కందుకూరి పురస్కారాలకు ఎంపికైంది వీరే | AP Govt announces Kandukuri Awards | Sakshi
Sakshi News home page

కందుకూరి పురస్కారాలకు ఎంపికైంది వీరే

Apr 16 2017 7:09 PM | Updated on Jun 2 2018 2:56 PM

2017వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి కందుకూరి రంగ స్థల పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతి: 2017వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి కందుకూరి రంగ స్థల పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని, జిల్లాకు ఐదుగురు చొప్పున ప్రభుత్వం ఎంపిక చేసింది. కర్నాటి లక్ష్మీనరసయ్య, చింతా కబీర్ దాస్, అగ్గరపులు రజనీబాయి ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది.

రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష, జిల్లా స్థాయి గ్రహీతలకు రూ.10వేలతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాలను రాజమహేంద్రవరంలో ఈ నెల 30న ప్రదానం చేస్తారని ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ ఎండీ ఎస్.వెంకటేశ్వర్ వివరించారు. విజేతల పూర్తి వివరాల కోసం www.apsftvtdc.in వెబ్ సైట్లో ను సందర్శించాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement