మూగజీవాల మృత్యువాత | 450 sheeps died due to food poison | Sakshi
Sakshi News home page

మూగజీవాల మృత్యువాత

Published Tue, Dec 10 2013 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

మూగజీవాల మృత్యువాత

మూగజీవాల మృత్యువాత

 గసి బొరుగులు తిని 450గొర్రెలు మృతి, రూ.22.50 లక్షల నష్టం
 సాక్షి, అనంతపురం: గసి బొరుగులు (మరమరాల తయారీలోని వ్యర్థాలు) తిని 450 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.22.50 లక్షల నష్టం వాటిల్లింది. సోమవారం అనంతపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుక్కరాయ సముద్రం ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు పెద్ద కొండన్న, చిన్న కొండన్న, రామాంజనేయులుకు 600 గొర్రెలున్నాయి. స్వగ్రామంలో మేత లేకపోవడంతో గొర్రెలను అనంతపురానికి తోలుకొచ్చారు.
 
    ఆదివారం రోడ్డు పక్కన పడేసిన గసి బొరుగులను తిన్న గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. అధిక మోతాదులో గసిని తినడంవల్ల గ్యాస్ అధికంగా తయారై గొర్రెలు మృత్యువాతపడినట్లు పశువైద్యులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement