బేగంపేటలో విద్యార్థులపై దూసుకెళ్లిన కారు | Car accident in Begampet | Sakshi
Sakshi News home page

బేగంపేటలో విద్యార్థులపై దూసుకెళ్లిన కారు

Published Tue, Nov 12 2013 3:30 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థులపై కారు దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే హైదరాబాద్లో ఈరోజు అటువంటి ప్రమాదమే జరిగింది.

హైదరాబాద్: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థులపై కారు దూసుకెళ్లిన సంఘటన మరువక ముందే హైదరాబాద్లో ఈరోజు అటువంటి  ప్రమాదమే జరిగింది. బేగంపేట్‌లోని పీజీ కాలేజ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ముగ్గురు విద్యార్థులపై దూసుకెళ్లింది. విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.  వారిని ఆస్పత్రికి తరలించారు.

విజయవాడలోని రామవరప్పాడులో ఈ నెల 7వ తేదీ గురువారం బస్సు కోసం నిల్చున్న విద్యార్థులపై కారు దూసుకుపోవడంతో నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు జ్యోతి, సింధూజ, చందుశ్రీ,  పీజీ విద్యార్థి  సురేష్  మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగి వారం రోజులు కూడా కాకుండానే బేగంపేటలో అదే విధంగా కారు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement