Yanamala Rama Krishnudu
-
చంద్రబాబుకు యనమల బిగ్ షాక్
-
బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అసమ్మతి గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యారని స్పష్టమైన సమాచారం. టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా.. ఏడుగురు ఎమ్మెల్సీలకు(Seven MLCs) మండలి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరమణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వీడ్కోలు మీటింగ్కు కావాలనే డుమ్మా కొట్టి.. టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు.ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి స్పీకర్, పైగా మంత్రిగా కూడా. టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కూతురు ఎమ్మెల్యే, బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ.. తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు. పైగా గత ఐదేళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా ఎమ్మెల్సీ(MLC)గా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు. కనీసం ఆయనకున్న రాజకీయానుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయతన వర్గీయులు అంటున్నారు. పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు.. రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంత కాలం కొనసాగి.. ఆపై రాజకీయాలకు గుడ్బై చెప్పాలని ఆయన భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకూ ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో చివరకు.. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్కు వెళ్లలేదు. మరోవైపు ‘ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్’ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది. -
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్యాదవ్కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్కుమార్కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
యనమల రామకృష్ణుడికి కృష్ణుడి కౌంటర్
సాక్షి, కాకినాడ: టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నేత యనమల కృష్ణుడు. టీడీపీకి బలం లేకపోయినా అధికార జులుంతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని భావించారు. యనమల చెత్త రాజకీయంలో భాగంగానే ఇదంతా జరిగింది అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నాయకుడు యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పది మంది కౌన్సిలర్లతో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ పదవి గెలవాలని యనమల రామకృష్ణుడు భావించారు. టీడీపీ బలం లేకపోయినా.. అధికారం జులుంతో గెలవాలని అనుకున్నారు. దీనిని బట్టి యనమలకు ప్రజాస్వామ్యం ఎంత వరకు తెలుసు అనేది తుని ప్రజలకు అర్ధమైంది. యనమల స్పీకర్గా ఉన్నప్పుడు ఇలాంటి లెక్కలే చూపించి ఎన్టీఆర్ను పదవిలో నుంచి దించేశారు. ఆయన కన్నీరు పెట్టుకునేలా చేశారా? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించినా.. ఇప్పటికీ వైఎస్సార్సీపీ బలం 17 మంది కౌన్సిలర్లు, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది. పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మున్సిపల్ చైర్మన్ సుధారాణిపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూశారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
దమ్ముంటే అరెస్ట్ చేయండి.. యనమలకు కృష్ణుడి సవాల్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు ఆయన తమ్ముడు, వైఎస్సార్సీపీ నేత కృష్ణుడు సవాల్ కూడా విసిరారు. రామకృష్ణుడికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. తనను అరెస్ట్ చేస్తే రామకృష్ణకు మంచిపేరు వస్తుందన్నారు.వైఎస్సార్సీపీ నేత యనమల కృష్ణుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారు. నా దగ్గర పనిచేసే కుర్రాళ్లను, డ్రైవర్లను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు. నిజంగా యనమల రామకృష్ణకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే యనమలకు మంచి పేరు వస్తుంది.అక్రమ కేసులు, అరెస్ట్లకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను.. ఇలాంటి చౌకబారు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నానని చులకనగా చూడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
మా అన్నకు పదవులే ముఖ్యం
-
Yanamala Family: కుమార్తె కోసం యనమల రామకృష్ణుడి కుట్ర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు ఒక్కటవుతార’నే సామెత టీడీపీలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడి విషయంలో నిజమైనట్టే కనిపిస్తోంది. నమ్ముకున్న నాయకులను చంద్రబాబు నట్టేట ముంచేసిన సందర్భాలు కోకొల్లలు. అనుకున్న పని అయిపోయిందంటే చాలు.. ఇక వారిని దూరం పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారనే విమర్శ ఉంది. చంద్రబాబుతో సావాసమో ఏమో కానీ తునికి చెందిన ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు మాత్రం ప్రస్తుతం అధినేత పంథానే అనుసరిస్తున్నారు. టీడీపీలో నంబర్–2గా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా రామకృష్ణుడు వ్యవహరిస్తున్నారు. ఆ స్థాయిలో ఉన్న ఆయన చంద్రబాబు మాదిరిగానే.. వరుసకు సోదరుడయ్యే కృష్ణుడిని టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ‘దివ్య’ంగా పొగ పెట్టేస్తున్నారు. నేరుగా పొమ్మనకుండానే ఈ కుటిల రాజకీయం నడిపించేస్తున్నారు. పార్టీకి దూరం చేస్తున్నారిలా.. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ దాదాపు మూడు దశాబ్దాల పాటు తునిలో యనమల సోదరుల అరాచక పాలన సాగించారనే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా తునిలో ఆ పార్టీ వరుసగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటూ వచ్చింది. చివరకు టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారిపోయిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తన కుమార్తె దివ్యను తుని నుంచి టీడీపీ తరఫున రామకృష్ణుడు బరిలోకి దింపారు. ఆమెకు అడ్డంకిగా ఉన్నారనే అక్కసుతో సోదరుడైన కృçష్ణుడిని పారీ్టకి దాదాపు దూరం చేసే ఎత్తులు వేస్తున్నారు. ► నియోజకవర్గంలో ఇంత కాలం కృష్ణుడి వెన్నంటి నడిచిన మండల స్థాయి నాయకులు ఒక్కొక్కరినీ ఆయనకు దూరం చేస్తూ, ఏకాకిని చేశారు. ► రాష్ట్ర పార్టీ అంతర్గత వ్యవహారాల్లో రామకృష్ణుడిదే పెత్తనమైనా.. తుని టీడీపీలో మాత్రం కృష్ణుడి హవాయే నడిచేది. కుమార్తె దివ్యకు టిక్కెట్టు ఇప్పించుకున్న రామకృష్ణుడు.. టీడీపీ తెరపై కృష్ణుడు కనిపించకూడదనే నిశ్చయానికి వచ్చారు. దివ్యను తుని టీడీపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణం నుంచే కృష్ణుడిని పారీ్టకి దూరం చేసే ప్రయత్నాలను తెర వెనుక ముమ్మరంగా సాగిస్తున్నారు. ► కృష్ణుడికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావును దూరం పెట్టాలని కృష్ణుడికి చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కృష్ణుడు ప్రచారంలో తన వెంట ఉండటానికి వీలు లేదని దివ్య కరాఖండీగా చెప్పారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. కృష్ణుడు ఉంటే ప్రచారానికి వెళ్లబోనని ఆమె ఇటీవల తండ్రి రామకృష్ణుడికి తెగేసి చెప్పారనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది. ఆయన తన వెంట ప్రచారంలో తిరిగితే పడే నాలుగు ఓట్లు కూడా పడవనే లెక్కలతోనే దివ్య ఆ విధంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కొన్ని రోజులుగా కృష్ణుడు పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కృష్ణుడి ఏలుబడిలో అరాచకాలు, దోపిడీలు, కేసులు పార్టీపై ప్రభావితం చూపుతాయనే ఉద్దేశంతోనే ఆయన దూరంగా ఉండాలని రామకృష్ణుడు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ► అనేక అవినీతి ఆరోపణలతో వైఎస్సార్ సీపీ బయటకు గెంటేసిన వెంకటేషకు టీడీపీలో పెత్తనం అప్పగించడం ద్వారా కృష్ణుడిని దూరం పెట్టడానికి రామకృష్ణుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్టు కనిపిస్తోంది. కృష్ణుడి వల్లనే పార్టీ నష్టపోయిందనే సాకుతో ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించిందని అంటున్నారు. ► 30 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించినందుకు తగిన శాస్తే జరిగిందని సహచరుల వద్ద కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరుకుంపటికి యత్నాలు తాము ఏం చేసినా అన్న రామకృష్ణుడి కోసమేనని ఆయనకు తెలియనిది కాదని, అయినప్పటికీ తనపట్ల కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారని కృష్ణుడు మండిపడుతున్నారు. సీటు కాదన్నా పార్టీ కోసం ఓపికగా భరించామని, ఇప్పుడు ప్రచారంలో కూడా వద్దని చెబుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన వర్గం ప్రశి్నస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఇంతలా అవమానించిన రామకృష్ణుడి వెంట తిరగాల్సిన అవసరం లేదని చెబుతూ.. వేరుకుంపటి పెట్టేందుకు కృష్ణుడి వర్గం సన్నద్ధమవుతోంది. వాస్తవానికి దివ్యను పార్టీ అభ్యరి్థగా ఎంపిక చేయడాన్ని మొదట్లోనే కృష్ణుడి వర్గం వ్యతిరేకించింది. ఇప్పుడు పారీ్టకి దూరం చేయాలనే రామకృష్ణుడు ఎత్తులను ఎదుర్కొనే దిశగా భవిష్యత్ నిర్ణయం కోసం మంతనాలు జరుపుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తునిలో సోమవారం అనుచరులతో భేటీ కావాలని కృష్ణుడు భావించారు. ఈ మేరకు అందరికీ పిలుపులు కూడా వెళ్లాయి. కారణాంతరాలతో చివరి నిమిషంలో సమావేశాన్ని మరో రెండు రోజులు వాయిదా వేశారు. ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట... టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు
-
యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
తుని రూరల్: నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుని బాహాబాహీకి దిగిన ఘటన సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద చోటు చేసుకుంది. తుని నియోజకవర్గ స్థాయిలో 2024 నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నాయకులు సాయి వేదికలో ఏర్పాటు చేశారు. వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామకృష్ణుడి కుమార్తె) ఉండడంతో నాయకులు, కార్యకర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంత సమయం తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొండంగి మండలం నుంచి అనుచరులతో తరలివచ్చిన యనమల రాజేష్.. రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ కృష్ణుడి వర్గీయులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన రాజేష్ వర్గీయులు ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజేష్, కృష్ణుడి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం ఘర్షణ పడుతూ కొట్టుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు. ఇదీ చదవండి: పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి -
యనమలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
-
ఏపీ అప్పులు.. గంటా శ్రీనివాసరావు, యనమలపై మంత్రి బుగ్గన సెటైర్లు..!
