రతి ఏటా లక్ష నుంచి రెండు లక్షల బోగస్ ఓటర్లను తొలగించారు. బోగస్, చిరునామా మారి, చనిపోయిన ఓటర్లను మాత్రమే తొలగించామని సీఈఓ రజత్కుమార్ తెలిపారు. పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లను తొలగించి, బోగస్ ఓటర్లను జాబితాలో ఉంచారని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 60 లక్షలకు పైగా బోగస్ ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంటున్నా ఓటర్ల జాబితాలో ఇంకా బోగస్ ఓట్లున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కీలకంగా మారింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించనున్న ఓటర్ల జాబితాలో మళ్లీ అవే పొరపాట్లు పునరావృతమైతే ఆ తర్వాత జరగనున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరోసారి అభాసుపాలు కాకతప్పదని విమర్శలు వస్తున్నాయి. -
తుది ఓటర్ల జాబితా ఏదీ..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీల్లో తుది ఓటర్ల జాబితా ప్రకటించకుండానే ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు సోమవారం నోటిసులు జారీ చేశారు. గతేడాది మే 17న గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను విడుదల చేయగా ఆ తర్వాత డిసెంబర్ 19న తొలి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈ నెల 1న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 7న రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశించింది. అయితే రెండో అనుబంధ ఓటర్ల జాబితాను విడుదల చేయకుండానే చాలా చోట్ల తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సోమవారం రిటర్నింగ్ అధికారులు నోటిసులు జారీ చేయడంపై చాలా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం స్పందించింది. రెండో అనుబంధ ఓటర్ల జాబితాను తక్షణమే ప్రకటించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటిస్తేనే పంచాయతీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా సిద్ధం కానుంది. రెండో అనుబంధ ఓటర్ల జాబితాలు విడుదల చేసినట్లు రుజువుగా పీడీఎఫ్ కాపీలను సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. భారీగా ఓట్ల గల్లంతు..! అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 22 లక్షల ఓట్లు గల్లంతు కావడంపై వివాదం సద్దుమణగకముందే తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగా ఓట్లు గల్లంతు అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం, అందులో పేరుంటేనే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హులనే నిబంధన ఉండటంతో నామినేషన్ వేయలేకపోతున్నట్లు ఔత్సాహిక అభ్యర్థులు వాపోతున్నారు. అడ్డగోలుగా తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పెద్ద సంఖ్యలో బాధితులు జిల్లా కలెక్టర్లు, మండల తహసీల్దార్లకు మొరపెట్టుకుంటున్నారు. మరికొందరు సోమవారం హైదరాబాద్ వచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. క్షేత్రస్థాయిలో వైఫల్యం వల్లే... : ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలు, వార్డులవారీగా విభజించి పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించుకుంటున్నారు. డిసెంబర్ 19న ప్రచురించిన పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తొలి అనుబంధం ప్రకారం రాష్ట్రంలో 1.37 కోట్ల మంది ఓటర్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చినా అదే ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని పంచాయతీ ఎన్నికలకు వెళ్లడంతో మళ్లీ అదే సమస్య పునరావృతం అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు అయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కావాలని ఓట్లు గల్లంతు చేశారు... మా గ్రామం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో సర్పంచ్గా పోటీ చేయాలని నా భార్య వనజ భావించింది. ఓటర్ల జాబితాలో మా కుటుంబ సభ్యుల పేర్లు లేవని తెలిసి కంగుతిన్నాం. ఓటర్ల జాబితాలో మా కుటుంబ పేర్లను చేర్చేలా సిద్దిపేట జిల్లా కలెక్టర్ను ఆదేశించాలని సోమవా రం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం సమర్పించా. ఓటరు జాబితాలో మా పేర్లు చేర్చకుంటే హైకోర్టుకెళ్తాం. –రంగన్నగారి మధుసూదన్రెడ్డి, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ దరఖాస్తు చేసుకున్నా ఓటు రాలేదు... మా తండాకు గ్రామ పంచాయతీ హోదా రావడం, ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో ఎన్నికల్లో నా సోదరుడి భార్య ఎ. విజయను పోటీలోకి దింపాలనుకున్నాం. సోమవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించా. గత నెల 29న ఓటరుగా నమోదు కోసం విజయ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఇంకా ఓటు రాలేదు. –గోపాల్నాయక్, వనపర్తి జిల్లా బొమరాస్పేట మండలం మదంపల్లితండా -
‘పుర’లో కుల గణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. వచ్చే జూలైతో పాలకవర్గాల గడువు ముగియనున్న మునిసిపాలిటీలతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. కొత్తగా ఏర్పడిన 71 మునిసిపాలిటీలతో సహా మొత్తం 142 పురపాలక సంఘాలకు వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన వాటిలో వార్డుల పునర్విభజన చేపట్టిన పురపాలక శాఖ..తాజాగా పురపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో బీసీ ఓటర్ల గుర్తింపునకు పురపాలక శాఖ ఆదేశించగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను మాత్రం 76 మునిసిపాలిటీల్లో గుర్తించాలంది. వాటిల్లో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాలు జనవరి 9న ప్రకటించనున్నారు. అన్నీ జనవరి 10న కులాల వారీగా ఓటర్ల జాబితాలను పురపాలక శాఖకు సమర్పించాల్సి ఉండనుంది. 19 రోజుల షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించి ఓటర్ల గణన పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. మునిసిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయడంలో కులాల వారీగా ఓటర్ల గుర్తింపు కీలకం కానుంది. 2011 జనాభా గణాంకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల దామాషా లెక్కలను పరిగణనలోకి తీసుకుని మునిసిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్/మేయర్, కౌన్సిలర్/కార్పొరేటర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. -
29లోపు ‘పంచాయతీ’ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంటోంది. ముఖ్యంగా పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో జిల్లా, మండల యంత్రాంగాలు నిమగ్నమయ్యాయి. రాష్ట్రస్థాయిలో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలో మండలాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన లెక్కలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన ఫార్ములాపై జిల్లా పంచాయతీ అధికారుల (డీపీఓ)కు పంచాయతీరాజ్ కమిషనర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఈనెల 29లోగా ఈ ప్రక్రియను ముగించేందుకు జిల్లా కలెక్టర్లు, డీపీఓలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత ఏర్పడని దృష్ట్యా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా పుంజుకోవడం లేదు. జిల్లా, మండల స్థాయిల్లో రిజర్వేషన్లను ప్రకటించాక ప్రచారం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గ్రామస్థాయిల్లో బరిలో నిలిచేందుకు ఎంత మంది ముందుకు వస్తారన్నది, ఏ మేరకు పోటీ ఏర్పడుతుందనేది వేచి చూడాల్సి ఉంది. ఏకగ్రీవాలకు ఆర్థిక చేయూత.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏకగ్రీవ ఎన్నికలూ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నిక ఏకగ్రీవమైతే మంచిదనే చర్చ కూడా కొన్ని వర్గాల్లో సాగుతోంది. గతంలో మాదిరిగానే ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఆర్థిక చేయూత కింద నిధులు అందుతాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లోనూ ఐదువేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, ఐదువేల కంటే తక్కువగా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తారు. ఈ నిధులను గ్రామీణాభివృద్ధి పనుల కోసం ఆయా పంచాయతీలు వెచ్చించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పంచాయతీల సంఖ్య 12,751కు పెరిగింది. తక్కువ జనాభా ఉన్న గ్రామాలు, తండాలు పంచాయతీలుగా మారిన నేపథ్యంలో ఏకగ్రీవాల సంఖ్యకూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఏపీలో 2013లో పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ పరిధిలో 8,778 పంచాయతీలున్నాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో 451 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ప్రోత్సాహం కింద ఈ పంచాయతీలకు నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగినా ప్రకటించిన మేర నిధులు కేటాయించారు. -
పంచాయతీ సమరానికి .. చకచకా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అసెంబ్లీ సమరం ముగియగానే జిల్లా అధికార యంత్రాంగం మరోమారు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా, ఎలాంటి సమస్య లేకుండా పంచాయతీ సమరాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొత్తం పదకొండు విభాగాలుగా విధులను విభజించారు. ఒక్కో విభాగానికి ఒకరినుంచి ఐదుగురు దాకా నోడల్ అధికారులను నియమించారు. మొత్తంగా ఎన్నికల విధులకు సంబంధించి 11 విభాగాలకు 32 మందిని నోడల్ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పటికే నోడల్ అధికారులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శిక్షణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిలో స్టేజ్ –1, 2 అధికారుల శిక్షణ కూడా పూర్తయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏడుగురు నోడల్ అధికారులకు ‘మ్యాన్పవర్ మేనేజ్మెంటు’ బాధ్యతలు పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా ముగించేందుకు ఏడుగురు నోడల్ అధికారులకు ‘మ్యాన్పవర్ మేనేజ్మెంటు’ బాధ్యతలు అప్పజెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఎంత మంది సిబ్బంది అవసరమవుతారో గుర్తిం చడం, వారిని నియమించుకోవడం, స్టేజ్–1 ఆర్వోలు, స్టేజ్–2 ఆర్వోలు, అసిస్టెం ట్ ఆర్వోలు, ప్రిసైడింగ్ అధికారుల నియామకం, జోనల్ అధికారులు, రూట్ అధి కారుల నియామకం తదితర బాధ్యతలను మ్యాన్పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధి కారులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తారు. బ్యాలెట్ బాక్స్ మేనేజ్మెంట్ కోసం కూడా మరో నోడల్ అధికారిని నియమించారు. బ్యాలట్ బాక్స్ రిప్లేస్, ఇతరత్రా సరిచూసుకోవడం వంటి విధులను ఈ అధికారికి కేటాయించారు. ఇవి కాకుండా, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్కు ముగ్గురు, శిక్షణ కోసం ఐదుగురు, ఎన్నికల సామగ్రి నిర్వహణకు ఇద్దరిని, ఎన్నికల సంఘం నియమించే జనరల్ అబ్జర్వర్లు, ఖర్చుల పరిశీలకుల కోసం ముగ్గురు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వాటిని మండలాలకు చేరవేయడం వంటి విధుల కోసం ఇద్దరు, మీడియా కమ్యునికేషన్ కోసం ఒకరిని, కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం) కోసం ఇద్దరు, ఓటర్ల జాబితా ముద్రణ వంటి విధుల నిర్వహణకు మరో ముగ్గురు నోడల్ అధికారులను, మొత్తంగా 32 మంది జిల్లా అధికారులకు నోడల్ అధికారుల బాధ్యతలను అప్పజెప్పారు. ఉపాధ్యాయులకే బాధ్యతలు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఎన్నికల సిబ్బందిలో ఉపాధ్యాయులే అధికంగా ఉండనున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను ప్రిసైడింగ్ అధికారులుగా తీసుకుంటున్నారు. ప్రతి 200 ఓట్లున్న పంచాయతీకి ఒక పీఓ, ఇతర సిబ్బంది ఇద్దరు చొప్పున ముగ్గురికి, 500 ఓట్లున్న పంచాయతీలో నలుగురు చొప్పున ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 844 పంచాయతీలకు గాను ఈ సారి 837 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగుస్తుందని, ఆ తర్వాత ఓట్లను లెక్కించి విజేతలను అదే రోజు ప్రకటిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఉప సర్పంచ్ ఎన్నిక పోలింగ్ రోజు కానీ, లేదంటే మరునాడు ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి 13వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాన్న ఆదేశాల మేరకు ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది. దానికి తగినట్లే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. -
ఫొటోలతో ఓటర్ల జాబితా
మోర్తాడ్(బాల్కొండ): త్వరలో నిర్వహించబోయే సహకార ఎన్నికల్లో బోగస్ ఓటర్లు లేకుండా చే యడానికి సహకార శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తోంది. ఈ ఎన్నికల నుంచి సరికొత్త విధానం సహకార శాఖ అమలు చేస్తోం ది. సహకార సంఘాల ద్వారా పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారి పేర్లు తొలగించి సక్రమంగా రుణాలు చెల్లించిన వారి పేర్లతో ఓటర్ల జాబితాను సహకార శాఖ ఉద్యోగులు సిద్ధం చేశారు. గతంలో కేవలం ఓటర్ల జాబితాల్లో ఓటు హక్కు పొందిన వారి పేర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటర్ల పేర్లతో పాటు వారి ఫొటోలను అతికించి జాబితాలను ఆయా సహకార సంఘాల పరిధిలో అందుబాటులో ఉంచారు. సహకార సంఘాలలోనే కాకుండా సహకార సంఘం పరిధిలోని గ్రామ పంచాయతీల్లోనే ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 142 సహకార సంఘాలు ఉండగా 1,056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి సహకార సంఘం పరిధిలోని గ్రామాలలో ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలను వారం రోజుల నుంచి అందుబాటులో ఉంచారు. ఎవరైనా రుణ గ్రహీతలు బకాయి చెల్లిస్తే వారి పేర్లు చేర్చే అవకాశం ఉంది. అలా కొత్తగా చేర్చిన పేర్లతో ఈనెల 22న తుది జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సహకార సంఘాల ఎన్నికల్లో బోగస్ ఓటర్లను తొలగించడానికి సహకార శాఖ తీసుకున్న పకడ్బందీ ఏర్పాట్లు సత్పలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. -
వేగంగా ‘పంచాయతీ’ రిజర్వేషన్ల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు కసరత్తు ఊపందుకుంది. ఈ నెల 27లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందించాల్సి ఉండటంతో ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రెండు మూడ్రోజుల్లోపే ఈ రిజర్వేషన్లకు తుదిరూపు ఇవ్వవచ్చునని తెలుస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలన్న కోర్టు నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపునకు చర్యలు ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల ఖరారు అధికారులకు కత్తి మీద సాముగా మారింది. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 60.55% (బీసీలకు 34%) అమలయ్యాయి. ఇప్పు డు 50 శాతానికి ఈ రిజర్వేషన్లను పరిమితం చే యాల్సి ఉండటంతో ప్రస్తుతం సవరణలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో బీసీలకు 24% మించకుండా రిజర్వేషన్లు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అప్పుడు మిగతా 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ లకు పంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంæ ఏర్పడ్డాక తొలిసారిగా రిజర్వేషన్లకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికల్లో కొత్త రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. జనాభా మేరకు రిజర్వేషన్లు.. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. వాటిలో 17 పంచాయతీల కాలపరిమితి మరో ఏడాది పాటు ఉండటంతో ప్రస్తుతం 12,734 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొత్తం 12,751 పంచాయతీలకు కోటా నిర్ణయించి తదనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే సర్పంచ్ పదవుల శాతాన్ని తేల్చనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ ల జనాభాను లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతా ల్లో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీశాకే రాష్ట్ర స్థాయి జనాభా కోటాకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత మంది ఉన్నారనే లెక్కల ప్రకారం జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. బీసీ వర్గాల రిజర్వేషన్లను మాత్రం ఓటర్ల జాబితాలో మండలం, గ్రామం వారీగా ఎంత మంది బీసీ ఓటర్లు, వారి ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 1,308 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు చేయడం తప్పనిసరి. అలాగే వంద శాతం ఎస్టీ వర్గం వారున్న 1,326 గ్రామ పంచాయతీలను ఈ వర్గం వారికే కేటాయిస్తారు. ఇవికాకుండా మైదాన ప్రాంతం గ్రామ పంచాయతీల్లోని మొత్తం జనాభా ఆధారంగా ఆ కేటగిరీకి రిజర్వేషన్ ఉంటుంది. అయితే రిజర్వేషన్ల జాబితా అందగానే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మూడు విడతల్లో ఎన్నికలు! మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒక్కో విడతకు మధ్యలో రెండు మూడ్రోజుల విరామం ఇచ్చి విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్టు సమాచారం. జిల్లాల్లో స్థానికంగానే ఈ ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేస్తారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10 లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
ఓటర్ల జాబితా ప్రక్షాళన..!
చిత్తూరు కలెక్టరేట్: వంద శాతం పారదర్శకత ఓటర్ల జాబితా కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అలసత్వం వహిస్తున్న ఎన్నికల అధికారులకు కలెక్టర్ ప్రద్యుమ్న షోకాజ్ నోటీసులు జారీచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షోకాజ్ నోటీసులు సంఖ్య మంగళవారం నాటికి 33 కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను ఈ నెల 14వ తేది నాటికి ఈఆర్వో నెట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. అందులో భాగంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు, అప్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ప్రక్రియలో అలసత్వం వహించిన కుప్పం, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పలమనేరు నియోజకవర్గాల ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు (తహసీల్దార్) లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విధితమే. ఈ నెల 10న తాజాగా పలమనేరు నియోజకవర్గం ఈఆర్వో (ప్రభాకర్రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి)కి, అదే నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, వి.కోట, పెద్దపంజాణి తహసీల్దార్లకు రెండోసారి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. త్వరలో ముగ్గురిపై వేటు ఎన్నికల ప్రక్రియలో అలసత్వం వహించిన ముగ్గురు అధికారులపై త్వరలో కలెక్టర్ వేటు వేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అందులో ఇప్పటి వరకు నోటీసులు ఎక్కువ అందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి నాటికి అందిన ఓటరు దరఖాస్తులు, క్లైమ్లు, చిరునామా మార్పుల దరఖాస్తుల నమోదులో అధికంగా తప్పులు దొర్లాయని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న గుర్తించారు. అలాగే జిల్లాలో 3,42,961 బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షి వరుస కథనాలను గతంలో ప్రచురించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ల సవరణ జాబితాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటర్ల క్షేత్ర స్థాయి తనిఖీలను రెండు సార్లు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియలో జిల్లాలో ఉన్న 3,42,961 బోగస్ ఓట్లను ఇంటింటి పరిశీలన చేయించారు. అందులో 16,246 ఓట్లు అనుమానిత ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. వారందరికి నోటీసులు జారీచేశారు. ఈ నెల 14వ తేది లోపు మరోసారి నోటీసులు అందజేసిన ఓట్లపై విచారణ చేసి వాటిని తొలగించనున్నారు. ఆమోదించిన ఓట్లను ఈఆర్వో నెట్ లో అప్లోడ్ చేయనున్నారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తాం జిల్లాలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యం. జిల్లాలో 3.42 లక్షల అనుమానిత ఓట్లు ఉన్నట్లు సమాచారం. ఇంటింటి తనిఖీలు చేయించడం జరిగింది. డోర్ నంబర్లు లేకపోవడం, సరైన పేర్లు నమోదు చేసుకోకపోవడం, నమోదు చేసుకున్న చిరునామాలో లేకపోవడం తదితర అంశాలపై 16,246 అనుమానిత ఓట్లుగా గుర్తించడం జరిగింది. వారికి నోటీసులు ఇచ్చాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా చేస్తాం. జిల్లాలో ప్రక్రియ ఆలస్యంగా చేయడం, రాజకీయపార్టీలతో సమావేశాలు నిర్వహించకపోవడం, అప్లోడ్ ప్రక్రియలో వెనుకబడడం కారణాలపై నోటీసులు జారీచేయడం జరిగింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా చర్యలు తప్పవు. – ప్రద్యుమ్న, కలెక్టర్ -
‘ఎంపీటీసీ, సర్పంచ్ ఓట్లను కూడా గల్లంతు చేశారు’
సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లను టీడీపీ నేతలు గల్లంతు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ ఓట్లను కూడా గల్లంతు చేయడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆర్కే సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో ప్రభుత్వమే ఓట్ల గల్లంతు కార్యక్రమం చేపట్టిందని ఆర్కే ధ్వజమెత్తారు. -
ఓటేయండి.. లేదా ఉన్నవారితో వేయించండి
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఓటుకోసం డబ్బిస్తున్నారా, అక్కడికక్కడే తిరస్కరించండి. మీకు ఓటు లేదా...మీరు ఎలాగూ ఓటేసే మహత్తర అవకాశం పోగొట్టుకుంటున్నారు కదా, ఓటుండీ వేయకుండా ఉన్న కనీసం మరో ఐదుమంది వెంటపడి వారి చేత ఓటు వేయించండి. మీ నేతలు మీ మాట వినాలనుకుంటే..ఓటు వేయండి. ఎక్కువ మంది వెళ్లి ఓటేస్తేనే... వారు మీ అవసరాలేమిటో శ్రద్ధగా తెలుసుకోగలుగుతారు. పెద్ద చదువులు చదివి పెద్ద నగరాల్లో ఉంటూ ఓ అరగంట వెచ్చించి ఓటు వేయకపోతే ఏమ వుతుందో తెలుసా...ప్రజాస్వామ్యం బక్కచిక్కిపోతుంది. పోటీలో ఉన్న ఏ అభ్యర్థీ లేదా ఏ రాజకీయ పార్టీ మీకు నచ్చలేదా... వెళ్లి కనీసం ‘నోటా’నొక్కి రండి. గెలిచిన అభ్యర్థి మెజారిటీ తగ్గినందుకు తలదించుకుంటాడు’’ ఇవీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ భావోద్రేకంతో పలికిన పలుకులు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన ఆర్థిక కమిటీ, ఉస్మానియా పట్టభద్రుల సంఘం శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన ‘ఓటర్ల చైతన్య కార్యక్రమం’’ఇందుకు వేదికయింది.ముఖ్య అతిథి గా హాజరైన రజత్కుమార్ ప్రజాస్వామ్య క్రతువులో ప్రతీ పౌరుడూ పాల్గొనాలనీ, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగును ఓటింగ్కు ప్రోత్స హించాలనీ చెబుతూ...‘‘ఎవరయినా డబ్బిస్తే, అక్కడికక్కడే వద్దని చెప్పేయండి’’అం టూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మీరు గమని స్తున్నారో లేదో తెలి యదు. ఎన్నికల్లో డబ్బు, మాఫియాలను లేకుండా చేయడానికి మేము అహోరాత్రాలు కష్టపడుతున్నాం. సమైక్య రాష్ట్రంలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసేలోగా పట్టుబడిన నగదు కంటే ఇప్పుడు కేవలం తెలంగాణలో పోలింగ్కు ఇంకా ఐదురోజులుండగానే చిక్కిన మొత్తం రు.104 కోట్లు, అంటే అప్పటికంటే రు.28కోట్లు అధికం. పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోండి. డబ్బు, మాఫియాలు ఎలా చెలరేగుతున్నాయో చూడండి.. కారణం ...మా శ్రమకు మీ సహకారం , మీ పాత్ర తోడు కాకపోవడమే.’’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేస్తేనే నేతలు మీ మాట వింటారు ‘‘ఓటర్లు ఎంత ఎక్కువ సంఖ్యలో వెళ్లి ఓటు వేస్తే నేతలు మీ మాట అంతగా వింటారు. వినక తప్పదు. వారు కోరుకునేది కూడా మీ మనసులను గెలవాలనే. అలాగే ఓటు వేసేముందు మీరు గందరగోళం పడకుండా, ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి వీలుగా 48 గంటలు అన్ని రకాల ప్రచారాలు ఆపేయిస్తాం. మీరు కులం, డబ్బు వంటి అంశాలు కాకుండా అభ్యర్థులు, రాజకీయపార్టీల విధానాలు, హామీలు, విశ్వసనీయత ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి’’అని చెప్పారు. మన ఎన్నికల కమిషన్కు నీరాజనాలు ‘‘సంతోషించాల్సిన విషయం, ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే అక్షరాస్యత తక్కువగా ఉండే మారుమూల పల్లెల్లో 80–90% ఓటింగ్ నమోదవుతుంటే, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ వంటి నగరాల్లో సగటున 50–55% ఉంటున్నది. ఇది ఎన్నికల చిత్రం. కానీ బయట దేశాల్లో మన ప్రజాస్వామ్యానికి ఎక్కడలేని గుర్తింపుంది. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతకు ప్రపంచం నీరాజనాలర్పిస్తోంది. మన ఎన్నికల నిర్వహణ విధానం తమకూ చూపాలని బ్రెజిల్ తదితర దేశాలు మనకు ఆహ్వానిస్తున్నాయి.మన ఈవిఎంలు, వీవీప్యాట్లను చూసి అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.అక్కడ ఇటువంటి యంత్రాలకు చట్టసమ్మతి లేదు. ఇక ఈసారి దివ్యాంగులకు చక్కని సౌకర్యాలు కల్పించాం’’ అని అన్నారు. హామీలకు ఆధారాలు కోరాం.. మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారో ఆధారసహితంగా సమాచారం సమర్పించాలని కోరాం. ఓటర్ల జాబితా తయారీ స్ధాయినుండే బోగస్ ఓటర్లను తొలగించడం వంటి ప్రక్షాళన పనులు చేపట్టాం. బూత్ల దగ్గర కూడా అక్రమాలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించడానికి కెమెరాలు పెట్టి, ప్రత్యక్ష ప్రసారలు చేపట్టాం. ఇవే కాదు ఇంకా చాలా చర్యలు తీసుకుంటున్నాం ’అని వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కమిటీ అధ్యక్షుడు బి. ప్రభాశంకర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస రావు, ఉస్మానియా పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు డా.డి.గంగాధర్ రావు, కన్వీనర్ అశ్విన్ మార్గం పాల్గొన్నారు. -
లక్ష ఆత్మలకు ఓట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి పేరుతో లక్షకుపైగా ఓట్లు ఉన్నట్లు తేలటం ఆందోళన కలిగిస్తోంది. వీటిని తొలగించకుంటే దొంగఓట్లుగా మారి ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మృతి చెందినవారి ఓట్లను రివిజన్ చేసే సమయంలో ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫలితంగా చనిపోయిన వారి పేరుతో ఓట్లు ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలపై విస్తృతంగా అధ్యయనం జరిపిన ‘ఓటర్ ఎనలటిక్స్ స్ట్రాటజీ టీమ్’ (వాస్ట్) రాష్ట్రంలో చనిపోయిన వారి పేరుతో ఓట్లు లక్షకుపైగా ఉన్నట్లు తేల్చింది. వాస్ట్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకొని చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్ల సమాచారాన్ని నివేదికలుగా రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఓట్లు భారీగా ఉన్నాయి. ఓటరు పేరును జాబితాలోకి చేర్చినప్పుడు పక్కనే తండ్రి, / భర్త పేరును కూడా నమోదు చేస్తుం టారు. తండ్రి / భర్త చనిపోతే ఆ పేర్ల పక్కనే ‘లేట్’ అని పేర్కొంటారు. ఇలా ‘లేట్’ అని ఉన్న పేర్లతో కూడా ఓట్లు కొనసాగుతుండడం విశేషం. ‘లేట్’ అని పేర్కొంటూ చనిపోయినట్లుగా నిర్ధారించిన వ్యక్తుల పేర్లు అదే నియోజకవర్గం లేదా మరో నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. నకిలీ ఓటర్లు అరకోటికిపైనే.. దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో అరకోటికిపైగా నకిలీ ఓట్లు ఉన్నట్లు ఇప్పటికే ‘వాస్ట్’ నిర్వహించిన సర్వేలో వెలుగు చూడటం తెలిసిందే. ఏపీలోని మొత్తం 3.6 కోట్ల ఓట్లలో ఏకంగా 52.67 లక్షల నకిలీ ఓట్లు నమోద య్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోంది. కేవలం ఒకటి రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే పార్టీల జయాపజయాలు మారిపోతున్న నేపథ్యంలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉండటం కలవరం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించి ఏరివేసేందుకు ఎన్నికల సంఘం చొరవ చూపాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పసిగుడ్డులకూ ఓటు హక్కు బతికి ఉన్న వారి పేరిట నాలుగైదు ఓట్లు నమోదు కావడం ఒక ఎత్తు కాగా ఏడాది కూడా నిండని చంటిబిడ్డల పేరిట కూడా ఓటరు కార్డులుండడం విస్మయం కలిగిస్తోంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కొందరు ఓటర్ల వయసు ఏకంగా 352 ఏళ్లు కూడా ఉండడంపై నివ్వెరపోతున్నారు. ఇలాంటి వింతలు ఎన్నికల సంఘం రూపొందించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయి సిబ్బందితో కలసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. స్థానికంగా పరిశీలన లేకుండా ఓటరుగా నమోదు చేస్తుండటం, సరైన సమాచారం లేకున్నా జాబితాలోకి చేర్చడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ద్వంద్వ ఓటర్లు 18 లక్షలకుపైనే మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ ఓటు హక్కు కలిగిన వారు 18,50,511 మంది ఉన్నట్లు వెల్లడైంది. ద్వంద్వ ఓట్ల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ఎన్నికల సమయంలో ఇవి దొంగ ఓట్లుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ద్వంద్వ ఓట్లు ఏకంగా 5.14 శాతంగా ఉండటం విస్తుగొలుపుతోంది. వీరంతా తెలంగాణాతోపాటు ఏపీలోనూ ఓటు హక్కు వినియోగించుకోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో అసలైన ఓటర్ల మనోభీష్టాలతో నిమిత్తం లేకుండా ద్వంద్వ ఓట్లు ఎన్నికల ఫలితాలను శాసించేలా మారుతున్నాయి. నకిలీ ఓట్లు ఎన్నికల వ్యవస్థకే పెను సవాల్గా మారుతున్నాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పేరుతో విపక్షం ఓట్లు తొలగిస్తున్న టీడీపీ బృందాలు.. ఎన్నికల సర్వే పేరుతో రాష్ట్రంలో సంచరిస్తున్న కొన్ని బృందాలు ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ట్యాబ్లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలతో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి పట్టున్న ప్రాంతాల్లో సర్వే పేరిట ఈ బృందాలను మోహరిస్తున్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు అంటూ ప్రశ్నలు అడుగుతూ చివర్లో ఓటరు ఐడీ నెంబర్, మొబైల్ నెంబర్ను సేకరిస్తున్నారు. ఈ నెంబర్ను నకిలీ బృందాలు ట్యాబ్ల్లో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే తమ ఓటు రద్దు అయినట్లు సమాచారం అందటంతో ఓటర్లు నివ్వెరపోతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ఓట్లు గల్లంతు అవుతున్నాయి. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే ఈ బృందాల లక్ష్యమని స్పష్టమవుతోంది. ఈ బృందాల్లోని యువకుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ ఫొటోలున్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులుండడం గమనార్హం. ఆ ఓట్లను తొలగించాలి.. పలు నియోజకవర్గాల్లో ఓటర్లకు సంబంధించి తండ్రి/భర్త వివరాల్లో ‘లేట్’ అని పేర్కొంటున్నా అవే పేర్లతో అవే జిల్లాల్లోని ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు కొనసాగుతున్నాయని ‘ఓటర్ ఎనలటిక్స్ స్ట్రాటజీ టీమ్’ హెడ్ తుమ్మల లోకేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇలా ‘లేట్’ పేర్లతో కొనసాగుతున్న ఓట్లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నాయని, వీటిని పరిశీలించి తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ పేర్లను తొలగించకుంటే ఇవన్నీ చివరకు దొంగ ఓట్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటరు ఒకరే.. పలుచోట్ల ఓటుహక్కు విశాఖకే చెందిన దాడి కృష్ణవేణి (ఐడీ ఎక్స్బీ02166460) తండ్రి దాడి శ్రీనివాసరావు లేట్ అని జాబితాలో పేరు ఉంది. అయితే ఈ దాడి శ్రీనివాసరావుకు ‘ఏపీ060320090382’ నెంబర్తో ఓటు మరోచోట కొనసాగుతోంది. విశాఖలోని తాటిచెట్లపాలేనికి చెందిన మహ్మద్ బాషా మదీనా అనే మహిళకు ‘సీకే0936484’ ఐడీతో ఓటుహక్కు ఉంది. ఆమె తండ్రి/భర్త అబ్దుల్ కరీమ్ చనిపోయినట్లుగా ‘లేట్’ అని పేర్కొన్నారు. అయితే అబ్దుల్కరీమ్ పేరిట టీజీఎం0282012’ ఐడీ నెంబర్తో మరోచోట ఓటరు జాబితాలో ఓటు హక్కు కొనసాగుతోంది. ఇదే నియోజకవర్గంలో ఎల్లపు అప్పారావు అనే వ్యక్తి చనిపోయినట్లుగా ఒక జాబితాలో ‘లేట్’ అని గుర్తించగా మరో జాబితాలో టీజీఎం0343855 నెంబర్తో ఓటు హక్కు కొనసాగుతుండడం విశేషం. గుంటూరులో అమీరున్ షేక్ భర్త సుభాని షేక్ చనిపోయినట్లుగా ఆమె ఓటరు వివరాల్లో ‘లేట్’ అని నమోదు చేశారు. అదే సుభాని షేక్కు బాపట్ల నియోజకవర్గం ఇందిరాగాంధీనగర్ ఓటరు జాబితాలో ఎస్ఎస్వై0496000 ఐడీతో ఓటు హక్కు కొనసాగుతోంది. బాపట్ల నియోజకవర్గంలోని అక్ష గండికోట (ఎస్ఎస్వై0644741) తండ్రి శ్రీనివాసరావు చనిపోయినట్లుగా నమోదై ఉండగా ఆయన పేరు యాజలిలో (ఎస్ఎస్వై426767) ఓటరు జాబితాలో ఉండటం గమనార్హం. విజయనగరం జిల్లాకు చెందిన రమణ రొంగలి (యూసీజే0861352) తండ్రి అప్పలనాయుడు రొంగలి చనిపోయినట్లు ఓటరు జాబితాలో ఉంది. అయితే ఇదే వ్యక్తి పేరిట గజపతినగరంలో ఓటు నమోదై ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మాధవి చేకూరి (ఓటర్ ఐడీ ఐఎంహెచ్1020437) పేరుతో ఉన్న ఓటరు తండ్రి సీతారామారాజు చేకూరి లేట్ అని జాబితాలో ఉంది. అయితే ఇదే సీతారామరాజు చేకూరికి ఆచంట నియోజకవర్గంలో ‘ఏపీ 100640504516’ ఐడీ నెంబర్తో ఓటు హక్కు ఉండడం విశేషం. చింతలపూడి నియోజకవర్గంలోని సత్యదేవి కాజ అనే ఓటరు (ఐడీ డబ్ల్యూఎక్స్డబ్ల్యూ 1113943) భర్త సత్యనారాయణ కాజ చనిపోయినట్లు ‘లేట్ ’ అని జాబితాలో పేర్కొన్నారు. అదే వ్యక్తి పేరుతో ఆచంటలో ఐడీ నెంబర్ టీవై00648206తో ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కొనసాగుతోంది. విశాఖపట్నానికి చెందిన వెంకటరమణ కొల్లి (ఓటరు ఐడీ నెంబర్ జెడ్జెయ్యు1234731) ఓటరు తండ్రి కొల్లి దేముడు ‘లేట్’’ అని ఓటరు జాబితాలో ఉంది. చనిపోయినట్లున్నగా చూపిస్తున్న ఈ కొల్లి దేముడికి అనకాపల్లి నియోజకవర్గంలో ఓటరు ఐడీ నెంబర్ ‘జీఎం0035071’తో ఓటరు జాబితాలో ఓటు కొనసాగుతుండడం విశేషం. -
హైదరాబాద్లో రోహింగ్యా ముస్లిం ఓటర్లు
న్యూఢిల్లీ: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఓటర్ల జాబితాలో భారీగా రోహింగ్యా ముస్లింల పేర్లు ఉన్నాయని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోహింగ్యా ముస్లింలను ఓటర్లుగా నమోదు చేశారని పేర్కొంది. టీఆర్ఎస్, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ల ఉమ్మడి కుట్రలో భాగంగానే ఇది జరిగిం దని తెలిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. కేంద్ర సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, పార్టీ జాతీయ మీడియా హెడ్ అనీల్ బాలుని బుధవారం ఈ మేరకు సీఈసీ ఉన్నతాధికారులని కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నఖ్వీ మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రోహింగ్యా ముస్లింలు భారత పౌరులు కాదని, అయినా వారు తెలంగాణలో ఓటర్లుగా నమోదై ఉన్నారని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోపే ఈ కుట్రను ఛేదించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని, అధికార పార్టీ ఒకే ఇంటిలో 700 బోగస్ ఓటర్లను చేర్చిన విషయాన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. -
‘ఓటర్ల జాబితాలో రోహింగ్యా ముస్లింలు’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో రోహింగ్యా ముస్లింల పేర్లను అక్రమంగా చేర్చారని బీజేపీ బుధవారం ఆరోపించింది. పాలక టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్లు మూకుమ్మడిగా కుట్ర పన్ని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని, దీనిపై ఈసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ జాతీయ మీడియా చీఫ్ అనిల్ బలూనిలతో కూడిన ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈ మేరకు ఈసీ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. రోహింగ్యా ముస్లింలు భారత పౌరులు కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసినా తెలంగాణలో వారిని ఓటర్లుగా చేర్చారని నక్వీ ఆరోపించారు. దేశ చట్టాలకు విరుద్ధంగా రోహింగ్యా ముస్లింలను ఓటర్ల జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు ఈసీ తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను చక్కదిద్దాలని కోరారు. ఓటర్ల జాబితాలో అసాధారణ హెచ్చుతగ్గులున్నాయని బీజేపీ విస్మయం వ్యక్తం చేసింది. పాలక టీఆర్ఎస్ అక్రమ పద్ధతుల్లో బోగస్ ఓటర్లను చేర్పించిందని కేంద్ర మంత్రి నక్వీ ఆరోపించారు. -
గీత దాటితే వేటే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా దూషణలు, కుల, మతాల పేరుతో ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే సంబంధిత పార్టీ అగ్రనాయకత్వంపై ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలు 100 శాతం ట్యాంపర్ రహితం కావని కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్లు జేఎం లింగ్డో, సంపత్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై స్పందన కోరగా, ప్రపంచంలో ఏ యంత్రాన్ని అయినా ట్యాంపర్ చేయవచ్చన్నారు. యంత్రాలకు కళ్లు, చెవులు, నోరు, చేతులుండకపోవడంతో అవి తమను తాము సంరక్షించుకోలేవన్నారు. అవి మనుషుల సంరక్షణలో ఉండాల్సిందేనని, వారు రాజీపడితే ట్యాంపరింగ్ సాధ్యమేనన్నారు. లేనిపక్షంలో ఈవీఎంలు పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్ యంత్రాలే అన్నారు. ఈవీఎంలకు ఎన్నికల సంఘం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం చేపట్టిన రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లడానికి ముందు శుక్రవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏర్పాట్ల పట్ల సంతృప్తి, ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్కుమార్, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎస్పీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ కష్టపడి పనిచేసి ఏర్పాట్లలో మంచి పురోగతి సాధించారని కొనియాడారు. నేర చరిత్రపై ప్రకటనలు ఇవ్వాల్సిందే.. పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించగా.. ఓటర్ల జాబితాలో తప్పులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, కుల, మతాల పేరుతో ఓట్ల అభ్యర్థన, ఫోన్ల ట్యాపింగ్, అనుమతుల జారీలో అధికారుల వివక్ష తదితర ఫిర్యాదులు, సూచనలొచ్చాయని రావత్ అన్నారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులు, సూచనలు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల యంత్రాంగానికి సూచనలు జారీ చేశామని రావత్ అన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఎలాంటి ప్రలోభాలు, భయాందోళనలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కోరామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదుపై సత్వర చర్యలు తీసుకోవాలని, ఈ–సువిధ యాప్ ద్వారా ప్రచార కార్యక్రమాలకు అనుమతుల జారీలో అన్ని పార్టీలకు సమ అవకాశం కల్పించాలని, 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని సూచించామన్నారు. రాజకీయ పార్టీల యాజమాన్యంలో పత్రికలు, వార్తా చానళ్లకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి తనపై ఉన్న నేర చరిత్రను వేర్వేరు రోజుల్లో మూడు పర్యాయాలు పత్రికలు, వార్తా చానళ్లలో ప్రకటనలు జారీ చేయాల్సిందే అన్నారు. నియోజకవర్గానికో మహిళా పోలింగ్ కేంద్రం ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున రాష్ట్రంలో 119 మహిళా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రావత్ అన్నారు. వీవీ ప్యాట్లో ఓటు వేరే వారికి పడినట్లు కనిపిస్తోందని పోలింగ్ ఏజెంట్ల నుంచి ఫిర్యాదులొస్తే.. పరిశీలన జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉందన్నారు. పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. 2014లో రాష్ట్రంలో 7,056 మంది సర్వీస్ ఓటర్లుండగా, తాజాగా 10,038కు పెరిగారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తదుపరిగా ఇంకొన్ని చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను అరెస్టు చేయాలని, నేరస్తులను బైండోవర్ చేయాలని, అవసరమైతే అరెస్టు చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, కానుకల పంపిణీ జరుగుతోందని ఫిర్యాదులున్నాయన్నారు. ఇప్పటి వరకు గణనీయ సంఖ్యలో రూ.77.80 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, గత ఎన్నికల్లో జప్తు చేసిన రూ.76 కోట్లతో పోల్చితే ఈ సారి పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయన్నారు. ఆధార్తో ‘ఓటర్ల’అనుసంధానంపై చర్చలు ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు లేవని, డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని రావత్ అన్నారు. పునరావృతమైన ఓటర్లను ప్రస్తుతం తొలగించడం సాధ్యం కాదన్నారు. 2019 జనవరి 1 అర్హత తేదీ గా నిర్వహించనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా పునరావృత ఓటర్లను తొలగిస్తామని, ఈ జాబితాతో 2019లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితాను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే అంశంపై యూఐడీఏఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించే హామీ లు సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమని, ఇలాంటి హామీలను మేనిఫెస్టోలో పెడితే ఎన్నికల సంఘం పరిశీలించి మార్పులకు సూచిస్తుందన్నారు. మౌఖికంగా ఇలాంటి హామీలు ఇస్తే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1952 నుంచి గులాబీ బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నామని, ఇప్పుడో పార్టీ గులాబీ రంగు జెండాను కలిగి ఉందని బ్యాలెట్ల రంగు మార్చలేమన్నారు. జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించే అంశంపై పరిశీలన చేస్తామన్నారు. గతంలో తాము నిర్వహించిన పర్యటనలో జరిపిన పరిశీలనతో పోల్చితే ప్రస్తుతం ఎన్నికల ఏర్పాట్లలో మంచి పురోగతి వచ్చిందని, గత పర్యటన అనంతరం కలిగిన ఆందోళన దూరమైందన్నారు. సీఈవో రజత్కుమార్ బాగా కష్టపడ్డారని అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సునీల్ అరోరా, సీఈవో రజత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం మొరాయిస్తే ఏం చేస్తారు? కలెక్టర్ల పరిజ్ఞానానికి ఈసీఐ రావత్ పరీక్ష పోలింగ్ సమయంలో ఈవీ ఎం మొరాయిస్తే ఏం చర్యలు తీసుకుంటారు? వీవీ ప్యాట్ పనిచేయకపోతే ఎలా స్పందిస్తారు? వంటి ప్రశ్నలతో ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లకు ఉన్న పరిజ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ పరీక్షించి చూశారు. ఎన్నికల సందర్భంగా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే కలెక్టర్ల స్పందన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నారు. శాసనసభ ఎన్నికల నిర్వహణకు వచ్చే 15 రోజులే కీలకమని, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తతతో పని చేయాలని ఆదేశిం చారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకుగాను రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం రెండో రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్తో కలసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఘట నలపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలుపుదల చేయాలన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ జిల్లాలో డబ్బులు, మద్యం జప్తు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. తమ జిల్లాలోని కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గంపై అధిక దృష్టి పెట్టాల్సి వస్తోందని తెలియజేసినట్లు సమాచారం. -
ఈ లెక్క పక్కా!!
ఆదిలాబాద్అర్బన్: రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్న జిల్లా ఓటర్ల లెక్క తేలింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, పోలింగ్కు సిబ్బంది, వెబ్కాస్టింగ్, ఎన్నికల అధికారుల నియామకంపై దృష్టి సారించిన ఈసీ ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసి తాజాగా ఈ నెల 19న తుది జాబితాను విడుదల చేసింది. ఓటర్ల పూర్తి స్థాయి జాబితా జిల్లా అధికారులకు అందాల్సి ఉంది. తాజాగా విడుదలైన ఓటరు జాబితాలో పేర్లున్న వారే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు మూడు సార్లు ఓటరు సవరణ కార్యక్రమాలు చేపట్టి అర్హులైన వారి పేరును జాబితాలో నమోదు చేశారు. తాజాగా విడుదలైన జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 3,83,072 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,89,980 మంది ఉండగా, మహిళలు 1,93,030 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 62 మంది ఉన్నారు. కాగా, ఈ యేడాది అక్టోబర్ 12న విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 3,77,562 మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడా సంఖ్య కాస్త పెరిగింది. అంటే ఓటు నమోదుకు ఈసీ అవకాశం కల్పించడంతో ఒక నెల వ్యవధిలోనే 5,510 మంది ఓటర్లు జాబితా చేరారు. మూడు సార్లు జాబితా సవరణ.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జనాభాకు సరాసరి ఓటర్లు ఉన్నారని భావించిన ఎన్నికల సంఘం ఈ యేడాది మార్చిలో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్(ఐఆర్ఈఆర్) కార్యక్రమం పేరిట ఓటర్ల సవరణ ప్రక్రియ చేపట్టగా, బోథ్లో స్పెషల్ సమ్మరి రివిజన్ పేరిట సవరణ జరిగింది. ఆ ప్రక్రియలో జిల్లాలో బోగస్ ఓట్లు చాలా వరకు తొలగిపోగా, అర్హులవి కూడా తొలగించబడ్డాయని పలువురు రాజకీయ నాయకులు అప్పట్లో కలెక్టర్ను కలిసి విన్నవించారు. దీంతో కలెక్టర్ ఇంటింటి సర్వే చేపట్టి ఓటర్ల జాబితాను సవరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి యేడాది ఓటర్ల సవరణ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి తోడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల జాబితా రెడీ చేయాలని ఆదేశించడంతో ఈ యేడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జాబితాను మళ్లీ సవరించారు. ఈ ప్రక్రియలో కొత్త ఓటరు నమోదుతోపాటు అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సవరణ ప్రక్రియ ద్వారా వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలన చేసి గత అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు చేసేందుకు ఈసీతోపాటు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతీ, యువకులు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మరోసారి ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఈ యేడాది అక్టోబర్ 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం వరకు ముచ్చటగా మూడోసారి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను గత వారం రోజులుగా పరిశీలన చేసిన అధికారులు వాటి వివరాలను ఈసీకి పంపించారు. తాజాగా ఈసీ ఈ నెల 19న ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా వివరాలు జిల్లా అధికారులకు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, మూడు సార్లు చేపట్టిన ఓటర్ల నమో దు కార్యక్రమాల ద్వారా జిల్లాలో సుమారు 20 వేల మందికిపైగా ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కాగా, తాజాగా విడుదలైన ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. 2014లోని జాబితా కంటే తక్కువే.. జిల్లాలో బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఏప్రిల్లో విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం చూస్తే జిల్లాలో 3,99,271 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 2,83,072కు తగ్గింది. ఈ నాలుగేళ్లలో జిల్లాలో చనిపోయిన, వలస వెళ్లిన, బోగస్ ఓటర్లను తొలగించడంతోపాటు కొత్త వారిని నమోదు చేశారు. కానీ జాబితా నుంచి తొలగిపోయిన వారి వారి సంఖ్యకు అనుగుణంగా 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు జాబితాలో నమోదు కాలేదు. ఈ యేడాది మినహాయించి ప్రతీ యేడాది నమోదు సంఖ్య మూడంకెల్లో ఉంటే తొలగింపు సంఖ్య వేలల్లో ఉందన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో సాధారణ ఎన్నికలు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా 32 వేల మంది ఓటర్లు జాబితాలో ఈ యేడాది కొత్తగా చేరారు. -
‘ప్రతిపక్షం’ ఓట్లు తొలగింపు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అధికార పార్టీ అభిమానులు, సానుభూతిపరులైతే చాలు ఒకటికి మించి ఓట్లు లభిస్తాయి. రెండు మూడు చోట్ల ఓటు హక్కు దక్కుతుంది. వేర్వేరు నంబర్లతో ఓటర్ ఐడీ కార్డులు చేతికందుతాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారనే అనుమానం ఏమాత్రం ఉన్నా అలాంటి వారి ఓట్లు గల్లంతవుతాయి. ఏకంగా ఓటు హక్కే రద్దవుతుంది. ఓటర్ జాబితాల్లోంచి పేర్లు మాయమవుతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంటున్న బాగోతమిది. ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్(వాస్ట్) బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ అరాచకం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, ప్రలోభాలకు గురిచేసి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుకు సమాధి కడుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లపై వేటు వేశారు. చనిపోయినా ఓటు హక్కు పదిలం విశాఖ జిల్లాలో 2014 జనవరిలో 34,31,822 మంది ఓటర్లు ఉండేవారు. 2018 జనవరి నాటికి ఈ సంఖ్య ఏకంగా 30,83,722కు పడిపోయింది. తొలగించిన ఓట్లలో వైఎస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఈ జిల్లాలో కొన్నిచోట్ల ఒకే ఓటర్కు రెండేసి, మరికొందరికి ఐదేసి ఓట్లు నమోదయ్యేలా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. చనిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలోకి వచ్చేశాయి. అక్రమంగా వేలాది ఓట్ల నమోదు ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నాయకులు దొంగ ఓట్లను పెద్ద ఎత్తున నమోదు చేయిస్తున్నారు. అక్టోబర్ 28న దొంగ ఓట్లు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఒత్తిడి, దూషణలను తట్టుకోలేక బూత్ లెవల్ ఆఫీసర్ జయశ్రీ పోలింగ్ బూత్ వద్దే కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను సహచర సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. కేవలం ఒక్క ఒంగోలు నిÄయోజకవర్గంలోనే 15 వేల ఓట్లను అక్రమంగా చేర్పించినట్లు అంచనా. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని అనుమానం వస్తే చాలు గుట్టుచప్పుడు కాకుండా వారి ఓట్లను తొలగిస్తున్నారు. దొంగ ఓట్ల జాతర వైఎస్సార్ జిల్లాలో అధికార పార్టీ నేతల అడ్డగోలుగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఇతర జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉండే వ్యక్తుల పేరిట వైఎస్సార్ జిల్లాలో ఓట్లు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లపై వేటు పడుతోంది. అనంతపురంలో అక్రమాలకు అంతే లేదు అనంతపురం జిల్లాలో ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని ఓటర్ల తొలగింపునకు పాల్పడుతోంది. ప్రధానంగా అనంతపురం అర్బన్ పరిధిలో 64,592 ఓట్లను తొలగించారు. తాడిపత్రి నియోకవర్గం పరిధిలో 14,322 ఓట్లు, ధర్మవరంలో 10,475 ఓట్లు, కదిరిలో 7,757 ఓట్లు, హిందూపురం నియోజకవర్గంలో 3,426 ఓట్లను తొలగించారు. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీకి సంబంధించిన వారి ఓట్లను అధికంగా తొలగించారు. ఒకే ఓటర్ పేరిట రెండు మూడు చోట్ల ఓట్లు నమోదైన ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒకే బూత్లో రెండు ఓట్లు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం ఆలమూరులోని 237వ బూత్లో కుడిపూడి సతీష్కు రెండు ఓట్లున్నాయి. స్థానిక కూరగాయల మార్కెట్ వీధిలో 3–67/1 అనే ఇంటి నెంబర్లో సతీష్ ఉంటున్నారు. అతడికి అదే ఇంటిలో 716, 800 సీరియల్ నంబర్లతో ఓట్లున్నాయి. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే ఇలాంటి ఓట్లు నమోదతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలో ఓట్ల తొలగింపు నెల్లూరు జిల్లాలోని కోట మండలానికి చెందిన తిన్నెలపూడి ముత్యాలయ్య వయసు 52.వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. గతంలో సాధారణ, పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో విస్తుపోయాడు. తాను వైఎస్సార్సీపీ అభిమానినని, అందుకే ఓటర్ల లిస్టు నుంచి పేరు తొలగించారని చెబుతున్నాడు. గ్రామంలో వైఎస్సార్సీపీ అభిమానులుగా ఉన్న 15 మంది ఓట్లను తొలగించారని ముత్యాలయ్య వెల్లడించాడు. చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన కందలూరి మద¯ŒŒ మోహన్రెడ్డి చాలా ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లో గ్రామంలోని 130 పోలింగ్ బూత్లో ఓటు వేస్తున్నాడు. ఈ ఏడాది ఓటర్ల జాబితాలో చూస్తే ఆయన పేరు గల్లంతైంది. చిత్తూరు జిల్లాలోనూ గల్లంతైన ఓట్లు చిత్తూరు పట్టణంలోని బండి దొరస్వామిరెడ్డిబౌండ్ వీధి, డోర్ నెంబర్ 2/4లో కాపురముంటున్నారు. గతంలో పుత్తూరు గ్రామదేవత ఆరేటమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్సీపీ నాయకుడు కావడంతో ఈయన పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించేశారు. ఈయనతో పాటు ఈయన భార్య ఈశ్వరమ్మ, కుమారుడి పేర్లను కూడా తొలగించేశారు. వైఎస్సార్సీపీ అభిమాని అని ఓటు తొలగించారు ‘‘గత సాధారణ ఎన్నికల్లో మా కుటుంబ సభ్యులంతా ఓట్లు వేశాం. నేను వైఎస్సార్సీపీ యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా. కాకినాడలోని రమణయ్యపేట రాయుడుపాలెంలో ఉన్న నా కుటుంబంలోని ఓట్లన్నీ కుట్ర చేసి తొలగించారు. నా ఒక్కడిదే కాకుండా చాలామంది ఓట్లు ఓటరు జాబితాల్లో లేవు. కేవలం వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు మాత్రమే ఓటరు జాబితాల్లో కనిపించడం లేదు. నా ఓటుతోపాటు మరి కొన్నిఓట్లు నమోదు చేయించగలిగాను. ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని గ్రామంలో ప్రచారం చేశాం’’ – లింగం రవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువత కార్యదర్శి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా -
బోగస్ ఓట్లపై ఇంటింటి తనిఖీలు
సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున డూప్లికేట్, బోగస్ ఓటర్లున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు, అందజేసిన డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. 18 లక్షల మంది అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ ఓటర్లుగా ఉన్నట్లు డేటాతో సహా వైఎస్ఆర్సీపీ నేతలు ఇచ్చారని, ఆ డేటా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆయా చిరునామాల్లో లేని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని సిసోడియా స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణ, డూప్లికేట్ ఓట్లతో పాటు వివిధ ఆంశాలపై ఆయన సచివాలయంలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. 25 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారనే డేటా ఆధారంగా తనిఖీలు నిర్వహించి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. రాష్ట్రంలో 3.70 కోట్ల మంది ఓటర్లున్నారని, కానీ.. ప్రస్తుతం 3.50 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, అంటే 2014 నుంచి ఇప్పటివరకు 20 లక్షల మంది ఓటర్లు తగ్గినట్లు తెలుస్తోందన్నారు. మృతిచెందిన వారి, వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు డూప్లికేట్ ఓట్లను కూడా అప్పుడు తొలగించారన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ 3.50 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు చర్యలను చేపట్టామని ఆయన తెలిపారు. కొత్తగా 32లక్షల మంది దరఖాస్తు సాధారణంగా రాష్ట్ర జనాభాలో 70 శాతానికి మించి ఓటర్లు ఉండరాదని, అలా ఉంటే బోగస్ ఓట్లు ఉన్నట్లేనని సిసోడియా తెలిపారు. అయితే, ప్రస్తుతం జనాభాలో 67.3 శాతం మంది ఓటర్లున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా సమయం ఉన్నందున ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించడం ద్వారా బోగస్, డూప్లికేట్, రాష్ట్రంలో లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించి వచ్చే ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా సవరణకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్తగా 32 లక్షల మంది ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 80 శాతం వరకు యువతీ, యువకులేననన్నారు. ప్రస్తుతం దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతోందని, సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులను ఓటరుగా నమోదు చేస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 4న ప్రకటిస్తామన్నారు. బెంగళూరుకు 1.50లక్షల ఈవీఎంలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు 1.13 లక్షల వీవీ ప్యాట్స్(ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) అవసరమని, అవి ఇప్పటికే రాష్ట్రానికి రావడం ప్రారంభమైందని సిసోడియా తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.50 లక్షల ఈవీఎంలున్నాయని, అవన్నీ అల్యూమినియంతో తయారై ఉన్నందున వాటిని స్టీలుతో మరింత పటిష్టపర్చనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.50 లక్షల ఈవీఎంలను బెంగళూరు పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమం ముగిసినప్పటికీ అది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా ఓటరుగా నమోదుకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలను జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలోకి తీసుకువస్తున్నామని.. దీనివల్ల ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. -
దొంగ ఓట్ల కార్ఖానా
సాక్షి, అమరావతి: ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్ల కార్ఖానాగా మారింది. దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడిగా రాష్ట్రంలో నకిలీ ఓట్లు నమోదవుతున్నాయి. ఏపీలో ఏకంగా 52.67 లక్షల మేర నకిలీ ఓట్లు నమోదైనట్లు ‘ఓటర్ అనలిస్టు అండ్ స్ట్రాటజీ టీమ్’ (వాస్ట్) స్పష్టం చేసింది. కేవలం ఒకటి, రెండు శాతం ఓట్ల వ్యత్యాసం ఎన్నికల్లో పార్టీల తలరాతలను మార్చేస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు కావడం పట్ల రాజకీయ పరిశీలకులతోపాటు సామాన్య ప్రజల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. నకిలీ ఓటర్ల నమోదు వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటే దీని వెనుక ఒత్తిళ్లు, ప్రలోభాలు ఉన్నాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓటర్ జాబితాలో నివ్వెరపరిచే వాస్తవాలు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దొంగ ఓట్లు నమోదయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘వాస్ట్’ అనే సంస్థ దీనిపై లోతైన అధ్యయనం నిర్వహించింది. పలువురు ఐటీ నిపుణులు, డేటా అనలిస్టులు వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ‘వాస్ట్’ గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్లు నమోదు తీరుపై అధ్యయనం చేపట్టింది. క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలను సేకరించింది. ఓట్ల నమోదు విషయంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. పలు అంశాలతో సమగ్ర నివేదిక రూపొందించింది. జీవించి ఉన్నవారి పేరుతో నాలుగైదు ఓట్లు నమోదు కావడం ఒక ఎత్తయితే ఏడాది కూడా నిండని పసిబిడ్డల పేరుతో, చనిపోయిన వారి పేర్లతోనూ ఓటరు కార్డులుండడం గమనార్హం. కొందరు ఓటర్ల వయసును ఏకంగా 352 ఏళ్లుగా చూపించడం వింతల్లోకెల్లా వింత. ఎన్నికల సంఘం(ఈసీ) రూపొందించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే ఇలాంటి నివ్వెరపోయే వాస్తవాలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాలోని వివరాల ఆధారంగా ఈ నకిలీ ఓట్లను ‘వాస్ట్’ గుర్తించి, తన నివేదిక ద్వారా బహిర్గతం చేసింది. దొంగ ఓట్లకు దారులెన్నో... రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని 45,920 పోలింగ్బూత్ల పరిధిలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 52.67 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు ‘వాస్ట్’ తేల్చింది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 15 శాతం నకిలీ ఓట్లేనని తేటతెల్లమవుతోంది. ఏకంగా అర కోటికిపైగా దొంగ ఓట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో నకిలీ, రిపీట్, అక్రమ, చెల్లని, ఒకే విధమైన సమాచారం ఉన్న ఓట్లు 34.17 లక్షలున్నాయి. ఇవికాకుండా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఓటర్లుగా కొనసాగుతున్న వారి సంఖ్య 18.50 లక్షలుగా ఉంది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు 18 ఏళ్లు నిండి ఉండాలన్నది నిబంధన. కానీ ఏడాది వయసున్న చంటిబిడ్డలు కూడా ఓటర్లుగా నమోదైన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇంటి నెంబరు, చిరునామా లేకుండా లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. ఒకే ఐడీ నెంబర్తో రెండుచోట్ల ఓటు సాక్షాత్తూ ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాలోనే నకిలీ ఓటర్ల బాగోతం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో దొంగ ఓట్లను పలు రకాలుగా నమోదు చేయించినట్లు ‘వాస్ట్’ గుర్తించింది. వీటిని 10 కేటగిరీలుగా విభజించింది. ఒకటో కేటగిరీలోని నకిలీ ఓట్లను పరిశీలిస్తే.. ఉదాహరణకు అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 46వ పోలింగ్ బూత్లోని 362 సీరియల్ నెంబర్లో... ‘డి.అనిల్కుమార్ (ఐడీ నెం.వైడబ్ల్యూబీ0957993) తండ్రి డి.నందప్ప, ఇంటినెంబర్ 1–4–135, వయసు 36, సెక్స్ మేల్’ అనే ఓటరు పేరు నమోదై ఉంది. అయితే, ఇదే ఐడీ నెంబర్తో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 64వ పోలింగ్బూత్లో ‘అనిల్కుమార్ దొడ్డపనేని, తండ్రి నందప్ప దొడ్డపనేని, ఇంటి నెంబర్ 14/166–2డి’గా కూడా ఓటరు కార్డు ఉంది. వేర్వేరు ఐడీ నెంబర్లతో రెండు ఓట్లు రెండో కేటగిరీలోని నకిలీ ఓట్లను పరిశీలిస్తే... తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 20లోని 815 సీరియల్ నెంబర్లో ఐడీ నెంబర్ ‘డబ్ల్యూయూజెడ్1410737’ తో ‘శ్రీను యండపల్లి, తండ్రి సత్యనారాయణ యండపల్లి, ఇంటినెం.2–96, వయసు 36, సెక్స్ పురుష’ అనే వివరాలతో ఓటరు నమోదై ఉన్నారు. ఇవే వివరాలతో ఈ నియోజకవర్గంలోని 21వ పోలింగ్బూత్లో సీరియల్ నెంబర్ 513లో ఐడీ నెంబర్ ‘డబ్ల్యూయూజెడ్1412337’ నెంబర్తో ఓటు నమోదై ఉంది. ఒకే వ్యక్తికి వేర్వేరు వయసులా? మూడో కేటగిరీ నకిలీ ఓట్లను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో 75వ నెంబర్ పోలింగ్ బూత్, సీరియల్ నెంబర్ 413లో ఐడీ నెంబర్ ‘ఐడీఎస్1243500’తో ‘కృష్ణారావు ఊబలంక, తండ్రి వీర్రాజు ఊబలంక, ఇంటి నెం.4–4–25, వయసు 54, సెక్స్ పురుష’ అనే ఓటరు ఉన్నారు. అయితే 54 ఏళ్ల వయసును మార్పు చేసి 53 ఏళ్లుగా పేర్కొంటూ ఇదే వ్యక్తి పేరుతో మండపేట నియోజకవర్గంలోని 27వ నెంబరు పోలింగ్ బూత్లో సీరియల్ నెంబర్ 9లో కూడా ఓటు నమోదైంది. పురుషుడిని మహిళలను చేశారు నాలుగో కేటగిరీకి సంబంధించి ‘వాస్ట్’ చూపిన ఉదాహరణల్లో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 138వ నెంబర్ పోలింగ్బూత్, 133వ సీరియల్ నెంబర్లో ‘దుర్గా ప్రసాద్ ఇరుసుమల్ల, తండ్రి సత్తిబాబు ఇరుసుమల్ల, ఇంటినెంబర్ 4–89, వయసు 28. సెక్స్ మహిళ’ అనే వివరాలతో ఐడీ నెంబర్ ‘ఆర్హెచ్ఏ0983123’తో ఓటరు కార్డు ఉంది. విచిత్రం ఏమిటంటే ఇదే నియోజకవర్గంలోని 139వ పోలింగ్ బూత్లో 565 సీరియల్ నెంబర్లో ఇవే పేర్లు, సమాచారంతో సెక్స్ అనే దగ్గర మహిళకు బదులు పురుషుడిగా పేర్కొంటూ మరో ఓటు నమోదై ఉంది. వివరాలే అవే.. ఓట్లే వేర్వేరు ఐదో కేటగిరీ నకిలీ ఓట్లకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే... కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో 10 నెంబర్ పోలింగ్బూత్లోని 267 సీరియల్ నెంబర్లోని ఐడీ నెంబర్ ‘ఎక్స్ఎక్స్సీ0461293’తో ‘శివకుమారి వేమూరి, భర్త శ్రీహర్షవర్థన్ వేమూరి, ఇంటి నెం.1–110, వయసు 30, సెక్స్ మహిళ’ అనే సమాచారంతో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గంలోని 11వ నెంబర్ పోలింగ్బూత్లోని 624వ సీరియల్ నెంబర్లో ఇదే సమాచారంతో ‘ఎక్స్ఎక్స్సీఓ192641’ ఐడీ నెంబర్తో మరో ఓటును నమోదు చేశారు. పేరులోని పదాలను అటుఇటుగా మార్చేశారు ఆరో కేటగిరీలో ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకకు మార్చేసి 2,60,634 ఓట్లు నమోదు చేసినట్లు ‘వాస్ట్’ గుర్తించింది. ఉదాహరణకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం 253వ పోలింగ్బూత్లోని 553 సీరియల్ నెంబర్లో ‘కోటేశ్వరమ్మ అవుల, భర్త ఎంకటేశ్వర్లు, ఇంటి నెం.2–31, వయసు 45, సెక్స్ మహిళ’ అనే వివరాలతో ఓటరు ఐడీ నెంబర్ ‘ఎఫ్ఎల్ఆర్2587012’తో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గం 55వ పోలింగ్బూత్, 545 సీరియల్ నెంబర్లో ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకకు మార్చి ‘ఆవుల కోటేశ్వరమ్మ’గా మార్చి, వయసును 43 ఏళ్లుగా పేర్కొంటూ ఓటర్ ఐడీ నెంబర్ ‘కేబీబీ0940270’తో మరో ఓటును నమోదు చేయించారు. ఒకే వ్యక్తికి వేర్వేరు ఐడీలతో ఓట్లు ఏడో కేటగిరీలో ఒక్కొక్కరి పేరిట రెండేసి ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేర్లలో ఎలాంటి మార్పులు లేవు. ఎక్కువగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్ననియోజకవర్గాల్లో ఇలాంటి ఓట్లు 25,17,164 ఉన్నాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఒకటో నెంబర్ పోలింగ్బూత్లోని సీరియల్ నెంబర్14లో ‘రామ ముద్గల, భర్త వెంకట్రావు ముద్గల, ఇంటి నెం.007. తిలక్ అపార్టుమెంట్స్, వయసు 44, సెక్స్ మహిళ’ అనే సమాచారంతో ‘జెడ్జెఓ1516988’ ఐడీ నెంబర్తో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గంలోని 61వ నెంబర్ పోలింగ్బూత్లోని 442 సీరియల్లో ఇవే పేర్లతో, ఇంటినెంబర్ 31–8–5/1గా పేర్కొంటూ ‘జెడ్జేఓ1512334’ మరో ఓటు నమోదైంది. ఆ ఓటరు వయసు 352 ఏళ్లట! ఎనిమిదో కేటగిరీలోని అక్రమాలను పరిశీలిస్తే ఓటరు వయసును తప్పుగా పేర్కొంటూ ఓటు నమోదు చేశారు. నెల్లూరు నగరంలోని 76వ పోలింగ్బూత్, 473 సీరియల్ నెంబర్లో ‘సాయికుమార్ పేరూరి, తండ్రి ఐజాక్ న్యూటన్ పేరూరి, ఇంటి నెం.20–2–881, వయసు 1, సెక్స్ పురుష’ వివరాలతో ఐడీ కార్డు ‘జెడ్ఏఎఫ్1714971’తో ఓటు నమోదు చేశారు. ఇక్కడ ఓటరు వయసు ఏడాది మాత్రమే ఉండడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో 208 పోలింగ్బూత్లోని 153వ సీరియల్ నెంబర్లో ‘దివ్య తాటిపాక, భర్త రవికుమార్ తాటిపాక, ఇంటి నెం.1–206, వయసు 5, సెక్స్ మహిళ’ సమాచారంతో ఐడీ నెంబర్ ‘యూడీఐ1123595’తో ఓటు నమోదై ఉంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని 85వ పోలింగ్బూత్లోని 342 సీరియల్ నెంబర్లో ‘నర్సింగ్రావు ఎర్రంశెట్టి, తండ్రి అప్పన్న ఎర్రంశెట్టి, ఇంటి నెం.1–69/2, వయసు 352, సెక్స్ పురుష’ అనే వివరాలతో ‘ఎఫ్జెఎక్స్0992941’ ఐడీ నెంబర్తో ఒక ఓటు నమోదైంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం 107 పోలింగ్బూత్లోని 386 సీరియల్ నెంబర్లోని ఓటర్ వయసును ఏకంగా 248 ఏళ్లు. ‘సుదర్శన పుల్లగుర్ర, భర్త శ్యామ్, ఇంటి నెం.8–110, వయసు 248, సెక్స్ మహిళ’ అనే వివరాలతో ఐడీ కార్డు‘ఎస్జీఈ0247270’తో ఓటు నమోదైంది. ఇంటి నెంబర్ల మార్పుతో ఒక్కరికే వేర్వేరు ఓట్లు తొమ్మిదో కేటగిరీలో ఇంటి నెంబర్ లేకుండానే 3,95,877 ఓట్లు నమోదు చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం 81వ పోలింగ్బూత్లోని ఒకటో సీరియల్ నెంబర్లో ‘టీక్యూక్యూ0809160’ ఐడీ నెంబర్తో గంగా భవానీ, భర్త భూలోక మధుమతి అనే పేరుతో ఇంటినెంబర్ లేకుండానే ఓటు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ‘ఎస్ఏఏ0761990’ ఐడీ నెంబర్తో నమోదైన ఓటరు సమాచారంలో ఇంటి నెంబరును ‘నన్’గా పెట్టి వదిలేశారు. విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలోని ‘ఎక్స్బీఓ1319673’ నెంబర్ ఓటరు సమాచారంలో ఇంటి నెంబర్ను సేమ్ అని పేర్కొన్నారు. ఇక ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ‘ఐయూడబ్ల్యూ0647810’ నెంబర్తో నమోదైన ఓటరు సమాచారంలో ఇంటి నెంబర్ను ఓల్డ్ అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు పదో కేటగిరీలో.. చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటర్లుగా నమోదయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 6వ నెంబర్ పోలింగ్బూత్లోని 164వ సీరియల్ నెంబర్లో ‘ఎస్జీఏ0592551’ ఐడీ నెంబర్తో మౌనిక తమ్మన తల్లి ఎన్వీఎస్కే పద్మజ అనే మహిళ పేరుతో ఓటు నమోదై ఉంది. ఇదే పేరుతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని 112వ పోలింగ్బూత్లోని 407 సీరియల్ నెంబర్లో ‘ఎస్జీఏ0592551’ ఐడీ నెంబర్తో మరో ఓటు ఉంది. తుని నియోజకవర్గంలో పోలింగ్బూత్ నెంబర్ 152, సీరియల్ నెంబర్ 26లో ‘యూడీఐ1300144’ ఐడీనెంబర్తో నాగభూషణరావు దిడ్డి, తండ్రి లక్ష్మీనరసింగరావు పేరుతో ఒక ఓటు ఉండగా, ఇదే పేరుతో తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 564 పోలింగ్బూత్, 217 సీరియల్ నెంబర్లో ‘ఎస్డబ్ల్యూడీ0424507’ ఐడీ నెంబర్తో మరో ఓటు ఉంది. -
రాష్ట్రంలో 52 లక్షల బోగస్ ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం వెల్లడించారు. నగరంలోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాలోని అవకతవకలపై శనివారం మీడియా సమావేశం జరిగింది. ఇందుకు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ మాట్లాడుతూ.. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 52.67 లక్షల నకిలీ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. 2–3 శాతం ఓట్ల తేడతో జయాపజయాలు ఉంటున్న నేటి పరిస్థితుల్లో 15 శాతం నకిలీ ఓట్లు ఉండటం దుర్మార్గమన్నారు. అజేయ్ కల్లం ప్రసంగిస్తూ.. అధునాతన సాఫ్ట్వేర్ ఉపయోగించి నకిలీ ఓట్లను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లుగా కూడా నమోదైన వారు 18 లక్షల మంది ఉన్నారన్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 26వేల నకిలీ ఓట్లను గుర్తించగా అందులో 18 వేల ఓటర్లను తొలగించారని ఇంకా 8 వేల ఓట్లు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలు, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రజాసంఘాలు అప్రమత్తమై ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, జన్మభూమి కమిటీలు కుమ్మక్కై జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో ఏపీ అధికార యంత్రంగం కుమ్మక్కు కావడంవల్లే నకిలీ ఓట్లు కొనసాగుతున్నాయన్నారు. ఓటరు కార్డులను ఆధార్కు లింకు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాలను అమలుచేయడం ద్వారా వీటిని నిరోధించవచ్చన్నారు. జాబితాలో అక్రమాలు జరిగితే స్థానిక అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేసి శిక్షించాలన్నారు. 34లక్షల డూప్లికేటెడ్, రిపీటెడ్ ఓట్లు ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాలజీ టీమ్ సభ్యులు తుమ్మల లోకేశ్వర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ఏపీలోని 175 నియోజవర్గాల్లో 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్, రిపీటెడ్గా ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – 18లక్షల మందికి పైగా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని.. ఇవి ఏ విధంగా వచ్చాయో ఆధారాలతో ఎన్నికల కమిషన్కు చూపించాం. – 10 కేటగిరీల కింద డూప్లికేట్ ఓట్లను విభజించాం. – అలాగే, సెప్టెంబర్ 1, 2018న విడుదల చేసిన ఓటరు జాబితాలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. భర్త స్థానంలో భార్య పేరు మార్చడం, ఇంటి నెంబర్లు వేర్వేరుగా నమోదు చేసి నకిలీ ఓట్లు సృష్టించారు. – ఒకటే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి. వయస్సు తేడా చూపించి ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ విధంగా 24,928 కేసులు నమోదయ్యాయి. – ఇంటి పేర్లు, అసలు పేర్లు అటూఇటూ మార్చి మొత్తం 92,198 ఓట్లు నమోదు చేశారు. పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇదిలా ఉంటే.. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలని.. కానీ, రాష్ట్రంలో పుట్టిన ఏడాదికే ఓటు హక్కు ఇచ్చారని ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ప్రపంచంలో 124 సంవత్సరాల 2 రోజులు బతికినట్లు రికార్డులు ఉంటే .. మన రాష్ట్ర ఓటర్ల జాబితాలో 352 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఉన్నారన్నారు. ఇలాంటివి 6,118 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ ప్రకారమైతే.. ఇలాంటి తప్పులు చేసిన వారిపై ఏడాది జైలుశిక్ష విధించాలని చెబుతోందని ఆయన గుర్తుచేశారు. అలాగే, ఇలాంటివి దేశంలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లు గుర్తించలేవని,, సాఫ్ట్వేర్ ఆప్డేట్ చేయకపోవడంతో కూడా ఇలా జరుగుతుందని లోకేశ్వర్రెడ్డి చెప్పారు. సమావేశంలో రీసెర్చ్ స్కాలర్ ఓటరు అనలెటిక్స్ మరియు స్ట్రాటాజీ టీమ్ సభ్యులు జీవీ సుధాకర్రెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సలీమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ని అనడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెలువరించే ఓటర్ల జాబితాల్లో తప్పు, ఒప్పుల్ని పరిశీలించేందుకు ఈసీకి హైకోర్టు ఏమీ ఆడిటర్ కాదు. ఈసీ కూడా తన పనిని తాను సమర్థంగా చేయాలి. లోటుపాట్ల పాపాన్ని ఇంటర్నెట్పై మోపడం అన్యాయం. కొత్త ఓటర్లను చేర్చేందుకు ఇంటర్నెట్ పనిచేస్తుంది కానీ బోగస్ ఓట్లను తొలగించేందుకు పనిచేయడం లేదా?’అని ఈసీని ఉద్దేశించి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. నకిలీ ఓట్ల తొలగింపునకు ఇంటర్నెట్ మొరాయిస్తోందన్న ఈసీ వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓటర్లు ఉన్నారని లేదా ఇతర అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లవచ్చని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం సూచన చేసింది. నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ 19 వరకూ ఓటర్ల జాబితాల్లో మార్పుచేర్పులకు అవకాశం ఉందని, 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువరిస్తామని ఈసీ చెబుతోందని గుర్తు చేసింది. ఈసీ దగ్గర పని అవ్వకపోతే ఎలక్షన్ ట్రిబ్యునల్ వద్ద కేసులు దాఖలు చేసుకోవచ్చని పిటిషనర్కు సూచించింది. నకిలీ ఓట్లు తొలగించడం లేదు.. ఓటర్ల జాబితాలో నకిలీల పేర్లు ఉన్నాయని.. శశిధర్రెడ్డి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనర్హులను తొలగించామని ఈసీ తరఫు న్యాయవాది వివరణ ఇవ్వగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 16కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మేనిఫెస్టోలు విధిగా పాటించాలా? ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల్లోని హామీలకు ఆ పార్టీలు కట్టుబడి ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలనే మరో పిల్పై హైకోర్టు స్పందించింది. పిల్లోని అంశాలపై వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చార్టెడ్ అకౌంటెంట్ ఎం.నారాయణాచార్యులు ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణను ఈ నెల 12కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
వైఎస్ఆర్సీపీ అంటే ఓటు తొలగింపే!
-
వైఎస్సార్సీపీ అంటే ఓటు తొలగింపే!
సాక్షి, గుంటూరు/మంగళగిరి/గుంటూరు ఈస్ట్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లు గల్లంతు చేసే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. సర్వేల పేరుతో కొందరు యువకులు బృందాలుగా వైఎస్సార్సీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో సంచరిస్తూ వారి ఓట్లను మాయం చేస్తున్నారు. ఈ విధంగా సర్వే చేస్తున్న 12 మందిని మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు బాలాజీ నగర్కు చెందిన పి.వెంకటేశ్వర్లు నివాసం వద్దకు మంగళవారం సా.5 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వచ్చాడు. సర్వే పేరుతో వెంకటేశ్వర్లు ఓటర్ ఐడీ నంబర్, ఫోన్ నంబర్, ఏ పార్టీకి ఓటు వేస్తావు అంటూ వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావని వెంకటేశ్వర్లు ఆ యువకుడిని ప్రశ్నించగా స్పా (సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ ఎనాలసిస్) అనే సంస్థ ద్వారా 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి ఓటేయబోతున్నారో అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేసే వారికి ఓటర్ ఐడీ నంబర్తో ఏం పని ఉందని వెంకటేశ్వర్లు ప్రశ్నించగా ఆ యువకుడు తడబడుతూ సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆ యువకుడిని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అతనిని ఆరా తీయగా తనతోపాటు ఇంకా 11 మంది ఉన్నారని, వారందరూ కొత్తపేటలోని నటరాజ లాడ్జిలో ఉన్నారని చెప్పాడు. దీంతో మిగిలిన యువకుల వద్దకు వెళ్లి వారినీ విచారించారు. ఇదంతా బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నట్లు వారు చెప్పారు. కాగా, పోలీసులకు పట్టుబడిన స్పా బృందం 76 మందితో వాట్సాప్ గ్రూప్ కూడా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్లో ఉన్న వారిలో చాలామంది ప్రొఫైల్ పిక్లలో టీడీపీ ఫొటోలు, లోకేష్తో దిగిన ఫొటోలు ఉండటం గమనార్హం. మరోవైపు.. ఇదే విధంగా ఈ నెల 17న ఇదే జిల్లా కృష్ణాయపాలెంలో కూడా ఇలాగే సర్వే నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వే సాధారణంగా సర్వే నిర్వహించే వారు కేవలం వ్యక్తి పేరు.. ఏ నియోజకవర్గం.. ఎవరికి ఓటు వేస్తారు అనే అంశాలపై మాత్రమే ప్రజలను అడిగి తెలుసుకుంటారు. అయితే, ఈ సంస్థ సభ్యులు నిర్వహించే సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఓటరు పేరు, మొబైల్ నంబర్తో పాటు ఓటర్ ఐడీ నంబర్, ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ సంస్థ తరఫున అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఓటర్లే లక్ష్యం.. స్పా సంస్థ సభ్యులను విచారించగా.. అధికశాతం వైఎస్సార్సీపీ ఓటర్లే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారని తెలుస్తోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 25 పోలింగ్ కేంద్రాల పరిధిలో మంగళవారం వీరు సర్వే నిర్వహించినట్లు సమాచారం. వీరు వివరాలు సేకరించిన అరగంట లోపే తమ ఓటు రద్దయిందని పలువురు బాధితులు తెలిపారు. సర్వేల పేరుతో ఓట్లు గల్లంతు చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముస్తఫా కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సర్వేకు సంబంధించిన సూపర్వైజర్లు ఉమామహేశ్, రవి సహా 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిచ్చాక చూస్తే ఓట్లు గల్లంతయ్యాయి సోమవారం ఇద్దరు యువకులు మా ఇంటికి వచ్చి కార్పొరేషన్ అధికారులు పంపించారని చెప్పి నమ్మించారు. ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామంటూ మా ఇంట్లోని ఓటర్ల వివరాలు అడిగారు. చివరగా వారి చేతిలోని ట్యాబ్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ గుర్తుపై వేలిముద్ర వేయాలన్నారు. నేను, మా అమ్మ వెంకట లక్ష్మమ్మ.. వైఎస్సార్సీపీ గుర్తు అయిన ఫ్యాన్పై వేలిముద్రలు వేశాం. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించడంతో పారిపోయారు. మంగళవారం ఓటర్ల జాబితా పరిశీలించగా నా ఓటు, మా అమ్మ ఓటు గల్లంతయ్యాయి. – సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఎల్ఆర్ కాలనీ 6వ లైను, గుంటూరు వెంటనే ఓట్లు సరిచూసుకోండి ఓటర్లందరూ తమ ఓట్లను జాబితాలో సరిచూసుకోవాలి. తొలగించి ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలి. రానున్న ఎన్నికలలో విజయం సాధించలేమనే టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. ఓట్లను తొలగించారని నిర్ధారణ జరిగితే ఎన్నికల కమిషన్ దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి 36వేల ఓట్ల గల్లంతు గుంటూరు నగరంలో వైఎస్సార్సీపీకి చెందిన 36వేల ఓట్లు తొలగించారు. నాలుగు నెలలుగా కష్టపడి మేం ఓటర్లను చేర్పిస్తుంటే.. సర్వేల పేరుతో టీడీపీ వాటిని తొలగిస్తోంది. సర్వేలు చేసే వారికి ఓటర్ ఐడీ నంబర్లు, ఇతర వివరాలతో ఏం పని? ఇది ముమ్మాటికీ వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించడానికి చేస్తున్న పనే. – మహ్మద్ ముస్తఫా, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే పావుగంటలో ఓటు గల్లంతు స్పా ప్రతినిధులమంటూ మంగళవారం కొందరు నా వద్దకు వచ్చి స్థానిక సమస్యలు అడిగారు. అనంతరం ఓటు ఎవరికి వేస్తున్నారో తెలపాలంటూ ప్రశ్నించారు. జనసేనకు వేస్తానని చెప్పా. అనంతరం వారి వద్ద ఉన్న టాబ్పై నా వేలి ముద్ర తీసుకున్నారు. నా ఓటు ఐడీ కార్డు నంబరు అడిగారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ 1905కు ఫోన్చేయగా 15 నిమిషాల క్రితం నా ఓటు తొలగించబడిందని సమాధానం వచ్చింది. – తోట కార్తీక్, బాలాజీనగర్, 9వ లైను, గుంటూరు -
ఈసీది ధృతరాష్ట్ర వైఖరి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల విషయంలో ఎన్నికల కమిషన్ ధృతరాష్ట్ర వైఖరిని అవలంబిస్తోందని పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి విమర్శించారు. ఓటర్ల జాబితాలో అనేక తప్పిదాలు ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ.. ప్రస్తుత ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే అసలు ప్రజాస్వామ్యానికి విలువే ఉండదన్నారు. పునర్విభజన చట్టం–2008లోని సెక్షన్–11 ప్రకారం మం డలాల పేరు, సరిహద్దులు, విస్తీర్ణం మారితే దానికి అనుగుణంగా చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఏపీలో కలిసిన 7 మండలాల విషయంలో ఇంతవరకు చట్టంలో ఎలాంటి సవరణలు చేయలేదని గుర్తు చేశారు. ఈ విషయమై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్న తీరును ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ దృష్టికి తీసుకెళ్లమని తెలిపారు. -
సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు షురూ
కామారెడ్డి క్రైం: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలు పెట్టింది. సర్పంచ్ల ఎన్నికలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితాలను సిద్ధం చేయాల్సిందిగా ఎన్నికల సంఘం రెండ్రోజుల క్రితం ఆదేశాల జారీ చేసింది. మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను జిల్లా ఎన్నికల అధికారులకు పంపించింది. కామారెడ్డి కలెక్టర్ నుంచి ఈ మార్గదర్శకాలు జిల్లాలోని ఆయా మండýలాల ఎంపీడీవోలకు చేరాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాను సెప్టెంబర్ 25న విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా గ్రామపంచాయతీల ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. దీంతో పంచాయితీరాజ్శాఖ అధికారులు ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లు, సిబ్బందికి విధుల కేటాయింపు, పోలింగ్ అధికారుల ఎంపిక పనుల్లో నిమగ్నమయ్యారు. ఇవీ మార్గదర్శకాలు... యాక్షన్ ప్లాన్ ప్రకారం పనులు చేపట్టాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 25న విడుదలైన అసెంబ్లీ ఎన్ని కల ఓటరు జాబితాను అనుసరించి జీపీ ఓ టర్ల జాబితాను సిద్ధం చేయాలి. నవంబర్ మూడో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారంలోగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలి. నవంబర్ చివరికల్లా ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఎంపిక చేయాలి. డిసెంబర్ మొదటి వారంలో వారికి శిక్షణ ఇవ్వాలి. ఎంపికలో గెజిటెడ్ స్థాయి అధికారులను గుర్తించాలి. ఎన్నికల వి«ధుల్లో భాగంగా పోలింగ్లో పాల్గొనే సిబ్బందిని గుర్తించి బాధ్యతలు అప్పగించాలి. డిసెంబర్ రెండో వారానికల్లా వారికి ఆర్డర్లు అందజేయాలి. మూడు నెలల్లోగా ఎన్నికలు.. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఇప్పటికే మూడు నెలలు గడుస్తోంది. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల మాదిరిగానే 60 శాతం రిజర్వేషన్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కొందరు కోర్టుకు వెళ్లారు. 60 శాతం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం జరుగుతుందనేది వారి వాదన. అంతేకాకుండా కులాలా వారీగా ఓటర్ల గణన పూర్తి చేయకుండానే ఎన్నికల్లో రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడం వీలు కాలేదు. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. అయితే, ప్రత్యేకాధికారుల పాలన సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు.. మూడు నెలల్లోగా గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 11న ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఎన్నికల కమిషన్ జీపీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. దీంతో సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఆశావహులు అసెంబ్లీ ఎన్నికలు కాగానే పంచాయతీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నిర్వహణ కష్టమే! జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతన జీపీల ఏర్పాటుకు ముందు 323 పంచాయతీలు ఉండగా, 214 జీపీలు కొత్తగా ఏర్పడ్డాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గండిమాసానీపేట్ జీపీ కలిసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 12 వరకు పంచాయతీ ఎన్నికలకు సమయం ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు సమయం సరిపోదు. కులాల వారీగా ఓటర్ల జాబితాలు ఇప్పటికి సిద్ధంగా లేవు. ప్రభుత్వం ఆదేశిస్తే కులాల వారీగా ఓటరు గణాంకాలను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. బీసీ ఓటర్ల గణన చేపట్టాలంటే చట్టబద్ధమైన ప్రభుత్వ సంస్థతో ముందుకు వెళ్లాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ ఓటర్ల లెక్కింపు చేయవచ్చు. కులాల వారీగా ఓటర్ల వివరాలు అందుబాటులోకి వచ్చాకే రిజర్వేషన్లను కేటాయించడానికి వీలవుతుంది. ఆయా కారణాలతో హైకోర్టు సూచించిన ప్రకారం జీపీ ఎన్నికలు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రణాళిక ప్రకారం పనులు.. అసెంబ్లీ ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని జీపీ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. జీపీ ఎన్నికలకు సంబంధించిన పనులపై కార్యాచరణ ప్రణాళిక విడుదలైంది. ఆయా మండలాల అధికారులకు యాక్షన్ ప్లాన్ను పంపించాం. ఉన్నతాధికారుల సూచన మేరకు పనులు చేపడుతున్నాం. – రాములు, డీపీవో, కామారెడ్డి -
ఓటర్ల జాబితా తక్షణ తనిఖీ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను క్షేత్ర స్థాయికి పిలిపించి స్పాట్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల (ఈఆర్వో)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ ఆదేశించారు. ఫిర్యాదులందిన మరుసటి రోజు స్వయంగా ఈఆర్వోలు, ఎన్నికల బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని సూచించారు. ఈ పరిశీలనలో తప్పులను గుర్తిస్తే సరిదిద్దాలని, తప్పులు లేకుంటే పాత సమాచారంతో ఫిర్యాదు చేశారని రాజకీయ పార్టీలను కన్విన్స్ చేయాలని ఈఆర్వోలకు సూచించినట్లు రావత్ వెల్లడించారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన నిర్దిష్ట ఫిర్యాదులను సంబంధిత ఈఆర్వోలకు పంపించామని, ఫిర్యాదుల పరిశీలన పురోగతిలో ఉందన్నారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకోసం తెలంగాణకు వచ్చిన ఓపీ రావత్.. మూడ్రోజుల పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) రజత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్ల పట్ల కొంత ఆందోళనతో రాష్ట్ర పర్యటనకు వచ్చామని, సమీక్ష అనంతరం సీఈవో, కలెక్టర్లు, ఎస్పీలు తీసుకున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. ప్రజా పండుగలా ఎన్నికలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రజా పండుగలా నిర్వహించాలని రాష్ట్ర, జిల్లా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తుందని ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఎలాంటి భయాందోళనలు, ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని సూచించామన్నారు. ఎన్నికల నిర్వహణలో నిర్భయంగా, తటస్థంగా, స్వతంత్రంగా ఉండాలని, రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదుశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ‘పెద్ద మొత్తంలో డబ్బులు, మద్యం పంపిణీ జరుగుతోందని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులొచ్చాయి. వీటి నియంత్రణ చర్యల కోసం ఆదాయ పన్ను, ఎక్సైజ్, రవాణా, బ్యాంకర్స్ కమిటీ, విమానాశ్రయాలు అధికారులతో చర్చించాం. ఎన్నికల కోడ్ అమలుకు ఫ్లైయింగ్ స్క్వాడ్ల సంఖ్యను పెంచుతున్నాం. రైలు, వాయు, బ్యాంకింగ్ ద్వారా జరిగే డబ్బుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలపై పరిమిత అధికారాలే! రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలపై ఎన్నికల సంఘానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని, హామీలను ఎలా అమలు చేస్తారు? వనరులేంటి? అనే సమాచారాన్ని మాత్రమే పార్టీల నుంచి కోరతామని రావత్ వెల్లడించారు. ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలకు 24 గంటల్లోగా అనుమతులు జారీ చేయాలని ఈఆర్వోలను ఆదేశించామన్నారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో పక్షపాత వైఖరితో వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరాయన్నారు. డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు, కానుకల టోకెన్ల పంపిణీని నియంత్రించాలని కోరినట్లు రావత్ వెల్లడించారు. పొరుగు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రాష్ట్రంలో డబ్బులు, మద్యం పంపిణీకి సహకరిస్తున్నారని ఓ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిందని, వివరాలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. బురఖా ధరించి వచ్చే ముస్లిం ఓటర్లను గుర్తించేందుకు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు/మహిళా పోలింగ్ అధికారులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. వికలాంగ ఓటర్ల నమోదు, వారు ఓటు హక్కు వినియోగించుకునేలా సదుపాయాలకల్పన కోసం తొలిసారిగా ఎలక్షన్ యాక్ససబిలిటీ అబ్జర్వర్లను పంపుతున్నామన్నారు. అంధ ఓటర్లకు బ్రెయిలీలో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సిబ్బందికి క్యాష్లెస్ వైద్యం ఎన్నికల విధుల్లో అస్వస్థతకు గురయ్యే సిబ్బందికి.. సమీపంలోని అత్యుత్తుమ ఆస్పత్రిలో క్యాష్లెస్ సదుపాయం కల్పించాలని సూచించగా.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకరించారన్నారు. మారుమూల ప్రాంతాల్లో అస్వస్థతకు లోనైతే వారిని తరలించడానికి ఏయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రావత్ పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలను వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. మహిళా పోలింగ్ బూత్ల్లో ఎక్కడా గులాబీ రంగు కనిపించదన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస, బృందంలోని ఇతర అధికారులు ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సందీప్ జైన్, చంద్రభూషణ్ కుమార్, దిలీప్ శర్మ, ధీరేంద్ర ఓజా, సుందర్ భయిల్ శర్మ, ఎస్కె రుడోలా పాల్గొన్నారు. నేర చరిత్ర ప్రకటన తప్పనిసరి అభ్యర్థులు తమ నేర చరిత్రను తప్పనిసరిగా ప్రకటించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్ల నమూనాలో మార్పు లు చేశామన్నారు. అభ్యర్థులు.. తమ నేర చరిత్రను 3 పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రకటనల రూపంలో ప్రసారం చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల అఫిడవిట్లను 24 గంటల్లోగా వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. గత ఎన్నికల్లో నమోదైన కేసుల్లో కేవలం 25% మాత్రమే కోర్టుల్లో రుజువయ్యాయని.. ఈసారి కేసుల నమోదు సమయంలోనే అన్ని రకాల ఆధారాలను సేకరించాలని, బాధ్యుల పేర్ల ను రికార్డు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించామన్నారు. నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదుల స్వీకరణకు ‘సీ–విజిల్’యాప్ వినియోగంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని 38 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల పరిధిలో ఉన్నాయని, గందరగోళం ఏర్పడకుండా ఈవీఎంలకు కలర్ కోడింగ్ చేస్తున్నట్లు సీఈఓ చెప్పారన్నారు. -
ఓటు వేయిస్తాం..ఇది మా 'వాదా'..
నగర ప్రజలు పోలింగ్పై ఆసక్తి కనపరచడంలేదు. ఏ ఎన్నికల్లో చూసినా ఇది రుజువు అవుతోంది. గత ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నవారు 53 శాతం మందే. ఆసక్తి లేక పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివారు కొందరైతే, వెళ్లేందుకు శక్తిలేని వారు ఎందరో. ఇలాంటి వారిలో గర్భిణులు, వయోధికులు, అంధులతో సహా దివ్యాంగులుంటున్నారు. ఈసారి వారు సైతం అధికసంఖ్యలో ఓటు వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.అందుకనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ భావించారు.ఆయన నేతృత్వంలో, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ , ‘సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్(స్వీప్)’నోడల్ అధికారి హరిచందన పర్యవేక్షణలో ప్రత్యేక యాప్ రూపొందించింది జీహెచ్ఎంసీ . అందరూ వినియోగిస్తున్న సెల్ఫోన్లను, ఆన్లైన్ను దృష్టిలో ఉంచుకొని ఐటీలో నిపుణులైన పలువురు ప్రోగ్రామర్లు, డెవలపర్లతో వారం రోజుల పాటు శ్రమించి ఈ ప్రత్యేక యాప్కు రూపకల్పన చేశారు. ఓటర్ యాక్సెస్బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ (వాదా)గా పేరు పెట్టారు. వాదా(హామీ) అనే అర్థమొచ్చేలా ఈ పేరు పెట్టారు. ఈ యాప్ను వినియోగించుకోవడం ద్వారా సులభంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి, తిరిగి తమ ఇళ్ల వద్దకు చేరుకోవచ్చు.పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారికి అధికారులు వాహన సదుపాయం కల్పిస్తారు. ఓటు వేయడంలో సహకరిస్తారు. – సాక్షి,హైదరాబాద్ నేడు యాప్ ఆవిష్కరణ ఈ యాప్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓంప్రకాశ్ రావత్ మంగళవారం ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. యాప్ డౌన్లోడ్ చేశాక..ఇలా చేస్తే చాలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక పోలింగ్ కేంద్రానికి వెళ్లాలనుకునే ఓటరు పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలతోపాటు ఎలాంటి అశక్తతతో ఉన్నారు..ఎలాంటి సాయం కోరుకుంటున్నారు, ఎన్ని గంటలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారో తెలియజేయాలి. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో దేన్నయినా ఎంచుకొని ఈ వివరాలు పూర్తిచేయవచ్చు. వివరాల్ని టైప్ చేయలేని వారు వాయిస్ రికార్డు ద్వారా అయినా నమోదు చేసి పంపించవచ్చు. వాటిని నమోదు చేయగానే జీఐఎస్తో ఓటరు ఎక్కడున్నదీ అధికారులకు తెలుస్తుంది. ఇలా ఓటరు నివాసంతో సహా పూర్తివివరాలన్నీ సర్వర్లో నిక్షిప్తమవుతాయి.హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 3వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాలు దీనితో అనుసంధానమై ఉంటాయి.వారు తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు వీలుగా అధికారులు తగిన ఏర్పాట్లుచేస్తారు. ఆమేరకు బూత్ స్థాయి అధికారులకు సూచనలిస్తారు. హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా మేరకు 20వేలకు పైగా దివ్యాంగులున్నారు. 22 రకాలైన అశక్తతలతో ఉన్నవారు వీరిలో ఉన్నారు. వీరితోపాటు గర్భిణులు, 65 ఏళ్లు దాటిన వయోధికులు సైతం ఓటు వేసేందుకు సహాయ మందిస్తాం. జీఐఎస్, జియోట్యాగింగ్లతో ఓటర్లకు ఇలాంటి సదుపాయం కల్పించడం దేశంలో బహుశా ఇదే ప్రథమం. వివరాలు పంపిన వారిని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకువెళ్లడం, వారు ఓటు వేశాక తిరిగి ఇంటివద్ద దిగబెట్టడంతోపాటు పోలింగ్ కేంద్రంలో తోడుగా సహాయకుడు కావాలన్నా అనుమతిస్తాం. – హరిచందన దాసరి, ‘స్వీప్’నోడల్ అధికారి -
‘అసెంబ్లీ’ జాబితా రెడీ!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు శాసనసభ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాలు అందుబాటులోకి వచ్చా యి. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దేశించిన గడువు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను అధికారిక వెబ్సైట్ (http:// ceotelangana.nic.in)లో పొందుపరిచింది. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సాఫ్ట్ కాపీల రూపంలో పొందుపరిచిన హార్డ్డిస్క్లను పంపిణీ చేయనుంది. ఎన్నికల వ్యూహ రచన, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల నిర్వహణలో రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబి తాలు కీలకం కానున్నాయి. నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉన్న వివిధ వర్గాల ఓటర్లను లక్ష్యం చేసుకుని ఎన్నికల వ్యూహ రచన చేయడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా మారింది. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం కింద తుది జాబితాలను ఈ నెల 12న ప్రకటించినప్పటికీ, నియోజకవర్గాల వారీగా జాబితాలు సిద్ధం కాకపోవడంతో రాజకీయ పార్టీలు కొన్ని రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. వెబ్సైట్లో ఓటర్ల జాబితా నవీకరణ (అప్డేటింగ్) ప్రక్రియ సైతం ముగియడంతో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారు తుది జాబితాలో తమ పేరు ఉందో లేదో ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం లభించింది. శేరిలింగ్పల్లి టాప్.. భద్రాచలం లాస్ట్.. రాష్ట్రంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా 5,49,773 మంది ఓటర్లున్నారు. మేడ్చల్ 4,85,202 మంది, ఎల్బీ నగర్ 4,74,599 మంది, కుత్బుల్లాపూర్ 4,68,344 మంది, ఉప్పల్ 4,27,141 మంది, రాజేంద్రనగర్లో 4,21,345 మంది ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో మిగతా నియోజకవర్గాలున్నాయి. ఇక భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 1,33,756 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఈ నియోజకవర్గం పరిధిలోని 6 మండలాలను ఏపీలో విలీనం చేయడంతో అక్కడి ఓటర్లను సైతం ఏపీలోని నియోజకవర్గాలకు బదిలీ చేశారు. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 1,42,573 మందితో అశ్వారావుపేట, 1,49,688 మందితో బెల్లంపల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పురుష ఓటర్లే ఎక్కువ! రాష్ట్రంలోని 67 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు, 52 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 2,73,18,603 ఓటర్లలో 1,37,87,920 పురుషులు, 1,35,28,020 మంది మహిళలు, 2,663 మంది ఇతర ఓటర్లున్నారు. సోమవారం నుంచి ఓటరు గుర్తింపు కార్డులు.. రాష్ట్రంలో కొత్త ఓటర్లుగా నమోదైన 17,68,873 మందికి సోమవారం నుంచి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. మీ–సేవ కేంద్రాల్లో రూ.10 ఫీజు చెల్లించి ఓటరు ఫోటో గుర్తింపు కార్డులను కొత్త ఓటర్లు పొందవచ్చని సీఈఓ కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రానికి రానున్న ఈసీ బృందం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పరిశీలన జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎం యంత్రాల సంసిద్ధత, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అం శాలపై పరిశీలన జరపడంతోపాటు రాజకీయ పార్టీ ల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్తో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. 22న మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం.. అదే రోజు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించనుంది. అనంతరం సాయంత్రం 7.30 నుంచి 8.30 వరకు సీఈఓ రజత్కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్రెడ్డిలతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. 23న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుంది. 24న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో సమావేశమై ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనుంది. అనంతరం ఉదయం 11.15 నుంచి 12 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశం కానుంది. మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు విలేకరుల సమావేశం నిర్వహించి న అనంతరం సాయంత్రం 4.40 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ వెల్లడైన నేపథ్యంలో ఈ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. రాష్ట్ర శాసనసభ రద్దు అయిన అనంతరం ఈసీ అధికారుల బృందం రాష్ట్ర పర్యటనకు రావడం ఇది రెండో సారి. పూర్తి అవగాహనతో రండి: కలెక్టర్లతో సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నిర్వహించే సమావేశానికి పూర్తి అవగాహనతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ రజత్కుమార్ ఆదేశించారు. ఈసీ బృందంలోని అధికారులు అడిగే ఏ ప్రశ్నకైనా తక్షణమే సమాధానం ఇచ్చేలా అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహనతో సమావేశానికి రావాలని సూచించారు. రాష్ట్ర పర్యటనకు ఈసీ బృందం వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసీ బృందం నిర్వహించే సమావేశంలో కలెక్టర్లు ఎవరైనా సమాధానాలు ఇవ్వడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించినట్లు తెలిసింది. -
కొత్త ఓటర్లు 24,000
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా యంత్రాంగం శనివారం నూతన ఓటరు జాబితాను విడుదల చేసింది. ఇటీవల కొత్త ఓటర్ల నమోదుతోపాటు, ఓటర్ల సవరణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఓటర్ల జాబితాను ఈ నెల 8న ప్రకటించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా సరిగా లేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఓటర్ల జాబితాను ప్రకటించొద్దని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని అదేశించింది. ఈ నేపథ్యంలో మార్పులు, చేర్పులకు మరో నాలుగు రోజుల గడువు పొడగిస్తూ తుది జాబితాను శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేశారు. సాధారణంగా ఒక రోజు ముందే తుది జాబితాను ప్రకటిస్తుంటారు. అయితే సాఫ్ట్వేర్ చిక్కులతో జాబితా విడుదల ఆలస్యమైనట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 5,36,756 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో పరకాల, నర్సంపేట నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు వరంగల్ అర్బన్ జిల్లా ఎన్నికల అధికారి పరిధిలోకి, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం జనగామ జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో, భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని శాయంపేట మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో ఉన్నాయి. జిల్లాలో 5,36,756 మంది ఓటర్లు వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని మొత్తం 5,36,756 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జాబితా విడుదల చేశారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,66,659, మహిళా ఓటర్లు 2,70,074, ఇతరులు 21 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పురుషుల కంటే మహిళ ఓటర్లు 3,415 మంది అధికంగా ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 2,04,450 , పరకాల నియోజకవర్గం పరిధిలో 1,94,983 మంది ఓటర్లు ఉన్నారు. పరకాల నియోజకవర్గం కంటే నర్సంపేట నియోజకవర్గంలో ఓటర్లు 9,467 అధికంగా ఉన్నారు. కొత్త ఓటర్లు 24,546 ఇటీవల నిర్వహించిన నూతన ఓటర్ల స్పెషల్ డ్రైవ్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 40,629 మంది నూతన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, వీటిని బూత్ లెవల్ అధికారులు పరిశీలించారు. అనంతరం 24,546 మందిని అర్హులుగా గుర్తించారు. నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12,415 మంది ఓటర్లు నమోదు కాగా, వారిలో పురుషులు 5,633, మహిళలు 6,781 మంది, థర్డ్ జండర్ ఒకరు , పరకాల నియోజకవర్గం పరిధిలో 12,131 మంది కొత్తగా ఓటరుగా నమోదుకాగా 5,537 మంది పురుషులు, 6,593 మంది మహిళలు, థర్డ్ జండర్ ఒకరు పెరిగారు. 2014 కంటే స్వల్పంగా పెరిగిన ఓటర్లు 2014లో పరకాల, నర్సంపేట రెండు నియోజకవర్గాల ఓటర్లు 3,99,055 ఉండగా శనివారం ప్రకటించిన ఓటర్లు 3,99,433 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల కంటే 2018లో జరిగే ఎన్నికలకు 378 మంది ఓటర్లే పెరిగారు. 2014లో నర్సంపేట పరిధిలో 2,05,605, పరకాల 1,93,450 మంది ఓటర్లు ఉన్నారు. -
ఓటర్ల జాబితాకు ఈసీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఓటర్ల జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముసాయిదా కంటే అదనంగా 12లక్షల పై చిలుకు ఓటర్లు కొత్తగా చేరారని తెలిపారు. కొత్త ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు పంపిస్తామన్నారు. జిల్లా ఎన్నికల అధికారులకు ఈ జాబితాను పంపించామన్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలిని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. -
ఎన్నికల అధికారులూ జాగ్రత్త: మర్రి
సాక్షి,హైదరాబాద్: అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, తప్పుడు ఓటర్ల జాబితా రూపొందిస్తే సహించేది లేదని ఎన్నికల అధికారులను తెలంగాణ పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని లేదం టే ఎవరినీ వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. గాంధీభవన్లో శుక్రవారం సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటరు నమోదు ప్రక్రియ అంతా హైకోర్టు పర్యవేక్షణలో జరగడం ప్రజాస్వామ్యవాదుల విజయంగా పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు బూత్స్థాయి వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను గుర్తించాలన్నారు. ఓటర్ల తుది జాబితాను తమకు అందిస్తే, ఎన్నికల కమిషన్ తప్పులను గాంధీభవన్ సాక్షిగా స్క్రీన్పై నిరూపిస్తామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినంత మాత్రాన ఎవరు ఏమీ చేయలేరనుకోవడం తప్పని ఈసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 12న వస్తుందని, అప్పటి వరకూ ఓటరుగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని దీనిపై ఈసీని సైతం నిలదీయవచ్చన్నారు. -
వచ్చే నెల 9వరకూ అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై నవంబర్ 9 వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 19 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఆ తేదీకి 10 రోజుల ముందువరకూ అభ్యంతరాలను స్వీకరిస్తా మని హైకోర్టు సీజే జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనానికి ఈసీ విన్నవించింది. బోగస్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయో జన వ్యాజ్యం శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఓటర్ల తుది జాబితా శుక్రవారం ప్రకటించామని ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ ధర్మాసనానికి తెలిపారు. ఓటర్ల జాబితాపై నవంబర్ 9 వర కూ అభ్యంతరాలను స్వీకరించాక మార్పులు, చేర్పులతో పాటుగా తొలగింపునకు ఒకరోజు ఉంటుం దని వివరించారు. ఈ మేరకు అఫి డవిట్ దాఖలు చేశామన్నారు. ప్రచురించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలించేందుకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు అధికారి, సహాయ అధికారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాలు, బూత్ స్థాయి అధికారుల కార్యాలయాల వద్దా జాబితా బహిర్గతం చేస్తామన్నారు. వాదనల అనంతరం కోర్టు కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ముహూర్తం ఖరారు
మెదక్ అర్బన్ : ఎట్టకేలకు ఓటర్ల తుది జాబితా విడుదలకు సమయం ఖరారైంది. హై కోర్టు 12వ తేదీన ఫైనల్ జాబితాను ప్రకటించాలిని తీర్పునిచ్చింది. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు ఓటర్ల తుది జాబితా తయారీకి కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సెప్టెంబర్ 10వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఆ తర్వాత 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అక్టోబరు 8వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో లోపాలు ఉండగా ఎన్నికలు ఎలా? నిర్వహిస్తారంటూ? కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు ఈనెల 12వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు ఆమోదం తెలిపింది. ఈ తీర్పుతో జిల్లా రెవెన్యూ అధికారులు సవరణలు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేసి 12వ తేదీన ఫైనల్ జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఓటరు నమోదులో కొత్తగా పేర్ల నమోదు, తొలగింపులు, పేర్లలో తప్పులు, సవరణలు, పోలింగ్ స్టేషన్లలో మార్పులకు సంబం«ధించి ఈనెల 25 వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఈ మేరకు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లు వివరాలు సేకరించారు. అధికారులు, బూత్ లెవల్ సిబ్బంది చేపట్టిన ఓటరు జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 3,92,606 మంది మొత్తం ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్ల పరిధిలో పేర్లు లేని వారు కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడం, రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక చోట తొలగించడం, పేర్లలో తప్పులు, సవరణలుకు నమోదు చేసుకున్నారు. వారిదే హవా.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు (చేర్పులు, మార్పులు ) 33,191, ఫామ్–6 ద్వారా 26,639, ఫామ్–7 ద్వారా 3,693 , ఫామ్–8 ద్వారా 1,657, ఫారం–8ఏ ద్వారా 1,202 దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఇతరత్రా దరఖాస్తులను పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సిబ్బంది సెప్టెంబర్ 10వ తేదీ వరకు ముసాయిదా జాబితా ప్రకారం మెదక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,82,464 ఉంది. అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,88,909 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుదిజాబితా కసరత్తు చేపట్టాలని ఆదేశించడంతో బూత్ లెవల్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పూర్తి కసరత్తును ప్రారంభించారు. ఈ మేరకు మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య, అందులో మహిళలు, పురుషుల వివరాలను సేకరించారు. జిల్లా వ్యాప్తంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 3,92,606 మంది ఉన్నారు. దీనిలో రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండటం గమనార్హం. -
ఓటర్ల జాబితా ప్రచురణకు హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రచురించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ముందు నిర్ణయించిన విధంగానే ఈ నెల 12న ఓటర్ల జాబితాను ప్రచురించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పింది. తాము చెప్పేంత వరకు ఓటర్ల జాబితాను ప్రచురించవద్దని ఈసీఐని నియంత్రిస్తూ ఈ నెల 5న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఎత్తేసింది. ఓటర్ల జాబితా ప్రచురణ బూత్ల వారీగా ఉండాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, చేర్పులు, తొలగింపులపై ఎవరైనా ఓటర్లు, ఇతర వ్యక్తులు అభ్యంతరాలను లేవనెత్తితే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతేగాక తాము చెప్పిన విధంగా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ, చేర్పులు, తొలగింపుల విషయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలు, ఇందుకు సంబంధించిన ఓ కార్యాచరణ ప్రణాళికను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలంది. బూత్ల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో తీసుకుంటున్న చర్యలను కూడా వివరించాలని సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో భారీస్థాయిలో తప్పులున్నాయని, పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని, ఈ తప్పులను సరిదిద్దేంత వరకు ఓటర్ల తుది జాబితా ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి గత శుక్రవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, తాము చెప్పేంత వరకు ఓటర్ల జాబితాను ప్రచురించవద్దని ఈసీఐను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. సవరణలు తెలుసుకోకుండానే... ఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, ఓటర్ల జాబితా సవరణ ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం జరిగే ప్రక్రియని అన్నారు. ఎన్నికల నిర్వహించాల్సి ఉంటే రెండో సవరణ ఓటర్ల జాబితాను సవరిస్తామన్నారు. నామినేషన్ దాఖలు చేసే చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు సవరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ 2015–16 ఓటర్ల జాబితా ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. పిటిషనర్ ఏ తప్పుల గురించి మాట్లాడుతున్నారో, వాటిని సవరించామని, సవరణలతో జాబితా ప్రచురించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ జాబితాను చూడకుండానే తప్పులున్నాయంటూ మాట్లాడటం సరికాదన్నారు. కోర్టు ఇచ్చే ఆదేశాలిస్తే ఈ నెల 12న జాబితాను ప్రచురించాలని భావిస్తున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ సామూహిక ఓట్ల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఇటువంటి సమయంలో ఆ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమేనా? అని అవినాశ్ను ప్రశ్నించింది. సాధ్యం కాదని, నిర్ధిష్టంగా ఒక్కో ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఆ తరువాతే జాబితాలో చేర్చడం, తొలగించడం చేయడం జరుగుతుందని ఆయన బదులిచ్చారు. 68 లక్షల బోగస్ ఓటర్లున్నా... పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసు ఎన్కౌంటర్లో చనిపోయిన తీవ్రవాది వికారుద్దీన్ పేరు కూడా ఓటర్ల జాబితాలో ఉందన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు సైతం ఓటర్ల జాబితాలో స్థానం కల్పించారన్నారు. ఇలా 68 లక్షల బోగస్ ఓటర్లు ఉన్నారని, ఈ విషయాన్ని తాము ఈసీఐ ముందు నిరూపించామని చెప్పారు. తాజాగా ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పరిశీలించే తాము మాట్లాడుతున్నామన్నారు. అయినా తప్పులను సరిదిద్దకుండా ఓటర్ల జాబితా ప్రచురణకు ఈసీ సిద్ధమైందన్నారు. ఓటర్ల జాబితా ప్రచురించకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి వీల్లేదని తెలిపారు. అలిపిరి వద్ద తనపై మావోయిస్టులు దాడి చేసిన నేపథ్యంలో నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సానుభూతి కోసం ముందస్తు ఎన్నికలకు సిఫారసు చేశారని, దీనిని అప్పటి కేంద్ర ఎన్నికల కమిషనర్ లింగ్డో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఓటర్ల జాబితాను ప్రచురించడమే మార్గం... ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ‘పిటిషనర్ చెబుతున్న తప్పులు ఓటర్ల జాబితాలో ఉన్నాయా? లేదా? తెలియాలంటే ఓటర్ల జాబితా ప్రచురించడమే మార్గం. అందువల్ల మేము ఓటర్ల జాబితా ప్రచురణకు ఆదేశాలిస్తున్నాం. రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఓటర్ల జాబితా తయారీ నిబంధనలను పరిశీలించాం. అలాగే ఈసీ వాదనలు కూడా విన్నాం. వీటిని బట్టి ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియని అర్థమైంది. ఎన్నికల కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ సిద్ధంగా ఉంటుంది. తప్పుల సవరణ, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నామినేషన్ సమర్పణ చివరి రోజు 3 గంటల వరకు ఎన్నికల సంఘం చేపడుతుంది. ఈ నెల 12న బూత్ల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలి. ఈ జాబితాపై ఎవరైనా అభ్యంతరాలను లేవనెత్తితే వాటిని చట్ట ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలి.’అని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. -
అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల12కి వాయిదా వేసింది. ఓటరు జాబితాలో అభ్యంతరాలను నివృత్తి చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తారో అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపాలని ఎన్నికల కమిషన్ని హైకోర్టు ఆదేశించింది. బూత్ లెవెల్ నుంచి ఓటర్ల జాబితాపై అఫిడవిట్లో వివరాలు పొందుపరచాలని కోరింది. ఓటర్ల తుది జాబితాను ఈనెల 12న ప్రచురించేందుకు ఎన్నికల సంఘానికి హైకోర్టు అనుమతినిచ్చింది. అసెంబ్లీ రద్దు పిటిషన్లపై వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. కాగా అంతకుముందు తెలంగాణ ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదోపవాదాలు సాగాయి. ఓటరు నమోదు ప్రక్రియపై నిబంధనలు ఏం చెబుతున్నాయనే వివరాలు అందించాలని ప్రధాన న్యాయమూర్తి ఈసీని ఆదేశించారు. ఓటరు నమోదు నిబంధనలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించారు. తెలంగాణ ఓటర్ల జాబితాపై దాఖలైన అన్ని పిటిషన్లను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్పై ఈసీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. ఈసీ కౌంటర్పై మర్రి శశిధర్ రెడ్డి న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించనున్నారు. కాగా ఓటర్ల జాబితాపై కోర్టులో విచారణ సాగుతుండగానే ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగా, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ముందస్తు అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ మాజీ మంత్రి డీకే అరుణ సహా పలువురు దాఖలు చేసిన పలు పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది. -
సుప్రీంకోర్టులో ఈసీ, కాంగ్రెస్ వాగ్వాదం!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలపై సుప్రీంకోర్టు సాక్షిగా కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ పార్టీ వాగ్వాదానికి దిగాయి. ఓటర్ల జాబితాలో నకిలీఓట్ల అంశంపై దాఖలైన కేసులను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ల సుప్రీంకోర్టు బెంచ్ సోమవారం విచారణ ముగించి తీర్పును రిజర్వ్లో ఉంచింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ నేతలు కమల్నాథ్, సచిన్ పైలట్లు కేసు వేయగా వీరి తరఫున కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదించారు. ఈ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ని ప్రతివాదిగా చేర్చగా, ఈసీ తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నాటి కొన్ని వీవీప్యాట్లను చెక్చేయాలని సిబల్ వాదించారు. అయితే, ఓటర్ల జాబితాలో నకిలీఓట్లు ఉన్నా యని అసత్య ఆరోపణలు చేస్తూ, ఈసీలాంటి రాజ్యాంగబద్ధ సంస్థను అపఖ్యాతిపాలు చేయాలని కాంగ్రెస్ నేతలు కుట్రపన్నారని వికాస్ సింగ్ వాదించారు. అయితే, ఒక్క మధ్యప్రదేశ్లోనే 60 లక్షల నకిలీఓట్లు బయటపడ్డాయని, మరో 24 లక్షల ఓట్లను ఈసీనే తొలగించిందని సిబల్ వాదించారు. -
ఆ ఆరోపణలు అర్థరహితం
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని, సవరించిన ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించలేదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హైకోర్టుకు నివేదించింది. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దకుండానే తుది జాబితా ప్రచురించారన్న ఆరోపణలు అర్థరహితమని తెలిపింది. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న వివరాల మేరకు పిటిషన్ దాఖలు చేయలేదని వివరించింది. 30.13 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారన్న ఆరోపణలకూ ఆధారాలు చూపలేదంది. అత్యాధునిక సాంకేతిక సాయంతో తప్పులను సవరించామని సీఈసీ తెలిపింది. ఊహాజనిత, అర్థరహిత ఆరోపణలతో శశిధర్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరింది. తన పిటిషన్లో సీఈసీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి తిరుగు సమాధానం ఇచ్చేందుకు అవకాశమివ్వాలని శశిధర్రెడ్డి తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధా కృష్ణన్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, వీటిని సవరించకుండా తుది ఓటర్ల జాబితాను ప్రచురించకుండా సీఈసీని ఆదేశించాలని కోరుతూ శశిధర్రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ చివరి తేదీ వరకు సవరణ: సీఈసీ శశిధర్రెడ్డి వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాల మేరకు సీఈసీ తరఫున డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి సత్యవాణి సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. శశిధర్రెడ్డి తన పిటిషన్లో చెప్పిన వివరాలన్నీ గతంలోనివని తెలిపారు. ప్రతీ ఏడాది ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఉంటుందని, ఎన్నికలు జరిగే చోట రెండోసారీ సవరణ ఉంటుందన్నారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం నామినేషన్ చివరి తేదీ వరకు సవరణ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందన్నారు. ఎంతో తీవ్రస్థాయిలో పనిచేసి రెండో సవరణను పూర్తి చేశామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఒకే రకమైన వివరాలున్న 4.92 లక్షల ఓటర్లను గుర్తించామని తెలిపారు. 2014 ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 2018 ఓటర్ల సంఖ్యలో 20 లక్షల తగ్గుదలను తప్పుపడుతున్నారని, ఇందుకు సహేతుక కారణాలున్నాయని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొందరు వలస వెళ్లడం, ఆధార్ అనుసంధాన ప్రక్రియ, అనర్హుల ఏరివేత వంటి కారణాల వల్ల ఓటర్ల సంఖ్య తగ్గిందని కోర్టుకు నివేదించారు. -
జాబితాకు ’సాంకేతిక’ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న సుడిగాలి ఏర్పాట్లకు అనూహ్య రీతిలో అడ్డంకి ఎదురైంది. ఈనెల 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించాలన్న ఈసీఐ నిర్ణయానికి దాదాపుగా బ్రేక్ పడింది. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ‘ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ’ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేమంటూ జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు చేతులెత్తేశారు. ఆ గడువును మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ 13 జిల్లాల కలెక్టర్లు గురు, శుక్రవారాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్కుమార్కు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ఈసీఐ దృష్టికి తీసుకెళ్లి గడువుకు మరో 7 రోజుల మినహాయింపు కోరాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు గురువారం రజత్కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సైతం కలెక్టర్లు ఇదే అంశాన్ని తేల్చి చెప్పినట్లు తెలిసింది. సాంకేతిక ఇబ్బందుల వల్లే... గత నెల 6న శాసనసభ రద్దు కావడంతో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం షెడ్యూల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం గత నెల 10 నుంచి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు కలిపి 13,15,234 దరఖాస్తులొచ్చాయి. వీటిని ఈ నెల 4వ తేదీలోగా పరిష్కరించి ‘ఈఆర్వో నెట్’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ‘‘దరఖాస్తు స్వీకరించి 7 రోజులు గడవకముందే ఉత్తర్వులు జారీ చేయరాదు’’ అని ఈఆర్వో నెట్ వెబ్సైట్ నుంచి అలర్ట్ వస్తుండడంతో గడువు ముగిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తుల కంప్యూటరీకరణ పెండింగ్లో ఉండిపోయింది. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 4,501 దరఖాస్తులు, అభ్యంతరాలు పెండింగ్లో ఉండిపోయాయి. మరోవైపు ఈ నెల 8న తుది ఓటర్ల జాబితాలను ప్రకటించాలని ఈసీఐ నిర్దేశించిన గడువు ముంచుకొస్తుండటంతో కలెక్టర్లు ఆందోళన చెంది తమ ఇబ్బందులను సీఈఓకి ఏకరువు పెట్టారు. ‘ఈఆర్వో నెట్’ వెబ్సైట్లో అప్లోడింగ్ పని మినహా నిబంధనల ప్రకారం చేయాల్సిన ఇతర పనులన్నీ పూర్తి చేశామని తెలిపారు. తలకిందులైన షెడ్యూల్ అంచనాలు.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి కనీసం మూడు నెలల సమయం అవసరం కాగా, రాష్ట్రంలో త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కేవలం నెల రోజుల వ్యవధితో ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. వాస్తవానికి గత జూలైలో రాష్ట్రంలో ప్రారంభమైన ఓటర్ల జాబితా తొలి సవరణ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరిలో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాదే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ఈసీఐ.. ఓటర్ల జాబితా తొలి సవరణ కార్యక్రమాన్ని నిలుపుదల చేసి రెండో సవరణ కార్యక్రమానికి కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మేరకు బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ) నుంచి జిల్లా కలెక్టర్ల వరకు గత నెల 10 నుంచి ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. అయితే, ఊహించని రీతిలో సాంకేతిక అడ్డంకులు ఎదురుకావడంతో ఆ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న తుది ఓటర్ల జాబితాల ప్రకటన అసాధ్యమేనని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం గడువు సడలిస్తే ఈ నెల 15న లేదా ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాలను ప్రకటించే అవకాశముంది. ఈసీఐకు సీఈఓ నివేదిక! ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్లోగా సాధ్యం కాదంటూ కలెక్టర్లు లేఖలు రాసిన విషయంపై సీఈఓ రజత్ కుమార్ ఈసీఐకి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. సీఈఓ వెబ్సైట్ల ప్రామాణీకరణ అంశంపై ఢిల్లీలో శుక్రవారం ఈసీఐ నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన ఈ మేరకు నివేదిక అందజేసినట్లు సమాచారం. దీనిపై త్వరలో ఈసీఐ నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
ఓటర్లజాబితాపై హైకోర్టే తేల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టు శుక్రవారమే విచారించాలని, అవకతవకలు ఉన్నట్టు గుర్తిస్తే ఓటర్ల జాబితా సవ రణ షెడ్యూలును పొడిగించేందుకు హైకోర్టుకు స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితాలో మూడు రకాల లోపాలు ఉన్నాయని, వాటిని సవరించేందుకు వీలుగా ఓటర్ల జాబితా సవరణ పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. మర్రి శశిధర్రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, జంధ్యాల రవిశంకర్ వాదన లు వినిపించారు. ఓటరు నమోదుకు జనవరి 1, 2018ని అర్హత తేదీగా పేర్కొన్నారని, దీని కారణంగా దాదాపు 20 లక్షలమంది కొత్త ఓటర్లు ఓటుహక్కును కోల్పోతున్నారని పోతుగంటి శశాంక్రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు. మర్రి తరపున సింఘ్వీ వాదిస్తూ 30.13 లక్షల మేర ఓటర్ల పేర్లు పునరావృతమవడం, 20 లక్షల ఓటర్లను తొలగించడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పునరావృతమైన పేర్లు 18 లక్షల మేర ఉండడం వం టి మూడు అంశాలను విపులంగా నివేదించారు. శశాంక్రెడ్డి తరపున నిరూప్రెడ్డి వాదనలు వినిపిస్తూ జనవరి 1, 2019 అర్హత తేదీతో ఓటర్ల సవరణ షెడ్యూలును పునరుద్ధరించాలని కోరారు.సీఎం కేసీఆర్ అభీష్టానికి అసెంబ్లీ రద్దుచేసి, కొత్త ఓటర్లను బలి చేసి వారి ఓటు హక్కు ను 2024 వరకూ వినియోగించుకోకుండా చేస్తారా అని ప్రశ్నించారు. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అమిత్ శర్మ వాదిస్తూ ఇదే తరహా పిటిషన్లను హైకోర్టు విచారించి కొట్టి వేసిందని, వీటిని పరిగణనలోకి తీసుకోరాదని వాదించారు. గతవారం ధర్మాసనం నోటీసులు ఇచ్చినప్పుడు దానికి ఈరోజు కౌంటర్ వేయకుండా ఇప్పుడు కొత్త వాదన తెరమీదకు తేవడం సరికాద సింఘ్వీ అన్నారు. తుది ఓటర్ల జాబితా ఈనెల 8న ప్రచురితం కానుందని, హైకోర్టుకు వెళ్లే సమయం లేదని నివేదించారు. పిటిషనర్ల వాదనను పరిగణనలోకి తీసుకుంటూ ఈ పిటిషన్లను హైకోర్టు శుక్రవారమే(నేడు) విచారించాలని ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్ల అభ్యర్థన న్యాయసమ్మతమని తేలితే ఓటర్ల సవరణను పొడిగించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీచేసే స్వేచ్ఛ హైకోర్టుకు ఉందని సూచించింది. -
తెలంగాణ ఓటర్ల జాబితాపై సుప్రీం కీలక ఆదేశాలు
-
తెలంగాణ ఓటర్ల జాబితాపై సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. పిటిషన్లోని మెరిట్ ఆధారంగా ఓటర్ల తుది జాబితా గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. రేపే విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. అంతకుముందు ఈ అంశంపై అందరి వాదనలను సర్వోన్నత న్యాయస్థానం ఆలకించింది. తెలంగాణలో ఓటర్ల జాబితా అంశంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితా షెడ్యూల్ కుదించారని, తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని కోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాలో 68 లక్షల ఓటర్ల విషయంలో అవకతవకలు జరిగాయని, 30 లక్షల బోగస్ ఓట్లున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి 18 లక్షల ఓట్లను తొలగించారని సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లారు. కటాఫ్ తేదీని ఈ ఏడాది జనవరి 1గా నిర్ణయించడం వల్ల 20 లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారని, 2000 సంవత్సరంలో పుట్టిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2024 వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు విచారణలో జోక్యం చేసుకుంటూ అసెంబ్లీ రద్దయిన పక్షంలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని జస్టిస్ ఏకే సిక్రీ కోరారు. గతంలో తోసిపుచ్చిన పిటిషన్లలో ఇవే అభ్యర్థనలు ఉంటే కేసులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఈసీ అడ్వకేట్ తన వాదనలు వినిపిస్తూ ఓటరు జాబితా అనేది నిరంతర ప్రక్రియని, హైకోర్టులో ఇవే అభ్యర్థనలపై వేసిన పిటిషన్లను డిస్మిస్ చేశారని గుర్తు చేశారు. కాగా హైకోర్టు డిస్మిస్ చేసిన ఉత్తర్వుల కాపీని తమకు ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. సిద్ధిపేటకు చెందిన సుశాంత్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న సుప్రీం కోర్టు మళ్లీ ఈ అంశాన్ని హైకోర్టుకు -
తుది కసరత్తు
సాక్షి, మెదక్: జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల నోటిపికేషన్ ఎప్పుడు విడుదలైనా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఓటరు తుది జాబితా రూపకల్పనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. తుది ఓటరు జాబితా ప్రకటనకు ఇంకా వారం రోజుల సమయం మిగిలి ఉంది. దీంతో ఎన్నికల సిబ్బంది ఓటరు దరఖాస్తు ఫారాలను పరిశీలన వేగవంతం చేశారు. నియోజకవర్గాల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. మరో పక్క ఈవీఎంల వినియోగంపైనా రాజకీయపార్టీలు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ రెండు ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని ప్రజలకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించటంతోపాటు మాక్ పోలింగ్ చేపడుతున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు మెదక్, నర్సాపూర్లోని 538 పోలింగ్ కేంద్రాల పరిధిలో అధికార యంత్రాంగం ఈవీఎంలపై పూర్తిగా అవగాహన కల్పించనున్నారు. అలాగే ఓటర్లతో మాక్పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించారు. కరెంటు, తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పార్టీలతో సమావేశం జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 538 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వందకుపైగా పోలింగ్ కేంద్రాల్లో కరెంటు, తాగునీరు, టాయిలెట్ల సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించారు. 231 పోలింగ్ కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అలాగే మొబైల్ఫోన్లు పనిచేయని గ్రామాలు 30 ఉన్నట్లు గుర్తించారు. ఆయా చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎన్నికల నోడల్ అధికారి నగేశ్ ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. త్వరలో రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తుది ఓటరు జాబితా, ఈవీఎంలపై అవగాహన తదితర అంశాలపై చర్చించనున్నారు. 30 నుంచి 39 వయస్సు ఓటర్లే ఎక్కువ జిల్లాలో 30–39 వయస్సు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వారి తీర్పు కీలకం కానుంది. జిల్లాలో మొత్తం 3,71,373 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 30–39 ఏళ్లు వయస్సు ఉన్న ఓటర్లు 1,13,921 మంది ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,82,464 మంది, నర్సాపూర్ నియోజకవర్గంలో 1,88,909 మంది ఉండగా కొత్తగా నమోదైన ఓటర్లలో ఎంతమంది కలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ కోసం 54,731 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సవరణలు చేసినవి 15,333. సవరణలు చేపట్టాల్సిన దరఖాస్తులు 39,398. తుది ఓటరు జాబితా నాటికి ఓటర్ల సంఖ్య స్వల్పంగా మారనుంది. రాబోయే ఎన్నికల్లో యువ, మధ్య వయస్సు ఓటర్ల తీర్పు కీలకం కానుంది. -
ఓటర్ల జాబితా వ్యవహారంపై ఈసీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికల కోసం ఓటు హక్కును పణంగా పెట్టడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన కేంద్ర , రాష్ట్ర ఎన్నికల సంఘాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీచేసింది. తమకు 18 ఏళ్లు నిండినప్పటికీ 2018 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకోవడంతో తాము ఓటు హక్కు కోల్పోతున్నామని, తమకు ఓటు హక్కు లభించే స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన వాతావరణం ఉండాలంటే రాష్ట్రపతి పాలనే శరణ్యమని పిటిషనర్లు పోతుగంటి శశాంక్రెడ్డి, ఆర్.అభిలాష్రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అంతకుముందే ఆగస్టు 28న, జనవరి 1, 2019ని అర్హత తేదీగా పేర్కొంటూ జారీచేసిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసిందని, తిరిగి 2018 జనవరి 1ని అర్హత తేదీగా పేర్కొంటూ సెప్టెంబరు 8న స్వల్పకాల ఓటరు నమోదు షెడ్యూలును జారీచేసిందని, ఈ ప్రకారం ఓటర్ల నమోదుకు, సవరణకు, లోపాలు సరిదిద్దడానికి తగిన సమయం లేనందున పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్భూషణ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. పోతుగంటి శశాంక్రెడ్డి తరపున న్యాయవాదులు నిరూప్రెడ్డి, ఆర్.చంద్రశేఖర్రెడ్డి తమ వాదనలు వినిపించారు. శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా మంత్రిమండలి ముందస్తుగా శాసనసభను రద్దు చేస్తూ సిఫారసు చేయడంపై సమీక్షించాలని కోరారు. ఏ అత్యవసర పరిస్థితి లేకున్నప్పటికీ, సభ అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే ఇలా సభను రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వాదించారు. అధికార పార్టీకి సానుకూల సమయమని చెప్పి ఓటర్ల నమోదుకు 2018 జనవరి 1ని అర్హత తేదీగా ప్రకటించినందున స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించినట్టు కాదని పేర్కొన్నారు. ‘ఎన్నికల సంఘం వక్రభాష్యం చెబుతోంది..’ త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావించి లక్షలాది మంది ఓటు హక్కును పణంగా పెడితే అది స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నిక ఎలా అవుతుందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. గుజరాత్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు కేంద్ర ఎన్నికల సంఘం వక్రభాష్యం చెబుతోందని, అసెంబ్లీ రద్దయినప్పటికీ ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పని లేదని, ఆర్టికల్ 324 ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం విశేష అధికారం కలిగి ఉందన్నారు. కొత్త షెడ్యూలు ప్రకారం తగిన సమయం లేనందున పాత షెడ్యూలును పునరుద్ధరించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. దాదాపు 60 లక్షల ఓటర్ల వివరాల్లో అవకతవకలు ఉన్నాయని విన్నవించారు. ఈ రెండు పిటిషన్లను పరిశీలించి, వాదనలు విన్న ధర్మాసనం వారంలోగా కౌంటర్ దాఖలు కోరుతూ నోటీసులు జారీచేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. -
ఓటర్ల నమోదుకు దరఖాస్తులు 23,87,942
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు కలిపి మొత్తం 23,87,942 దరఖాస్తులొచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ఇందులో 8.75 ల క్షల దరఖాస్తులు ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 10న చేపట్టిన ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద వచ్చాయన్నారు. గత జూలై 20 నుంచి ఈ నెల 10 వరకు నిర్వహించిన ఓటర్ల జాబితా మొదటి ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద మిగిలిన దర ఖాస్తులొచ్చాయన్నారు. మొత్తం 23.87 లక్షల దరఖాస్తుల్లో 11 లక్షల దరఖాస్తుల పరిశీలన పూరైందని, 13 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఇంటింటా సర్వే నిర్వహించి దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 2.61 లక్షల ఓటర్లుండగా, తుది జాబితా ప్రకటించే సరికి 2.8 కోట్లకు పెరగవచ్చని అంచనా వేశారు. ముందస్తు ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లపై సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మంగళవారం గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రజత్కుమార్ సూచించారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు అభ్యంతరాల స్వీకరణకు ఇదే చివరి అవకాశం కాదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత కూడా కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ గడువుకు 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతోపాటు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. 2,50,605 బోగస్ ఓటర్ల గుర్తింపు ఈఆర్వో నెట్ సాఫ్ట్వేర్ సహాయంతో రాష్ట్రంలో 4.92 లక్షల అనుమానాస్పద డూప్లికేట్(పునరావృత) ఓటర్లను ప్రాథమికంగా గుర్తించామని, పరిశీలన అనంతరం అందులో 2,50,605 బోగస్ ఓటర్లున్నట్లు సాఫ్ట్వేర్ ఆధారంగా నిర్ధారణకు వచ్చామని రజత్ కుమార్ వెల్లడించారు. 2.5 లక్షల అనుమానిత బోగస్ ఓట్లలో ఇప్పటి వరకు 1,20,265 ఓట్ల విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన సాగుతోందని, వారం రోజుల్లో మిగిలిన ఓట్ల పరిశీలన పూర్తి చేస్తామన్నారు. నిబంధనల ప్రకారం వారం ముందు నోటీసులు జారీ చేసి బోగస్ ఓట్లను తొలగిస్తామని, 1.80 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లు గుర్తించామని, వారి పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. 15,228 మందికి ఒకే నంబర్తో ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు గుర్తించామని, అందులో 7,614 మందికి కొత్త నంబర్లతో కొత్త గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి చేరిన ఈవీఎంలు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఈవీఎంలు రాష్ట్రానికి చేరాయని రజత్ కుమార్ ప్రకటించారు. 52 వేల బ్యాలెట్ యూనిట్లు, 40,700 కంట్రోల్ యూనిట్లు, 32,590 వీవీప్యాట్ యూనిట్లు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. 44 వేల వీవీ ప్యాట్ యూనిట్లు అవసరమని, మిగిలినవి ఒకట్రెండు రోజుల్లో చేరుతాయన్నారు. నాలుగో వంతు ఈవీఎంల పనితీరును పరీక్షించి చూస్తామని చెప్పారు. అత్యాధునిక వెర్షన్ ఈవీఎంలను ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నామని, ప్రాథమిక పరీక్షల్లో కేవలం 0.01 శాతం ఈవీఎంలలో మాత్రమే లోపాలు బహిర్గతమయ్యాయన్నారు. తొలిసారిగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్ యూనిట్లలో 7 నుంచి 8 శాతం వరకు పరీక్షల్లో విఫలమవుతున్నాయని, దీంతో అదనపు వీవీ ప్యాట్లను పంపాలని ఈసీఐఎల్ను కోరామన్నారు. ఎన్నికల సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వీవీ ప్యాట్లను మార్చేందుకు వీలుగా 30 శాతం యంత్రాలను అదనంగా సిద్ధం చేసి ఉంచుతామని, అక్టోబర్ 6లోగా ఈవీఎంలకు పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్పై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్పై పత్రికల్లో వస్తున్న ఊహాజనిత కథనాల్లో వాస్తవం లేదన్నారు. -
‘నమోదు’పై నజర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పక్షాలు దృష్టి పెట్టాయి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవడం.. అలాగే జాబితాలో తమకున్న అభ్యంతరాలపై దృష్టి సారించాయి. మరోవైపు జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకుని.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తోంది. ఇక పలు రాజకీయ పక్షాలు వచ్చే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించడంతోపాటు అనేక చోట్ల వారికి ఓటు నమోదు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నాయి. వీటితోపాటు ఓటరు జాబితాలో ఇబ్బడి ముబ్బడిగా పేర్లు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్న రాజకీయ పక్షాలు వాటిపై సైతం దృష్టి సారించాయి. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలిస్తూ.. ఒకే ప్రాంతంలో రెండుసార్లు ఓటర్లుగా నమోదైన వారి పేర్లు, మరణించినా జాబితాలో ఉన్న వారి పేరు, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇంకా ఆయా ప్రాంతాల్లో ఓటర్లుగా కొనసాగుతున్న వారి పేర్లను క్షేత్రస్థాయిలో సేకరించే పనిలో ఆయా రాజకీయ పక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు కొత్త ఓటరుగా నమోదు చేసుకునే వారికి అందుబాటులో ఉండేందుకు ప్రతి పోలింగ్ బూత్లోనూ బూత్ లెవల్ అధికారులను అందుబాటులో ఉంచగా.. ఆన్లైన్లోనూ ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు.. మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ప్రయత్నం చేసిన కొత్త ఓటర్లకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విమర్శలు తప్పడం లేదు. ఓటరు నమోదుకు సంబంధించి అన్ని వివరాలను పూర్తి చేసి.. సబ్మి ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆన్లైన్లో తిరస్కరణ అని వస్తున్నట్లు పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఆయా బూత్ పరిధిలోని బూత్ లెవల్ అధికారుల వద్ద నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. పార్టీల దృష్టి.. ఇక జిల్లాలోని ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ, న్యూడెమోక్రసీ వంటి పార్టీలు ఓటర్ల నమోదు, అలాగే నమోదు జరుగుతున్న తీరుపై దృష్టి పెట్టాయి. ఓటర్ల జాబితాలో తమ తమ పార్టీలు, ప్రాంతాలకు సంబంధించి పేర్ల తొలగింపు.. మరణించిన ఓటర్ల పేర్లు తొలగించారా? లేదా? చిరునామాల మార్పు సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న అంశంపై పూర్తిస్థాయి దృష్టి సారించే పనిలో నిమగ్నమయ్యాయి. ఓటర్ల మార్పులు, చేర్పులు, ఓటర్ల నమోదుకు సంబంధించి ఈనెల 25వ తేదీ వరకే గడువు ఉండడంతో జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలను రాష్ట్రస్థాయి నాయకత్వాలు అప్రమత్తం చేశాయి. ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించే వారికి అవగాహన కల్పించడంతోపాటు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయా రాజకీయ పక్షాలు నిర్ణయించడంతో జిల్లా, మండల స్థాయిలోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటరు నమోదు, జాబితాకు సంబంధించి కలెక్టర్ కర్ణన్ రాజకీయ పక్షాలతో పలుమార్లు సమావేశం నిర్వహించడంతోపాటు ఓటర్ల జాబితాకు సంబం ధించి సలహాలు, సూచనలను కోరారు. రాజకీయ పార్టీలు అందించిన సలహాలు, సూచనలను సైతం పరిగణనలోకి తీసుకుని కొత్త ఓటర్ల నమోదు, జాబితాను పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినా.. అందుకు తగిన విధంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ బూత్ల ఏర్పాటు, కొత్త ఈవీఎంలను తేవడంతోపాటు వివిధ స్థాయిల్లో అధికారులు నిర్వహించాల్సిన విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లాకు చెందిన ఐదుగురు అధికారులు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ నిర్వ హించే శిక్షణ కార్యక్రమానికి దశలవారీగా వెళ్లనున్నారు. వారు జిల్లాస్థాయిలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు అవగాహన కల్పించనున్నారు. ఇక రాజకీయ పక్షాలు సైతం పోలింగ్ బూత్ల స్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేసి.. వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా.. ఎన్నికలకు ప్రధానమైన ఓటర్ల జాబితాపై ఈసారి అన్ని రాజకీయ పక్షాలు దృష్టి సారించడం విశేషం. -
గడువు కుదించడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 15 రోజులకు కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓటర్ల నమోదు ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 45 రోజులుగా నిర్ణయించేలా ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీకి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్స్ ఎమన్సిపేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ ఈ పిల్ దాఖలు చేశారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. మొదట 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి, ఓటర్ల నమోదు గడువును 2018 జనవరి 1గా మార్చారని పిటిషనర్ వివరించారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోనే ఏకంగా 1.57 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. అధికార పార్టీ అండతోనే ఇది జరిగిందని ఆరోపించారు. ఓట ర్ల పరిశీలనకు అధికారులు ఉదయం 11 నుంచి సాయం త్రం 5 గంటల మధ్య వస్తారని, ఈ సమయంలో ఉద్యోగులు వారి ఉద్యోగాలకు వెళతారని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే వారి ఇంటికి తాళాలు వేసి ఉంటాయన్నారు. ఇలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు. ఏపీ ఓటర్లే లక్ష్యంగా..: కూకట్పల్లి నియోజకవర్గంలో నివాసముంటున్న ప్రజల్లో 50 శాతం మంది ఏపీకి చెందిన వారని, ప్రభుత్వం వీరినే లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియను చేపడుతోందన్నారు. ఇలా ఇప్పటి వరకు 1.57 లక్షల మంది ఓట ర్లను తొలగించారని, ఇది అన్యాయమని తెలిపారు. ఇలా తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యం కావాలంటే ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు తగినంత సమయం ఉండాలని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. పిటిషన్పై హైకోర్టు ఈ నెల 25న విచారణ జరిపే అవకాశం ఉంది. -
అర్హులందరికీ ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహం సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఓటర్ల జాబితాలో చేర్పుల ప్రక్రియ కీలకమని భావి స్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను, ప్రతిపాదనలను, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 25 వరకు గడువు ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటరు అయ్యేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నేతలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని వివరాలతో ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకోవడంతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నేతలతో మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్లోని అన్ని స్థాయిల నేతలు ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితా ప్రక్రియపైనే పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత ఉందని... అందరికీ ఓటు హక్కు ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉం టాయని కేసీఆర్ భావిస్తున్నారు. ఓటరు జాబితా ప్రక్రియ అనంతరమే పార్టీ పరంగా ఇతర కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ‘స్టేషన్’పై కడియం వివరణ... టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ప్రక్రియపై మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల పరిస్థితిపై ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్కు వివరిస్తున్నారు. సమాచారం ఆధారంగా కొం దరు అభ్యర్థులకు ఎప్పటికప్పడు సూచనలు చేస్తున్నారు. పలువురు అభ్యర్థులను పిలిచి మాట్లాడుతున్నారు. స్టేషన్ ఘన్పూర్లో నెలకొన్న తాజా పరిస్థితులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం కేటీఆర్కు వివరించారు. తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం తీరు, నియోజకవర్గంలోని అసంతృప్తి నేతల కార్యకలాపాలపై వీరిద్దరూ చర్చి ంచారు. మంత్రి మహేందర్రెడ్డి, చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేటీ ఆర్ను కలిశారు. కొడంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార తీరుపై చర్చించారు. చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కె.ఎస్.రత్నం ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా చేసిన వ్యవహారంపై మాట్లాడారు. రత్నం గతంలోనూ టీఆర్ఎస్ను వీడి మళ్లీ వచ్చారని, ఆయన వెళ్లినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని మహేందర్రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. మరో మంత్రి సి.లక్ష్మారెడ్డి సైతం కేటీఆర్ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ నేత దానం నాగేందర్ దాదాపు ప్రతిరోజూ కేటీఆ ర్ను కలుస్తూనే ఉన్నారు. ఖైరతాబాద్ టికెట్ విషయంపై శుక్రవారం మరోసారి కలసి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన చేయాలని కోరారు. తలసాని శ్రీనివాసయాదవ్ కూడా కేటీఆర్ను కలిశారు. -
ఓటర్ల నమోదుకు దరఖాస్తుల వెల్లువ
-
18 లక్షల కొత్త ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటరు నమోదు కోసం ఇప్పటివరకు సుమారు 17 లక్షల నుంచి 18 లక్షల మంది ఫారం–6 దరఖాస్తులు సమర్పించారని వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం సంతృప్తికరంగా సాగుతోందని, పెద్ద ఎత్తున యువత దరఖాస్తు చేసుకుంటోందన్నారు. ఎన్నికల ప్రకటన విడుదలై అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లున్నాయని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలతో బూత్ స్థాయి అధికారుల(బీఎల్వో)కు అభ్యంతరాలు అందించాలని సూచించారు. వారు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి బోగస్ ఓట్లను తొలగిస్తారన్నారు. ఈఆర్వో నెట్ సాయంతో.. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘ఈఆర్వో నెట్’సాఫ్ట్వేర్ సాయంతో ఓటర్ల జాబితాను విశ్లేషించి రాష్ట్రంలో 4.92 లక్షల డూప్లికేట్ ఓటర్లున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని రజత్ తెలిపారు. దేశం లోని ఓటర్లందరి వివరాలు ఈ సాఫ్ట్వేర్లో ఉంటాయని, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఒకే విధమైన పేర్లు, వయసు, చిరునామా ఉన్న ఓటర్లను సాఫ్ట్వేర్ గుర్తిస్తుందన్నారు. 4.92 లక్షల అనుమానాస్పద ఓటర్లందరికీ 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటిసులు జారీ చేస్తున్నామని, వివరణలు అందాక పరిశీలించి తొలగింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఓట్లలో దాదాపు 50 నుంచి 60 శాతం వరకు డూప్లికేట్ ఓటర్లుండే అవకాశముందన్నారు. సుమారు 1.20 లక్షల చనిపోయిన ఓటర్లను గుర్తించామని, వీటి తొలగింపు కోసం సంబంధికులకు నోటిసులు జారీ చేశామని చెప్పారు. ప్రతి బూత్లోనూ ఈవీఎంల పరీక్షలు రాష్ట్రంలో 19,044 పోలింగ్ కేంద్రాలున్నాయని.. 32,574 మంది బీఎల్వోలను నియమించామని, ఎక్కడా ఖాళీలు లేవని రజత్ కుమార్ తెలిపారు. 23 జిల్లాలకు ఇప్పటికే ఈవీఎంలు పూర్తి స్థాయిలో చేరాయని, మిగిలిన జిల్లాలకు మరో రెండ్రోజుల్లో చేరుతాయని తెలిపారు. 52,100కు గాను 30,470 బ్యాలెటింగ్ యూనిట్లు.. 44,000లకు గాను 18630 వీవీపాట్లు, 40,700 కంట్రోల్ యూనిట్లకు గాను 30,840 ఇప్పటికే చేరాయన్నారు. బూత్ స్థాయిలో ఈవీఎంలను పరీక్షించేందుకు 170 మంది ఇంజనీర్లను నియమించామని చెప్పారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల పనితీరుపై ప్రథమ స్థాయి పరీక్షలు నిర్వహించనున్నామని.. ప్రతి బూత్లో పార్టీలు, ప్రజల సమక్షంలో ఈవీఎంలకు పరీక్షలు జరుపుతామని, ఎవరైనా మాక్ పోలింగ్లో పాల్గొని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల నిర్వహణపై శిక్షణ కోసం 120 మంది మాస్టర్ ట్రైనర్లను ఢిల్లీ పంపామని, వారు తిరిగొచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఒకేరకమైన ఎన్నికల చిహ్నం కేటాయించాలని కొన్ని పార్టీలు ఇప్పటికే కార్యాలయాన్ని సంప్రదించాయని, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఇంతవరకు ఇలాంటి అభ్యర్థన చేయలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
బోగస్ ఓట్లు తొలగిస్తున్నాం : రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు ఇంకా ఐదు రోజుల సమయం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. ఇప్పటివరకూ 17 లక్షల పైచిలుకు కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు.ఓటర్ల జాబితాలో 4 లక్షల 90 వేల వరకు డబల్ వోటింగ్ ఉన్నట్టు తేలిందన్నారు. బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియ సాగుతోందన్నారు. 23 జిల్లాల్లో ఈవీఎంలు వచ్చాయని, మరో మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో పూర్తిగా వస్తాయన్నారు. రాష్ట్రంలో 170 మంది ఈవీఎం ఇంజనీర్లు అందుబాటులో ఉన్నారని, 120 మందిని ఢిల్లీకి మాస్టర్ ట్రైనింగ్ కోసం పంపిస్తామని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియని మరణించిన వారి పేర్లను తొలగించేందుకు, చిరునామా మార్పులకు మాత్రమే తుదిగడువు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో ఉన్న లిస్టునే అందరికీ ఇస్తామన్నారు. ఎన్నికల గుర్తు విషయంలో మాకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని, అది మోడల్ కోడ్ వచ్చాక చూస్తామని చెప్పారు. శాంతి భద్రతలను పకడ్బందీగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.ఢిల్లీ నుంచి ఈసీ బృందాలు ఎప్పటికప్పుడు వస్తాయని, అది సాధారణ ప్రక్రియేనని పేర్కొన్నారు. ఈవీఎంల పరిశీలన క్షుణ్ణంగా జరుగుతోందన్నారు. ఫస్ట్ లెవల్ చెక్ జరుగుతోందని, రోజుకు 540 ఈవీఎంలను మాత్రమే చెక్ చేయగలరన్నారు. ఏ గుర్తుకు నొక్కినా ఒక్కరికే వెళ్తుందన్న సందేహాల నివృత్తి కోసం మరింత ప్రచారం చేస్తామన్నారు. తొలుత ఈవీఎంలను చెక్ చేసిన అనంతరం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని, ప్రతీ అసెంబ్లీ సెగ్మంట్లో 10 యూనిట్లతో ప్రజల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రజత్ కుమార్ వెల్లడించారు. -
యువహో..
