ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్కు ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు అందాయి.
హైదరాబాద్ నుంచి 52,893 మంది పోటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్కు ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు అందాయి.
ఆదివారం అర్ధరాత్రితో గడువు ముగిసే సమయానికి ఈ పోస్టులకు 6,55,729 మంది ఆన్లైన్ దరఖాస్తు చేశారు. ఆన్లైన్ పేమెంటుకు సంబంధించి బ్యాంకుల నుంచి సమాచారం వస్తే ఈ సంఖ్య మరో వేయి వరకు పెరుగుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 52,893 మంది అభ్యర్థులు ఉండడం విశేషం. వీరంతా నాన్లోకల్ కేటగిరీలో దరఖాస్తు చేశారు.