Voters list
-
ప్రైవేట్ వ్యక్తి చేతిలో ‘పోలింగ్’ ప్రక్రియ
సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ పర్యవేక్షణ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్గా ప్రైవేట్ వ్యక్తి బోడపాటి అనిల్ను నియమించడం చర్చ నీయాంశమైంది. తొలుత ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో నెలకు రూ.1.40 లక్షల వేతనంతో ఈయన పని చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపిక కమిటీ సిఫారసుతో ఈయన్ను నియమించామని తెలిపారు. ఎంపిక కమిటీలో ఎవరున్నారనేది ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్–నెట్ను ఐటీ ప్రాజెక్టు మేనేజర్ అమలు చేస్తారని తెలిపారు. ఈవీఎంలు, సాప్ట్వేర్ ట్రాకింగ్తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్వం ఇకపై బోడపాటి అనిల్ పర్యవేక్షణలో ఉంటాయి. తద్వారా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పాతర వేయడమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.ఐటీ ప్రాజెక్టు మేనేజర్ విధులు ఇలా.. » ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏటా నిరంతర నవీకరణ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ–సేవా, మీ–సేవా కేంద్రాల ద్వారా ఎలక్టోరల్ రోల్స్లో పేరు చేర్చడం, పీవీసీ కార్డుల జారీ కోసం పౌర సేవల దరఖాస్తు అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం. » రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పర్యవేక్షించడం. » ఎస్ఎంఎస్ గేట్వే ఏకీకరణ, ఎస్ఎంఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ అమలు పర్యవేక్షణ. ఐటీ అప్లికేషన్స్ (ఇఆర్ఓ–నెట్, సైబర్ సెక్యూరిటీ, ఈ–రోల్ పర్యవేక్షణ), ఫామ్ 1–8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ల పర్యవేక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, కౌంటింగ్ అండ్ ఇండెక్స్ కార్డు అప్లికేషన్ల పర్యవేక్షణ. » కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో ఆన్లైన్ కార్యకలాపాలు, ఐటీ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణ. వీటితో పాటు ఓటర్ల జాబితా సవరణకు ముందు తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేయడం. -
తెలంగాణ ఓటర్ల సంఖ్య 3,35,27,925
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925కి పెరిగింది. వీరిలో 1,68,67,735 మంది మహిళలు, 1,66,41,489 మంది పురుషులు, 2,829 మంది ట్రాన్స్జెండర్లు, మరో 15,872 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025లో భాగంగా తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్రెడ్డి ప్రకటించారు. కొత్తగా 2,19,610 ఓటర్లను జాబితాలో చేర్చగా, మరో 1,17,932 ఓటర్లను తొలగించారు. 2024 ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నారు. 2024తో పోల్చుకుంటే–2025లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ పోలింగ్ కేంద్రాల వారీగా 119 శాసనసభ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను వెబ్సైట్ (https://ceotelangana.nic.in)లో ఉంచినట్టు సుదర్శన్రెడ్డి వెల్లడించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టు ద్వారా ఇళ్లకు ఉచితంగా పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు, వివరాల దిద్దుబాటు నిరంతర ప్రక్రియ అని, ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov.in)లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు సైతం ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారిని18 ఏళ్లు నిండిన తర్వాత జాబితాలో చేర్చుతామని వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, ప్రవాస ఓటర్లకు ఫారం–6ఏ, స్వచ్ఛందంగా ఆధార్ వివరాలు ఇవ్వడానికి ఫారం–6బీ, ఓటర్ల తొలగింపు కోసం ఫారం–7, వివరాల దిద్దుబాటు/నవీకరణ కోసం ఫారం–8 ఉపయోగించాలని చెప్పారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,356 నుంచి 35,907కి పెరిగింది. పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 14,464 నుంచి 14,750కి, గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,892 నుంచి 21,157కి పెరిగింది. మొత్తం 551 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కానుండగా, అందులో 286 పట్టణ, 265 గ్రామీణ పోలింగ్ కేంద్రాలున్నాయి. 90 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. కేవలం 29 స్థానాల్లోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని చోట్లా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. -
ఇదేం విచిత్రం.. 138 మందికి ఒక్కడే తండ్రి..
ఎవరైనా ఒకరు, ఇద్దరికీ తండ్రి అనడం కామన్. లేదంటే నలుగురు, ఆరుగురుకి తండ్రిగా ఉంటారు. కానీ ఓచోట ఓ వ్యక్తి 100 మందిపైగా తండ్రి అయ్యాడు. బిహార్లోని ముజఫర్పూర్లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 138 మందికే ఒకే తండ్రి ఉన్నారు. ఈ వార్త తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. దీని వెనుక అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.బిహార్లోని తిర్హుట్ పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం అధికారులు ఓటర్ల జాబితా తయారు చేశారు.ఔరాయ్ బ్లాక్లోని బూత నంబర్ 54లో 724 ఓటర్లు ఉన్నారు. అందులో 138 మంది ఓటర్ల తండ్రి పేరు మున్నా కమార్ అంకిత్గా ఉంది. వీరిలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జేడీయూ అభ్యర్థి అభిషేక్ ఝా ఓటర్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు.ఓట్లు తనకు పడకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీదనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
‘మహా’ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లే అధికం
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్(ఎన్సీపీ), షిండే(శివసేన), ప్రతిప్రక్షాల మహా వికాస్ అఘాడీ కూటమి (కాంగ్రెస్, ఠాక్రే (శివసేన), శరద్ పవార్ (ఎన్సీపీ) ప్రచారంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇక.. తుది ఓటర్ల జాబితా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4 కోట్లమంది పురుష ఓటర్లు, 4.7కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన అక్టోబర్ 15, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమోదుకు చివరి తేదీ అక్టోబర్ 19 మధ్య సుమారు 6.55 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. కూటమి పార్టీల గెలుపులో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారని ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
గ్రామీణ ఓటర్లు @ 1,67,33,584
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తాజాగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రచురించింది. దీనికి సంబంధించి ఇదివరకే ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారం, ఆ మేరకు ఓట్ల తొలగింపు తర్వాత మండల, పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై డిస్ప్లే చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 1,67,33, 584 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. రాష్ట్రంలోని మొత్తం 538 మండలాలు, వాటి పరిధిలోని 12,867 గ్రామ పంచాయతీలు, 1,13,722 వార్డుల్లో ఈ మొత్తం ఓటర్లలో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతరులు (ట్రాన్సజెండర్లు) ఉన్నారు. నల్లగొండ జిల్లా టాప్.. మేడ్చల్ లాస్ట్ గ్రామీణ ఓటర్ల పరంగా చూస్తే నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలోని 31 మండలాల్లోని 856 గ్రామపంచాయతీల్లో 7,392 వార్డుల్లో మొత్తం 10,42,545 ఓటర్లున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యల్ప గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో గతంలో ఐదు మండలాలు ఉండగా వాటిలో కీసర, ఘట్కేసర్ మండలాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మేడ్చల్ జిల్లా 3 మండలాల్లోని 34 గ్రామపంచాయతీలు..320 వార్డుల్లో మొత్తం 64,397 ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. -
4,85,729 మంది డూప్లికేట్ ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్) 2025లో భాగంగా రాష్ట్రంలో 4,85,729 మంది ఓటర్ల పేర్లు, ఇతర సమాచారం ఒకే రీతి(సిమిలర్ ఎంట్రీ)లో ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. ఒకే నియోజకవర్గం ఒకే పార్ట్ పరిధిలో 52,586 మంది, ఒకే నియోజకవర్గం వేర్వేరు పార్ట్ల పరిధిలో 1,10,994 మంది, వేర్వేరు నియోజకవర్గాల పరిధిలో 3,22,149 మంది ఇలాంటి ఓటర్లున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 21,432 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగించామని చెప్పారు. బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన నిర్వహిస్తున్నారని, గత నెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 3,33,11,347 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 70,60,288 (21.19 శాతం) మంది ఓటర్లను గుర్తించి నిర్ధారించినట్టు తెలిపారు. 10,224 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని, 23,220 మంది వలస వెళ్లారని, 21,465 మంది చనిపోయారని, 12,763 మంది ఫొటోలు సరిగ్గా లేవని, 5,677 మందికి రెండు ఓట్లున్నట్టు గుర్తించినట్టు సీఈఓ తెలిపారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్రెడ్డి తెలిపారు. నాటి నుంచి నవంబర్ 28 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖా స్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 2025 జనవరి 1కి కనీసం 18 ఏళ్లు కలిగి ఉండేవారు ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సైతం ఒక పర్యాయంలో 10 దరఖాస్తులు, అభ్యంతరాలు చొప్పున 3 పర్యాయాల్లో 30 దరఖాస్తులు, అభ్యంతరాలను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమరి్పంచవచ్చునని చెప్పారు. -
శాంతిభద్రతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తనిఖీలు, ఆస్తుల జప్తు జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 3న సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద కనీసం ఒక కెమేరాతో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్ను ఉంచాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సేవల్లో ఉండే 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి తప్పనిసరి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ఘటనలకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫారం–7, వివరాలు సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించొద్దన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేంధిరప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ ఈనాడు కుట్రవార్తలు
-
ఓటర్ల జాబితాపై ఎల్లో మీడియా నోరు మూయించిన సుప్రీంకోర్టు
-
ఓటర్ల జాబితాలపై ‘సుప్రీం’ సంతృప్తి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులపై నిత్యం అడ్డగోలు ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేస్తున్న ఎల్లో మీడియా నోళ్లు మూయిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఓటర్ల జాబితాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం చర్యలు సంతృప్తికరంగా ఉన్నందున ఈ వ్యవహారంలో తదుపరి తమ నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారిన ఓటర్లు లేదా మరణించిన ఓటర్లు లేదా డూప్లికేట్గా నమోదైన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే విషయంలో చట్ట నిబంధనల మేరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు, ఓటర్ల జాబితా సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకతతో చేపడుతున్నామన్న సీఈసీ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు చట్ట ప్రకారం వారికి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక తదుపరి ఆదేశాలతో పనేముందని విచారణ సందర్భంగా పిటిషనర్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసిందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యంతో తదుపరి విచారణ అవసరం లేదంది. ఓటర్ల జాబితా విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ప్రతివాదులుగా చేర్చడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ ‘సన్సద్ బాచావో ట్రస్ట్’ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన విసృ్తత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సన్సద్ బచావో ట్రస్ట్ పిటిషన్పై విచారణ రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం సవరణ ఓటర్ల జాబితాలను తయారు చేసేలా ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించాలని, అలాగే చిరునామా మారిన, మరణించిన, డూప్లికేట్గా నమోదైన ఓటర్ల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ సన్సద్ బాచావో ట్రస్ట్ 2023లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆరోరా వాదనలు వినిపిస్తూ.. డూప్లికేట్ ఓటర్ల విషయంలో ఎన్నికల అధికారులు సరిగ్గా స్పందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అమిత్ శర్మ స్పందిస్తూ.. డూప్లికేట్ ఓటర్లతో సహా ఓటర్ల జాబితా విషయంలో తాము తీసుకుంటున్న అన్ని చర్యలనూ వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ‘చట్టానికి లోబడే చేస్తున్నాం’ ఈ నేపథ్యంలో అమిత్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఓ నోట్ కూడా ధర్మాసనం ముందుంచారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు సుప్రీం ధర్మాసనం ఆ నోట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. చిరునామాలు మారడం, మరణించడం, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో తీసుకుంటున్న చర్యలను ఎన్నికల సంఘం తన కౌంటర్లో వివరించింది. చట్టానికి లోబడి తాము చేస్తున్న పనులన్నింటినీ కోర్టుకు తెలియచేసింది. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించదలచుకుంటే వారికి నోటీసులు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి ఆ తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సవివరంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ప్రతి దశలో ఏం చేస్తున్నాయో తెలియజేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయాన్ని కూడా చెప్పింది. లోపాలన్నింటినీ సవరించిన తరువాతే తుది జాబితాను ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఎల్లో మీడియా నిత్య రాద్ధాంతం ఏపీలో ఓటర్ల జాబితాల విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు చేసిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ ప్రతిరోజూ ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివారుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న ఆందోళనను ప్రజల్లో కలిగించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొంతకాలంగా ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తోంది. ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో స్వచ్ఛత లేదని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అడ్డగోలుగా ఓటర్ల జాబితా నుంచి తొలగింపులు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎల్లో మీడియాకు గట్టిగానే షాకిచ్చేవిగా ఉన్నాయి. మొత్తం ఓటర్లు 96.85కోట్ల మంది 2024 ఫిబ్రవరి 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 96,85,01,358 మంది ఓటర్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇందులో 49.70 కోట్లు పురుషులు కాగా.. 47.13 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారని వివరించింది. 48,057 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, దివ్యాంగ ఓటర్లు 88.24 లక్షలు ఉన్నారని వివరించింది. 18–19 సంవత్సరాల వయసు మధ్య 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 80 సంవత్సరాల పైబడిన వారు 1.86 కోట్లు ఉన్నారని వివరించింది. 100 ఏళ్లు దాటిన ఓటర్లు 2.40 లక్షల మంది ఉన్నారని తెలిపింది. 2024 స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)లో కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లుగా చేరారని వివరించింది. ఇందులో 1.41 కోట్ల మహిళలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. కొత్తగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చామని వివరించింది. 2024 ఎస్ఎస్ఆర్లో 1.65 కోట్ల మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 67.82 లక్షల మంది చనిపోయారని, 75.11 లక్షల మంది శాశ్వతంగా చిరునామాలు మారారని, 22.05 లక్షలు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపింది. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా సుప్రీం కోర్టుకు వివరించింది. పిటిషనర్ లేవనెత్తిన సందేహాలనూ నివృత్తి చేసింది. బహుళ ఎంట్రీలు, ఏకరూప ఫొటోలు, భౌగోళికంగా ఓ ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంది. ఈ ఉత్తర్వులతో సన్సద్ బచావో ట్రస్ట్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రొసీడింగ్స్ను మూసివేస్తున్నట్టు తెలిపింది. -
పచ్చ మీడియా పిచ్చి రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పచ్చ మీడియా పైత్యం హద్దులు దాటుతోంది. రాజ్యాంగ వ్యవస్థలను సైతం తన కుట్రల్లోకి లాగుతూ అడ్డగోలుగా బురద జల్లుతోంది. ఎన్నికల సంఘంలో డేటా నిర్వహణ ప్రొటోకాల్స్పై అవగాహన లేకుండా పిచ్చిరాతలతో బొక్కబోర్లాపడింది. పబ్లిక్ డొమైన్లో ఎవరైనా సులభంగా యాక్సెస్ చేయగల డేటాను.. వైఎస్సార్సీపీ కోసం ఐప్యాక్ సభ్యులు దొంగలించారంటూ మంగళవారం ‘ఈసీలో దొంగలు పడ్డారు’ పేరుతో కథనాన్ని అచ్చేసి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈఓ) తీవ్రంగా స్పందించింది. సీఈఓ పనితీరు, ఐటీ వ్యవస్థ నిర్వహణపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం, తమ నుంచి ఎలాంటి స్పష్టత తీసుకోకుండానే ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వార్తను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు సీఈఓ కార్యాలయ సమగ్రతను, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. ఈ డేటాను ఎవరైనా తీసుకోవచ్చు.. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వో నెట్ 2.0ను అమలుచేస్తోంది. దేశంలోని మొత్తం డేటాబేస్ను సైబర్ సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తూ ఈసీఐ తన సర్వర్ ద్వారా నిర్వహిస్తుంది. అంతేగానీ.. ఈసీఐ సర్వర్ ఒక రాష్ట్ర సీఈఓ నిర్వహణలో ఉండదు. ఇక్కడ ఈసీఐ నిర్దేశించిన అత్యాధునిక భద్రతా చర్యలు, అత్యంత పారదర్శకంగా ఉండే డేటాఫ్రేమ్ వర్క్లోనే సీఈఓ కార్యాలయం పనిచేస్తుంది. వాస్తవానికి.. రాష్ట్ర సీఈఓ కార్యాలయంలోని ఈఆర్వో నెట్లో రెండు రకాలుగా డేటా అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రస్తుత ఓటర్ల జాబితా డేటా, ఓటర్ల జాబితాలో మార్పులు–చేర్పులు, తొలగింపులకు వచ్చిన దరఖాస్తు ఫారాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. ఇది పబ్లిక్ డొమైన్లో.. అంటే సీఈఓ వెబ్సైట్ ద్వారా సాధారణ ప్రజలు సైతం చూడొచ్చు. మరోవైపు.. ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ లకు హార్డ్డిస్్కలలో దీనిని అందిస్తుంది. ఈ డేటాను సీఈఓ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా ఓటర్లు తమ ఓటులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సవరించిన జాబితా సైతం సీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దీనిని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ప్రతీవారం ఈఆర్వో, డీఈఓలు అన్ని రాజకీయ పార్టీలతోనూ పంచుకుంటారు. వాస్తవానికి.. ఈసీఐ నియంత్రణలో ఉన్న ఈఆర్వోనెట్ సర్వర్కు సీఈఓ, డీఈఓ, డీఆర్వోకి పరిమితంగా యాక్సెస్ ఉంటుంది. ఓటర్ల జాబితా, మార్పులుచేర్పులు అభ్యర్థనలు.. ఈ రెండురకాల డేటా మినహా మరే ఇతర డేటాను సీఈఓ స్థాయిలో యాక్సెస్ చేయలేరు. సీఈఓ సైతం ఈసీఐని అడగాల్సిందే.. ఏప్రిల్ 2023లో ఈసీఐ ఈఆర్వో నెట్ 2.0ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈసీఐ ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితా మొత్తాన్ని తన సర్వర్లో భద్రపరిచింది. ఏ రాష్ట్ర సీఈఓ కార్యాలయం అయినా పాత డేటా కావాలంటే ఈసీఐ దృష్టికి తీసుకెళ్లాల్సిందే. అలాంటిది.. అంతభద్రంగా దాచిన డేటాను తొలగించడం అనేది అసాధ్యం. కానీ, పచ్చమీడియా మాత్రం 2021, 22 సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సాయంతో కొంతమంది దొంగలించారని బరితెగించి అసత్య ఆరోపణ చేస్తోంది. ఎవ్వరూ ఈసీఐ సర్వర్ను యాక్సెస్ చేయలేనప్పుడు ఆ డేటా ఎలా దొంగిలిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
మీ ఓటును సరిచూసుకోండి!
సత్తెనపల్లి: తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.. దానిని ఆన్లైన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచింది. జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. వెంటనే సరిచూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ జాబితాలో మీ ఓటు లేకపోతే.. ఫారం–6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. మీ ఓటును సంబంధిత పోలింగ్ కేంద్రం బూత్ లెవల్ అధికారి వద్ద గానీ, స్మార్ట్ఫోన్, వెబ్సైట్ల ద్వారా గానీ సులభంగా తెలుసుకోవచ్చు. ‘స్మార్ట్’గా తెలుసుకోండిలా.. https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళితే పైభాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ తుది జాబితా–2024పై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం నమోదు చేయాలి. ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్లో వస్తాయి. మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకొని.. మీ ఓటు ఉందో? లేదో? చూసుకోవచ్చు. అలాగే https://voterportal.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ను నమోదుచేస్తే జాబితాలో మీ పేరు ఉందో..? లేదో..? ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది? సీరియల్ నంబర్ ఎంత? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ తెలియకపోతే.. ‘అడ్వాన్స్ సెర్చ్’ విభాగంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, శాసనసభ నియోజకవర్గం వివరాలు పొందుపరిచి జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. అలాగే www. nvsp.in వెబ్సైట్లోకి వెళితే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డీటెయిల్స్,’ ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు నమోదు చేసి లేదా ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ యాప్తో చిటికెలో.. గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకొని.. లాగిన్ కావాలి. యాప్లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఓటు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. కార్టు నంబర్ ఉంటే ఎపిక్ నంబర్ ద్వారా సరిచూసుకోవచ్చు. లేకపోతే మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపరచడం ద్వారా తెలుసుకునే వీలుంది. పోలింగ్ కేంద్రంలోనూ అవకాశం.. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ అధికారి ఉంటారు. వారి వద్ద ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా ఉంటుంది. అందులో మీ ఓటు ఉందో? లేదో? సరిచూసుకోవచ్చు. ఓటు లేకపోతే వెంటనే బీఎల్వో ద్వారా గానీ వెబ్సైట్ ద్వారా గానీ ఫారం –6 పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. -
AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది శుభపరిణామమని తెలిపింది. బుధవారం సాయంత్రం సీఈసీ రాజీవ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలకాంశాలను వివరించారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు రాజీవ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. సీఈసీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. చదవండి: రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్! ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది. ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి. ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలి. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి.(పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం’ అని సీఈసీ పేర్కొన్నారు. -
‘దొంగ’ నాటకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెర పడింది! వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు మూడింతలు అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్లు వీటిల్లో 80 నుంచి 90 శాతం వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. నాడు సేవామిత్ర.. నేడు మైపార్టీ డ్యాష్ బోర్డ్ గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా మైపార్టీ డ్యాష్ బోర్డ్ డాట్కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్న వారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతోపాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా, స్థానికంగా నివాసం ఉంటున్నా శాశ్వతంగా వలస వెళ్లినట్లు పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని రెండు ప్రదేశాల్లో రెండు ఓట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహం రచించింది. కుప్పలు తెప్పలుగా అందిన ఫారం 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80 శాతం తప్పుడువేనని తేల్చుతూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేకంగా గురి పెట్టి అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది. నెల్లూరులో సింహభాగం నకిలీ ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లు తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కోనేరు సురే‹Ùతో కలిసి ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 85 శాతానికి పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే కథ. విజయనగరం 4 నియోజకవర్గాల్లో ♦విజయనగరం జిల్లాలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన 19,407 మంది ఓట్లు తొలగించాలని కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7లను ఎన్నికల సంఘానికి సమర్పించాడు. ♦ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన విజయనగరం జిల్లా కలెక్టర్ 8,318 ఫారం 7లు తప్పుడువని తేల్చుతూ నివేదిక ఇచ్చారు. కర్నూలులో 88 శాతం బోగస్ ♦కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 67,370 ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశాడు. వీటిలో అత్యధికంగా కోడుమూరులో 17,576, ఆదోనిలో 13,968, ఆలూరులో 11,581 బోగస్ దరఖాస్తులున్నాయి. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీటిపై బీఎల్వోలు, డిప్యూటీ తహసిల్దార్లు, తహసిల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా 59,054 ఫారం 7లు బోగస్ అని తేలింది. అంటే 88 శాతం తప్పుడు ఫారం 7లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. 11,935 మంది బతికే ఉన్నా వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అన్నమయ్య.. అక్రమ మార్గంలో ♦ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 40,358 మంది ఓట్లు తొలగించాలంటూ కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి అందచేశాడు. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ 25,097 దరఖాస్తులు నకిలీవని నిర్థారించారు. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి టీడీపీ తప్పుడు దరఖాస్తులు సమర్పించినట్లు బహిర్గతమైంది. -
ఓట్ల..కేటుగాళ్లు
ప్రజాస్వామ్యమంటే... ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. ప్రజలే ప్రభువులు!ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ కీలకమే. ఒకే ఒక్క ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంది. ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజాతీర్పు అంత స్పష్టంగా ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజల ఆశీస్సులతో కాకుండా.. అడ్డదారుల్లో అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని ఏమంటారు? కేటుగాడనే కదా! ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాటి నుంచి ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ ‘డూప్లికేటు’ వేషాలు వేస్తున్నారు! సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటమికి ఇప్పట్నుంచే సాకులు వెతుక్కుంటున్నారు. ఒకవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెడుతున్న ఆయన మరోవైపు నిబంధనలను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17, 18 ప్రకారం దేశంలో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. రాజకీయాల్లో 1978 నుంచి ఉన్న చంద్రబాబుకు ఇది తెలిసినా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. తెలంగాణలోనూ, ఏపీలోనూ రెండు చోట్లా ఓట్లు ఉన్న వారు (డూప్లికేట్లు) 4,30,264 మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరుల పేర్లను ఏపీలోనూ సరిహద్దు నియోజకవర్గాల్లో చేర్పించారు. వాటిని తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలని ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మర్నాడే.. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న పూర్తయింది. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 1 నుంచే హైదరాబాద్లో ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా చేర్పించేందుకు ఆ పార్టీ భారీ ఎత్తున శిబిరాలు నిర్వహించింది. కూకట్పల్లి, నిజాంపేట, వనస్థలిపురం, మణికొండ, భరత్నగర్ తదితర ప్రాంతాల్లో శిబిరాల ఇన్ఛార్జ్లను నియమించిన టీడీపీ ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ ఓటర్లుగా చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ సానుభూతిపరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వయసు, చిరునామా ధ్రువీకరించే ఆధార్ కార్డును వాట్సప్లో పంపితే తామే ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేయిస్తామని, ఎన్నికల సంఘానికి తామే ఫారం 6 సమర్పిస్తామంటూ సందేశాలు పంపింది. టీడీపీని భుజానికెత్తుకునే మోసే ఓ సామాజిక వర్గం నాయకులు ఈ ప్రచారంలో ప్రధాన భూమిక పోషించారు. ఇలా హైదరాబాద్, తెలంగాణలో నివాసం ఉంటున్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరులను ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చేందుకు ఫారం 6 దరఖాస్తులను ఆన్లైన్లో ఇప్పటికే సమర్పించారు. ఈ ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పవన్ కుటుంబం బరి తెగింపు.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనే తరహాలో డూప్లికేటు ఓట్లు చేర్చడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాట పట్టారు. ఆయన సోదరుడు కొణిదల నాగేంద్రరావు(నాగాబాబు)కు హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబరు 168లో సీరియల్ నెంబరు 323 ఎఫ్వైవై 6038202 ఓటరు కార్డు నెంబరుతో ఓటు ఉంది. నాగేంద్రరావు సతీమణి పద్మజ కొణిదలకు సీరియల్ నెంబరు 324, వారి కుమారుడు కొణిదెల సాయివరుణ్ తేజ్కు సీరియల్ నెంబరు 325తో అక్కడ ఓట్లున్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అంటే డిసెంబరు 4న ఏపీలోనూ ఓటు హక్కు కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగా నగర్ మూడో వీధి 5–263 డోర్ నెంబర్ ఇంటిలో తాము నివాసం ఉంటున్నామంటూ కొణిదల నాగేంద్రరావు, పద్మజ, సాయివరుణ్ తేజ్ ఓటర్లుగా నమోదు కోసం ఫారం 6 దరఖాస్తు సమర్పించడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేనను స్థాపించిన సినీనటుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి జత కట్టడం ద్వారా దీన్ని రుజువు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు బేషరతుగా మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి మేలు చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. డూప్లికేటు ఓట్లకు సాక్ష్యాలు ఇవిగో..: ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (టీజెడ్టీ 2164002)తో దీపిక సైలాడకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎఫ్జెడ్జెడ్ 8526691)తో పి.వెంకటేష్ తండ్రి పి.రామారావుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (కేవైటీ 2765246)తో మారెమ్మ తురపాటి భర్త మారయ్యకు తెలంగాణలోని సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా ఎనీ్టఆర్ జిల్లా మైలవరం నియోజవకర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎస్డబ్ల్యూడీ 1814962)తో భరణి బిళ్లపాటి భర్త వెంకట రమణమూర్తి బిళ్లపాటికి హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాష్ట్రంలో అనకాపల్లి నియోజకవర్గంలో రెండు పోలింగ్ బూత్ల పరిధిలో రెండు ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం మూడు ఓట్లు ఉన్నట్లు. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (జేహెచ్జీ 1224126)తో 70 ఏళ్ల వంకదారి నారాయణస్వామి తండ్రి వి.కృష్ణయ్యకు గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ జడ్పీహెచ్ఎస్ పోలింగ్ బూత్ పరిధిలో సీరియల్ నెంబరు 750తో ఒక ఓటు ఉండగా వయసును 72 ఏళ్లుగా మార్చి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో సీరియల్ నెంబరు 197తో మరో ఓటు ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రరావు కొణిదల, ఆయన భార్య పద్మజ, కుమారుడు సాయి వరుణ్ తేజకు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయనడానికి ఆధారం ఇదీ ఓటరు కార్డు నెంబరు ఆర్డీవీ0159780తో కొసరాజు సాంబశివరావు తండ్రి సూర్యప్రకాశరావుకు తెలంగాణలో కూకటిపల్లిలో ఒక ఓటు.. రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గంలో మరో ఓటు ఉందనడానికి ఆధారం ఓటరు కార్డు నెంబరు ఆర్ఎస్యూ0326876తో నూతలపాటి కృష్ణచైతన్య తండ్రి పేరు ఎన్ఎస్ఆర్ ప్రసాద్కు తెలంగాణలో పటాన్చెర్వు నియోజకవర్గంలో ఒక ఓటు.. రాష్ట్రంలో నూజివీడు నియోజకవర్గంలో మరో ఓటు కలిగి ఉన్నారనడానికి సాక్ష్యం -
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2019 జనవరి 15వ తేదీ ప్రారంభమైంది. 2024 జనవరి 16వ తేదీతో తెలంగాణ అసెంబ్లీ గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30వ తేదీ గురువారం నాడు ఒకే దఫాలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ.. ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను అక్టోబర్ 9వ(సోమవారం) తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తక్షణమే ఎన్నికల కోడ్ను అమలులోకి తెచ్చింది. ఆపై నవంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాసేపటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. వారంపాటు సాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన చేపట్టారు రిటర్నింగ్ అధికారులు. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రం ముగిసింది. మొత్తం ఓటు హక్కు ఉన్నవాళ్ల సంఖ్య.. ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1.62 కోట్లు, మహిళా ఓటర్లు 1.63 కోట్లు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది,సర్వీస్ ఓటర్లు(సాయుధ దళాల సిబ్బంది, దేశం వెలుపలా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే వ్యక్తులు) 15, 406 మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు (18-19ఏళ్ల వయసు) 9,99,667 మంది ఉన్నారు. వీళ్లలో పురుష ఓటర్లు 5,70,274 మంది, మహిళా ఓటర్లు 4,29,273 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 120 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు(పీడబ్ల్యూడీ) 5,06,921 మంది ఉండగా.. ఇందులో పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్జెండర్ ఓటర్లు ఒకరు ఉన్నారు. ఓవర్సీస్ ఓటర్లు.. పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్జెండర్ ఓటర్లు 1 మొత్తంగా 2,944 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 59 ఏళ్లలోపు వాళ్లు 86 శాతం ఉన్నారు. వయసు 80 ఏళ్లు దాటిన వాళ్లు 4,40,371 మంది ఉన్నారు. 80ఏళ్ల వయసు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో ఈసీ తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,26,18,205. తెలంగాణలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించారు. ఈ వెసులుబాటుతో 27,178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాజ్ రాజ్ ప్రకటించారు. అందులో 15,000 మంది సీనియర్ సిటిజన్లు, 9,374 మంది వికలాంగులు, 1,407 మంది నిత్యావసర సేవా సిబ్బంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అత్యధికం.. అత్యల్పం అత్యధికంగా హైదరాబాద్లో 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో(హైదరాబాద్ జిల్లా) 7 లక్షల 32 వేల 560 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) నియోజకవర్గంలో లక్షా 48 వేల 713 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. బరిలో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 2,898 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరకు 2,290 మంది అభ్యర్థులు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీ నగర్(రంగారెడ్డి జిల్లా)లో 48 మంది, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్లో 44 మంది.. కామారెడ్డిలో 39 మంది పోటీలో మిగిలారు. అత్యల్పంగా నారాయణపేట(నారాయణపేట జిల్లా)లో ఏడుగురు, బాన్సువాడలో(కామారెడ్డి జిల్లా)లోనూ ఏడుగురు చొప్పున అభ్యర్థులు, బాల్కొండ(నిజామాబాద్)లో 8 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. సాధారణంగా.. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో ఎన్నికల అధికారులు జాబితా తయారు చేస్తారు. వాటి ఆధారంగానే బ్యాలెట్ రూపొందిస్తారు. పార్టీ ప్రతినిధుల నుండి క్లియరెన్స్ తర్వాత(నవంబర్ 29) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35,655 పోలింగ్ కేంద్రాల్లో తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో వెబ్క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,097 (78శాతం), 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 67 మంది జనరల్ అబ్జర్వర్లను, 39 మంది పోలీస్ అబ్జర్వర్లను తెలంగాణ ఎన్నికల కోసం నియమించింది ఈసీ. మొత్తంగా ఎన్నికల విధుల కోసం 2.08 లక్షల మంది సిబ్బందిని నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. వాళ్లను రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతాలకు తరలించింది. 35,655 పోలింగ్ కేంద్రాలు పోలింగ్: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్ కేంద్రాల వల్ల 144 సెక్షన్ అమలు 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో.. 4,400 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ముగింపు పోలింగ్ ముగిసే టైం వరకు లైన్లో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటింగ్కు అనుమతి భద్రత కోసం 375 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో 45 వేలమంది పోలీసులు ఏజెన్సీ ఏరియాల్లో భద్రత మరింత కట్టుదిట్టం నవంబర్ 30వ తేదీ ఉదయం 5.30ని. పోలింగ్ సిబ్బందికి అవగాహన కోసం మాక్ పోలింగ్ ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల కౌంటిగ్.. అదే రోజు ఫలితాల వెల్లడి అవుతాయి. మొత్తంగా ఈసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. -
ఏపీ ఓటర్ల జాబితా ముసాయిదా.. మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఏపీలో మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉండగా ఇందులో పురుషులు 1,98,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. జాబితా ఇదే.. మొత్తం ఓటర్లు- 4,01,53,292 పురుషులు- 1,98,31,791 మహిళలు - 2,03,85,851 ట్రాన్స్ జెండర్లు - 3808 సర్వీస్ ఓటర్లు- 66,158 ఇక, 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది. -
ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించామని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్లు వెల్లడించారు. తొలిసారి రాష్ట్రంలో వృద్ధులు ఇంటివద్దే ఓటు వేయడానికి ఫామ్ 12d ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. 2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మరణాలు ఉన్నా ధృవీకరణ ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని అన్నారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు. . పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో 35, 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉన్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7.689 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 8,11,640 లక్షల యువత ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీలు, సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించింది. బుధవారం రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే ► యంగెస్ట్ స్టేట్ తెలంగాణ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ► ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ►రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి ►అక్రమ నగదు - మద్యం ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ► అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు. ►119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. ►80ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షలు ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7689 ఉన్నారు. ► 22లక్షల ఓట్లను 2022-23 డిలీట్ చేశాం. ►తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉంది. ► రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం. ►ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ► ఈ సారి 8.11లక్షల మొదటిసారి ఓటర్స్ను నమోదు చేశాం. ►యువత - మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేశాం. సక్సెస్ అయ్యాము. ► 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి. ► థర్డ్ జెండర్స్ తో సమావేశాలు పెట్టాం. ► 35వేల పీస్లు, ప్రతీ పీఎస్కు 897 ఉన్నారు. ►మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం. ►అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే c vigil యాప్లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ► ప్రతీ ఒక్కరూ ఓటర్ helpline app డౌన్లోడ్ చేసుకోవాలి. ►suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు. ► KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు. ► సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు. ► అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ► ఆన్లైన్ లో నగదు బదిలీల పై EC నిఘా ఉంటుంది. ► ఎలిప్యాడ్స్, ఎయిర్పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా. ►ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం. ► ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి. ► ప్రకటనలు - సోషల్ మీడియా లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ►ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు ► ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక సమీక్ష సారాంశం కోసం క్లిక్ చేయండి -
Telangana: రాష్ట్ర ఓటర్లు 3,17,17,389