సాక్షి, మెదక్: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ముసాయిదా జాబితా లెక్కల ప్రకారం జిల్లాలో 10వేల మంది ఓటర్లు పెరిగారు.అక్టోబర్ 8వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం 4,390 దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెల 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి అవకాశం. నమోదు చేసుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అధికార యంత్రంగం ఇది వరకే ఓటరు నమోదు కోసం అన్ని గ్రామాల్లో ప్రచారం ప్రారంభించింది. జనవరి1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీ, యువకులు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కళాశాలల్లో ‘చునావ్ పాఠశాల’ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి ఓటు నమోదు ఆవశ్యకత గురించి కళాశాలల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రత్యేక చొరువ చూపుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయపార్టీల కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ అర్హులైన వా వివరాలను సేకరిస్తూ ఓటరు జాబితాలో పేరు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ప్రకటించిన ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 3,60,828 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ప్రకటించిన ఓటరు ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 3,71,373కు చేరుకుంది. ఓటరు జాబితా సవరణల కారణంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 10,545 మంది ఓటర్లుగా పెరిగారు. ప్రస్తుతం ఇంకా ఓటర్ల సవరణ కొనసాగుతోంది. ఈనెల 25 వరకు సవరణలు చేయనున్నారు. ముసాయిదా జాబితా ప్రకటనకు ముందు మెదక్ నియోజకవర్గంలో 1,78,364 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 1,82,464కు పెరిగింది. నర్సాపూర్ నియోజవర్గంలో గత ఓటరు జాబితాలో 1,82,464 ఉండగా ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,88, 909 కు పెరిగింది. తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి మరో 5 నుంచి 8వేల వరకు ఓటర్లు పెరగొచ్చని అధికారుల అంచనా. ఓటరుగా నమోదుకు ఆసక్తి ఓటరుగా తమ పేరు నమోదుచేసుకునేందకు జిల్లాలో అర్హులు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కొత్త ఓటరుగా నమోదు కోసం ఫామ్ 6 ద్వారా 4,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి 3,044, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1,346 దరఖాస్తులు అందాయి. ఓటరు జాబితాలో నుంచి పేరు తొలగింపు కోసం ఫామ్ 7 ద్వారా మొత్తం 2,025 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ నియోజకవర్గంలో 1,152, నర్సాపూర్లో 8,73 దరఖాస్తులు అందాయి. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా తదితర సవరణల కోసం ఫామ్ 8 ద్వారా అధికారులకు 1,811 దరఖాస్తులు అందాయి. ఇందులో మెదక్ నియోజకవర్గంలో 779, నర్సాపూర్లో 1032 దరఖాస్తులు ఉన్నాయి. ఓటు బదిలీ కోసం ఫామ్ 8ఏ ద్వారా 285 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ నుంచి 152, నర్సాపూర్ నుంచి 133 అందాయి. కొత్త ఓటర్లు నమోదు కోసం 4,390 దరఖాస్తులు రాగా ఇందులో 2వేల దరఖాస్తులు 18 ఏళ్లు నిండిన వారివిగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. మెదక్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్, బూత్లెవల్ ఆఫీసర్లతో మాట్లాడారు. యువతీయువకులు ముందుకు రావాలి జిల్లాలోని 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. జనవరి 1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ లేదా బూత్లెవల్ అధికారికి దరఖాస్తు ఇవ్వటం ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారు ఫామ్ 6 పూర్తి అందజేయాలన్నారు. ఫామ్ 6తో పాటు రెండు ఫొటోలు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్కార్డు జతచేయాలని సూచించారు. ఫామ్ 6 ఇచ్చిన వెంటనే వీఆర్వో దరఖాస్తుదారుల స్థానికత, సాధారణ నివాసాన్ని ధ్రవీకరించుకుని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు అందజేస్తారన్నారు. ఈనెల 25వ తేదీ వరకు సమయం ఉన్నట్లు తెలిపారు. బీఎల్ఓలతో ఓటరు జాబితా సవరణ గురించి మాట్లాడుతున్న కలెక్టర్ ధర్మారెడ్డి -
ఓటర్ల జాబితాపై ఓ కన్నేయండి!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని, బూత్ల వారీగా జాబితాలను పరిశీలించి అర్హులందరూ జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సూచించారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఆయా జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణన్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటులో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం వహించొద్దని, వారం రోజుల్లోగా అన్ని బూత్ కమిటీలను నియమించాలని చెప్పారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కేడర్పై దృష్టి సారించి చైతన్య పరచాలని సూచించారు. టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, నాయిని రాజేందర్రెడ్డి, తాహెర్బిన్ హమద్ తదితరులు పాల్గొన్నారు. -
‘వందేళ్ల ఓటర్లపై పునః పరిశీలన’
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల్లో వందేళ్లకు పైబడిన వయో వృద్ధుల ఓట్లపై పునఃపరిశీలన జరపాలని అన్ని జిలా కలెక్టర్లను ఆదేశిం చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ పేర్కొన్నారు. పరిశీలన ప్రక్రియ పూర్తయితే వెంటనే నకిలీ ఓట్లను తొలగిస్తా మని తెలిపారు. మరణ ధ్రువీకరణ రిజిస్టర్ ఆధారం గా ఓటరు జాబితాలను సరిచూస్తామన్నారు. ముం దస్తు ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో మాట్లాడారు. ఓటర్ల జాబితాల్లో కొంత వరకు బోగస్ ఓటర్లున్నట్లు గుర్తించా మని చెప్పారు. ఓటర్ల జాబితాల్లో 70 లక్షల బోగస్ ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు విషయంలో స్పందించేందుకు నిరాకరించారు. 2014 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 2.81 కోట్లు ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 2.61 కోట్లకు ఎలా తగ్గిందన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. -
ప్రజల్లోనే ఉండండి.. ఐక్యంగా ముందుకెళ్లండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కదనరంగంలో ఎక్కడా వెనకబడొద్దని, నిత్యం ప్రజల్లోనే ఉండి ఐక్యంగా ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సూచించారు. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచ రణ రూపొందిచుకోవాలని, ప్రజల మద్దతు పొందేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. ఈ సారి ఎన్నికలను చాలెంజ్గా తీసుకోవాలని చెప్పా రు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళుతున్న సందర్భంగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ను కలి శారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి, మధుయాష్కీ, గూడూరు నారాయణరెడ్డి, హర్కర వేణుగోపాల్లతో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జు లు కుంతియా, ఉమెన్చాందీ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్లతో ఆయన గంటకు పైగా సమావేశమయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ‘జాబితా’ అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్లండి రాష్ట్ర రాజకీయాలతోపాటు ఓటర్ల జాబితాలోని అవకతవకలను రాహుల్కు ఉత్తమ్ వివరించారు. లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, తప్పుల తడకగా ఉన్న జాబితాతోనే ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు అనేకసార్లు వివరించామని.. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేస్తున్నామని చెప్పారు. దీనికి స్పందించిన రాహుల్.. టీపీసీసీ న్యాయ పోరాటానికి ఏఐసీసీ మద్దతు ఉంటుందన్నా రు. ఓటర్ల జాబితా విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ దురుద్దేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఏపీ వ్యవహారాల ఇన్చార్జి ఉమెన్చాందీ కలగజేసుకుని ఓట్ల జాబితా నుంచి లక్షల మందిని తొలగించి ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికమని, దీనిపై నేతలు పోరాడాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలపై సర్కారు పెడుతున్న కేసుల గురించి కూడా రాహుల్కు ఉత్తమ్ వివరించారు. కక్ష సాధింపుతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఇప్పటికే పలువురు నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని, ఇంకొందరిపైనా అదే కుట్ర చేస్తున్నారన్నారు. రాహుల్ మాట్లాడుతూ అక్రమ కేసులను సమర్థంగా ఎదుర్కోవాలని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వ్యవహరించాల్సిన బాధ్యత టీపీసీసీ నేతలదేనని చెప్పారు. గెలిచే సీట్లు వదులుకోవద్దు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహాకూటమి, ఇతర పార్టీలతో పొత్తు అంశాలపైనా భేటీలో చర్చ జరిగింది. పొత్తుల వల్ల గతంలో కాంగ్రెస్ నష్టపోయిందని, అర్థవంతమైన పొత్తులుండేలా ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి చెప్పా రు. దీనికి ఏకీభవించిన రాహుల్ గెలిచే సీట్లను త్యాగం చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ సమావేశం లోనే తాను చెప్పానని, వీలున్నంత త్వరగా పొత్తు చర్చలను తుదిదశకు తీసుకొచ్చి ప్రజ ల్లోకి వెళ్లాలని సూచించారు. 2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పక్షాన ప్రజలకు చెప్పుకోకపోవడంతో పాటు చేసింది కూడా చెప్పుకోలేక అధికారం కోల్పోయామని నేతలు అభిప్రాయపడ్డారు. -
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి.
-
70 లక్షల ఓట్లపై అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో వెలుగుచూసిన అవకతవకలపై విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 70 లక్షల ఓట్లపై తమకు అనుమానాలున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్ సింఘ్వీ, సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తన వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ఓటర్ల జాబితా తయారీలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని సింఘ్వీ ఆరోపించారు. సెప్టెంబర్ 10న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్నారు. ఇందులో 30.13 లక్షల నకిలీ ఓటర్లున్నారని, 20 లక్షల వ్యతిరేక ఓట్లను కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి తొలగింపజేశారని, మరో 18 లక్షల ఓటర్లు ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో 2.81 కోట్లున్న తెలంగాణ ఓటర్ల సంఖ్య ఇప్పుడు 2.61 కోట్లకు చేరుకుందన్నారు. ఇందులో 20 లక్షల ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. తొలగించిన 20 లక్షల ఓటర్లు ఏపీకి తమ ఓటు హక్కును మార్చుకున్నట్టు సమాధానమిచ్చారని, అయితే ఏపీలో కూడా ఇదే సాకుగా చూపుతూ 17 లక్షల ఓట్లను తొలగించారని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల అధికారులను పిలిపించి వ్యతిరేక ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. తెలంగాణలో ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల పేర్లు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయని, ఇదే విషయమై ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే వారు కూడా ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. ఇక పోలవరం ముంపు మండలాల్లోని ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్నారని సింఘ్వీ వెల్లడించారు. ఓటర్ల జాబితాలో 2017 ఏళ్ల వారున్నారు! 21 వేల మంది ఓటర్ల వయసు చూస్తే అప్పుడే పుట్టిన శిశువు వయసు నుంచి 2017 ఏళ్ల (క్రీస్తు పూర్వం) వయసున్న వారు తెలంగాణలో ఓటర్లుగా ఉన్నారని మర్రి శశిధర్రెడ్డి, జంధ్యాల వివరించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి అని, అలా కాకుండా అవకతవకలతో కూడిన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలకు వెళ్తే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు. ఎన్నికలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, ఇలా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఎన్నికలకు వెళ్తే అంగీకరించబోమని చెప్పారు. -
‘తెలంగాణలో 38లక్షల నకిలీ ఓట్లు’
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసి అనంతరం తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వక మోసాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు కోరుకుంటున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ తెలంగాణలో దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లపై గందరగోళం నెలకొంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో 38 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు జరిగాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20 లక్షల ఓట్లు తీసేశారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అయినా ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల 18 లక్షల ఓట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 17లక్షల ఓట్లు తీసేశారు. ఖమ్మంలోని కొంతభాగం ఏపీలో కలిసింది. ఆ ప్రాంతంలోని ఓట్ల జాబితాపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మొత్తం ఓటర్ల జాబితాలో 20 శాతం తప్పులున్నాయి. వీటిని సరిచేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తార’ని ఆయన ప్రశ్నించారు. -
లక్ష ఓట్లు తొలగింపు
టీడీపీ ఓటు రాజకీయం చేస్తోందా? తమకు ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాల్లో బోగస్ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తోందా? ఇందుకోసం జిల్లా యంత్రాంగాన్నే అధికారికంగా వాడుకుంటోందా? పరిణామాలన్నీ పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాలో ఏకంగా లక్ష ఓట్లు తొలగించగా.. అత్యధికంగా అనంతపురం అర్బన్ అసెంబ్లీ పరిధిలో 64,552 ఓట్లను తీసివేయడం అనుమానాలకు తావిస్తోంది. అనంతపురం అర్బన్: ఏటా జనాభా పెరుగుతుంది. అదే క్రమంలో ఓటర్లూ పెరుగుతారు. అయితే జిల్లాలో మాత్రం ఏటికేడు ఓటర్లు తగ్గిపోతున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లలో ప్రస్తుతం 1,01,772 ఓట్లను తొలగించారు. అందులోనూ ఎక్కువగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులవే ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడు నియోజకవర్గాలే టార్గెట్ 2014 ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా 29,87,264 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటిన ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 29,24,040 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించారు. అత్యధికంగా అనంతపురం నియోకవర్గంలో 64,592 ఓట్లను తొలగించారు. అత్యల్పంగా గుంతకల్లు నియోజకవర్గంలో 325 ఓట్లను తొలగించారు. ఓట్ల తొలగింపు వ్యవహారం పూర్తిగా అధికారపార్టీ కనుసన్నల్లో వైఎస్సార్సీపీ లక్ష్యంగా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో దాదాపు 3 వేల ఓట్లు తొలగించారని, అదే విధంగా బోగస్ ఓట్లను చేర్చారని కలెక్టర్ జి.వీరపాండియన్కు మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం నియోజకవర్గం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధారాలతో సహా ఇటీవల ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఇతర నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించినట్లు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఓట్ల తొలగింపును పరిశీలిస్తే అధికారపార్టీకి అధికారయంత్రాగం అనుకూలంగా వ్యవహరించి ఈ తంతంగం నడిపిందనే విషయం స్పష్టమవుతోంది. ప్రధానంగా అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, హిందూపురంలో తొలగించిన ఓట్ల సంఖ్య అధికంగా ఉంది. పరిశీలిస్తాం.. సరిచేస్తాం సాధారణంగా ఓట్ల నమోదు, తొలగింపు 5 శాతం హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే అనంతపురం అర్బన్లో 64,592 తొలగించడంపై పరిశీలన చేయిస్తున్నాం. రెండు చోట్ల ఓటు నమోదై ఉంటే తొలగించి ఉండవచ్చు. స్థానికంగా నివాసముంటున్న వారి ఓటు తొలగించి ఉంటే సరిచేస్తాం.– కలెక్టర్ వీరపాండియన్ -
‘ముందస్తు’ కసరత్తు..!
ఆదిలాబాద్అర్బన్: ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితా తయారీ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల దిగుమతి వంటి వాటిపై ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి సారిస్తే.. శిక్షణలు, సమీక్షలు, సమావేశాలతో అధికారులు బీజీబీజీగా గడుపుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఓటరు నమోదు అంశంపై హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పాల్గొని వచ్చారు. సోమవారం జిల్లా అధికారులతో కలిసి ఈవీఎంలు భద్రపర్చే గోదాములను పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికలను వచ్చే నవంబర్లోనే నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 1న ప్రకటించిన ఓటర్ల నమోదు షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకే అవకాశం కల్పించింది. కాగా, జిల్లా ఎన్నికల సంఘం అధికారులు కావాల్సిన సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలను సిద్ధం చేస్తున్నారు. ఇది వరకే పంచాయతీల పోలింగ్ కేంద్రాల పెంపు పూర్తి కాగా, ఓటరు నమోదులో యంత్రాంగం బీజీగా ఉంది. నమోదు షెడ్యూల్లో మార్పు.. అసెంబ్లీ ఎన్నికలను నవంబర్లోనే జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారులు సైతం ముందస్తుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 1న ప్రకటించిన ఓటరు నమోదు షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు నమోదులో అవకాశం కల్పించారు. నవంబర్లోనే ఎన్నికలు జరుపనున్నందున వారు అర్హులు కారని ఈసీ భావించింది. 2018 జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు నిండిన యువతకే రా>నున్న ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 18 ఏళ్లు నిండి ఇంత వరకు ఓటరు జాబితాలో పేర్లు లేనట్లైతే వారు నమోదు చేసుకునేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించింది. కొత్త ఓటరు నమోదుతోపాటు ఇంతకు ముందున్న ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పులు, చిరునామాలు, పోలింగ్ కేంద్రాల మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫారాలను ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోల, బూత్ స్థాయి అధికారి(బీఎల్వో)ల వద్ద అందుబాటులో ఉంచారు. ఓటు నమోదుకు యువత ముందుకు రావాలని జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఇప్పుడు నమోదు చేసుకుంటే రానున్న ఎన్నికల్లో ఓటు వేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, 2019 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువత నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని సూచించింది. ఈ దరఖాస్తులను ప్రత్యేకంగా స్వీకరించి పరిశీలన అనంతరం 2019 జనవరిలో తుది జాబితా విడుదల చేయాలని పేర్కొంది. పది రోజుల్లో వెయ్యి దరఖాస్తులు.. గత ఓటరు నమోదు షెడ్యూల్ ప్రకారం అధికారులు ఓటర్ల నమోదు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 10 వరకు సుమారు వెయ్యి దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ 574 దరఖాస్తులు రాగా, బోథ్ నియోజకవర్గంలో 420 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో ఓటు తొలగింపులకు 160 రాగా, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు 817 దరఖాస్తులు వచ్చాయి. మార్పులు చేర్పులకు 13 దరఖాస్తులు రాగా, పోలింగ్ కేంద్రాల మార్పునకు 4 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అయినందున సెప్టెంబర్కు ముందు ఆదిలాబాద్లో 2,664 దరఖాస్తులు రాగా, బోథ్లో 228 దరఖాస్తులు వచ్చాయి. అవగాహన అవసరం.. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఇదే సరైన సమయం. ఆ దిశగా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని యువత కోరుతోంది. ఇప్పుడు బ్యానర్లు, కరపత్రాలు, అవగాహన కార్యక్రమాలు చేపడితే ఓటు నమోదుకు యువత ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయాల్లో విద్యాసంస్థల్లో విద్యార్థులు, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు ఓటు హక్కు నమోదుపై అవగాహ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లో, బీఎల్వో వద్ద ఓటు నమోదు ఫారాలను అందుబాటులో ఉంచినా యువతకు అవగాహన లేకపోవడంతో ఎక్కడికక్కడే మూలుగుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో ఓటు నమోదు కావడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తే కొంత వరకైనా లక్ష్యం సాధించవచ్చు. ఈ నెల 25 వరకే నమోదు.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన ఓటరు నమోదు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకే జాబితాలో కొత్త ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంతకు ముందున్న కార్డుల్లో తప్పులు, సవరణలు, పేర్లు, చిరునామాల్లో మార్పులు చేసుకోవచ్చు. తొలగింపు చేసుకునేందుకు సైతం దరఖాస్తు ఇవ్వవచ్చు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 518 పోలింగ్ కేంద్రాలతోపాటు అధికారుల వద్ద ఫారాలు అందుబాటులో ఉన్నాయి. బూత్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఆర్డీవోలు ఓటరు నమోదు కార్యక్రమాల్లో అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇలా కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం 18 ఏళ్లు నిండిన ప్రతి యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
నేడు ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల
హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2018, జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి...నోటీసులు జారీ చేస్తారు. అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ తెలిపారు. జాబితా సవరణ, ఇతర ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులతో ఆదివారం సాయంత్రం ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. 2018 జనవరి 1 ప్రాతిపదికగా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,861 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో బుత్ స్థాయి అధికారులు ఉంటారన్నారు. బీఎల్ఓలుగా నియమితులైన అంగన్వాడీ, ఇతర శాఖల సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. ఎన్నికల విధులు సందర్భంగా నేటి నుంచి ప్రతి ఒక్కరికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇళ్లను సందర్శించి ఓటరు జాబితా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. ఈనెల 25వ తేది వరకు అభ్యంతరాలు స్వీకరించి నోటీసులు జారీ చేసి, అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరించాలన్నారు. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. నేడు రాజకీయ పార్టీలతో సమావేశం ఓటర్ల జాబితా సవరణపై సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నియోజకవర్గ స్థాయిల్లోనూ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
ఓటరు నమోదుకు... ఆఖరి అవకాశం!
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరి ఓటు వేయాలంటే ఓటుహక్కు పొందాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రధానమైన ఈ ఓటుహక్కు కావాలంటే ఓటరుగా నమోదుకావడం ఒక్కటే మార్గం. ఇందుకు వచ్చే నెల 31వ తేదీ వరకూ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే రానున్న అసెంబ్లీ, లోక్సభ, స్థానిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం చేజార్చుకున్నట్లే! ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జరిగిన ఓటర్ల నమోదు సమ్మరీల్లో చాలామంది ఓట్లు గల్లంతయ్యాయనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. దీనివెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్హులైన వారంతా తమ ఓటుహక్కు పరిరక్షించుకోవడం కోసం ఈ సమ్మరీని సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఎన్నికల కమిషన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత కీలకంగా మారింది. అకారణంగా ఓటు గల్లంతైనవారు మరోసారి తమ పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 2019 జనవరి 31వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండేవారంతా ఓటుహక్కు పొందవచ్చు. ఈ ఓటర్ల నమోదు సమ్మరీ ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. 2019 జనవరి 4వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటనతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ప్రస్తుత శాసనసభకు జూన్ వరకూ గడువు ఉన్నప్పటికీ ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఈ ఓటర్ల జాబితానే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. అభ్యంతరాలపై విచారణ తప్పనిసరి... ఓటర్ల తొలగింపులపై ఇప్పటివరకూ ఎలాంటి అభ్యంతరాలొచ్చినా క్షేత్ర స్థాయిలో అధికారుల విచారణ మొక్కుబడిగా జరుగుతోంది. దీనివల్ల అర్హులైనవారు తమ ఓటుహక్కును కోల్పోతున్నారు. ప్రతిపక్షాల సానుభూతిపరులు, నాయకుల ఓట్లను గల్లంతు చేసేందుకు అధికార పార్టీ నాయకులు కూడా ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖ్యంగా శ్రీకాకుళం, రాజాం, పలాస, ఆమదాలవలస పట్టణాల్లోలో వేలాది ఓట్లు తొలగింపు జరిగిపోయింది. ఇంటింటా సర్వేలు పెట్టి సుమారుగా 36 వేల ఓట్లను తొలగించారు. వాటిని ఇప్పటికీ అధికారులు భర్తీ చేయలేదు. అడ్డగోలుగా ఓట్ల తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా పలు సమావేశాల్లో అధికారులను నిలదీసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈసారి అటువంటి పొరపాట్లు, అధికార పార్టీ ఆగడాలు లేకుండా సమ్మరీ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులు, చేర్పులు వంటి వాటిపైనా, అభ్యంతరాల విచారణపైనా నిఘా ఉంచనుంది. అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అందరి భాగస్వామ్యం తప్పనిసరి... అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదుకావడానికి స్వయంశక్తి సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ఇతర పౌర సమాజంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఈసారి ఎన్నికల కమిషన్ అధికార్లను ఆదేశించింది. ఫారం–6, 6ఏ, 7, 8, 8ఏలతో వచ్చే క్లైంలను, అభ్యంతరాలను వెంటనే అప్డేట్ చేయాల్సి ఉంది. ఆ జాబితాలో కనీసం 2 శాతాన్ని జాయింట్ కలెక్టర్ విచారణ చేయాలని, ఒక శాతం జిల్లా కలెక్టరు, అలాగే అర శాతం ఓట్లను రోల్ అబ్జర్వరు విచారణ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ రాష్ట్ర అబ్జర్వర్గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ దశలో, అలాగే అభ్యంతరాల పరిష్కార దశలో, తుది జాబితాను ప్రకటన సమయంలో ఆయన జిల్లాలో పర్యటించి పరిశీలించాల్సి ఉంది. రోల్ అబ్జర్వర్ జిల్లా పర్యటన సమయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు ఉంటే పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 2,908 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో పోలింగ్ కేంద్రాల సవరణ అనంతరం 2,908 కేంద్రాలు ఉన్నాయి. గతంలో 2,686 ఉండేవి. ఈ ప్రకారం 231 కొత్త పోలింగ్ కేంద్రాలు వచ్చాయి. అయితే ఇప్పటికే ఉన్న వంశధార నిర్వాసిత గ్రామాల్లోని తొమ్మిది కేంద్రాలను తొలగించారు. అలాగే 98 పోలింగ్ కేంద్రాల ప్రాంతం మార్చారు. 118 కేంద్రాల పేర్లు మారాయి. జిల్లాలో ప్రక్రియపై వీసీ... జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల సమ్మరీపై గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జాయింట్ కలెక్టరు కేవీఎన్ చక్రధరబాబు, డిఆర్వో కె.నరేంద్రకుమార్ తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రక్రియ ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సహాయం తీసుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బూత్ స్థాయి అధికారులను నియమించాలని చెప్పారు. ఓటర్ల సవరణ జాబితాపై మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలకు ఎప్పటికప్పుడు తగు సమాచారం అందించాలన్నారు. -
ఓటర్ల జాబితా ట్యాంపరింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలున్నాయ ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నా రు. రాష్ట్రంలో 8 లక్షల కొత్త ఓటర్లు చేరినా కూడా గత నాలుగేళ్లలో 20 లక్షల ఓటర్లు తగ్గారని పేర్కొన్నారు. కొత్తగా చేర్పులు జరిగినా సంఖ్య ఎలా తగ్గిందని ప్రశ్నించారు. జాబితాలో ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయని చెప్పా రు. మంగళవారం గాంధీభవన్లో మర్రి శశిధర్రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ భేటీ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఉత్తమ్ హాజరయ్యారు. ముందస్తు ఎన్నికలు, ఓటర్ జాబితా, ఎన్నికల సంఘం తదితర అంశాలపై చర్చించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు ఏపీలో కలిపినందున అక్కడ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 10 శాతం వీవీప్యాట్లను లెక్కపెట్టాలని సుప్రీం కోర్టులో రాజస్తాన్ వేసిన పిటిషన్ ఉందని, అందులో టీపీసీసీ కూడా కక్షిదారుగా చేరుతుందని పేర్కొన్నారు. ఈవీఎమ్ మానిటర్ను మాన్యువల్ చేయాలని కోరారు. ఓటర్ల జాబితాపై 7న సమావేశాలు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. ఓటర్ల జాబితాతో పాటు ఇతర అంశాలపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓటర్ల జాబి తాపై చర్చించడానికి సెప్టెంబర్ 7న అన్ని నియోజకవర్గాల్లో సమావేశా లు నిర్వహిస్తామన్నారు. 9న మండల, డివిజన్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బూత్ కార్యకర్త వరకు ఓటరు జాబితా చేరేలా చర్యలకు ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం చేసినట్లు చెప్పారు. 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరారు. ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలోనే కేసీఆర్ ఏం చెప్పలేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. జోనల్ కోసం ప్రధాని మోదీని ఇస్తావా.. చస్తావా అని నిలదీసిన సీఎం.. విభజన హామీలు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై అదే తరహాలో ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ను కోరతామని తెలిపారు. సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పెరిగిన ఓటర్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. తాజా ఓటర్ల జాబితానే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు నగర జనాభా, ఓటర్ల సంఖ్యలో పురోగతి కనిపిస్తోంది. దాదాపు 7నెలల వ్యవధిలోనే మహేశ్వరం నియోజకవర్గ జనాభా 25శాతం పెరిగింది. అలాగే ఎల్బీనగర్లో 15శాతం, నాంపల్లిలో 6.5శాతం మేర ఓటర్లు పెరిగినట్లు తాజా ముసాయిదా జాబితాలో వెల్లడైంది. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకున్న నియోజకవర్గాల్లో నాంపల్లి, కార్వాన్లు అగ్రస్థానంలో ఉన్నాయి. జనవరి 20న ఓటర్ల తుది జాబితా అనంతరం... తాజా ముసాయిదా విడుదల వరకు నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 17,860 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితా మేరకు నియోజకవర్గంలో 2,73,079 మంది ఓటర్లు ఉండగా... 6.5శాతం పెరిగారు. కార్వాన్ నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 2,86,436 మంది ఓటర్లుండగా.. కొత్తగా 10,879(4శాతం) మంది నమోదు చేసుకున్నారు. ఇక శివార్లలోని మహేశ్వరం నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 3,23,660 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం 4,02,442 మంది ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో తుది జాబితాలో 4,01,137 మంది ఓటర్లుండగా... తాజా ముసాయిదాలో 4,65,154 మంది ఉన్నారు. నగర శివార్లలో వేగంగా విస్తరిస్తుండడంతో అక్కడ ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే చాంద్రాయణగుట్టలో పురుషులతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషులు 1,49,348 మంది ఉండగా, మహిళలు 1,42,415 మంది ఉన్నారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పురుషులు 1,16,886 మంది కాగా... మహిళా ఓటర్లు 1,12,793 మంది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్, మల్కాజిగిరిలలో మాత్ర మే థర్డ్జెండర్స్ లేరు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 840 మంది ఓటర్లున్నారు. తగ్గిన తొలగింపులు... గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, కోర్టులకు వెళ్తుండడం తదితర కారణాలతో ఓటర్లను తొలగించేందుకు అధికారులు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చాలామంది అధికారులు ఇంటింటి సర్వే చేయకుండానే ముసాయిదా రూపొందించారనే ఆరోపణలున్నాయి. ఇళ్లకు వెళ్లకుండానే తొలగిస్తే తీవ్ర సమస్యలు ఎదురవనుండడంతో చిరునామాలు మారినవారు, మరణించిన వారి పేర్లను అలాగే ఉంచారనే అభిప్రాయాలున్నాయి. -
20.33 లక్షల ఓటర్లు తగ్గారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (టీఎస్సీఈవో) ఈ మేరకు రాష్ట్రంలోని ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడించారు. టీఎస్సీఈవో రజత్కుమార్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.61 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.28 కోట్ల మంది మహిళలు, 2,439 మంది థర్డ్ జెండర్ కేటగిరి వారు ఉన్నారు. ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 1 నుంచి అభ్యంతరాలను, ప్రతిపాదనలను స్వీకరించనున్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలను, ప్రతిపాదనలను పరిశీలించి ఈ ఏడాది నవంబర్ 30లోపు పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు గుర్తింపు కార్డు పొందాలని కోరారు. -
పోలీసుల తిరకేసు
హిందూపురంలో అధికార టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో ప్రజలు వైఎస్సార్సీపీకి ఆకర్షితులవుతుండటం తెలిసిందే. ఇదే సమయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ప్రజల్లో చెరగని అభిమానం కూడగట్టుకోవడం మింగుడుపడని టీడీపీ.. రహస్య సర్వేలతో ప్రజల నాడి తెలుసుకునేందుకు సిద్ధమైంది. పనిలో పనిగా వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు లక్ష్యంగా వివరాల సేకరణకు పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని మోహరించింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు చర్యలు తీసుకోవాలని కోరితే.. పోలీసుల సాయంతో అధికార పార్టీ ఎదురుదాడికి సిద్ధమైంది. ఏకంగా నవీన్ ఇంట్లో సోదాలు చేపట్టి.. అరెస్టుకు యత్నించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. హిందూపురం అర్బన్: టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా? ప్రతిపక్ష నేతలను బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారా? ఇందుకోసం పోలీసులను పావుగా వాడుకుంటున్నారా? పురంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. స్పార్క్ సోషియో పొలిటికల్ అనాలసిస్ అండ్ రిఫ్రెష్ సెంటర్ పేరిట నెల్లూరు, కర్నూలుకు చెందిన యువకులు నాలుగు రోజులుగా రహస్య సర్వే నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి కీలకమైన నేతల వివరాలను సేకరించారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి కొంతమంది యువకులు పట్టుబడగా స్థానికులు వారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్నిశ్చల్ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వారిని వన్టౌన్ సీఐ చిన్నగోవిందుకు అప్పగించారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసు నమోదు యువకులు తమ వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా సేకరించారని వారిపై సైబర్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలని శుక్రవారం రాత్రే వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు యువకులపై కేసు నమోదు చేయలేదు. శనివారం ఉదయం యువకులను కిడ్నాప్ చేశారని, వారిని దూషించడంతోపాటు దాడి చేశారని పలు సెక్షన్ల కింద నవీన్నిశ్చల్తోపాటు మరో11 మందిపై కేసు నమోదు చేయడం గమనార్హం. ప్రతిపక్ష నేతలను లోబర్చుకునేందుకు కుయుక్తులు : నవీన్నిశ్చల్ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖరారైందని, అందుకే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లను నయానోభయానో లోబర్చుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారని వైఎస్సార్సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్నిశ్చల్ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుని అధికార పార్టీ నాయకులు స్పార్క్ సోషియో పొలిటికల్ అనాలసిన్ అండ్ రిఫ్రెష్ సెంటర్ పేరిట రహస్య సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కొంతమంది యువకులు తమ పార్టీ నేతల వ్యక్తిగత వివరాలు, వారు దేనికిలొంగుతారో సేకరిస్తున్నారన్నారు. పట్టణంలోని తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లకు ఫోన్ ద్వారా నేరుగా బేరసారాలు, భయపెట్టడాలు జరిగాయని ఆరోపించారు. సర్వే చేస్తూ పట్టుబడిన యువకులు టీడీపీ నాయకులు తమతో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారన్నారు. దాదాపు 60 మంది యువకులు 4 రోజులుగా పట్టణంలో సర్వే చేస్తున్నా పోలీసులు తెలియదంటే ఎలా అని ప్రశ్నించారు. యువలకుపై తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏకంగా తమపైనే కిడ్నాప్, దాడి తదితర కేసులు పెట్టడం దారుణమన్నారు. కేవలం తనను బలహీనపర్చడానికే ఎమ్మెల్యే బాలకృష్ణ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యువకులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో తమ పార్టీ తరఫున పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్గౌడ్, ఏ,బి,బ్లాక్ కన్వీనర్లు ఈర్షద్, మల్లికార్జున, మైనార్టీ విభాగం జిల్లా నాయకులు ఫజులూరెహెమాన్, ప్లోర్ లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీఫ్వుల్లా, జబీవుల్లా, రజనీ, మహిళా కన్వీనర్ నాగమణి, ఎస్సీ, బిసీ సెల్ నేతలు శ్రీన, రాము, చంద్రశేఖర్, నాయకులు బాలాజీ, ఆజుబా, మన్సూర్, దౌలా, శివశంకర్రెడ్డి, నరసింహరెడ్డి పాల్గొన్నారు. సోదాల పేరుతో భయోత్పాతం.. డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, ప్రత్యేక పోలీసులు శనివారం మ«ధ్యాహ్నం నవీన్నిశ్చల్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అటుగా వెళ్తున్న వారిని ఆపి వివరాలు సేకరించారు. నవీన్నిశ్చల్ ఇంటిలో లేకపోవడంతో కుటుంబసభ్యులతో అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలలో దృశ్యాలు కూడా పరిశీలించారు. నవీన్నిశ్చల్, ఇతర నాయకులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. భారీగా పోలీసులు తరలిరావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనను వైఎస్సార్సీపీ నాయకులు శనివారం ఉదయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాన్న డీఎస్పీ మధ్యాహ్నానికల్లా వైఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేసేందుకు రావడం గమనార్హం. -
ఓటరు జాబితాలో సన్నీలియోన్కు 51 ఏళ్లు!
లక్నో: 2019 లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో సవరించిన ఓటర్ల జాబితాలో బాలీవుడ్ నటి సన్నిలియోన్ ప్రత్యక్షమైంది. పైగా ఆమె పేరు వయసు కూడా మారిపోయింది. ఈ జాబితాలో 51 ఏళ్ల దుర్గావతి సింగ్గా ఆమె ఫొటో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బలియా ఓటర్ల సవరణ కార్యక్రమంలో అనేక తప్పులు చోటుచేసుకున్నాయి. కొందరికి వారి ఫొటోల బదులు జంతువుల ఫొటోలు ప్రింటయ్యాయి. 56 ఏళ్ల నారదా రాయ్ అనే మహిళా స్థానంలో ఆఫ్రికన్ ఎనుగు, 51 ఏళ్ల దుర్గావతి సింగ్కు బదులు సన్నీ ఫొటోలు పొరపాటుగా వచ్చాయి. ఈ జాబితా ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇన్ సెట్లో సన్నీలియోన్ ఫొటో చదవండి: కేరళకు సన్నీలియోన్ సాయం! -
ఇష్టమొచ్చినట్లు ఓట్ల తొలగింపు కుదరదు
సాక్షి, అమరావతి : ఇష్టానుసారం ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం కుదరదని, అది అంత ఆషామాషీ వ్యవహారం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా రివిజన్, సవరణలు, మార్పులు చేర్పుల సందర్భంగా మృతిచెందిన లేదా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటే అందుకు సవివరమైన వాస్తవ కారణాలుండాలని.. క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించకుండా ఏ ఒక్క ఓటరు పేరూ తొలగించరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఎటువంటి తనిఖీలు లేకుండా ఇష్టానుసారం ఓటర్ల పేర్లను తొలగించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రివిజన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా రివిజన్తో పాటు మృతిచెందిన వారి పేర్లు, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపుతో పాటు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించింది. అవి.. ఓటర్ల జాబితాలో రెండేసి చోట్ల పేర్లు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించాలి. ఇందుకు సంబంధించి చెక్లిస్ట్ను రూపొందించాలి. అనంతరమే ఆ ఓటరు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటరుగా కొనసాగించి.. మరోచోట ఉన్న అతని ఓటును తొలగించాలి. క్షేత్రస్థాయి తనిఖీలో ఓటరు ఒకచోట నివసించడం లేదని తేలితే అతని నుంచి ఫాం–7ను తీసుకున్న తరువాతే జాబితా నుంచి అతని పేరును తొలగించాలి. శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటే.. వారు ఎక్కడికి వెళ్లారో సంబంధిత బూత్ స్థాయి అధికారి తెలుసుకోవాలి. వలస వెళ్లిన ఓటరుకు నోటీసు జారీచేయాలి. వలస వెళ్లినట్లు ఫాం–7ను అతని నుంచి తీసుకున్న తరువాతే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలి. ఓటరు ఎక్కడికి వలస వెళ్లారో బూత్స్థాయి అధికారి తెలుసుకోలేని పక్షంలో ఓటర్ల జాబితాలో ఉన్న ఇంటి చిరునామాకు నోటీసు అంటించాలని, ఏడు రోజుల అనంతరం.. ఆ ఓటరు కుటుంబ సభ్యులుంటే వారి వాంగ్మూలం తీసుకోవాలని, కుటుంబ సభ్యులెవ్వరూ లేకపోతే ఇద్దరు పక్కంటి వారి నుంచి సాక్ష్యం తీసుకున్న తరువాతే జాబితా నుంచి తొలగించాలి. సామూహికంగా వలస వెళ్లిన ఓటర్లుంటే, అలాంటి వారు ఎక్కడికి వలస వెళ్లారో తెలియని పక్షంలో స్థానిక దినపత్రికల్లో వారి పేర్లను ప్రచురించాలి. ఏడు రోజుల తరువాత కూడా ఎవ్వరూ స్పందించకపోతే వారి పేర్లను అప్పుడు తొలగించాలి. మృతి చెందిన వారి పేర్లను వారి డెత్ సర్టిఫికెట్ పరిశీలించిన అనంతరమే జాబితా నుంచి తొలగించాలి. జనన, మరణ రిజిస్టర్ లేదా స్థానిక సంస్థలకు చెందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నుంచి మృతి చెందినట్లు నిర్ధారించుకోవాలి. అలాగే, ఫాం–7 నుంచి ఆయా కుటుంబ సభ్యులు లేదా ఇరుగు పొరుగు వారి నుంచి తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించిన తరువాతే మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలి. అలాగే, అతను మృతి చెందినట్లు స్థానికంగా ఉన్న ఇద్దరు నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఓటరు గుర్తింపు కార్డు కలిగిన వారి పేర్లను తొలగించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేరు రెండుచోట్ల ఉంటే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్న తరువాతే తొలగించాలి. పొరపాటున గుర్తింపు కార్డుగల ఓటరు పేరు తొలగిస్తే తిరిగి అతని పేరు జాబితాలో చేర్చాలి. ఇందుకు సంబంధించిన రికార్డును నిర్విహించాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు గల ఓటరు పేరు తొలగించడానికి ముందు పోస్టు ద్వారాగానీ లేదా ఎస్ఎంఎస్, ఇ–మెయిల్ ద్వారా తెలియజేయాలి. ఏదేని కారణాలతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని నిర్ణయిస్తే సంబంధిత అధికారి కార్యాలయంలో ఏడు రోజులపాటు నోటీసు బోర్డులో వారి పేర్లను ఉంచాలి. అలాగే, వారి పేర్లను సీఈఓ వెబ్సైట్లో ఉంచాలి. వీటిపై అభ్యంతరాలను ఆహ్వానించాలి. ఆ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా చూపించాలి. అభ్యంతరం వ్యక్తం కాని పేర్లను తొలగించిన తరువాత మళ్లీ తుది జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేయాలి. ఓటర్ల తొలగింపు రిజిస్టర్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వహించాలి. మృతి చెందిన వారివి తప్ప.. ఏ రకమైన తొలగింపులనైనా నోటీసులు ఇచ్చి క్షేత్రస్థాయి తనిఖీల తరువాతే చేయాలి. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహించాలి. ఎటువంటి తొలగింపులనైనా తహసీల్దారు స్థాయి అధికారే చేయాలి. అంతకు తక్కువ స్థాయి అధికారి నిర్ణయం తీసుకోరాదు. తొలగింపులపై జిల్లా డిప్యుటీ ఎలక్రోల్ ఆఫీసర్ రెండు శాతం, జిల్లా ఎన్నికల అధికారి ఒక శాతం తనిఖీలను నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వికలాంగులను ఓటరుగా నమోదు చేస్తే వారి వికలాంగ స్థాయి వివరాలను పూర్తిగా సేకరించాలి. పోలింగ్ రోజున కమిషన్ వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తుందని కేంద్ర ఎన్నికల కమిషన్ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఓటర్ల జాబితా రివిజన్ టైం టేబుల్ – ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన 01–09–2018 – ఓటరుగా నమోదు దరఖాస్తు, అభ్యంతరాలు 01–09–2018 నుంచి 31–10–2018 – ఓటర్ల నమోదు, అభ్యంతరాల పరిశీలన 30–11–2018లోపు పూర్తి – డేటా అప్డేట్ అండ్ ప్రింటింగ్ సప్లిమెంటరీ వచ్చే ఏడాది జనవరి 3లోగా పూర్తి – ఓటర్ల తుది జాబితా ప్రకటన 04–01–2019 ఏపీలో తొలగించిన ఓట్ల వివరాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి నిబంధనలూ పాటించడంలేదన్న విమర్శలున్నాయి. జిల్లాల్లో ఓటర్లను ఎడాపెడా తొలగిస్తున్న తీరు ఇందుకు అద్దంపడుతోంది. వివిధ జిల్లాల్లో తొలగించిన ఓటర్ల సంఖ్య ఇలా ఉంది.. వ.నెం. జిల్లా పేరు తొలగించిన ఓట్ల మొత్తం 1. శ్రీకాకుళం 45,000 2. విజయనగరం 14,359 3. విశాఖపట్నం 97,268 4. తూర్పు గోదావరి 19,895 5. పశ్చిమ గోదావరి 9.212 6. నెల్లూరు 2,00,525 7. చిత్తూరు 2,55,093 8. కర్నూలు 65,000 9. అనంతపురం 37,059 10. వైఎస్సార్ జిల్లా సుమారు లక్ష -
ఓట్లు పోయాయ్!
జిల్లాలోని కడప అసెంబ్లీ సెగ్మెంట్ మొదలుకొని అనేక నియోజకవర్గాల్లో ఓట్లు మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది.కడపలో కొంతమంది ప్రజాప్రతినిధుల కుటుంబీకుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. త్వరలో ఎన్నికల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు చైతన్యం కల్పిస్తే ఓటుహక్కు నమోదుకు ప్రజలు కూడా ఉత్సాహం చూపుతారు. కానీ ఉన్న ఓట్లు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి కడప : జిల్లా కేంద్రమైన కడపలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. కడప నగర పరిధిలోని దాదాపు 50 డివిజన్ల పరిధిలో భారీ ఎత్తున ఓట్లు కనిపిం చడం లేదు. చాలాకాలంగా దీనిపై ఎన్నో కసరత్తులు చేస్తున్నా పరిస్థితి మాత్రం అంతుచిక్కడం లేదు. దాదాపు 70–80 వేల ఓట్లు గల్లంతయ్యాయి. చివరకు కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్బాషా ఓటు సైతం ఆయనకు తెలియకుండానే డోర్ నంబరు మారిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఒక్కసారి ప్రత్యేక దృష్టి సారిస్తే తొలగిన ఓట్లను చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొం దించవచ్చు. 100 కాదు..1000 కాదు....సుమారు 70– 80వేల మేర ఓట్లు కనిపించకుండా చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి దాదాపు 2,45,000 పైగా ఉన్న ఓట్లు ఒక్కసారిగా 1,73,000లకు పడిపోయాయంటేనే అంతుచిక్కడం లేదు. అంతా జంబ్లింగ్ కడప నియోజకవర్గంలో ఓట్లు గల్లంతైన నేపథ్యంలో ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ ఓట్లు ఎక్కడికో పోయినట్లు కనిపిస్తున్నాయి.. ఉదాహరణకు ప్రకాశ్నగర్లో ఉన్న ఒక వ్యక్తి ఓటు.. చిన్నచౌకు ఏరియాలో కనిపిస్తుండటం లాంటివి చెప్పుకోవచ్చు..ఇలా జంబ్లింగ్ అయినవి భారీగా ఉంటాయని తెలుస్తోంది. నివాసం ఉండేచోట కాకుండా మరో చోటికి ఓట్లన్ని జంబ్లింగ్ పద్ధతిలో మారాయి. ఎలా మారాయన్నది కూడా అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల చేర్పునకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. మరికొన్నిచోట్ల ఇదే పరిస్థితి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఓట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే వేల సంఖ్యలోనే మాయమయ్యాయి. బద్వేలు నియోజకవర్గంలోనూ చాలా కనుమరుగయ్యాయి. 2 లక్షల పైచిలుకు ఓట్లున్న సెగ్మెంట్లో ప్రస్తుతం 1.80 లక్షలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 20 వేల మేర కనిపించకుండా పోయాయి. అయితే వివిధ రకాల పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థానికత పేరుతో ఓటుకార్డు తీసుకున్నప్పటికీ ఇప్పుడు అందరూ వెళ్లిపోవడంతో ఓట్లు పోయినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గం 1.80 లక్షలకు పైచిలుకు ఓట్లు ఉంటే ఇటీవల 9–10 వేలు మాయమయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలో కూడా రెండు లక్షలకు పైగా ఓట్లు ఉండగా, దాదాపు 4–5 వేలు కనిపించడం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది అధికారులకే ఎరుక! జమ్మలమడుగు పరిధిలో కూడా దాదాపు మూడు వేల ఓట్ల వరకు, రాజంపేట పరిధిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైల్వేకోడూరులోనూ దాదాపు 4 వేల ఓట్లు మాయమైనట్లు తెలియవచ్చింది. సర్వే చేసినా..... కడప నగరంలో ఓట్లకు సంబంధించి సుమారు 500 మంది సిబ్బందితో అధికారులు గతంలో సర్వే చేపట్టారు. 260మంది బీఎల్ఓలు, మరో 250 మంది ట్యాబ్ ఆపరేటర్లర్లు.. 26 మంది సూపర్వైజర్లు.. ఇతర సిబ్బందితో కలిపి దాదాపు 500 మంది సర్వేలో పాల్గొన్నారు. అప్పట్లో కొంతమేర చేసినప్పటికీ చాలాచోట్ల డోర్ లాక్డ్, ఇతర సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలిసింది. సర్వేతో 10–20 వేలు మేర ఓట్లు రికవరీ అయినప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. అధికారులు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టి మళ్లీ ఎన్రోల్మెంట్ చేస్తే తప్ప సాధ్యమయ్యే పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ త్వరలో అవకాశం ఉంటుంది కడప నగరంతోపాటు అన్నిచోట్ల ఓట్ల మార్పులు, చేర్పులకు మళ్లీ అవకాశం ఉంటుందని, అప్పుడు ఓట్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని కడప ఆర్డీఓ దేవేందర్రెడ్డి తెలియజేశారు. కడప నగరంలో ఓట్లు పోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. చాలా వరకు అడ్రస్సుల మార్పు, ఆధార్ సీడింగ్, మనుషులు చనిపోయిన నేపథ్యంలోనే ఓట్లు పోయాయి తప్ప వేరే కారణాలు కావన్నారు. ప్రస్తుతం 1,76,000కు పైగా కడపలో ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఓటు కావాల్సిన వారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వివరాలు చెప్పినా అప్లోడ్ చేస్తారని, అంతేకాకుండా గతంలో కూడా అడ్రస్సులు, ఇతర అనేక కారణాలపై సర్వే చేయించనున్నట్లు తెలిపారు. ఎవరి ఓట్లు ప్రభుత్వ అధికారులు తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబరు 1వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరగనుందని, మరొకసారి నిరంతరం కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తామని ఆర్డీఓ వివరించారు. పాత జాబితాలో లేని వారు నమోదు చేసుకోవచ్చన్నారు. లోపం ఎక్కడ.. జిల్లాలో ఓట్ల మార్పులు, చేర్పుల్లో పెద్ద ఎత్తున తొలగింపు చూస్తే ఎక్కడ లోపమో అర్థం కావడం లేదు. ప్రధానంగా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా నజ్రరి నక్ష కార్యక్రమాన్ని అమలు చేసింది. కడప నగరంలో మాత్రమే అమలు చేసినట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కొత్త డోర్ నంబర్లను వేయడంతో బీఎల్ఓల ట్యాబుల్లో లిస్టుకు సరిపడనట్లు తెలియవచ్చింది. దాదాపు 261 పోలింగ్ బూత్ల పరిధిలో ఓట్లకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులు ఎన్ని సమాలోచనలు చేసినా మొత్తానికైతే ఓటర్ల చేర్పులు కనిపించడం లేదు. అడ్రస్సుల గల్లంతు...ఒక భవనంలో మూడంతస్తులుంటే...కేవలం ఒక భవనానికి మాత్రమే డోర్ నంబరు ఇవ్వడంతో పైన ఉన్న రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న ఓటర్లు జాబితా నుంచి మాయమయ్యారు. ఇలా అనేక రకాల సమస్యల వల్ల ఓట్లు తొలగిపోయాయి. కిందిస్థాయిలో డోర్ టు డోర్ వర్క్ చేస్తే మళ్లీ యథావిధిగా ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న వారు వేరే ప్రాంతాలకు బదిలీపై వెâళ్లడం, అడ్రస్సుల మార్పు, ఆధార్ అనుసంధానంతో కొంతమేర తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
ఆ జాబితాలో 60 లక్షల నకిలీ ఓటర్లు..
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 60 లక్షల నకిలీ ఓటర్లు నమోదయ్యారని పేర్కొంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై తమ వద్ద తగిన ఆధారాలున్నాయని ఎన్నికల కమిషన్(ఈసీ)కు ఇచ్చిన మెమొరాండంలో కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడిందని...ఇది అధికారుల నిర్లక్ష్యం కాదని, అధికార దుర్వినియోగమని ఆ పార్టీ ఆరోపించింది. ఓటర్ల జాబితాలో 60 లక్షల నకిలీ ఓటర్లున్నారని, ఉద్దేశపూర్వకంగానే వీరిని ఓటర్ల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో పాలక బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్ర జనాభా 24 శాతం పెరిగితే ఓటర్ల సంఖ్య 40 శాతం పెరగడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఒక ఓటరు పేరు వేర్వేరు ప్రాంతాల్లోని 26 జాబితాల్లో ఉందని, ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను తాము పరిశీలించామని జాబితా మొత్తం తప్పులతడకగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్నాయి.