తిరుపతి :తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం ఓ జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది అనంతపురం జిల్లాకు చెందిన భక్తులు కాగా, మరో ఇద్దరు తిరుపతి వాసులుగా గుర్తించారు.
తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఘాట్ రోడ్డులోని జింకలపార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.