బుచ్చిరెడ్డిపాలెం : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. అక్రమనిల్వలపై అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేశారు.
కాగా గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 13 వంటగ్యాస్ సిలిండర్లు, 60 లీటర్ల నీలి కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానురాలిపై నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
13 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
Published Tue, Jul 14 2015 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement
Advertisement