అనంతపురం: అనంతపురం జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ శివారులోని తోటలో బుధవారం అర్ధరాత్రి దాటాక పేకాట ఆడుతున్న స్ధావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ. 2.60 లక్షల నగదు, 5 ద్విచక్రవాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
12 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
Published Thu, Jul 23 2015 2:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
Advertisement
Advertisement