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389 కాగా, ఇందులో 1,58,71,493మంది పురుషులు, 1,58,43,339మంది మహిళలు, 2557 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలతుదిఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి(సీఈఓ) వికాస్రాజ్ బుధవారం ప్రకటించారు. 2023 జనవరితో పోల్చితే తుది ఓటర్ల జాబితాలో మొత్తం 5.8 శాతం ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో 15,338 మంది సర్వీసు ఓటర్లు, 2780 మంది ప్రవాస ఓటర్లున్నారు. 18–19 ఏళ్ల వయసు గల 5,32,990 మంది యువఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. దీంతో 18–19 ఏళ్ల వయస్సు గల ఓటర్ల సంఖ్య 8,11,640కి చేరింది. దీంతో జాబితాలో యువ ఓటర్ల శాతం 2.56 శాతానికి పెరిగింది. కొత్త ఓటర్లు 17,01,087 మంది ఓటర్ల జాబితా రెండో సవరణలో చివరి గడువు సెప్టెంబర్ 19 నాటికి 57,617 దరఖాస్తులను పరిష్కరించామని, త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించామని సీఈఓ వికాస్రాజ్ ప్రకటించారు. కొత్తగా 17,01,087 మంది ఓటర్లు జాబితాలో చోటు పొందగా, 6,10,694 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. 5,80,208 మంది ఓటర్లు పేరు, ఇతర వివరాలు సరిదిద్దుకోవడం లేదా కొత్త చిరునామాకు ఓటు బదిలీ చేసుకున్నారు. స్త్రీ, పురుష ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 992 నుంచి 998కి మెరుగు పడిందని సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. 18–19 ఏళ్ల వయసు గల ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 707 నుంచి 743కి మెరుగైందన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 43,943కి, దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,06,493కి, థర్డ్జెండర్ ఓటర్ల సంఖ్య 2557కి పెరిగిందన్నారు. ఓటర్ల నమోదుకుఇంకా అవకాశం కొత్త ఓటర్ల నమోదు నిరంతరంగా కొనసాగుతుందని, 2023 అక్టోబర్ 1తో 18 ఏళ్లు నిండిన వారు, గతంలో దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుంటే, అర్హులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తామన్నారు. https://voters.eci.gov.in/ వెబ్సైట్/ఓటర్ హెల్ప్లైన్ యాప్/బీఎల్ఓ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ పోలింగ్స్టేషన్, పేరు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉంటే ఫారం–8 దరఖాస్తు ఆన్లైన్/ యాప్/బీఎల్ఓ ద్వారా సమర్పించాలని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఓటరు హెల్ప్లైన్ నంబర్ 1950కి సంప్రదించాలన్నారు. 4లక్షల ఓటర్ల చిరునామాలు మార్పు ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే స్వయంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లను ధ్రువీకరించే కసరత్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4,15,824 మంది ఓటర్ల చిరునామాలు సవరించారు. 3,94,968 మంది ఓటర్లను ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి, 64,661 మంది ఓటర్లను ఒక అసెంబ్లీ స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ చేశారు. ఈఆర్వో నెట్ ద్వారా 73,364 మంది ఓటర్ల చిరునామాలు, ఇళ్ల నంబర్లు సవరించారు. 4605 బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో 757 బృందాలు తనిఖీ చేసి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు 50,907 దరఖాస్తులు స్వీకరించి వారికి ఓటుహక్కు కల్పించాయి. రెండేళ్లలో 22 లక్షల ఓటర్ల తొలగింపు ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా గత రెండేళ్లలో 22,02,168 మంది చనిపోయిన, డూప్లికేట్, వలస పోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో 4,89,574 మంది ఓటర్లు జీహె< చ్ఎంసీ పరిధిలోని వారే. ఈ ఏడాది 2,47,756 మంది చనిపోయిన ఓటర్లను తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తీవ్రంగా శ్రమించామని, 14,24,694 ఓటర్ల వివరాలను సవరించామని సీఈఓ తెలిపారు. అప్పుడు ఓటర్లు ఇలా... గత ఆగస్టు 21న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్లు మొత్తం కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,06,42,333 ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సర్వీసు ఓటర్లు ముసాయిదాలో ఉన్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. ఓటర్ల జాబితా తొలి ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, రెండో సవరణ నాటికి 3,17,32,727 మందికి పెరిగారు. -
తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులపాటు ఎన్నికల సన్నాహాక భేటీలు వరుసగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తుది ఓటర్ల జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ డేటా ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ వరకు.. కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉండగా.. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడదలు చేయాలని కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తిని ఈసీ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు - ఎస్పీలు, సీపీలతో ఇప్పటికే EC మీటింగ్ మొదలైంది. ఇవాళ రెండు సెషన్లుగా ఈ భేటీ జరగనుంది. మొదటి సెషన్లో అధికారులు చెప్పే అంశాల్ని కేంద్ర బృందం విననుంది. ఇక రెండో సెషన్లో అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేస్తుంది. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్రం ఎన్నికల సంఘ బృందం పరిశీలించింది. -
మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. ఓటు లేకపోతే తక్షణం నమోదు చేయించుకోండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 21 వరకు అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. ఓటర్ల జాబితాను పరిశీలించి సవరణలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోలతో కలిసి ఓటర్ల పరిశీలనలో పాల్గొంటాయి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 22 నుంచి రాజకీయ పార్టీల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30కి పూర్తి చేసి అక్టోబరు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. శనివారం, ఆదివారం అయిన అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. డిసెంబరు 26 కల్లా క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వీటి నమోదుపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర జనాభా ప్రకారం 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు కనీసం 12 లక్షలు ఉండాలి. కానీ 3.50 లక్షల ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. 2024 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో వీరి నమోదుపైనా దృష్టి సారిస్తున్నారు. వీరు ఫారం 6ను వినియోగించి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. చనిపోయిన వారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఫారం 7ను వినియోగించుకోవాలి. చిరునామా, నియోజకవర్గం మార్చుకోవడానికి ఫారం 8 ఇవ్వాలి. ప్రవాసాంధ్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారం 6 ఏను ఇవ్వాలి. పరిశీలనకు తీసుకొనే అంశాలు ♦ ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉంటే వారి అభీష్టం మేరకు ఒక చోట ఉంచి మిగిలిన ఓట్లను తొలగిస్తారు. ♦ నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తిస్తారు. ♦ డోర్ నంబర్లు లేకుండా ఉన్నా, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లను పరిశీలిస్తారు. ♦ ఇంటి నంబరు లేనివి, ఒకే ఇంటి నంబరు, వీధి పేరుపై వందలాది ఓట్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తారు. ♦ దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఒక్క ప్రాంతంలోనే ఉంచుతారు ♦ ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ సిఫారసు చేస్తారు. దొంగ ఓట్ల దొంగ బాబే! 2019 ఎన్నికల్లో గెలవడానికి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని హామీలేదు. అయినా నమ్మకం కుదరక ఇష్టానుసారంగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒకే ఇంట్లో 40–50 మొదలు.. ఏకంగా 600–700 ఓట్ల వరకు గంపగుత్తగా ఓట్లు ఉన్నట్లు సృష్టించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం ముందు తట్టుకోలేక తల వంచారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటి లీలలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే ఉలిక్కిపడుతున్నారు. గంపగుత్తగా ఉన్న దొంగ ఓట్లను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. విచారించగా ఆ దొంగ ఓట్లన్నీ నాటి బాబు పాలనలో రికార్డుల్లోకి ఎక్కినవేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ప్రజల్లో ఇంకా చులకనవుతానని భావించి ఎల్లో మీడియాను రంగంలోకి దింపారు. తను చేసిన తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై వేసి.. తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. రోజుకో రీతిన తప్పుడు కథనాలు వండి వార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారు. ఇది కూడా బెడిసి కొడుతోంది. బాబు తీరు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుంది. -
ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేకదృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గాల పరిశీలకులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడి దొంగ ఓట్లను చేర్పించారని గుర్తుచేశారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని ఎత్తిచూపారు. ఆ దొంగ ఓట్లను గుర్తించి, వాటి తొలగింపునకు కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకులు మరింత కీలకంగా, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసిన మేరకు 175 నియోజకవర్గాలకు 175 గెల్చుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గాలపై అవగాహన పెంచుకోవాలని, స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం, అక్కడి ప్రతిపక్షాల పాత్ర వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. వారంలో కనీసం రెండురోజులు నియోజకవర్గాల్లో ఉండి పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా పార్టీ సమన్వయకర్తకు తలలో నాలుకలాగా మెలుగుతూ కీలకంగా ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే సమన్వయంతో పరిష్కరించడానికి కృషిచేయాలని సూచించారు. స్థానిక నేతల అభిప్రాయాలు విభిన్నంగా ఉంటే వాటిని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ల దృష్టికి, పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. జగనన్న సురక్ష పథకం నియోజకవర్గాల్లో ఏ విధంగా జరుగుతోంది.. ప్రజలకు సంబంధించి అన్ని సమస్యల పరిష్కారం, పథకాలను లబ్దిదారులకు అందించేలా సమన్వయం చేయడం వంటి వాటిపైన కూడా దృష్టిపెట్టాలని కోరారు. గృహసారథులు, గ్రామ, వార్డు సచివాలయాల కన్వి నర్లు.. మండల, డివిజన్ పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ పట్ల ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉన్నారని.. రానున్న ఎన్నికలలో పార్టీ విజయం త«థ్యమని చెప్పారు. అయినప్పటికి నియోజకవర్గాలలో పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
వరస తప్పిన ముఖ్యమైన లెక్క
దేశ జనన, మరణాల రిజిస్టర్ను ఓటర్ల జాబితాతో అనుసంధానించేలా త్వరలోనే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. దేశ పౌరులెవరికైనా సరే 18 ఏళ్ళు నిండగానే వారి పేరు ఓటర్ల జాబితాలో చేరిపోయేలా ఆ బిల్లుతో వీలు కల్పించాలని భావిస్తోంది. సోమవారం ఢిల్లీలో భారత జనగణన కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించిన ఈ సంగతి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మంచి ఆలోచనే. మరణించినవారి పేర్లను తక్షణం తొలగించడానికీ, ఓటుహక్కు వయసు రాగానే జాప్యం లేకుండా కొత్త ఓటర్లు జాబి తాలో చేరడానికీ ఈ అనుసంధాన ప్రక్రియ ఉపకరిస్తుంది. అయితే, అదే సమయంలో పదేళ్ళకోసారి నిర్వహించాల్సిన కీలక జనగణనను ఈ దఫా ఎప్పుడు జరిపేదీ ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం. నిజానికి, 1948 జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. అలాగని ప్రతి పదేళ్ళకూ జనగణన చేయాలని చట్టమేమీ లేదు. ఎప్పుడు జనగణన చేయాలో, ఫలితాలెప్పుడు వెల్లడించాలో నిర్ణీత కాలవ్యవధి అందులో లేదు. అయితే, ఈ లెక్కల ప్రయోజనం అపారం. బ్రిటీష్ ఇండియాలో 1881లో వందల మంది శ్రమించి, 25 కోట్లకు పైగా జనాభా నుంచి జవాబులు సేకరించారు. అప్పటి నుంచి 130 ఏళ్ళ పాటు యుద్ధాలు సహా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, మన పాలకులు ఒక క్రమం తప్పని యజ్ఞంగా ఈ జనగణన ప్రక్రియను సాగించారు. తీరా ఈసారి ఆక్రమం తప్పింది. దేశంలో తాజా జనగణన 2021లో జరగాల్సి ఉంది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా అందులో తొలి దశ జరపాలని భావించారు. కరోనాతో అది నిరవధిక వాయిదా పడింది. జనం లెక్కను ప్రోదిచేసి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలతో ఒక సమాచార గనిగా, ప్రభుత్వ – ప్రజా కార్యాచరణకు కీలక సూచికగా ఉపకరించాల్సిన ఆ ప్రక్రియ ఈసారి అలా ఆలస్యమైంది. జాప్యానికి కరోనాయే కారణమన్న ప్రభుత్వ వాదన తర్కానికి నిలవదు. అత్యధికులు కరోనా టీకాలు వేయించుకున్నా, 2022లో మూడో వేవ్ ముగిసి జనజీవనం కుదుటపడినా, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం సాగుతున్నా సరే... సర్కార్ ఎందుకనో ఇప్పటి దాకా మళ్ళీ జనగణన ఊసే ఎత్తలేదు. జిల్లాలు, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల పాలనా సరిహద్దుల్ని స్తంభింపజేసే తుది గడువును ఈ జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది గనక లెక్కప్రకారం ఆ తర్వాత మూడు నెలలైతే కానీ జనగణన చేపట్టరాదు. అంటే, కనీసం ఈ సెప్టెంబర్ దాకా జనగణన లేనట్టే. ఇక, సాధారణంగా జనసంఖ్యను లెక్కించడం జనగణన చేసే ఏడాది ఫిబ్రవరిలో చేస్తారు. మార్చి 1కి ఇంత జనాభా అంటారు. కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 చివర ఎప్పటికో కానీ ప్రక్రియే మొదలు కాకపోవచ్చు. పైకి మామూలు గానే అనిపించినా, ఈ ఆలస్యం విస్తృత పర్యవసానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే, పుష్కరకాలం గడిచిపోయినా ఇప్ప టికీ మన విధాన రూపకర్తలు పాత 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాల నుంచి సాయాల దాకా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం విచిత్రం, విషాదం. అసలు కరోనాతో ఆలస్యమవడానికి ముందే ఈ 2021 జనగణన వివాదాస్పదమై కూర్చుంది. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించేలా జనాభా సర్వే చేపడతామంటూ ప్రభుత్వం తేనెతుట్టె కదిల్చింది. అప్పటికే, ముస్లిమ్లే లక్ష్యంగా వివాదాస్పద ‘పౌరసత్వ చట్టం–2019’ తెచ్చారంటూ, దేశవ్యాప్తంగా నెలల తరబడి నిరసనలు సాగాయి. ఆ చట్టానికి, ఇప్పుడు భారతీయులమని నిరూపించుకోవాల్సిన ఈ ‘ఎన్పీఆర్’ జత చేరిందని విమర్శలు రేగాయి. మరో పక్క ఇప్పటికే ప్రతిపక్షాల్లోని అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు దేశంలో కులగణన సాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ లెక్కలు కూడా తీస్తే తమ ఓటుబ్యాంకులో చీలికలు రావచ్చనీ, అది తమకు దెబ్బ కావచ్చనీ అధికార పార్టీ భయపడుతోంది. వివిధ వర్గాల నుంచి ప్రత్యేక కోటాలకు డిమాండ్లు తలెత్తుతాయని ఆందోళన చెందుతోంది. అయిన ఆలస్యం ఎలాగూ అయింది గనక వచ్చే ఎన్నికల్లో లెక్క తప్పకుండా ఉండాలంటే, ఈ లెక్కలు పక్కనపెట్టాలనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. జనగణన అంటే కేవలం భౌగోళిక ప్రాంతాల్లో తలకాయలు లెక్కపెట్టడం కాదు. సమాజంలోని భిన్న వర్గాల ఆకాంక్షలకు పునాదిగా నిలిచే ప్రక్రియ. గ్రామీణ – పట్టణ జనాభా వాటా, వలసలు, మాతృభాష, ఆయుఃప్రమాణం, గృహవసతులు వగైరా అనేక గణాంకాలను అందించే సమాచార నిధి. ఆర్థిక జీవిత అంశాలపై దృష్టి పెట్టే అనేక సర్వేలకు మాతృకైన ‘జాతీయ శాంపిల్ సర్వే’, ఆరోగ్యం – సామాజిక స్థితిగతులపై ఇంటింటి సర్వే అయిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వగైరాలు శాంపిల్స్ తీసుకోవడానికి జనగణనే ఆధారం. ఇంతటి ముఖ్యమైన వ్యవహారంపై ఈ సుదీర్ఘ అనిశ్చితి సమంజసం కాదు. జనగణన ప్రక్రియ ఎప్పుడు జరిగినా – ఆధునికతనూ, ఎప్పటి కప్పుడు లెక్కల్లో మార్పుల్ని పొందుపరుచుకొనే లక్షణాన్నీ సంతరించుకోవాలన్న ప్రభుత్వ యోచన ఆహ్వానించదగినదే. కాకపోతే ఎప్పుడో డిజిటల్ వేదికల్ని ఆశ్రయిస్తామనీ, వ్యక్తులు తమకు తామే ఎలక్ట్రానిక్గా సమాచారం పూర్తిచేసే హక్కు కల్పిస్తామనీ, అందులో సామాజిక – ఆర్థిక హోదాను లెక్కించే 35కు పైగా పరామితులు ఉంటాయనీ అంటూ... ఇప్పుడు అమితమైన జాప్యం చేయడం అర్థరహితం. అసలుకే మోసం. అయితే, జనగణన ఎప్పుడు చేస్తామో చెప్పకున్నా, ఎలా చేయాలను కుంటున్నదీ పాలకుల నోట వినపడడమే ప్రస్తుతానికి దక్కిన సాంత్వన. -
ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఐదుగురు సిట్టింగ్ సభ్యులు వచ్చే ఏడాది మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వారి నియోజకవర్గాలకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలపై డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించి తుది జాబితాలను డిసెంబర్ 30న విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్రాఫ్ట్ రోల్లో నమోదు చేసుకోలేకపోయిన అర్హులందరూ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కోసం ఫారం–18, ఉపాధ్యాయుల నియోజకవర్గం కోసం ఫారం–19లో నమోదుకు దరఖాస్తులను దాఖలు చేయవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే ఓటర్లు ఫారం–7, సవరణల కోసం ఫారం–8లో దాఖలు చేయవచ్చని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల సాయం ముసాయిదా జాబితాలో సవరణల కోసం బూత్ స్థాయి ఏజెంట్ల సాయం తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఏజెంట్ల బాధ్యతలను కూడా వివరించింది. చనిపోయిన, మారిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా, ఇతర మార్గాల ద్వారా గుర్తించి ఒక జాబితా తయారు చేసి, నిర్ణీత ఫార్మాట్లో అధికారులకు అందించవచ్చని తెలిపింది. ఇలా ఏజెంట్లు ఒక రోజులో 10కి మించకుండా దరఖాస్తులను ఫైల్ చేయవచ్చని చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్కు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని ఆదేశించింది. -
మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.96 కోట్ల పురుష ఓటర్లుండగా 2.01 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 24 జిల్లాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలుగా ఉన్నారు. విశాఖపట్టణం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే మహిళలకన్నా పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగతా 24 జిల్లాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 9.65 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9.60 లక్షలు, అనంతపురం జిల్లాలో 9.56 లక్షలు, విశాఖ జిల్లాలో 9.38 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 9.10 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం సాధారణ ఓటర్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19.12 లక్షల ఓటర్లు ఉండగా ఆ తరువాత అనంతపురం జిల్లాలో 19.11 మంది, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 18.98 లక్షల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 12.61 లక్షల ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 7.68 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7.15 లక్షల ఓటర్లు ఉన్నారు. -
అవ్వ... ఓటర్ల డేటా చోరీ
త్వరలో బెంగళూరు పాలికె ఎన్నికలు, ఆపై అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఓటర్ల సమాచారం చోరీ అనే అంశంపై వేడి పుట్టించింది. సీఎం బొమ్మై ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ బెంగళూరులో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని కాంగ్రెస్ ఘాటుగా ఆరోపించింది. ఇవి నిరాధార ఆరోపణలని సీఎం తిరస్కరించారు. శివాజీనగర: ఓటర్ల సమాచారాన్ని బీజేపీవారు ప్రైవేట్ సంస్థతో అక్రమంగా సేకరించారని, ఇందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బాధ్యుడని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. గురువారం కేపీసీసీ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ డేటా చౌర్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేయాలన్నారు. చెలుమ అనే ప్రభుత్వేతర సంస్థ సిబ్బందికి నకిలీ ఐడీ కార్డులిచ్చి ప్రభుత్వ అధికారుల్లా ప్రవర్తించి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థ అయిన చెలుమ ఓటర్ల సమాచారాన్ని సేకరించడం ఎందుకు?, బూత్ స్థాయిలో అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనకున్న వ్యక్తులు ఓ మంత్రికి సన్నిహితులని పరోక్షంగా మంత్రి అశ్వత్థ నారాయణపై ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కాంగ్రెస్ నాయకులు పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డికి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు: సీఎం ఓటర్ల డేటా చోరీపై కాంగ్రెస్ ఆరోపణ నిరాధారమని, ఫిర్యాదుపై తక్షణమే విచారణ జరుగుతుందని సీఎం బొమై్మ తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కార్యాన్ని ఎన్నికల కమిషన్, బీబీఎంపీ, స్థానిక సంస్థలు ఎన్జీఓలకు ఇస్తారు. 2008లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు ఇలాగే ఇచ్చారని చెప్పారు. ఒక ఎన్జీఓకు ఎన్నికల కమిషన్, బీబీఎంపీ అనుమతినిచ్చింది. వారు దురి్వనియోగం చేశారనే ఆరోపణపై విచారణ చేయాలని సూచించానని తెలిపారు. కాంగ్రెస్వారు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్వేకు అనుమతి ఇవ్వలేదు: ఈసీ బీబీఎంపీ వ్యాప్తిలో ఓటర్ల సర్వే నిర్వహించేందుకు ఏ సంస్థకు అనుమతి ఇవ్వలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా చెప్పారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏ సంస్థకు సమీక్ష కు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వేతర సంస్థ చెలుమ కు ఓటర్ల జాగృతి అభియాన జరపడానికి అనుమతివ్వగా, ఆ సంస్థపై ఫిర్యాదు రావటంతో తక్షణమే బీబీఎంపీ ఎన్నికలాధికారి రద్దు చేశారని తెలిపారు. బూత్ స్థాయి అధికారి గుర్తింపు కార్డు దుర్వినియోగం ఘటనలో మహాదేవపుర ఓటర్ల నమోదు అధికారి వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. (చదవండి: మంటల్లో బ్యాంకు అధికారి...మొబైల్ ఫోన్ పేలడమా? ఆత్మహత్య?) -
ఓటరు జాబితాలో చేర్చండి లేదా డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి
చండూరు: తమకు సమాచారం లేకుండానే ఓటరు జాబితాలో తమ పేర్లను తొలగించారని మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీ లకినేనిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన పలువురు బాధితులు గురువారం చండూరులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓట్లను వినియోగించుకునేలా ఓటర్ లిస్టులో పేర్లనైనా చేర్చండి.. లేదంటే తమకు డెత్ సర్టిఫికెట్ అయినా ఇప్పించాలని కోరారు. తాము గ్రామంలోనే నివసిస్తున్నా తమ పేర్లను ఓటరు జాబితా నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కారింగు శివలింగం, షేక్ ఖాసీంబీ, అలివేలు, దోమలపల్లి జంగయ్య ఉన్నారు. -
మునుగోడు పాలి‘ట్రిక్స్’..పెండింగ్ ఓటర్ లిస్టును నిలిపేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు.. మునుగోడు ఓటర్ల జాబితాపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓటర్ లిస్ట్లో కొత్త ఓటర్ల నమోదుపై బీజేపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, విచారణ సందర్భంగా హైకోర్ట్ ఓటర్ల జాబితాను కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో, ఈసీ ఓటర్ జాబితాను కోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా 25వేల ఓట్లలో 12వేలు నిర్ధారించినట్టు, మరో 7వేలు తిరస్కరించినట్టు ఈసీ పేర్కొంది. దీంతో, పెండింగ్లో ఉన్న ఓటర్ జాబితాను నిలిపేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
మునుగోడు ఓటర్ల జాబితాలో అక్రమాలు
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితాలో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ఇటీవల ఓటర్ల జాబితా లో చేరినవారి వివరాలను పరిశీలించాలని, అక్రమాలను అడ్డుకొనేందుకు వెంటనే పరిశీలకుడిని పంపించాలని కోరింది. అనంతరం కేంద్ర మంత్రి మురళీధరన్, ఎంపీ సారంగి, తెలంగాణ బీజేపీ నాయకుడు రామచందర్రావులతో కలిసి తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడులో 25వేల కొత్త ఓటర్ల నమోదు జరిగింది. సాధారణంగా కొత్త ఓటర్ల నమోదు సమయంలో ఎన్నడూ ఈ నియోజకవర్గంలో 2,000 మంది దాటలేదు. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? 25 వేల కొత్త ఓటర్లు అంటే.. 40 వేల మందికిపైగా జనాభా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టు భావించాలి. అంత భారీగా వలస ఎలా సాధ్యం? దీనిపై చర్యలు చేపట్టాలని ఈసీని కోరా’ అని తరుణ్ ఛుగ్ వెల్లడించారు. అధికారులను బదిలీ చేయాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు మునుగోడు ప్రాంతంలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఈసీ అనుమతి లేకుండా అక్కడికి వెళ్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరామని తరుణ్ ఛుగ్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సచివాలయాన్ని మునుగోడుకు మార్చి అక్కడ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేశారని.. అధికార యంత్రాంగం, మంత్రులు మొత్తం అక్కడే ఉన్నారని విమర్శించారు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవం రాజగోపాల్రెడ్డిపై కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. కాగా మునుగోడు లో ఓటర్ల నమోదు వ్యవహారంలో గోల్మాల్ ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేర్కొన్నారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఎన్నికల పర్యవేక్షకులను నియమించి అవకతవకలకు అడ్డుకట్ట వేయా లని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. -
మునుగోడులో మరో ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రెండు నెలల్లోనే పాతిక వేలు దాటిందని పేర్కొంది. ఈ తతంగంపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందు 7 నెలల కాలంలో 1,474 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు 6 నెలల్లోనే పెద్ద మొత్తంలో 24,781 దరఖాస్తు రావడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని చెప్పింది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోరారు. ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారని రచనారెడ్డి తెలపడంతో.. ఈ నెల 13న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. -
Munugode Bypoll 2022: దృష్టంతా ఓటర్ల జాబితాలపైనే...!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కౌంట్డౌన్ మొదలుకావడంతో ప్రధాన రాజకీయపక్షాల దృష్టంతా ఇప్పుడు ఓటర్ల జాబితాపై కేంద్రీకృతమైంది. నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయి.. ఏయే సామాజిక వర్గాల ఓట్లు ఎన్నెన్ని ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి.. తదితర అంశాలపై పార్టీలు సమాలోచనలు సాగిస్తున్నాయి. మునుగోడు ఓటర్లుగా ఉంటూ నియోజకవర్గం బయట.. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై ఆరా తీయడం ప్రారంభించాయి. వచ్చేనెల 3.. పోలింగ్ తేదీన వారందరిని పోలింగ్ స్టేషన్లకు రప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. నియోజకవర్గం వెలుపల ఉన్న ఓటర్లను కలసి వారి మద్దతును కూడగట్టేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో ఉండని వారిలో ఎక్కువ శాతం మంది ఎల్బీనగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా పార్టీ నేతలు గుర్తించారు. ఆ ఓటర్లు, వారి అడ్రస్లను వెలికితీసే బాధ్యతలను ఎల్బీ నగర్, ఇతర కార్పొరేటర్లకు అప్పగించినట్లు సమాచారం. ఓటింగ్ రోజున వారిని మునుగోడుకు తరలించే ఏర్పాట్లపై సైతం పార్టీ నాయకులు దృష్టి పెట్టా రు. ఇదిలాఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు శనివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన భేటీ జరగనుంది. మునుగోడు ఎన్నికలపై ప్రత్యేక చర్చతో పాటు పారీ్టపరంగా చేపడుతున్న కార్యక్రమాలను సైతం సమీక్షిస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తెలిపారు. ఈ భేటీ లో పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలతో అసెంబ్లీ ఇన్చార్జీలు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో జాతీయ నేతలు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ పాల్గొంటారని వివరించారు. చదవండి: అహంతోనే వినతిపత్రం విసిరికొట్టారు -
ఇక 17ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు
-
ఇకపై 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తు.. ఈసీ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. ఏడాదిలో మూడుసార్లు అవకాశం.. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీల్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్ జాబితాను అప్డేట్ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్గా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్పీ యాక్ట్ 1950లోని సెక్షన్ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుంది ఈసీ. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. ఇదీ చదవండి: గూగుల్తో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ ఉండదటా! -
తెలంగాణలో ఓటర్లు ఎంత మందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,52,56,474 మంది పురుషులు, 1,50,98,685 మంది మహిళలు, 1,735 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం 3,03,56,894 మంది ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2022లో రూపొందిం చిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ బుధవారం ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,03,56,665 మంది ఓటర్లుండగా, సవరణలో భాగంగా 2,27,226 మంది పేర్లను కొత్తగా చేర్చారు. వివిధ కారణాలతో మరో 2,26,997 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. 18–19 ఏళ్ల వయసున్న 1,36,496 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటర్ల జాబితాలో స్థానం పొందారు. మరో 14,661 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. -
తేలిన స్థానిక సంస్థల మండలి ఓటర్ల లెక్క.. 6 స్థానాల్లో 5,326 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఆరు స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు స్థానాల్లో 2,997 మంది మహిళలు, 2,329 మంది పురుషులు.. కలిపి మొత్తం 5,326 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీలు 3,223, జెడ్పీటీసీలు 325, మున్సిపల్ కౌన్సిలర్లు 1,544, కార్పొరేటర్లు 169, ఎక్స్అఫీషియో ఓటర్లు 65 మంది ఉన్నారు. రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల అథారిటీల (12 సీట్లకు) మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, ఆరు సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన ఆదిలాబాద్, కరీంనగర్ (2 సీట్లు), మెదక్, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహించి 12న ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ స్థానాల్లో ఓటేయనున్న వారి వివరాలను పట్టికలో చూడవచ్చు.. -
37 ‘మునిసిపల్’ ఎన్నికలకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలకశాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపి మొత్తం 125 ఉండగా ఇటీవల 87 చోట్ల ఎన్నికలు జరిగాయి. కాకినాడ కార్పొరేషన్కు 2017లోనే ఎన్నికలు జరిగాయి. దీంతో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లతోసహా 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్ పనుల్ని వచ్చేనెల 15 నాటికి పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. ఓటర్ల జాబితాలను రూపొందించాలని, అవసరమైనచోట వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. అవసరమైనచోట వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రతిపాదనలను రూపొందించి, వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించమని ఆదేశించింది. సమీప గ్రామాలను విలీనం చేయడంపై ఉన్న వ్యాజ్యాలను త్వరగా పరిష్కరించాలని పురపాలకశాఖ యోచిస్తోంది. ఆ 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. అందుకు సన్నద్ధమై ఉండాలని భావిస్తోంది. -
నవంబర్ 16 నుంచి ఓటర్ల జాబితా సవరణ
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ► ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగిస్తారు. అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ► నవంబర్ 1వ తేదీ నుంచి ఫాం 1 నుంచి 8 వరకు అందుబాటులో తెస్తారు. సప్లిమెంటరీతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 16వ తేదీన ప్రకటిస్తారు. అదే రోజు నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండేవారితో పాటు ఓటర్ల జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ► డిసెంబర్ 15వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ► నవంబర్ 28, 29, డిసెంబర్ 12, 13 తేదీ (శని, ఆదివారాలు)ల్లో పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ► ఓటర్లుగా చేరేందుకు బూత్ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులుంటే వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని సరిచూసుకుంటారు. జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. -
రాష్ట్రంలో 2.99 కోట్ల ఓటర్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,99,32,943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,50,41,943 మంది పురుష, 1,48,89,410 మహిళ, 1590 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. కొత్తగా 1,44,855 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 12,639 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020లో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని ఓటర్లందరికీ ప్రామాణిక ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా జారీ చేయనున్నారు. ఓటర్లకు జీవితాంతం ఒకే విశిష్ట సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 10 ఆంగ్ల అక్షరాలు, అంకెల (ఆల్ఫా న్యూమరిక్) కలయికతో కొత్త నమూనాలో ప్రామాణిక ఓటరు గుర్తింపు (స్టాండర్డ్ ఎపిక్) కార్డులు జారీ చేస్తోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లినా.. వారి విశిష్ట ఓటరు సంఖ్య మారదు. చిరునామా మారితే అదే విశిష్ట సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయనున్నారు. -
ముందుగా మున్సిపోల్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మున్సి‘పోల్స్’ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఈలోపు ‘పుర’పోరు పూర్తిచేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదలైంది. అనంతపురం, కదిరి: మున్సి‘పోల్స్’ ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు దాదాపుగా పూర్తి చేసిన అధికారులు.. తాజాగా సోమవారం అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఏ క్షణాన నోటిఫికేషన్ విడుదల చేసినా.. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ గంధం చంద్రుడుతో పాటు ఎస్పీ సత్యయేసుబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని అధికారులు భావిస్తున్నారు. వార్డుల వారీగాఓటరు జాబితా విడుదల రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే కులాలవారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తాజాగా సోమవారం మొత్తం ఓటర్ల వివరాలతో వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఇటీవల కమిషనర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని పేర్కొన్నారు. అందుకే నగర పాలక సంస్థతో పాటు మిగతా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లలో మునిగిపోయారు. కొత్తగా ఏర్పడ్డ పెనుకొండ మున్సిపాలిటీలో ఓటరు జాబితా కూడా ఇంకా ప్రకటించలేదు. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్? ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,200 మంది ఓటర్లకు ఒక బ్యాలెట్ బాక్స్ చొప్పున అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 7న వీడియో కాన్ఫరెన్స్ పోలింగ్ కేంద్రాల వివరాలను ఈ నెల 5న ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 6వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 7వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాల అందినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 10న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల ఖరారు ఇలా.. నగరపాలక సంస్థలోని అన్ని డివిజన్లతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల రిజర్వేషన్లను కలెక్టర్ నేతృత్వంలోనే నిర్ణయిస్తారు. నగరపాలక సంస్థ మేయర్ పదవితో పాటు అన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు మాత్రం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్లు ఖరారు చేస్తారు. -
‘మున్సిపాలిటీ’ ఓటర్ల తుది జాబితా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. 22న జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల పరిధిలో 53,36,605 ఓటర్లున్నట్టు తేలింది. పురుషులు 26,71,694, మహిళలు 26,64, 557, ఇతరులు 354 మంది ఉన్నారు. ఇటీవ ల 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల వా రీగా ముసాయిదా జాబితాను ప్రకటించగా, శనివారం ఒక్కో జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓ టర్ల తుది జాబితాను ప్రకటించారు. అయితే మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాలను ఆ దివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 30న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబి తా ప్రకారం... ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 53,57,260 ఉండగా, వారిలో పురుషులు 26,72,021 మంది, మహిళలు 26,64,885 మంది, ఇతరులు 354 ఉన్నట్టు ప్రకటించా రు. శనివారం అనధికారికంగా వెల్లడించిన వి వరాల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 655 మేర తగ్గినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తుది జాబితాలో మహిళా ఓటర్ల కంటే పురుషుల ఓట్లు 7,137 అధికంగా ఉన్నాయి. -
మూడేళ్లకే ఓటు హక్కు
సాక్షి, కరీంనగర్ సిటీ: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అర్హతున్న వారికి ఓటుహక్కు ఇవ్వని అధికారులు, కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు. కరీంనగర్లో ఓటర్ ఐడీ వైఓజే 8588352 నంబర్పై నందిత మెతుకు పేరిట నమోదు అయింది. నందిత వయస్సు 35ఏళ్లుగా, ఇంటినంబర్ 5–6–434గా ప్రచురించారు. వీటిని చూసిన నందిత తండ్రి మెతుకు రమేశ్ అవాక్కయ్యాడు. తమకూతురు నందిత వయస్సు 3ఏళ్లని, ఎల్కేజీ చదువుతోందని తెలిపాడు. అధికారులు స్పందించి వెంటనే ఓటర్ లిస్ట్ నుంచి తమ కూతురుపేరు తొలగించాలని కోరాడు. -
ఓటరు పేరు.. థథ భర్త పేరు.. పప
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాల్లో అనేక తప్పులు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోమవారం విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితాలో పాదర్శకత లోపించింది. జిల్లాలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లోని ఓటరు జాబితాలను పరిశీలిస్తే అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వందల సంఖ్యలో బోగస్ ఓటర్లను నమోదు చేసి యథాతథంగా జాబితాను విడుదల చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులోనే మున్సిపల్ ఎన్నికలు వస్తాయన్న సంకేతాల నేపథ్యంలో అంతకు ముందటి నెలజులైలో ముసాయిదా ఓటరు జాబితాలను ఆయా మున్సిపాలిటీల్లో విడుదల చేశారు. ఈ సమయంలో చోటు చేసుకున్న తప్పిదాలను గుర్తించి.. సరిచేశారు. అయినా, తాజా ముసాయిదా జాబితాలో యథాతథంగా తప్పులు పునరావృతం కావడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకే ఓటరును రెండు, మూడుసార్లు ఓటరుగా నమోదు చేసిన దృశ్యాలు ప్రతి పురపాలక సంఘం పరిధిలో కనిపించాయి. ఓటు జాబితాలో పక్కపక్కనే ఈ తరహా తప్పిదాలు చోటుచేసుకున్నా గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటరు పేరు, ఫొటోలు, ఇంటి చిరునామా, వయసు ఇలా అన్ని వివరాల్లోనూ తప్పులే ఉన్నాయి. దీంతోపాటు సామాజిక వర్గాలు సైతం మార్చేశారు. ఎస్సీలను బీసీలుగా.. బీసీలను ఓసీలుగా నమోదు చేసి ప్రచురించారు. అసలు కొన్ని చోట్ల ఓటరు, తండ్రి పేరు స్థానంలో తెలుగు అక్షరాలను ముద్రించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించలేదు. కుప్పలుగా బోగస్ ఓటర్ల పేర్లు బోగస్ ఓటర్ల జాబితా చాంతాడంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో రెండు ఇంటి నంబర్లపై మొత్తం 160 మందిని ఓటర్లుగా నమోదు చేశారు. గతంలో ఇలాంటి తప్పిదాలను గుర్తించిన అధికారులు.. వందల సంఖ్యలో బోగస్ ఓటర్లను తొలగించారు. ఇంకా వందల సంఖ్యలో ఈ తరహా ఓటర్లు ఉన్నట్లు తాజా ముసాయిదా జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. ఇంకొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానికంగా నివసించిన వారికి ఓటు హక్కు కల్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇంటింటికి తిరిగి ఓటర్ల సమగ్ర వివరాలు సేకరించాల్సిన అధికారులు దాన్ని మరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా కొందరు వ్యక్తులను నమ్ముకుని ఓటర్ల వివరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే జాబితాలో పారదర్శకత లోపించినట్లు అర్థమవుతోంది. ఈ తరహా పరిస్థితి మీర్పేట, నార్సింగి మున్సిపాలిటీల్లో నెలకొంది. కొన్ని నెలల కిందట ఓటరు కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయాలన్న నిబంధన వచ్చింది. ఇది చాలా చోట్ల పకడ్బందీగా అమలు కాలేదు. దీంతో ఒకరి వివరాలు పలుచోట్ల నమోదైనా.. గుర్తించడం కష్టంగా మారింది. దీని కారణంగానే డుప్లికేట్ ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయని ఓ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. చాలా వరకు తామే స్వయంగా గుర్తిస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే స్థానికులు, రాజకీయ పార్టీల నుంచి వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. వీటి ఆధారంగా తప్పులను సవరించడంతోపాటు బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఈనెల 4న ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తామంటున్నారు. ఒకరికే రెండుసార్లు చోటు.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో ఒకరినే రెండుచోట్ల ఓటర్లుగా నమోదు చేశారు. సీరియల్ నంబర్ 1024పై సంతోష బిజ్జాల (తండ్రి జగన్)కు ఓటు హక్కు కల్పించగా.. 1025 నంబర్పైనా ఆమె పేరునే జాబితాలో చేర్చారు. ఇక్కడ భర్త వీరేశంగా పేర్కొన్నారు. అలాగే 1027 సీరియల్ నంబర్పై రిజ్వానా బేగంకు ఓటు కల్పించిన అధికారులు.. 1028 సీరియల్ నంబర్పై ఆమె పేరును మరోసారి నమోదు చేశారు. ఒకచోట భర్త పేరు షమీం అలీ ఉండగా.. మరోచోట మహ్మద్ షమీం అలీగా పేర్కొన్నారు. ఇక్కడ ఒకరి ఫొటోనే రెండుసార్లు ముద్రించారు. ఓటరు పేరు థథ షాద్నగర్ పట్టణంలోని 1–7–152/1/అ నంబర్ గల ఇంట్లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఓటరు పేరు ‘థథ’ అని ముసాయిదా జాబితాలో ప్రచురించారు. ఆమె భర్త పేరును ‘పప’గా నమోదు చేయడం గమనార్హం. అంతేగాక చాలా మంది ఓటర్ల సామాజిక వర్గాలను తారుమారు చేశారు. ఓసీలను.. బీసీలుగా, ఎస్సీలను.. బీసీలుగా మార్చారు. రెండు ఇళ్లలో 160 మంది ఓటర్లు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు స్పష్టమవుతోంది. రెండు ఇంటి నంబర్లపై(6–54, 6–71/ఏ) మొత్తం 160 మందిని ఓటర్లుగా జాబితాలో చేర్చారు. -
4న తుది ఓటర్ల జాబితా.. 6వరకు ఓటు నమోదుకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సూచించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం అసాధ్యమని తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టంలోని 195, 197 సెక్షన్లకు అనుగుణంగా ప్రభుత్వ అనుమతితోనే ఈనెల 24న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశామని.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని స్పష్టంచేశారు. షెడ్యూల్ జారీ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కొత్త పద్థతి పాటించిందని, నోటిఫికేషన్ను వచ్చేనెల 7న బహిర్గతం చేయాల్సి ఉండగా, షెడ్యూల్ను ముందుగానే 24న విడుదల చేసిందని.. తద్వారా పార్టీలు, ఓటర్లను ముందుగానే ఎన్నికలకు సిద్ధం చేసినట్టు అయిందన్నారు. ఎస్ఈసీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంతో కుమ్మక్కై తొందరపాటుతో షెడ్యూల్ జారీ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చట్టం, ఎస్ఈసీ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. జనవరి 6 వరకు ఓటు నమోదు.. అసెంబ్లీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రాతిపదికన మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధమైందని నాగిరెడ్డి తెలిపారు. ఎస్ఈసీ వెబ్సైట్లో ఉన్న ముసాయిదా ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకుని, ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి 2 వరకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మున్సిపల్ ఓటర్ల జాబితాలో లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తే మున్సిపల్ కమిషనర్లు సరిచేస్తారని వివరించారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు లేకున్నా.. జనవరి 6 వరకు ఫారం–6, 7, 8 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జనవరి 4న వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాలు ఎస్ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయన్నారు. 7న నోటిషికేషన్ విడుదల తర్వాత 8న ఓటర్ల జాబితాలను రిటర్నింగ్ అధికారులు నోటీ సు బోర్డులపై ప్రదర్శిస్తారని, అదే రోజునుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అన్ని అంశాలూ వెబ్సైట్లో... మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను టీ పోల్ సాఫ్ట్వేర్తో పాటు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పొందుపరిచినట్టు నాగిరెడ్డి తెలిపారు. ఓటరు స్లిప్పులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం వచ్చేనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లు... మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ డైరెక్టర్, మున్సిపాలిటీల వార్డులకు జిల్లా కలెక్లర్లు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని వివరించారు. జనవరి 4న సాయంత్రానికి రిజర్వేషన్లను పూర్తి చేసి 5న వెల్లడిస్తామన్నారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేశారు. సోమవారమిక్కడి ఓ ప్రైవేటు హోటల్లో మున్సిపల్ ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు పరిశీలకులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల విషయంలో వ్యయ పరిశీలకులు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. -
రిజర్వేషన్లు తేలకముందే మున్సిపోల్స్కు షెడ్యూలా?
సాక్షి, హైదరాబాద్: వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ఖరారు చేయకుండానే పురపాలిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై టీపీసీసీ కోర్కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేయకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడాన్ని తప్పుపట్టింది. గురువారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కోర్ కమిటీ భేటీ అయింది. ఇందులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్కృష్ణన్, సంపత్, వంశీచందర్రెడ్డి పాల్గొన్నారు. కనీసం వారమైనా ఇవ్వాల్సింది.. భేటీలో భాగంగా ఈనెల 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ నిర్వహణ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేత లు చర్చించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్పై చర్చించిన నేతలు ఎన్నికల సంఘం తీరును ఆక్షేపించారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వా త అభ్యర్థులను ఎంపిక చేసుకుని, వారు నామినేషన్ దాఖలుకు వీలుగా అన్ని పత్రాలు సిద్ధం చేసుకునేందుకు కనీసం వారం సమయం కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడం సరైంది కాదని, దీనిపై హైకో ర్టుకు వెళ్లాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను నిలిపేయాలని అడగటం లేదని, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం తగిన సమయం ఇవ్వాలని మాత్రమే కోర్టును కోరాలని అభిప్రాయపడ్డారు. పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికల సమాయత్తంపై కూడా నేతలు చర్చించారు. స్థానికంగా అవసరమైన స్థానాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకునే అధికారం స్థానిక నాయకత్వానికే ఇవ్వాలని కోర్కమిటీ నిర్ణయించింది. డీజీపీని అడిగితే డీసీపీ స్పందిస్తారా? నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తాము డీజీపీని కోరితే స్థానిక డీసీపీ స్పందించి ర్యాలీకి అనుమతి లేదనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన ర్యాలీ నిర్వహించి తీరాల్సిందేనని కోర్కమిటీ నిర్ణయించింది. వేదిక పంచుకునేది లేదు.. ఇక నిజామాబాద్లో యునైటెడ్ ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27న ఎన్ఆర్సీకి వ్యతిరేకం గా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనడంపై కూడా కోర్కమిటీ సమావేశంలో చర్చించా రు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ తనకు ఫోన్ చేశారని టీపీసీసీ కోశాధికారి గూడూరు దృష్టికి తెచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్లు పాల్గొనే ఏ వేదికను కాంగ్రె స్ పంచుకునేది లేదన్నారు. కోర్కమిటీ సమావేశం అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్రెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి ఈనెల 28న తాము నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతినివ్వాలని కోరారు. -
మీ పేరు చూసుకోండి..
సాక్షి, హైదరాబాద్: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఓటర్లు.. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఎన్నికలు జరనున్న పురపాలక సంస్థల పరిధిలోని సంబంధిత అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో తమ పేరు రిజిస్టరై ఉందో లేదో పరిశీలించుకోవాలని ఎస్ఈసీ కార్యదర్శి అశోక్కుమార్ కోరారు. ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు లేవని ఎన్నికల రోజు నిరాశకు గురికాకుండా ముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే విజ్ఞప్తి చేస్తున్నామాని, తర్వాత పేర్లు చేర్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ప్రాతిపదికనే మున్సిపల్ ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నందున ఆ జాబితాలు సరిచూసుకోవాలని సూచించారు. ఇప్పటికే మున్సిపల్ సంస్థలు వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి గత జూలై 16న ప్రచురించిన నేపథ్యంలో మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా లేదా ఓటర్లు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. జాబితాలో పేర్లుంటేనే.. వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉన్న వారే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులని, ఫొటో ఓటరు కార్డు కలిగి ఉన్నంత మాత్రాన, ఇటీవలి ఎన్నికల్లో ఓటు వేసినంత మాత్రాన మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసే వీలుండదని వివరించారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాల్లో పేర్లుంటేనే ఓటేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎస్ఈసీ వెబ్పోర్టల్ (్టట్ఛఛి.జౌఠి.జీn)లో ఓటర్ పోర్టల్ మాడ్యూల్లో ఓటర్స్లిప్ను డౌన్లోడ్ చేసుకుని తమ ఓటు స్టేటస్ను పరిశీలించుకోవచ్చు. సంబంధిత అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉండేలా చూసుకోవచ్చు. ఛ్ఛిౌ.్ట్ఛ ్చnజ్చn్చ వెబ్సైట్ ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఏ ఓటరైనా తన ఓటు ఉందో లేదా తెలుసుకోవచ్చు. అసెంబ్లీ జాబితాల్లో పేర్లు లేనివారు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికార్లకు నిర్ణీత ఫార్మాట్లో తగిన పత్రాలు లేదా ఆన్లైన్లో కూడా సమర్పించొచ్చని ఎస్ఈసీ తెలిపింది. -
ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా..
ఇబ్రహీంపట్నం పురపాలికలో 8–120 ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటుండగా.. 144 ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు. 8–119 ఇంటిలో నివసిస్తున్న నలుగురిలో ఒకరికే ఓటు ఉండగా.. ఈ ఇంటి పేరు మీద ఏకంగా 60 ఓట్లను ఎక్కించారు. 6–72లో 102 ఓట్లు, 6–28లో 105 ఓట్లు ఎక్కించారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో 6వ వార్డులో ఉండాల్సిన ఓట్లు 7వ వార్డులో, 9వ వార్డులో ఓట్లు 10వ వార్డులో చేర్చారన్న ఆరోపణలున్నాయి. 6, 7, 9, 10, 11 వార్డుల ఓటర్ల జాబితాల తయారీలో అవకతవకలు జరిగాయన్నది స్థానికుల వాదన. ఇది వార్డులు రిజర్వేషన్ల ఖరారుపై కూడా ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఓటరు జాబితా అవకతవకలపై 26 దరఖాస్తులు అందగా, వందల సంఖ్యలో ఓటర్లు తమ ఓట్లు ఎక్కడున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సాక్షి, హైదరాబాద్ : ఈ రెండు పురపాలికల్లోనే కాదు రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇల్లు కట్టని ప్లాట్లలో కుటుంబాలకు కుటుంబాలే జీవిస్తున్నట్లు ఓ గందరగోళ జాబితా తయారీలో అధికారులు, రాజకీయ నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఓపెన్ ప్లాటే కాదు.. ఆఖరికి సర్వే నంబర్లలోనూ ఓటర్లున్నట్లు నమోదు చేశారు. పెద్ద అంబర్పేట పురపాలక సంఘం పరిధిలోని 7వ నంబర్ వార్డులో మొత్తం 1,615 మంది ఓటర్లలో ఏకంగా 588 మంది ఒకే సర్వే నంబర్, ఓపెన్ ప్లాట్లో నివాసమున్నట్లు జాబితాలో పొందుపరిచారు. అదే మున్సిపాలిటీలోని 15 వార్డులో ఒక కంపెనీలో పనిచేస్తున్న 211 మంది స్థానికేతరులను కూడా సర్వే నంబర్ ఆధారంగానే జాబితాలోకి ఎక్కించారు. ఆఖరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపులోనూ ఇలాంటి సిత్రాలెన్నో జరిగాయి. ఇంటింటికి తిరగకుండానే కార్యాలయాల్లో కూర్చొని ఓటర్ల జాబితా కూర్పు చేయడంతో ఓసీలు బీసీలుగా.. బీసీలు కాస్తా ఎస్సీలుగా నమోదయ్యారు. హడావుడితో ఆగమాగం! సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వార్డుల విభజన, ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా రూపొందించారు. వార్డుల విభజనలో తప్పులు దొర్లడం.. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడమే కాకుండా.. ఆఖరికి భార్యాభర్తల ఓట్లను కూడా విడగొట్టడంతో పురపాలక శాఖ పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఓటర్ల జాబితా షెడ్యూల్ను తరచూ కుదింపు.. పొడిగింపు చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. వార్డుల ఖరారులో శాస్త్రీయత పాటించకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీలో చోటుచేసుకున్న అక్రమాలపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఇప్పటికే శంషాబాద్, భైంసా, ఇబ్రహీంపట్నం, మీర్పేట, బండ్లగూడ జాగీర్, మహబూబ్నగర్, మిర్యాలగూడ మున్సిపాలిటీల ఎన్నికలపై స్టే విధించింది. ఈ కోవలోనే మరికొందరు కోర్టు మెట్లెక్కేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థలకు ఆగస్టు రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయ ఒత్తిళ్లు.. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితాలో ఏకంగా ఓపెన్ ప్లాట్, సర్వే నంబర్లలో స్థానికేతరుల పేర్లను నమోదు చేస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఎన్నికల తంతును త్వరితగతిన పూర్తి చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మున్సిపల్ యంత్రాంగంపై ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో నమోదవుతున్న పేర్లను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా యథాతథంగా అచ్చేస్తుండటం ఈ ఆరోపణలకు అద్దంపడుతోంది. -
లెక్క తేలలేదు..
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓటర్ల లెక్క పూర్తిగా తేలలేదు. ఓటర్ల తుది జాబితా వెల్లడించినప్పటికీ కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలోని మిగతా మున్సిపాల్టీల్లో ఓటర్ల తుది జాబితాను కులాల వారీగా, మహిళా ఓటర్ల సంఖ్య ప్రకటించినా నగరపాలక సంస్థలో బుధవారం నాటికి వాయిదా పడింది. కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి మంగళవారం 60 డివిజన్లకు చెందిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. విడుదల చేసిన తుది ఓటర్ జాబితాను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. నగరంలో ఉన్న వివిధ పార్టీల కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులకు నగరపాలకసంస్థ తరఫున 60 డివిజన్ల ఓటర్ల జాబితాను అందజేశారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి న్యాయబద్ధమైనవి పరిష్కరించినట్లు వెల్లడించారు. తుది జాబితాలో పెరిగిన ఓటర్లు 18,941 కరీంనగర్ నగరపాలక సంస్థలో పునర్విభజన తర్వాత చేపట్టిన ఓటర్ల సర్వే ఆధారంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,56,845 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,29,273 మంది కాగా, మహిళలు 1,27,572 మంది ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. తుదిజాబితా ప్రకారం ఓటర్లు 2,75,786 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా కంటే ప్రస్తుత జాబితాలో 18,941 ఓటర్లు పెరిగారు. ముసాయిదా జాబితా తయారీ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఎక్కడ గల్లంతయ్యాయో... సర్వే చేపట్టిన వారికే తెలియాలి. వెల్లడించని కుల, మహిళా ఓటర్ల సంఖ్య.. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓటర్ల తుది జాబితాను వెల్లడించినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన సంఖ్యను ప్రకటించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కుల, మహిళా ఓటర్ల సంఖ్యను ప్రకటించినా కరీంనగర్లో ప్రకటించికపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు, ఈ నెల 14 తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం మరో రెండు రోజుల గడువు పెంచి 16న తుది జాబితా ప్రకటించాలని సమయం ఇచ్చినప్పటికీ అధికారులు గణన పూర్తి చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కులాల వారీగా ఓటర్ల జాబితాల్లో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా... అంటూ విపక్ష పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా కులాల గుర్తింపు... నగరపాలక సంస్థలో పలు డివిజన్లలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన సమయంలో ఇష్టం వచ్చినట్లు ఒక కులం వారికి మరో కులంగా గుర్తించారు. నగరంలోని 3–7–188/1 ఇంటిలో రెడ్డి కులానికి చెందిన రాజిరెడ్డి కుటుంబంలోని ఓటర్లను ఎస్సీలుగా లెక్కించారు. ఇది ఒక్క ప్రాంతంలోనే కాదు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠ.. ఓటర్ల జాబితాలో కుల గణనను వెల్లడించికపోవడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ వీడడం లేదు. కుల గణనను ప్రకటిస్తే ఆ లెక్క ప్రకారం రిజర్వేషన్లను లెక్కించుకునే అవకాశం ఉండేది. అధికారులు కుల గణనను ప్రకటించకపోవడంతో రిజర్వేషన్లపై సందిగ్ధం నెలకొంది. ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఏ డివిజన్ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే ఎవరూ తేల్చలేని పరిస్థితి నెలకొంది. కుల గణన ప్రకటిస్తే తప్ప రిజర్వేషన్లపై ఉత్కంఠత వీడే అవకాశం లేదు. మున్సిపాల్టీల వారీగా.. ► చొప్పదండి మున్సిపాల్టీలో మొత్తం 12,554 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,253, మహిళలు 6,301 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 48 మంది అధికంగా ఉండడం గమనార్హం. కొత్త మున్సిపల్ చట్టంపై చట్టసభల్లో ఆమోదం పొందాకే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ► కొత్తపల్లి మున్సిపాల్టీ తుది ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేశారు. కమిషనర్ గాలిపల్లి స్వరూపారాణి, టీపీఓ శ్రీహరి తదితరులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. 12 వార్డులకు గాను 9,421 మంది ఫొటోలతో కూడిన ఓటరు జాబితా విడుదల చేశారు. 117 ఓట్లు డబుల్గా నమోదైనట్లు వచ్చిన అభ్యర్థనలను తదుపరి చర్యల నిమిత్తం ఆర్డీఓకు నివేదించారు. ► జమ్మికుంట పురపాలక సంఘం ఓటర్ల తుది జాబితా వెలువడింది. కమిషనర్ అనిసూర్ రషీద్ ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మొత్తం 29,087 ఓటర్లుండగా.. ఇందులో 14,596 మంది మహిళలు, 14,491 పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. బీసీలు 18,920, ఎస్సీలు 5,704, ఎస్టీలు 210, ఓసీలు 4,253 ఉన్నట్లు వివరించారు. ► హుజూరాబాద్ పట్టణంలోని 30 వార్డులకు సంబంధించిన ఓటరు తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 25,406 మంది ఉండగా.. పురుషులు 12,659, మహిళా ఓటర్లు 12,747 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 234, ఎస్సీలు 4,583, బీసీలు 16,305, ఓసీ ఓటర్లు 4,284 మంది ఉన్నారు. -
‘ప్రత్యేక’ పాలనలోకి..
సాక్షి, మండపేట(పశ్చిమ గోదావరి) : జిల్లా, మండల పరిషత్తులు ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి రానున్నాయి. ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం, 4వ తేదీతో జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్నాయి. జిల్లాలో 1,102 మంది ఎంపీటీసీ సభ్యులు, 63 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జిల్లాలోని ఎటపాక, చింతూరు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో అవి మినహా మిగిలిన మండలాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 3న ముగియనుంది. పరిషత్తులకు ఎన్నికలు జరిగి, కొత్త పాలక వర్గాలు ఏర్పడేంత వరకూ జిల్లా, మండల పరిషత్తులు ప్రత్యేక పాలనలో ఉండనున్నాయి. గతంలో మాదిరిగా జిల్లా పరిషత్తుకు కలెక్టర్ను, మండల పరిషత్తులకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికారులు అంటున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ నుంచి సీఎం కార్యాలయానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు రెండు రోజుల్లో జిల్లా, మండల పరిషత్తుల పదవీ కాలం ముగియనుండగా ‘పరిషత్ పోరు’కు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) వారీగా జూలై 3వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను ఎంపీడీఓ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈఓ సిద్ధం చేయాలని సూచించింది. ఇప్పటికే పంచాయతీల్లో ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఓటర్ల ఫొటోలు, డోర్ నంబర్లతో అధికారులు జాబితాలను సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీ పరిధి మేరకు అధికారులు జాబితాలను రూపొందిస్తున్నారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీన వీటిని అందుబాటులో ఉంచనున్నారు. -
తెలుగు తమ్ముళ్లలో ‘స్థానిక’ భయం
చంద్రబాబు టీడీపీ గెలుపు నల్లెరు మీద నడకేనంటూ పదేపదే చెప్తూ మేకపోతు గాభీర్యం ప్రదర్శించారు. దీంతో ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి రావటం తథ్యమని ఆపార్టీ నాయకులు బలంగా నమ్మారు. ఎన్నికల అనంతరం ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో ఆంధ్రా ఆక్టోపస్గా పేరుపొందిన లగడపాటి రాజ్గోపాల్ సర్వే పేరిట టీడీపీ అనుకూలంగా రిపోర్టు చెప్పటంతో వాళ్ల మాట విన్న టీడీపీ నేతలు లక్షల రూపాయల్లో బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా నష్టపోయారు. సాక్షి, యద్దనపూడి (ప్రకాశం): ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయ ప్రభంజనంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోయారు. గత ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీలో వర్గాలుగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో తాము నష్టపోవాల్సివస్తుందన్న ఉద్దేశ్యంతో ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్సిగ్నల్ లభించింది. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే టీడీపీ నాయకులు మాత్రం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా లేనట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అధికారులు స్థానిక ఎన్నికలకు కులాలవారీగా ఓటర్ల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఆరుమండలాల పరిధిలో 95 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2,29,742 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. ఇతరులు (థర్డ్జండర్లు) 10 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామపంచాయతీలకు అందజేశారు. ఇక పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. స్థానిక ఎన్నికల ఖర్చుపై చర్చ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు అభ్యర్థులు ఖర్చుచేశారు. దీనిని బట్టి రేపు జరగనున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఓటర్లకు ఇదే రీతిలో పంపిణీ చేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసలే టీడీపీ నాయకులు బెట్టింగ్లో ఆర్థికంగా నష్టపోవటం, ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఫుల్ జోష్లో ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవటం మావల్ల కాదని స్థానిక నేతలు చేతులెతేస్తున్నారు. ఒకవేళ పోటీచేయాల్సి వస్తే స్థానిక ఎమ్మెల్యేనో లేక పార్టీ అధిష్ఠానమో భారీమెత్తంలో ఆర్థిక సాయం అందిస్తే తప్ప తాము పోటీచేసే ప్రసక్తే లేదని స్థానిక నేతలు తెగేసి చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే వైఎస్సార్ సీపీ తరపున స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆపార్టీ ఆశావాహులు అధికంగా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇలా స్థానిక ఎన్నికలైన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘం వంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా మిన్నకుండిపోతే భవిష్యత్లో తమ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఎదురవుతుందని కొందరు టీడీపీ సినీయర్ నాయకులు వాపోతున్నారు. మెత్తం మీద స్థానిక ఎన్నికల్లో పోటీపై కొందరు టీడీపీ నాయకులు ఎటూ తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామపంచాయతీ కార్యాలయం -
రేపే ప్రజాతీర్పు
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ప్రజాతీర్పు రేపు వెలువడనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని అటు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమదాలవలసలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉండడంతో రాష్ట్రంలో అందరి చూపు ఆమదాలవలస నియోజకవర్గం పైనే ఉంది. పోలింగ్ జరిగి ఫలితాల వెల్లడికి మధ్య సుమారు 40 రోజుల విరామం ఉండడంతో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండడంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రజాతీర్పుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. అని చర్చించుకుంటున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూన రవికుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డేపల్లి సత్యవతి, బీజేపీ అభ్యర్థిగా పాతిన గడ్డియ్య, జనసేన అభ్యర్ధిగా పేడాడ రామ్మోహన్రావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తూలుగు సతీష్కుమార్ బరిలో నిలిచారు. అయితే వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పోలింగ్ సరలి బట్టి ఇక్కడ విజయం సాధిస్తారనేది స్పష్టత రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అధిక శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి పడ్డాయని, ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం గెలుపు తద్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేయగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రజలు మరోసారి కూన రవికుమార్కు పట్టం కడతారని టీడీపీ వర్గీయులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 78.8 శాతం పోలిగ్ జరగడంతో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, పసుపు కుంకుమ వంటివి లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. జగన్ పాదయాత్ర, నవరత్నాలు తమను గెలిపిస్తాయని వైఎస్సార్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ప్రజలు నాడి పట్టుకోవడం కష్టతరంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ – టీడీపీకి పోలైన ఓట్లు వివరాలు మండలం వైఎస్సార్సీపీ టీడీపీ మెజార్టీ ఆమదాలవలస రూరల్ 12048 13095 1047 ఆమదాలవలస పట్టణం 7541 8947 1403 బూర్జ 10825 11059 234 సరుబుజ్జలి 9616 8912 704 పొందూరు 19168 22,686 3518 2019 ఎన్నికల పోలింగ్ వివరాలు ఆమదాలవలస నియోజకవర్గం కోడ్నెంబర్–06, మండలాలు 4 ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జలి, బూర్జ మొత్తం పోలింగ్ కేంద్రాలు: 259, ఆమదాలవలస–82, పొందూరు–77, సరుబుజ్జలి–45, బూర్జ–55 ఓటర్లు వివరాలు: పురుషులు 94,224 స్త్రీలు 93,403 ఇతరులు 46 మొత్తం 1,87,673 -
నారాయణా.. తగునా!
సాక్షి, అనంతపురం అర్బన్: రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ల జాబితా అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో అందించాలి. అయితే ఈ విషయం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు కొందరు తిరకాసు తంతుకు తెరతీశారు. టీడీపీ నేతలతో ఉన్న స్నేహంతో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గంలోని టీడీపీకి నేతలకు మూడు రోజులు ముందుగానే ఓటరు జాబితాను అందజేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల తహసీల్దారుగా వ్యహరిస్తున్న సి.భాస్కర్నారాయణ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను ఉన్నతాధికారులు కొనసాగిస్తుండడం విమర్శులు ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాలకు ఎలా వెళ్లింది.? ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటర్ల జాబితాను అందజేస్తామని సమాచారం ఇవ్వాలని ఆర్ఓ, ఈఆర్ఓలకు జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు మార్చి 31న వాట్స్ప్ మెసేజ్ పెట్టారు. దీంతో అభ్యర్థులు ఏప్రిల్ ఒకటిన జాబితా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు విరుద్ధంగా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గం టీడీపీ నాయకులకు మూడు రోజుల ముందేగా జాబితా చేరిపోయింది. దాన్ని పట్టుకుని టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతున్నారు. ధర్మవరం నియోజకవర్గానికి ముందుగానే చేరిన ఓటర్ల జాబితా ఎన్నికల తహసీల్దారుపై ఆరోపణ.. ఓటరు జాబితా ముందుగానే టీడీపీ నేతలకు అందడం వెనుక ఎన్నికల తహసీల్దారుగా కొనసాగుతున్న భాస్కర్నారాయణపై హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ధర్మవరం టీడీపీ అభ్యర్థి జి.సూర్యానారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అంతే కాకుండా సదరు నేతకు ఆయన క్లాస్మెట్ కూడా అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గం టీడీపీ నాయకులకు షెడ్యూల్ కంటే ముందుగానే ఓటర్ల జాబితా అందించడం వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. పర్సెంటేజీ దందా: ఎన్నికల విభాగంలో ఏళ్లగా తిష్టవేసిన భాస్కర్నారాయణ పర్సెంటేజీ, కమిషన్ దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల వ్యవహారానికి సంబంధించి స్టేషనరీ, ఫ్లెక్సీలు, కరపత్రాలు, ఓటర్ల జాబితా ముద్రణ ఇలా ప్రతి దాంట్లోనూ ఆయనకు కమిషన్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నా యి. ఈ కారణంగానే ఆయన రాజకీయ అండతో ఆ సీటు వదలకుండా ఏదో ఒక రకంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగింపు: భాస్కర్నారాయణకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు ఆయన్ను ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో వాస్తవాన్ని కప్పిపెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కూడా ఉన్నతాధికారులు తప్పుదారి పట్టించినట్లు విమర్శులు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ భాస్కర్నారాయణ సేవలను ఉపయోగించుకుంటున్నారు. దీంతో భాస్కర్ నారాయణ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. విభాగం సిబ్బందితో ఇష్టానుసారంగా మాట్లాడడం, వారిపై ప్రతి చిన్న విషయానికి ఆగ్రహించడం జరుగుతోందని కొందరు సిబ్బంది వాపోయారు. విచారణ చేయిస్తాం .. ఓటరు జాబితా కావాలనుకునే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి అర్జీ ఇస్తే...ఓటర్ల ఫొటోలు లేకుండా సాఫ్ట్ కాపీ (సీడీ) ఇస్తాం. అభ్యర్థులు వచ్చి ఓటర్ల జాబితా తీసుకోవాలని మార్చి 31న సమాచారం పంపాము. అయితే ధర్మవరం నియోజకవర్గానికి ఫొటో ఓటర్ల జాబితా ముందుగానే ఎలా ఇచ్చారు..? ఎవరు ఇచ్చారు..? అనే దానిపై విచారణ చేస్తాం. ఎస్.డిల్లీరావు,జాయింట్ కలెక్టర్ -
రాష్ట్ర ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకనే తొలిసారిగా రాష్ట్రస్థాయిలో పోలీసు, వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీసు పరిశీలకులుగా నియమించిన కేకే శర్మ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, కావాల్సిన పోలీసు బలగాల వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కేకే శర్శకు దివ్వేది అందజేశారు. శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం జరగనుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాలకు వారిగా సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులను పంపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి 2,395, పార్లమెంటుకు 344 మంది పోటీ రాష్ట్రంలో 175 మంది అసెంబ్లీ స్థానాలకు 2,395 మంది, 25 పార్లమెంటుకు 344 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు దివ్వేది తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశమైన దివ్వేది తుది ఓటర్ల జాబితాను రాజకీయల పార్టీలకు అందజేశారు. అదే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను అందజేస్తారని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన పరిశీలకులు పేర్లు, ఫోను నంబర్లను రాజకీయ పార్టీలకు అందజేస్తామని, ఏదైనా సమస్య ఉంటే వారిని సంప్రదించవచ్చని తెలిపారు. వేసిన ఓటు చూసుకోవచ్చు రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, వీటి ద్వారా ఓటరు వేసిన ఓటును ఒకసారి చూసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)లో వేసిన ఓటు ఏడు సెకన్లు కనిపించి బాక్స్లో పడుతుందన్నారు. ఒక గుర్తుకు ఓటు వేస్తే వేరే గుర్తుకు ఓటు పడుతోందన్న అపోహలను తొలగించడానికి 2017జూన్ నుంచి జరుగుతున్న ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా వీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ నియోకవర్గంలో లాటరీ విధానంలో ఒక వీవీప్యాట్ను ఎంపిక చేసి, ఇందులో స్లిప్లను లెక్కించి ఈవీంఎలో పోలైన ఓట్లతో సరిపోల్చి చూడటం జరుగుతుందన్నారు. వీవీప్యాట్ స్లిప్ ఎండలో ఎండినా, వానలో తడిసినా పాడవదని, ఐదేళ్ల పాటు ఈ స్లిప్ చెరిగిపోకుండా ఉంటుందన్నారు. 1400 ఓటర్లకు ఒక వీవీప్యాట్ను వినియోగిస్తామని, ఓటర్లు 1400 మించి ఉంటే మరో పోలింగ్ బూత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ద్వివేది తెలిపారు. ఆరు నెలల నుంచి వీవీప్యాట్లు, ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు జాయింట్ సీఈవో మార్కేండేయులు తెలిపారు. ఈ విధానంలో ఈవీఎంల మిషన్లను ట్యాపరింగ్ చేసే అవకాశమే లేదని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణ ఓటర్లు.. 2,96,97,279
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం తరఫున 2,96,97,279 మంది ఓటర్లు ఓటేయనున్నారు. ఇందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు ఉన్నారు. 18–19 ఏళ్ల వయసున్న 6,52,744 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు హక్కు పొందగా, అందులో 3,65,548 మంది పురుషులు, 2,87,103 మంది మహిళలు, 93 మంది ఇతరులున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోమవారం అనుబంధ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి 22న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో 2,95,18,954 మంది ఓటర్లున్నారు. నిరంతర ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 వరకు 3.38 లక్షల మంది కొత్త వారు ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరించి సోమవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించగా, 1,78,325 మంది కొత్త ఓటర్లకు చోటు లభించింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఓటేసే ఓటర్ల సంఖ్య 2,96,97,279కు పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 41,77,703 మంది, అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 2,47,419 మంది ఓటర్లున్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 6,17,169 మంది, భద్రాచలం అసెంబ్లీ స్థానంలో అత్యల్పంగా 1,45,509 మంది ఓటర్లున్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో అత్యధికంగా 31,49,710 మంది, అత్యల్పంగా మహబూబాబాద్ లోక్సభ స్థానంలో 14,23,351 మంది ఓటర్లున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య ఇలా.. -
ఓటర్ల జాబితాపై సమీక్ష
సాక్షి, కూసుమంచి: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలపై మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 22న సాయంత్రం 5 గంటలలోపు ఎంపీడీఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు. తహసీల్దారు స్వర్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. వివిధ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు నిషేధమని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొల్లంపల్లి సుధాకర్రెడ్డి, ఆసిఫ్పాషా, సీపీఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, బీజేపీ నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, బీఎస్పీ మండల అధ్యక్షుడు ఉపేందర్తో పాటు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కవిరాజ్, సురేష్, ఎంసీఓ అంజిరెడ్డి పాల్గొన్నారు. తిరుమలాయపాలెం: ఎంపీటీసీల ఓటర్ల జాబితా ముసాయిదాపై మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో మండల పరిషత్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎంపీటీసీల వారీగా ప్రదర్శించిన ఓటరు జాబితా సవరణలపై రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచిన ఓటరు జాబితాపై ఈ నెల 25 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చని మండల ఈఓఆర్డీ రాజేశ్వరి తెలిపారు. ఆ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ఈశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆ వివరాలు బయటపెట్టాలని ఆదేశించలేం
సాక్షి, హైదరాబాద్: డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పంచుకున్న సమాచార వివరాలను బహిర్గతం చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఒక పక్క సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకోవడం గోప్యత హక్కుకు భంగమని చెబుతున్న పిటిషనర్... మరోపక్క దాన్ని బహిర్గతం చేయాలని కోరడంలో అర్థం లేదని స్పష్టం చేసింది. ఓటరు కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొంది. ఆన్లైన్ అన్నది ఓ మాయాబజార్ వంటిదని, అందులో ఓసారి సమాచారాన్ని బహిర్గతం చేస్తే దాన్ని నిమిషాల్లో లక్షల్లో కాపీ చేసుకుంటారని, దాన్ని అడ్డుకోవడం అసాధ్యమని తెలిపింది. ఒకవేళ ఆ సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ తమకున్న ప్రాథమిక పరిజ్ఞానం ప్రకారం ఆ సమాచారాన్ని పునఃసృష్టించుకునే పరిజ్ఞానం ఇప్పుడు అంతటా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే ఆధార్ కార్డుతో అనుసంధానించిన సమాచారాన్ని తొలగించే అంశంపై మాత్రం లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి. రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితా తయారీ సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పుచేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన ఇంజనీర్ కొడలి శ్రీనివాస్ హైకోర్టులో గతేడాది పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇతరులు @ 38,325 మంది
న్యూఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఓటర్ల జాబితాలో ‘ఇతరుల’విభాగంలో చేరిన ట్రాన్స్జెండర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం మేరకు.. ఇతరుల విభాగంలో ఇప్పటివరకు ఎన్రోల్ అయిన ఓటర్లు 38,325 మంది కాగా.. గత ఐదేళ్లలో కొత్తగా చేరిన వారు కేవలం 15,306 మందే. ట్రాన్స్జెండర్లు ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు 2012 నుంచి అనుమతించారు. తమ జనాభా కంటే చాలా తక్కువస్థాయిలో ఐదేళ్లలో ఓటరు జాబితాలో చేరారని.. ఇప్పటికీ ఇతరుల విభాగంలో ఓట్లు నమోదు చేసుకునేందుకు చాలా మంది వెనకాడుతున్నారని ట్రాన్స్జెండర్ల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. 2011 గణాంకాల ప్రకారం తమ వర్గానికి చెందిన వారి జనాభా 4.9 లక్షలని.. అయితే ఈ సంఖ్య కంటే ఎక్కువే తమ వారున్నారని వెల్లడించారు. ట్రాన్స్జెండర్ల కింద నమోదైతే సమాజంలో చిన్నచూపు చూస్తారని.. ఇతరుల విభాగంలో ఎన్రోల్ అయ్యేందుకు అడుగుతున్న ధ్రువపత్రాల కారణాంగా కూడా ఎక్కువ మంది ఓటు నమోదుచేసుకోలేకపోతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విషయమై ఒక్క గుర్తింపు కోసం ఎన్నో ధ్రువపత్రాలు అడుగుతున్నారని.. ఇది సరికాదని చెప్పారు. ‘ఇది ట్రాన్స్జెండర్లకు చాలా కష్టమైన పని. వీరిలో చాలా మందికి అన్నిధ్రువపత్రాలు ఉండవు..’అని ప్రత్యత్ జెండర్స్ ట్రస్ట్కు చెందిన అనింధ్య హజ్రా వ్యాఖ్యానించారు. అలాగే పాస్పోర్టుల విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని.. 2014 నల్సా తీర్పునకు విరుద్ధంగా వైద్య ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారని వాపోయారు. ఓటర్ జాబితాలో ఇదివరకు స్త్రీ లేదా పురుషుడుగా నమోదైన వారు ఇతరుల విభాగంలో చేరేందుకు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు. ‘2014లో ఇచ్చిన కోర్టు తీర్పును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అన్ని రాష్ట్రాలు ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులివ్వాలని.. వీటి మేరకే ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని చెప్పినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు..’అని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్, తెలంగాణ హిజ్రా ఇంటర్సెక్స్ ట్రాన్స్జెండర్ సమితికి చెందిన మీరా సంఘమిత్ర వాపోయారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో ‘మధ్య’ ఓట్లే కీలకం!
ఆదిలాబాద్అర్బన్: ఏప్రిల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మధ్య వయస్కుల ఓట్లే కీలకం కా నున్నాయి. ఇప్పటికే అధికారులు వయసుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. 18 ఏళ్ల యువ ఓటర్ల నుంచి 79 ఏళ్ల వయస్సు గల వారు, 80 ఏళ్లకుపైబడిన వృద్ధులు జాబితాలో ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా లెక్కతీశారు. ఉమ్మ డి జిల్లాలో గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ఓటర్ల జాబితా రూపకల్పన కోసం గత డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వర కు ఓటరు నమోదును నాలుగు జిల్లాలో చేపట్టా రు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొం దిం చిన ఓటర్ల జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 20,63,963 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 10,20,320 మంది ఉండగా, మహిళలు 10,43,552 మంది ఉన్నారు. ఇతరులు 91 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,63,963 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో 30 ఏళ్ల వయసు నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారు 12,19,180 మంది ఉండగా, 18 నుంచి 29 ఏళ్ల వయసు గల యువ ఓటర్లు 5,97,276 మంది ఉన్నారు. 60 నుంచి 79 ఏళ్ల వయసు గల వృద్ధ ఓటర్లు 2,26,047 మంది ఉండగా, 80 ఏళ్లకుపైబడిన వృద్ధులు 21,460 మంది ఉన్నట్లు జాబితాలో స్పష్టంగా ఉంది. ఇక 18, 19 ఏళ్ల వయసు గల వారు కొత్తగా ఓటరు జాబితాలో నమోదయ్యారు. ఈ లెక్కన 48,519 మంది యువకులు కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వచ్చే నెలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వయస్సుల వారీగా ఓటర్లతో పోల్చుకుంటే ఈ సారి ఎక్కువగా నమోదయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు నాలుగు జిల్లాల అధికార యంత్రాంగం గత రెండు నెలలుగా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఎన్నికల సి బ్బంది, అధికారుల నియామకం, పోలింగ్ కేం ద్రాల్లో సౌకర్యాల కల్పన, ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకుంటున్న అధికారులు మ రోవైపు ఓటర్ల తుది జాబితాను కూడా రెడీ చేశా రు. కాగా, ఓటరు జాబితా ప్రకారం చూ స్తే.. రానున్న లోక్సభ ఎన్నికల్లో మధ్య వయస్కులు, యువత ఓట్లు కీలకం కానున్నాయి. జా బితాలో 52 శాతం మంది మధ్య వయస్కులు ఉండగా, 25 శాతం యువ ఓటర్లు ఉండడం ఇక్కడడంతో అభ్యర్థుల గెలుపు వీరి చేతుల్లో ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించి ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్కు ఎవరిని పంపాలన్నది ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఓ టు హక్కు ద్వారా నేతల తలరాతలను మార్చుతారో.. లేదో చూడాలంటే ఏప్రిల్ 11 దాకా ఆగాల్సిందే. నాలుగు జిల్లాల్లో వయసుల వారీగా ఓటర్లు ఇలా.. వయసు కుమురంభీం మంచిర్యాల ఆదిలాబాద్ నిర్మల్ 18 నుంచి 19 9,438 12,185 8,916 17,987 20 నుంచి 29 1,09,037 1,46,308 1,14,080 1,79,235 30 నుంచి 39 1,02,264 1,53,305 1,10,100 1,78,053 40 నుంచి 49 79,481 1,16,485 77,462 1,28,886 50 నుంచి 59 52,875 83,340 52,248 84,681 60 నుంచి 69 30,493 47,032 29,235 49,492 70 నుంచి 79 13,098 20,721 13,574 22,402 80 నుంచి ఆపైన 4,420 5,925 3,726 7,389 -
లోక్సభ ఓటర్లు 3 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో సుమారు 3 కోట్ల మందికి ఓటు హక్కు లభించనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా గత నెల 22న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,95,18,964 మంది ఓటర్లున్నారు. అందులో 1,48,42,619 మంది పురుషులు, 1,46,74,977 మంది మహిళలు, 1,368 మంది ఇతరులున్నారు. ఓటరు నమోదు కోసం ఈ నెల 15 వరకు వచ్చే దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలను నియమించి ఓటరు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లోక్సభ ఎన్నికలకు వారం రోజుల ముందు అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. అనుబంధ ఓటర్ల జాబితాలో మరో 5 లక్షల మంది కొత్త ఓటర్లకు చోటు లభిస్తే రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య తొలిసారిగా 3 కోట్ల మైలురాయిని దాటనుంది. మల్కాజ్గిరి టాప్! మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో అత్యధికంగా 30,98,816 మంది ఓటర్లున్నారు. 24,15,598 ఓటర్లతో చేవెళ్ల, 19,59,490 మంది ఓటర్లతో హైదరాబాద్, 19,54,813 మంది ఓటర్లతో సికింద్రాబాద్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహబూబాబాద్ పరిధిలో అతి తక్కువగా 14,14,210 మంది ఓటర్లున్నారు. -
కర్నూలు జిల్లా.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, కర్నూలు: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ప్రత్యేక సెల్ ఇన్చార్జ్ లక్ష్మిరాజు : 9704738448 మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ప్రతి శనివారం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుంది. పేరు ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఓటు ఉందో లేదో చూసుకోండి
-
ఓటు నమోదుకు ఇక ఐదు రోజులే సమయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ పేరు లేనట్లయితే ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది విజ్ఞప్తి చేశారు. ఓటరుగా చేరేందుకు ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉందని, ఆలోగా జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకుంటే.. వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, 15వ తేదీ తరువాత ఓటు లేదంటే ఏమి చేయలేమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించిన అనంతరం ద్వివేది ఆదివారం రాత్రి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్లుగా చేరడానికి సమయం ఉందని, అయితే దరఖాస్తుల వెరిఫికేషన్కు పది రోజుల సమయం పడుతుందని, అందువల్లే ఈ నెల 15లోగా పేరుందో లేదో చూసుకుని దరఖాస్తు చేసుకోమని కోరుతున్నట్లు ద్వివేది వివరించారు. ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి ఏడు రోజుల నోటీసు సమయం పడుతుందని, ఆ తర్వాత మూడు రోజులు వెరిఫికేషన్కు సమయం పడుతుందన్నారు. ఇప్పుడు ఓటర్లను తొలగించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఫారం–7లకు సంబంధించి ఇప్పటివరకు 9,27,542 దరఖాస్తులు రాగా వాటిలో 7,24,940 తనిఖీ చేశామని, అందులో 5,25,957 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. ఇంకా 1.57 లక్షల ఫారం–7 దరఖాస్తుల్ని పరిశీలన చేయాల్సి ఉందన్నారు. వీటిని వెరిఫై చేశాక కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పుడు 3.82 కోట్లకు చేరినట్లు వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది చెప్పారు. మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 9,345 పోలింగ్ కేంద్రాల్ని సమస్యాత్మకంగా గుర్తించామని, అక్కడ కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 200 నుంచి 300 వరకు పోలింగ్ కేంద్రాలు పెరిగే వీలుందని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతితోపాటు టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు, ర్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటరు స్లిప్లు ఇస్తామని చెప్పారు. అయితే ఓటర్ స్లిప్లను గుర్తింపు కార్డులుగా పరిగణించరని, ఈసీ పేర్కొన్న ప్రత్యామ్నాయ 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదుకోసం వచ్చిన 2,64,712 పెండింగ్ దరఖాస్తులున్నాయని, వాటిన్నింటినీ వెరిఫై చేసి క్లియర్ చేస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని, కొన్ని స్పీడు బోట్లను కూడా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే సామాన్యులెవరైనా సరే సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి శాఖ ఓ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి: అయ్యన్నార్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి సారిస్తున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. పది లక్షలలోపు నగదు లావాదేవీలపై పోలీసులు విచారణ చేస్తారని, అంతకుమించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని చెప్పారు. సామాన్యులెవరైనా నగదును తీసుకెళుతున్నప్పుడు సంబంధిత ధ్రువపత్రాలుంటే, అలాంటి వాటికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్నారు. ఎక్సైజ్, రవాణా, ఆదాయపు పన్ను, కస్టమ్స్ అధికారులతో కూడిన బృందాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి బృందంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో ఓ అధికారిని నియమిస్తున్నామన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అక్కడికక్కడే విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తారని తెలిపారు. ఫారం–7 దరఖాస్తులపై 446 కేసులు నమోదు చేశామని, వాటిని సిట్కు బదలాయించామని చెప్పారు. ఐపీ అడ్రస్లకోసం సి–డాక్కు లేఖ రాశామన్నారు. -
ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటన
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య: శ్రీకాకుళం 20,64,330 విజయనగరం 17,33,667 విశాఖపట్నం 32,80,028 తూర్పు గోదావరి 40,13,770 పశ్చిమ గోదావరి 30,57,922 కృష్ణా 33,03,592 గుంటూరు 37,46,072 ప్రకాశం 24,95,383 నెల్లూరు 22,06,652 వైఎస్సార్ కడప 20,56,660 కర్నూలు 28,90,884 చిత్తూరు 30,25,222 అనంతపురం 30,58,909 -
విశాఖపట్నం : మీ ఓటు ఉందా.. వెంటనే సరి చూసుకోండి..
సాక్షి, విశాఖపట్నం : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. - 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - కలెక్టరేట్లోని కాల్ సెంటర్ ల్యాండ్ లైన్ నెం : 0891–2534426 - కాల్ సెంటర్ ఇన్చార్జి : కే.పద్మ, పీడీ, డ్వామా : 9490914671 - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - సాధారణంగా ఎన్నికల నామినేషన్కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. - ఆర్డీవో ఆఫీసులో ఎన్నికల విధులు చూసే అధికారి (ఆర్డీఓ లేదా ఇతరులు) ఉంటారు. ఆయనను సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన నంబర్: 9618827134, (ఆర్వో: జి.సూర్యనారాయణరెడ్డి) - తహసీల్దార్ కార్యాలయం ఎలక్షన్ సెల్, ఫోన్ నంబర్లు యలమంచిలి : 9100064953 అచ్యుతాపురం : 9100064943 రాంబిల్లి : 9100064952 మునగపాక : 9100064951 - మీ సమీపంలోని బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీనిని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. - ఒకవేళ మీ ఓటు లేదని తెలిస్తే.. పై మూడు స్థాయిల్లోనూ అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి, ఫారం–6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లోనూ నిర్ణీత రుసుము తీసుకుని ఓటు ఉందో లేదో తెలియ చెబుతారు. అక్కడే ఓటు నమోదు చేస్తారు. - ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవల్ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఆర్డీఓ, ఎమ్మార్వో, బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలి. ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్కు లింక్
సాక్షి, అమరావతి: ఓటరుతో ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు... ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్న, ఓటర్లను గందరగోళపరుస్తున్న అంశం ఇది. ఈ సమస్యకు ఎన్నికల సంఘం ఓ పరిష్కార మార్గం చూపిస్తోంది. మీ ఓటరు ఐడీని మీ మొబైల్ నంబర్తో అనుసంధానం చేసుకోవడం ద్వారా.. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్ను ఒకసారి లింక్ చేస్తే మీ పేరిట ఫామ్–7తో సహా ఏమైనా మార్పులు చేర్పులకు దరఖాస్తులు వస్తే వెంటనే మీ మొబైల్కు హెచ్చరిక (అలర్ట్) సందేశం వస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా http://ceoaperms.ap.gov.in/AP&MobileNoRegistration/MobileNoRegistration.aspx అనే లింక్లోకి వెళ్లి మీ ఎలక్టొరల్ ఫోటో ఐడీ కార్డు నంబర్ (ఎపిక్ నంబర్)ను, ఫోన్ నంబర్ను ఎంటర్ చేస్తే ఆ నంబర్కు వన్టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు ఎపిక్ నంబర్తో మీ ఫోను అనుసంధానం అయినట్లే. మీ కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే నంబర్కు ఇలా లింక్ చేసుకోవచ్చు. ఇది కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎన్నికల అక్రమాలకే డేటా చౌర్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం–7 దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడం జాతీయస్థాయిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై వివిధ వర్గాలకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును, ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు సంబంధించిన డేటా ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలకు అనధికారికంగా వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకే డేటా చౌర్యానికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులమీద ఐటీ, ఐపీసీ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగించడంపై వివిధ రంగాల నిపుణులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమాలు, డేటా చౌర్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓట్ల తొలగింపు తీవ్రమైన నేరం ఓట్ల అక్రమ తొలగింపు తీవ్రమైన నేరం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లను తొలగించాలంటూ ఫారం–7తో ఆన్లైన్లో దరఖాస్తులు చేయడమంటే పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడమే. రాజ్యాంగ విరుద్ధమైన ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సత్వరం స్పందించాలి. ప్రత్యేక పరిశీలకులను నియమించి రాష్ట్రంలో ఇంటింటికి సర్వే నిర్వహించాలి. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కేజే రావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఐపీసీ, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పథకాల సందర్భంగా సేకరించిన సమాచారాన్ని కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభంకోసం ఉపయోగిస్తుండడం, ఓటర్ల జాబితాల నుంచి ఓట్లు తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని నా దృష్టికి రాగానే దీనిపై దర్యాప్తు చేయమని ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ప్రభుత్వంపై నమ్మకంతో ఆధార్ కార్డు, ఇతర అవసరాలకోసం ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తారు. అలాంటి సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరకుండా గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరిందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల సమాచార దుర్వినియోగం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. అందుకు బాధ్యులైనవారిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి రాజకీయాలకతీతంగా చర్యలు తీసుకోవాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి చంద్రబాబు ప్రభుత్వానిది దేశ ద్రోహం అక్రమంగా ఓట్లను తొలగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఓటుహక్కును కాలరాయడంతోపాటు దేశద్రోహానికి కూడా పాల్పడింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. ఆధార్కార్డు, తదితర సమాచారం దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తులకు చేరితే తీవ్ర దుష్పలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు సీఎం చంద్రబాబుతోపాటు యావత్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. సీఎం ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ ఆధార్ ప్రాజెక్టులో కూడా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు చేరిన వ్యవహారంలో సత్యనారాయణను వెంటనే తొలగించాలి. ప్రభుత్వ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టాలి. – అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజల ఆధార్కార్డ్, ఓట్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ప్రైవేటు సంస్థలకు ఎలా చేరాయన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఆ ప్రైవేటు సంస్థలు ఎందుకోసం ప్రజల వ్యక్తిగత వివరాలను తమ వద్ద ఉంచుకున్నాయన్నది కీలకం. ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు, ఎలాంటి ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు ఈ డేటాను చౌర్యం చేశారన్నది నిగ్గు తేలాల్సి ఉంది. ఈ అక్రమాల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – డా.గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక -
డేటా లీకేజి వెనుక బ్లూ ఫ్రాగ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐటీ హబ్ అవుతుందనుకున్న విశాఖ నగరం చివరికి డేటా లీకేజి కేంద్రంగా మారింది. విశాఖ నగరాన్ని ఐటీ హబ్ చేసేస్తామని ఐదేళ్లుగా చెబుతున్న సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోక్శ్.. దీన్ని డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు తాజా సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. విశాఖ కేంద్రంగా డేటా అక్రమ వినియోగం కోసం కొన్నేళ్లుగా పక్కా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ వ్యవహారం వెనుక హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు విశాఖకు చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హస్తం ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన సేవామిత్ర మొబైల్ యాప్లో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మూడుకోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సైబరాబాద్ పోలీసులు శనివారం సాయంత్రం నుంచి సోదాలు నిర్వహించారు. కొన్ని హార్ట్ డిస్క్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ నేత తుమ్మల లోకేశ్వరరెడ్డి మాదాపూర్ పోలీసులకు చేసిన మరో ఫిర్యాదుతో విశాఖలోని బ్లూ ఫ్రాగ్ సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్ఫోన్ ఆధారిత సేవల పేరిట వైజాగ్లోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ రాష్ట్ర జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ప్రజల ఆధార్ కార్డులు, ఏపీ స్మార్ట్ పల్స్ సర్వే, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్తో పాటు హైదరాబాద్లోని కావ్య డేటా మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి ప్రజా సాధికార వేదిక వివరాలను సేకరిస్తోంది. ఈ డేటా మొత్తాన్ని ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థకు అందిస్తోందని లోకేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వగా.. ఇందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ యాప్లో ఓటర్ల వివరాలు ఉండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సీఎంతో హెలికాప్టర్లో వెళ్లేంత సాన్నిహిత్యం విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ ఫణిరాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సీఎంతో హెలికాప్టర్లో కూడా తిరిగేంతటి సాన్నిహిత్యం అతడికి ఉందని విశాఖ టీడీపీ నేతలు చెబుతున్నారు. పదేళ్ల కిందట సింగపూర్ నుంచి తిరిగొచ్చి.. విశాఖలో స్థిరపడిన ఫణి మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత బ్లూ ఫ్రాగ్ సంస్థను నెలకొల్పిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వారా సీఎంకు పరిచయమయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ యాప్లు, ఎన్టీఆర్ ట్రస్ట్కు సంబంధించిన ఐటీ సర్వీసులన్నీ ఆయనే చూసేవారు. ఈ క్రమంలోనే డేటా లీకేజి పనిని కూడా సదరు ఫణికే అప్పగించారన్న వాదనలకు బలం చేకూరుతోంది. -
జెడ్పీ, మండల ఎన్నికలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మే నెల చివరికల్లా ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు అవసరమైన సంసిద్ధతను ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈ సీ) తెలియజేసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 27 లోగా రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయ తీల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితా లను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీఓ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. రాష్ట్రం లోని గ్రామపంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించేలా చర్యలు తీసుకోవా లని శనివారం ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పీఆర్శాఖ ముఖ్యకార్య దర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (హైదరాబాద్ మినహా), సీఈఓలు, ఎంపీడీఓలకు సమాచారం పంపించారు. 2019 జనవరి 1 కల్లా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరున్న వారిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా నిర్ణయించింది. ఈ నెల 22న ›ప్రకటించిన (2019 జనవరి 1 ప్రాతిపదికగా) అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు అనుగుణంగా వాటిని తయారు చేయాలని నాగిరెడ్డి సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచిం చిన మేరకు వార్డుల విభజన పూర్తి చేయాలని నిర్దేశించారు. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ను మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా మండలాల స్థాయిల్లో ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ల స్థాయిలో సీఈఓ లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఓటర్ల జాబితాలను సంబంధిత మండల, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుం ది. వచ్చేనెల 27న ఫోటోలతో కూడిన గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదర్శించాక, నోటిఫికేషన్ వెలువడే నాటికి అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఏవైనా చేర్పులు, తీసివేతలు లేదా సవరణల విషయంలో ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి ఆదేశాలు ఇచ్చి ఉంటే వాటిని కూడా డీపీఓలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుం దని స్పష్టంచేశారు. ఆ మేరకు సంబంధిత గ్రామపంచాయతీ వార్డుల ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలని సూచించారు. జెడ్పీ,ఎంపీటీసీ ఎన్నికలు ఇలా... రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల(పూర్తిగా పట్టణ ప్రాంతమైన హైదరాబాద్ మినహాయిం చి) ప్రాతిపదికన జిల్లా, మండల ప్రజాపరిష త్ల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను ముం దుగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా జెడ్పీ టీసీలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించడంతో దానిపై జిల్లా కలెక్టర్లు చేసిన కసరత్తు పూర్తికావొచ్చింది. కొత్త గా ఏర్పాటైన రెవెన్యూ జిల్లాలు, మండలాల ప్రాతిపదికన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణపై క్షేత్రస్థాయి పరిస్థి తులు పరిగణనలోకి తీసుకుని వీటిని పూర్తి చేస్తు న్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధం కాగానే పోలిం గ్స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత జెడ్పీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల తేదీలు ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఇదీ షెడ్యూల్ - మార్చి 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా (డ్రాఫ్ట్) ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాలి - మార్చి 17–20 తేదీల మధ్య గ్రామీణ అసెంబ్లీ ఓటర్లను వార్డులు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చడం పట్ల ఏవైనా అభ్యంత రాలుంటేస్వీకరణ - మార్చి 18న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారుల సమావేశం - మార్చి 19న మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓల సమావేశం - మార్చి 23న ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని డీపీఓలు పరిష్కరించాలి - మార్చి 27న డీపీఓలు చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి - మార్చి 30న మండల ప్రజా పరిషత్ పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ఎంపీడీఓలు, జిల్లా పరిషత్ పరిధిలోని జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల (జెడ్పీటీసీ) వారీగా ఫోటో ఓటర్ల జాబితాను సీఈఓలు, తయారు చేసి సంబంధిత మండల, జిల్లా పరిషత్ కార్యా లయాల్లో బహిరంగంగా ప్రదర్శించాలి. -
జిల్లా ఓటర్లు 9,68,305
ఉమ్మడి జిల్లాలోని ఓటర్ల లెక్క తేలింది. శుక్రవారం ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈసీ జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అతివలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,22,888 ఓటర్లుండగా.. మహిళలు 13,78,186, పురుషులు 13,44,634గా ఉన్నారు. మొత్తంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లు 33,552 అధికంగా నమోదయ్యారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళలు అధికంగా ఉండగా.. పెద్దపల్లిలో మాత్రం పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఇతరులు 68 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13నియోజకవర్గాలుండగా.. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి మినహాయిస్తే అన్నింటిలో మహిళాఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో నాయకులు మహిళల తీర్పుతోనే గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లు 4,81,271, మహిళలు 4,87,013, ఇతరులు 21తో కలిపి మొత్తం 9,68,305 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. జగిత్యాలలో పురుష ఓటర్లు 3,19,476, మహిళలు 3,39,479 ఓట్లుండగా.. ఐదుగురితో కలుపుకుని మొత్తం 6,58,960 ఓట్లున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 3,34,536 ఉండగా మహిళల ఓట్లు 3,31,405 ఇతరులతో 39 ఓట్లు కలపి మొత్తం 6,65,980 ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో పురుషులు అధికంగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశీలించినట్లయితే పురుషులు 2,09,351 ఉండగా మహిళలు 2,20,289 ఇతరులు ముగ్గురుతో కలిపి మొత్తం 4,29,643 ఓటర్లున్నారు. రానున్న ఎన్నికలు తుదిజాబితాతోనే.. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికల్లో తుది ఓటరు జాబితా ప్రకారమే ఓట్లు వేస్తారు. ఓటు హక్కు ప్రాధాన్యం పెరగడం, వరుస ఎన్నికలు వస్తుండడంతో ఓటు నమోదుపై ఆసక్తి చూపారు. దరఖాస్తులు కూడా ఊహించినదానికంటే ఎక్కువగానే వచ్చాయని సమాచారం. ఈనెల 14వరకు కొత్త ఓటరుగా దరఖాస్తుకు గడువు ఇచ్చి.. తుది జాబితాను శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితా ప్రకారమే రానున్న పార్లమెంట్, పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా ఎన్నికల కాంటాక్ట్ కేంద్రం ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచి చాలామంది సమస్యల పరిష్కారానికి కృషిచేసింది. ఫోన్ ద్వారా సమస్య తెలిపితే చాలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు అనుసంధానించి కొత్త ఓట్ల నమోదులో కీలకపాత్ర పోషించింది. దేశ, రాష్ట్ర స్థాయిలో కాంటాక్ట్ కేంద్రం ద్వారా చాలామంది ఓటరు దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచింది. -
తేలిన లెక్క
నిర్మల్: లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 20,63,963 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు తుది జాబితాను శుక్రవారం వెల్లడించారు. ఇందులో 10,20,320మంది పురుష ఓటర్లు, 10,43,552మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అలాగే 91మంది ఇతరుల కింద ఓటు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా నిర్మల్లో, అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్లు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిర్మల్లోనే అధికం... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో తూర్పు ప్రాంతంలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 4,01,106 మంది ఉండగా మహిళలు 1,99,795మంది, పురుషులు 2,01,300, ఇతరులు 11మంది ఉన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,85,301మంది ఓటర్లు ఉన్నారు. ఇందు లో 2,90,903మంది మహిళలు, 2,94,359మంది పురుషులు, ఇతరులు 39మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల పరిధిలో 4,09,341మంది ఓటర్లు ఉన్నారు. 2,07,703మంది మహిళలు ఉండగా, 2,01,630మంది పురుషులు, ఇతర 8మంది ఓటర్లు ఉన్నారు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,45,151మంది మహిళలు, 3,23,031మంది పురుషులు, 33మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఓటర్ల నమోదు కనిపిస్తోంది. అలాగే నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. మహిళలదే పైచేయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20,63,963మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో పురుషులతో పోల్చితే మహిళలే అత్యధికంగా ఉండటం గమనార్హం. జనాభా పరంగా పురుషుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లలోనూ మహిళలే పైచేయి సాధించారు. పురుషులతో పోల్చితే 23,232మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో పురుష ఓటర్లు 3,23,031మంది ఉండగా 3,45,151మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్ల జాబితాలోనూ మహిళల చైతన్యం కనిపిస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91మంది ఇతరుల విభాగంలో ఓటు నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 39మంది ఇతరుల విభాగంలో ఉన్నారు. కుమురంభీంలో స్వల్పం.. జిల్లాల వారీగా పోలిస్తే కేవలం రెండు నియోజకవర్గాల పరిధి కలిగిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువ ఓటర్లు నమోదయ్యారు. ఇక్కడ 4,01,106మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ జిల్లాతో పోలిస్తే కాస్త ఎక్కువగా 4,09,341మంది ఓటర్లు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లా పరిధిలోనూ రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఇక అత్యధికంగా మూడు నియోజకవర్గాలు ఉన్న నిర్మల్ జిల్లాలో 6,68,215మంది ఓటర్లు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోనూ మూడు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఇక్కడ 5,85,301మంది ఓటర్లు నమోదయ్యారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఓటర్లు గల్లంతు కావడంతో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, 2కే రన్, స్పెషల్ డ్రైవ్ వంటివి నిర్వహించారు. దీంతో నిర్మల్ జిల్లాలో ఓటర్ల సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ ఈవీఎంల పరిశీలన పూర్తయింది. పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటికి నంబర్లను కేటాయించడం వంటి పనులు పూర్తి చేస్తున్నారు. -
‘దొంగ’దారుల్లో చిత్తూరు ‘దేశం’!
సాక్షి, చిత్తూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేకపోవడంతో అధికారం నిలుపుకోడానికి ‘దొంగ’దారులు వెతుక్కుంటోంది. ఓటర్ల మార్పులు, చేర్పులు, నమోదుల్లో చేతివాటం ప్రదర్శిస్తోంది. దీనికి ఇతోధికంగా అధికార యంత్రాంగం కూడా సహకరిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏ జిల్లాలో లేనంత ప్రహసనంగా చిత్తూరు జిల్లాలో మారింది. ఓటర్ల జాబితాలో కొత్త పేర్లు ఇష్టారీతిన చేరుతున్నాయి. ఒకొక్కరికి 2కు మించి ఓట్లు ఉంటున్నాయి. గంగాధర నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో సరైన సమాచారం లేకుండానే వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో అయితే వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించాలని ఏకంగా 10,224 దరఖాస్తులు వచ్చాయి. పోలింగ్ బూత్ల మార్పునకు ఒత్తిడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లున్న పోలింగ్ బూత్లను మార్చాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. దీనికి కోసం అధికారులపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ బూత్లను ఇప్పటికే మార్చేశారు. ఈ నియోజకవర్గంలోని పెనుమూరు మండలం పెద్దకలికిరిలోని పోలింగ్ బూత్ను మొరవకండ్రిగకు మార్చారు. కలికిరి గ్రామం మొత్తం వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారు. దీన్ని టీడీపీ నేతలు మొరవకండ్రిగకు మార్పించారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సమగ్ర సర్వే చేసిన తరువాత పోలింగ్ బూత్ పెద్ద కలికిరిలోనే ఉండాలని ఆదేశించింది. అయితే, పెనుమూరు పూర్వపు ఎమ్మార్వో రవి ఈసీ ఆదేశాలను సైతం ఖాతరు చేయలేదు. కుప్పం, శ్రీకాళహాస్తి, నగరి నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల్లోనూ మార్పులు జరిగాయి. టార్గెట్ చంద్రగిరి.. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. ఓటర్లకే తెలీకుండా ఫాం–7ను నింపి అధికారులకు పంపుతోంది. ఇలా ఓట్లు తొలగించాలని ఈ ఏడాది జనవరి 12 నుంచి ఫిబ్రవరి 14 వరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 17,395 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 10,224 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తే అవి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులవేనని తేలింది. అలాగే, గత పది సార్వత్రిక ఎన్నికల్లో ఒకే బూత్లో ఓటేసిన వారి ఓట్లూ తీసేయాలని దరఖాస్తులు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఓట్లు తొలగించాలని వచ్చిన 10 వేల దరఖాస్తుల్లో ఇప్పటికే 7,983 ఓట్లను తొలగించేందుకు టీడీపీ నేతలు అధికారులతో కలిసి కుట్ర చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం నకిలీ జిత్తులు ఇదిలా ఉంటే.. సొంత జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు ‘నకిలీ’ ఎత్తులు కూడా వేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారు. కుప్పం, గంగాధర నెల్లూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అయితే, వీటి తొలగింపు ప్రక్రియలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం క్రిష్ణయ్యయానాది కాలనీ, రామకృష్ణాపురం యానాది కాలనీల్లో నివాసంలేని వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో కర్ణాటక, తమిళనాడు వాసులను ఎక్కువగా ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారు. కాగా, వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటే వారి ఓటుపై వేటు వేస్తున్నారు. అధికారులతో కుమ్మక్కయి ఓట్లను తొలగిస్తున్నారు. దీనిపై పలుమార్లు ఆందోళన చేసినా ఫలితంలేదు. నగరి నియోజకవర్గం వడమాలపేటకు చెందిన మురళీధర్రెడ్డి స్థానికంగా పేరున్న నేత. ఆయన ఓటుతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లనూ తొలగించారు. అధికారులను అడిగినా సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆయన వాపోతున్నాడు. -
ఓట్ల దొంగలు జైలుకే
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల విధుల్లో సెక్టోరల్, పోలీస్ అధి కారుల విధులు చాలా కీలకమైనవని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో మదనపల్లె డివిజన్ సెక్టోరల్, పోలీస్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పిం చిన ఓటుహక్కును జిల్లాలో ఉన్న ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 17 నుం చి 20వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటర్లందరికీ ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈవీఎంలపై ఓటర్లకున్న సందేహాలను నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. అవగాహన కోసం తీసుకెళ్లే యంత్రాలను కార్యక్రమాలు పూర్తయ్యాక తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరచాలన్నారు. ఎట్టి పరిస్థితులల్లోను ఎన్నికల యంత్రాలను ఇళ్లకు తీసుకెళ్లకూడదని తెలిపారు. ఏ చిన్నతప్పు చేసినా, పక్షపాతంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 473 మంది సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మౌలిక సదుపాయాల ఇబ్బందులుంటే నివేదికలు ఇవ్వాలన్నారు. ఆ ప్రక్రియ ఈ నెల 20 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో జరిగే ఎన్నికలను ఉత్తమ ఎన్నికలుగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసులు ఎక్కడైనా విధులు పట్ల అలసత్వం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఓటు చిత్తూరు ఓటు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున, జెడ్పీ సీఈఓ ఓబులేసు, ఈవీఎం నోడల్ అధికారి విద్యాశంకర్, ఎంసీఎంసీ నోడల్ అధికారి తిమ్మప్ప, ఈఆర్వో లు కనకనరసారెడ్డి, నాగరాజు, సెక్టోరల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
వీవీప్యాట్లు లెక్కించవచ్చు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలు 35 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో జరిగాయని, అందులో దాదాపు 200 పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు సరైన అవగాహన లేకుండా ఈవీఎంలను వినియోగించి పొర పాట్లు చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్కుమార్ తెలిపారు. మాక్ పోల్ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించే మీటను నొక్కకుండానే పోలింగ్ ప్రారంభించడంతో వాస్తవంగా పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లసంఖ్య మధ్య వ్యత్యాసం ఏర్పడిందన్నారు. ఈ సందర్భం గా నెలకొనే అనుమానాలను నివృత్తి చేసేందుకు వీవీ ప్యాట్ రసీదులను లెక్కించవచ్చన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగం గా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లా ఎన్నికల అధికారు(డీఈవో)లైన కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్తోపాటు రిటర్నింగ్ అధికారులకు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శిక్షణ అనంతరం ఆర్వోలకు పరీక్షలు నిర్వహించామని, పాసైతేనే లోక్సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ పరీక్షల్లో విఫలమైన అధికారులను ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణ తరగతులకు పంపిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఖర్చుల అధ్యయనం, నామినేషన్లను భర్తీ చేసే విధానం, వికలాంగులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, ఓటు చేసే విధానం తదితర అన్ని అంశాలపై డీఈవోలకు, ఆర్వోలకు శిక్షణనిచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో డీఈవోలు, ఆర్వోల పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న డీఈవోలు, ఆర్వోలను భర్తీ చేసే కార్యక్రమం కొనసాగుతోందని, ఇప్పుడున్న కొంతమంది ఆర్వోలను మార్చనున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని రజత్కుమార్ తెలిపారు. అన్ని టెక్ని కల్ విషయాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయపరమైన సమస్యలను కూడా చర్చించినట్లు తెలిపారు. సీ– విజిల్ యాప్, 1950 కాల్సెంటర్ కూడా ఉపయోగిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పా రు. శాంతిభద్రతల విషయంలో లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సమీక్ష లోక్సభ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఆరా తీశారు. ఏపీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్కు చేరుకుని ఇక్కడే రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో సమావేశమై లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఖాళీలున్న చోట్లలో జిల్లా ఎన్నికల అధికారుల నియామకం, అవసరమైన చోట్లలో బదిలీలు, రిటర్నింగ్ అధికారులకు శిక్షణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకునేందుకు సీఎస్ ఎస్కే జోషితో సీఈవో రజత్కుమార్ సచివాలయంలో సమావేశమై చర్చించారు. ఆ కలెక్టర్ అనుకోకుండా పొరపాటు చేశారు ‘శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్లు తీవ్రంగా కష్టపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ సైతం బాగా కష్టపడి పనిచేశారు. అయితే, ఆయన పొరపాటుగా ఈవీఎం యంత్రాలను తెరిచి చిక్కుల్లోపడ్డారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయలేదు. పొరపాటుగా ఈవీఎంలను తెరిచి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆయన్ను సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకోకతప్పలేదు’అని రజత్కుమార్ పేర్కొన్నారు. 27.31 లక్షల దరఖాస్తులు... ఓటర్ల జాబితా సవరణ కింద దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 4తో ముగిసిందని, గడువులోగా 27.31 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్కుమార్ అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, అందులో 7 లక్షల దరఖాస్తులు తొలిసారిగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నవారే ఉన్నారన్నారు. మిగిలిన పెండింగ్ దరఖాస్తులను సైతం పరిష్కరిస్తే తొలిసారిగా ఓటేయనున్న యువ ఓటర్ల సంఖ్య 12 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
-
టోల్ ఫ్రీ నెం.1950
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకై అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈ నెల 3న ఆదివారం మరోసారి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. అలాగే సలహాలు, సూచనలు ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు డయల్ చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ లొకేషన్లలో బూత్లెవల్ అధికారులు ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై హైదరాబాద్ జిల్లా ఓటర్ల నమోదు పర్యవేక్షక అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంయుక్త ఎన్నికల నిర్వహణ అధికారి అమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, జయరాజ్ కెనడిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2018 డిసెంబర్ 26వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని, ఈ జాబితాలో సవరణలు, చిరునామా మార్పిడి, 18 ఏళ్లు నిండినవారికి ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన బిఎల్ఓలు ఫారం–6, 7, 8, 8ఏ ఫారాలతో పాటు ఓటర్ల జాబితాను కలిగి ఉంటారని అన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు కూడా హాజరు కావాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన అవసరం హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా వెళ్లి విచారణ జరపాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. అందిన ప్రతి క్లెయిమ్లు, అభ్యంతరాలకు సంబంధించి పత్రాలను విచారణ జరిపినట్లు బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఇఆర్ఓలు, ఇఆర్ఓలు ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు. కాల్స్ స్వీకరించిన కమిషనర్ హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి సలహాలు, సూచనలు, సమాచారానికి సంబంధించి టోల్ ఫ్రీ నెం.1950కు ఫోన్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఓటర్లకు కమిషనర్ దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 1950 టోల్ ఫ్రీ నెంబర్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 1950కు వచ్చిన కాల్స్ను స్వీకరించి వారితో మాట్లాడారు. -
ఓట్లు తొలగించడానికే సర్వే
-
ఓటు దొంగలొస్తారు జాగ్రత్త..!
మళ్లీ అధికారంలోకి రావాలని అన్నిరకాల అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను సామ... భేద... దాన... దండోపాయాలతో లొంగతీసుకోవాలని చూస్తున్నారు. మాయోపాయంతో వారిని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. సంతృప్తస్థాయి తగ్గుతోందని భావిస్తున్న సర్కారు లెక్కలేనన్ని డ్రామాలకు తెరతీసింది. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తోంది. మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించేవారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. ఇందులో భాగంగానే సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపిస్తోంది. కాల్ సెంటర్నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం:‘నమస్కారం. నేను, మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. ఉన్నామంటే ఒకటి నొక్కండి, ఫర్యాలేదంటే రెండు నొక్కండి, చాలా బాగుందంటే మూడు నొక్కండి, అసలేం బాగోలేదంటే నాలుగు నొక్కండి’... అంటూ మీకు ఫోన్ చేసి అడుగుతున్నారా.! ‘మేం ఒక సంస్థ నుంచి వచ్చాం. రాష్ట్ర రాజకీయాలపై సర్వే చేస్తున్నాం. మేం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. చంద్రబాబు, జగన్, పవన్కల్యాణ్.. ఈ ముగ్గురిలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం ఐతే బాగుంటుందనుకుంటున్నారు.’ అంటూ మీ వద్దకు వచ్చి ఎవరైనా ఆరాతీస్తున్నారా.! ఈ రెండింటికీ మీరు సమాధానంచెప్పాక ఒక సారి మీ ఓటరు లిస్టు చెక్ చేసుకోండి. ఎందుకంటే వారడిగిన ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానం టీడీపీకి వ్యతిరేకంగా ఉంటే మీ ఓటు తీసేసినా తీసేస్తారు. అవును..ఇన్నాళ్లూ దీనిపై అనుమానాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఇది నిజమేనేమోనినించేలా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. పూసపాటిరేగ మండలంలోని కుమిలి గ్రామంలో ఎన్నికల రాజకీయ సర్వే పేరిట ఓటర్ల జాబితాతో కూడిన ట్యాబ్లను తీసుకుని సర్వే చేస్తున్న వ్యక్తులను వైఎస్సార్సీపీ నేతలు గురువారం గుర్తించారు. వారిని పట్టుకుని, ట్యాబ్లతో సహా పోలీసులకు అప్పగించారు. ఏం జరిగిందంటే: గజపతినగరానికి చెందిన గొల్లు కృష్ణ, గొల్లు దేముడుబాబు, తొత్తిడి దేముడు అనే యువకులు ‘పీపుల్స్పోల్ సర్వే’ పేరిట కుమిలి గ్రామంలో గురువారం సర్వే ప్రారంభించారు. ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితా ట్యాబ్లో వుండటంతో పాటు అధికారపార్టీకి అనుకూలంగా ప్రశ్నలు చేయడంతో అక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు మహంతి శ్రీనివాసరావు, గుజ్జు సురేష్రెడ్డి, పార్టీ కార్యకర్తలకు అనుమానం వచ్చింది. అధికారపార్టీకి వ్యతిరేకంగా సమాధానాలిస్తున్న వ్యక్తుల వివరాలు ట్యాబ్లలో నమోదు చేసుకుని తర్వాత వారి ఓట్లు తొలగించే అవకాశం వుందని భావించి సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. పూసపాటిరేగలో ప్రతిపక్షానికి చెందిన సుమారు 140 ఓట్ల వరకు ఫారం–7 ఇవ్వకుండానే తొలగింపుల జాబితాలో కనిపిస్తున్నాయి. వీరంతా సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన వాయిస్ మెసేజీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానమిచ్చినవారని భావిస్తున్నారు. ఇదేమిటని తహసీల్దార్ జి.సూర్యలక్ష్మిని అడిగితే అమె తనకేమీ తెలియదన్నట్లు సమాధానమిస్తున్నారు. ఈ నేపధ్యంలో కుమిలిలో ఓటర్ల జాబితా సహా సర్వే జరుగుతుండటంతో తొలిగింపు ప్రక్రియలో భాగంగానే సర్వే జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరింది. పోలీసుల హైడ్రామా వైఎస్సార్సీపీ నేతలు అప్పగించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పూసపాటిరేగ ఎస్ఐ వి.బాలా జీరావు వారిని తూతూ మంత్రంగా విచారించి వదిలేశారు. వారిపై కేసు నమోదు చేయాలని నాయకులు కోరగా.. సర్వే చేయడం నేరం కాదంటూ తోసిపుచ్చారు. పైగా ట్యాబ్లు ఎందుకు తీసుకున్నారు... వాటిని వారికి అప్పగించేయండి... అంటూ పట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. ఈ సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాను పోలీస్ స్టేషన్ లోపలికి కూడా రానివ్వకుండా గేట్లు మూసేశారు. ‘నచ్చింది రాసుకోండి, మమ్మల్నేమీ అడగవద్దు’ అంటూ ఫోన్లలో సంప్రదించిన మీడియా ప్రతినిధులకు పోలీసులు సమాధానమిచ్చారు. సీరియస్గా తీసుకున్న వైఎస్సార్ సీపీ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రం గా స్పందించారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. పలువురు పార్టీ నేతలతో పాటు వెళ్లి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటరు లిస్టులను ట్యాబ్లలో ఉంచి, సర్వేలు చేస్తున్న వారిపైనా, వారి వెనకుండి ఈ పని చేయిస్తున్న వారిపైనా ఫిర్యాదు చేయనున్నారు. సర్వే పేరుతో ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తుందనే కోణంలో విచారణ జరిపించాల్సిందిగా ఎన్నికల కమిషన్కు, డీజీపీని కోరనున్నారు. అవసరమైతే జాతీయ ఎన్నికల కమిషన్ను కూడా కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నికల కమిషన్ పట్టించుకోవాలి ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పట్టించుకుని పారదర్శకంగా ఎన్నికలు జరిపించడానికి చర్యలు తీసుకోవాలి. సర్వేల పేరిట ఓటర్ల వద్దకు వెళ్లి వారి నాడి తెలుసుకొని అధికారపార్టీకి అనుకూలం అయితే ఓటు ఉంచుతారు. ప్రతి పక్షం అయితే వెంటనే ఓటును తీసేస్తున్నారు. అలా కుమిలి గ్రామంలో సర్వేపేరిట ట్యాబ్లలో సమాచారం సేకరిస్తుండగా ముగ్గురు వ్యక్తులు మాకు దొరికారు.– గుజ్జు సురేష్రెడ్డి, కుమిలి గ్రామం ఓట్లు తొలగించడానికే సర్వే కుమిలి గ్రామంలో జరిగిన సర్వే కేవలం ఓట్లను తొలగించడానికే. ట్యాబ్లో ఓటరు జాబితా వుంది. అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడితే ఓటు ఉంటుంది. ప్రతి పక్షానికి చెందిన వారని భావిస్తే ఓటును తీసేయడానికే సర్వే జరుగుతోంది. సర్వే చేసిన వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించాం.– మహంతి శ్రీనివాసరావు, రెల్లివలస. -
ఏపీలో అక్రమ ఓటర్లు
-
ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఓటర్ల జాబితాలో అనేక లోపాలు, అక్రమాలు ఉన్నాయని ‘ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్)’ ప్రతినిధులు తుమ్మల లోకేశ్వరరెడ్డి, నలివెల సురేష్కుమార్రెడ్డిలు అన్నారు. ఈ నెల 11న ప్రచురితమైన కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 175 నియోజకవర్గాల్లో 59,18,631 ఓటర్లు నమోదు అక్రమంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు కలిగిన వారు 20.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు. నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్ అయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్నికల అధికారిని వాస్ట్ ప్రతినిధులు కలిసి అక్రమ ఓట్ల వివరాలతో రూపొందించిన నివేదిక ఇచ్చారు. ఆ తరువాత మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. ఓ ఓటరుకు 351 ఏళ్ల వయసు ఉన్నట్టుగా జాబితాలో నమోదు చేశారని, 18 సంవత్సరాలలోపు వారిని కూడా ఓటర్లుగా చేర్చారని తెలిపారు. ఇంటి నంబర్లు లేకుండా కూడా పలువురి ఓట్లను నమోదు చేశారని తెలిపారు. నకిలీ ఓట్లను తాము 12 రకాల పద్ధతుల ద్వారా గుర్తించామని తెలిపారు. ఒకే ఓటర్ ఐడీతో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని, ఇటువంటి ఓటర్లు 9,552 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఇంటి నంబరు, జెండర్ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 52,180 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి జెండర్ మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,224 ఉన్నారని, ఇతర వివరాలు ఒకేలా ఉండి తండ్రి లేదా భర్త పేరు మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 1,78,868 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు ముందుకు, వెనుకకు మారిన నకిలీ ఓటర్లు (ఉదాహరణకు వరలక్ష్మి కొండేటి– కొండేటి వరలక్ష్మి) వంటివి 1,69,448 ఉన్నారని చెప్పారు. ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు ఒకే విధంగా ఉండి, ఇతర వివరాలు వేరే విధంగా ఉన్న ఓటర్లు 25,17,630 ఉన్నారని తెలిపారు. ఇతర వివరాలు ఒకేలా ఉండి ఇంటి నంబరులో మాత్రమే తేడా ఉన్న ఓటర్లు 4,49,126 ఉన్నారని, ఓటరు పేరు పలకడానికి ఒక రకంగా, ఒకటి రెండు అక్షరాల మార్పులతో ఉండే నకిలీవి 2,36,626 ఉన్నాయని వివరించారు. ఇంటి నంబరు తప్పు ఉన్న ఓటర్లు 2,15,119 ఉన్నారని చెప్పారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరుతూ దానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. -
బరితెగించిన టీడీపీ కార్యకర్తలు
-
ఇంటింటికీ లెక్క
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో అధిక ఓటర్లు ఉన్న ఇళ్లను అధికారులు సర్వే చేయనున్నారు. ఒకే ఇంట్లో భారీ సంఖ్యలో ఓటర్లు ఉండడం.. అనేక ప్రాంతాల్లో బోగస్ ఓటర్ల నమోదు.. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తొలగించలేదని రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఇంట్లో అధిక సంఖ్యలో ఓటర్లున్న నివాసాలను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే ఇంటి నంబర్పై 30 మంది, అంతకన్నా ఎక్కువగా ఉన్న ఓటర్లపై విచారణ చేయనున్నట్టు గురువారం ఓటరు నమోదు అధికారులు(ఈఆర్ఓ), సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తెలిపారు. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ.. నగరంలో ఒకే ఇంట్లో 30 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లున్న ఇళ్లను మరోమారు పరిశీలించాలన్నారు. తహసీల్దార్లతో ఈ సర్వే చేయనున్నట్టు తెలిపారు. బీఎల్ఓలు ఇంటింటినీ సర్వే చేస్తున్నప్పటికీ, ప్రతిసారి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై వాటికి ఆస్కారం లేకుండా చేయాలని తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. 23నుంచి 25 వరకు ప్రచార కార్యక్రమం.. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకు అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈనెల 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని దానకిషోర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రచారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా పరిధిలోని 84 మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో క్లెయిమ్స్, కొత్త ఓటర్లు దరఖాస్తుల స్వీకరణకు సిబ్బందిని నియమించామన్నారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఆయా వార్డు కార్యాలయాల్లో జనవరి 25 వరకు ఏర్పాట్లు ఉంటాయన్నారు. అయితే, ఈ కేంద్రాల ద్వారా ఒకే వ్యక్తి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందజేస్తే స్వీకరించరని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఈఆర్ఓలు చైతన్య సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు మాల్స్లోను నూతన ఓటర్ల నమోదు దరఖాస్తులు వేసేందుకు డ్రాప్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవి జనవరి 20వ తేదీ వరకు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి, అద్వైత్కుమార్ సింగ్, జయరాజ్ కెనెడీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.