తల్లి మృతి... పరీక్షకు హాజరైన విద్యార్థి | 10 class student attend exam due to mother died | Sakshi
Sakshi News home page

తల్లి మృతి... పరీక్షకు హాజరైన విద్యార్థి

Published Tue, Apr 7 2015 12:11 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

10 class student attend  exam due to mother died

గుంటూరు:  అనారోగ్యంతో అకాల మరణం పాలైన కన్నతల్లి మృతదేహం ఓ వైపు ... ఆమె కలలుకన్న బంగారు భవితకు పునాదులు వేసుకునే పరీక్ష మరో వైపు ... ఇలాంటి సంక్షిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న పసి మనస్సు పరీక్ష రాయడానికి సిద్ధమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. సత్తెనపల్లికి చెందిన సుమంత్రాజ్ తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. గత అర్థరాత్రి కన్నతల్లి మరణించింది. అయినా పుట్టెడు దుఃఖంలో సుమంత్రాజ్ మంగళవారం ఉదయం పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement