సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేడో, రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఆదివారం ఉదయం, సాయంత్రం యనమల రామకృష్ణుడు, సీఎం రమేష్, సుజనా చౌదరి, అరవిందకుమార్గౌడ్, పెద్దిరెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులతో చర్చించారు. విభజన అంశంపై ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి అభిప్రాయ సేకరణ జరపనున్న నేపథ్యంలో.. అంతకంటే ముందుగా వెళ్లి ప్రధాని, రాష్ర్టపతిలను కలవాలని నిర్ణయించారు. సమావేశానంతరం యనమల, సీఎం రమేష్, పెద్దిరె డ్డి మీడి యాతో మాట్లాడుతూ.. పొత్తుల గురించి మోడీ తన అభిప్రాయాన్ని చెప్పారని, ఈ విషయమై సోమవారం మరోసారి చర్చిస్తామని తెలిపారు.