సింగపూర్ ప్రభుత్వం ప్రతిపాదన
జీ టూ జీ విధానంలో నిర్మిద్దామని సూచన
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం, అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఏపీ రాజధానిని జీ టూ జీ (ప్రభుత్వం -ప్రభుత్వం) విధానంలో అభివృద్ధి చేయవచ్చ ని, ఇందులో తామూ భాగస్వాములవుతామని సూచించింది. ముగ్గురు మంత్రుల సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సుదీర్ఘంగా చ ర్చించింది. సింగపూర్ మంత్రులు గో చోక్ టాం గ్, ఎస్.ఈశ్వరన్, డెస్మాండ్ లీ ఈ బృందంలో ఉన్నారు. ఈ నగరాన్ని ప్రభుత్వాల భాగస్వామ్యంతో జీ టూ జీ విధానంలో అభివృద్ధి చేయాలని బృందం వెంకయ్యకు సూచించింది.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సింగపూర్ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుం దని ప్రతిపాదించింది. ఈ సూచనను పరిశీలిస్తామని, పట్టణాభివృద్ధి కార్యదర్శి శంకర్ అగర్వాల్ తదుపరి సంప్రదింపులు జరుపుతారని వెంకయ్య చెప్పారు. కేంద్రం చేపట్టిన వంద స్మార్ట్ సిటీల పథకం మౌలిక స్వరూపం, విధివిధానా లు, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం తదితర వివరాలను ఈ బృందం తెలుసుకుంది. పట్టణాభివృద్ధి రంగంలో ఇరు దేశాల పరస్పర సహకారానికి సంబంధించి పలు అంశాలపైన కూడా చర్చించారు. ఈ సందర్భంగా నగరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు, నీటి శుద్ధి, సరఫరా, గ్యాస్ సరఫరా, రవాణా, ఇంధన నిర్వహణ, వైద్యం, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ జరిగింది.
ఏపీ రాజధాని నిర్మాణంలో మేమూ కలుస్తాం
Published Thu, Sep 11 2014 1:28 AM | Last Updated on Sat, Aug 11 2018 7:46 PM
Advertisement
Advertisement