-
యనమల ఓ రాజకీయ శకుని: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్ అయ్యారు. యనమల ఓ రాజకీయ శకుని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు పెట్టించడం యనమల సోదరులకు పైశాచిక ఆనందం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిపై కేసులు పెడదామా అని యనమల ఆలోచిస్తాడు. ఎన్నికొలొస్తున్నాయనే తునిలో యనమల మోకాళ్ల యాత్ర చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లోనూ యనమలకు ఓటమి ఖాయం. 1989లో తునిలో వంగవీటి విగ్రహం పెడితే యనమల సోదరులు పొడిపించేశారు. గత 40 ఏళ్ళుగా యనమలకు తుని ప్రజలు గుర్తుకు రాలేదు. బెంగళూరులో ఉండే యనమల కుమార్తె తుని వచ్చి రాజకీయం చేస్తానంటే కుదరదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్ -
ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: యనమల రామకృష్ణుడి మాటలను తుని ప్రజలు విశ్వసించడం లేదని, చివరికి ఆయనకు ఇళ్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు లేరంటున్నారు.. తుని పీహెచ్సీలో వైద్యులు లేరని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని మంత్రి సవాల్ విసిరారు. ‘‘సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 2014-2019 వరకు వరకు తన పరిపాలన చూసి ఓటేయండి అనే ధైర్యం చంద్రబాబుకు ఉందా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. -
యనమల వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్
సాక్షి, తుని (కాకినాడ జిల్లా): యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఏపీ విద్యా విధానాలను కేంద్ర బడ్జెట్లోనూ ప్రస్తావించారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాం’’ అని మంత్రి అన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. నాడు-నేడు కింద రూపురేఖలు మార్చిన స్కూళ్లు గురించి తెలుసుకో. యనమల స్వగ్రామంలోనూ నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది’’ అని దాడిశెట్టి రాజా హితవు పలికారు. ‘‘యనమల వస్తే నియోజకవర్గంలో స్కూళ్లకు తీసుకెళ్తా. ఆయన అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు. హైస్కూల్ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ ఉండరన్నావు. యనమల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’’ అని మంత్రి రాజా అన్నారు. చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’ -
యనమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే.. ఇప్పుడెలా? యనమలా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య మొదలైన రాజకీయ వైరం హట్ టాపిక్గా మారింది. ఇప్పటికే రెండు సార్లు తుని నుండి ఓటమి చెందిన యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు.. వచ్చే ఎన్నికల్లో తనకే మళ్ళీ సీటు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో 30 శాతం సీట్లు యువతరానికే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో యనమల తన కుమార్తె దివ్యకు సీటు కన్ఫాం చేసుకున్నారు. అన్న వ్యవహారం రుచించని యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల తుని నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో యనమల రామకృష్ణుడు ఒక సమావేశం నిర్వహించారు. దీనికి ముందు రోజే కృష్ణుడు తన అనుచర గణానికి కాల్ చేసి...వచ్చే ఎన్నికల్లో కూడా సీటు మళ్ళీ తనకే ఇవ్వాలంటూ తన అన్న ముందు చెప్పాలని ప్రిపేర్ చేశారు. ఐతే ఆ ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది. నీ సంగతి బాబుకు చెబుతా ఆ మర్నాడు జరిగిన సమావేశంలో అన్న యనమల రామకృష్ణుడికి తమ గళాన్ని యాజ్ టీజ్గా వినిపించారు తమ్ముడు కృష్ణుడి అనుచరులు. దీంతో కాస్తంత అసహనానికి గురయిన యనమల.. విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళారు. కాని ఇదంతా యనమల ఆడిస్తున్న మైండ్ గేమ్ అనే వాదనలు టీడీపీ వర్గాల్లో వినిపించాయి. ఎందుకంటే.. ఈసారి తుని సీటు యనమల కుటుంబానికి కాకుండా బయట వ్యక్తులకు ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది. అదే సమయంలో తుని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్బాబు కూడా చంద్రబాబును కలిసి వచ్చారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో యనమల ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఇప్పటి వరకు టీడీపీలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న యనమలకు తన నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం తెలియకపోవడంతో కంగు తిన్నారని తెలుగు తమ్ముళ్ల ప్రచారం. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! దీంతో యనమల తుని సీటు బయట వ్యక్తులకు పోకుండా ఇలా అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినట్లు డ్రామా నడిడించి రక్తి కట్టించారని రాజకీయ మేధావులు అభిప్రాయ పడ్డారు. ఇదిలా ఉంటే అసలు రాజా అశోక్ బాబును చంద్రబాబుతో కలిపించిందే కృష్ణుడు అని మరో ప్రచారం ఉంది. అన్నకు వ్యతిరేకంగా కృష్ణుడు ఈ పని చేశాడని నియోజకవర్గంలో కొందరు కోడై కూస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే అంతే సంగతులు ఈ పరిణామాలన్నీ తుని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపగా.. తాజాగా యనమల సోదరుల మధ్య మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి సీటు తనకు ఇవ్వకపోతే తన కుమారుడు శివరామకృష్ణకు ఇవ్వాలని కృష్ణుడు గట్టిగా పట్టుపడుతున్నారట. ప్రస్తుతం శివరామకృష్ణ నియోజకవర్గంలో తెలుగుదేశం యువజన విభాగం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం తుని సీటు యువతకే ఇవ్వాలనుకుంటే తన కుమారుడు పేరే పెట్టాలని అన్న యనమలకు ఖరాఖండీగా చెప్పేశారట కృష్ణుడు. దీంతో అన్న యనమలకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఎదురయిందని అంటున్నారు వారి అనుచరులు. మొత్తం మీద టీడీపీలో తొలితరం నాయకుడైన యనమల రామకృష్ణుడికి తమ్ముడు రూపంలో చిక్కులు ఎదురుకావడంతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్పై పెట్టుకున్న ఆశలు ఏమవుతాయా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
యనమల ఓ సైకో : మంత్రి దాడిశెట్టి రాజా
-
యనమలకు ఆ విషయం తెలియకపోవడం బాధాకరం
ఏయూక్యాంపస్: రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదని, ఈ విషయం మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి తెలియకపోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అన్నారు. దీనిపై క్లారిటీ కావాలనుకుంటే యనమల కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించడానికి శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల దిశగా ఏపీ వెళుతోందన్న యనమల మాటలను ఖండించారు. యనమల వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు, ఇప్పటి అప్పులు పోల్చి చూసుకోవాలని అన్నారు. అనవసరమైన రాజకీయ విమర్శలు చేయడం కన్నా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఇదిలాఉండగా...న్యాయస్థానంలో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టుకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదన పంపినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. పీఎంవో కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన కూడా జరుగుతుందని చెప్పారు. -
అప్పులు, ప్రగతిపై అడ్డగోలుగా అబద్ధాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పారిశ్రామిక ప్రగతితో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేయడమే కాకుండా భారీ అప్పులతో ఏకంగా రూ.40 వేల కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయిన యనమల రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతూ బుకాయించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బుధవారం సచివాలయంలో బుగ్గన మాట్లాడారు. ► నీతి ఆయోగ్ 10 అంశాలతో నివేదిక ఇస్తే తనకు అనుకూలమైన ఒక అంశానికి చెందిన అంకెలను తీసుకుని యనమల తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. సున్నా వడ్డీని రైతులకు చెల్లించకుండా టీడీపీ సర్కారు రూ.784.71 కోట్ల బకాయిలు పెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తాన్ని 39.06 లక్షల మంది రైతులకు చెల్లించింది. ఇన్పుట్ సబ్సిడీ కింద ఇప్పటికే రూ.1795.45 కోట్లు చెల్లించాం. 8.76 లక్షల మంది కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రూ.5,915 కోట్ల పంట రుణాలు ఇప్పించాం. ► విద్య, వైద్య రంగాల్లో నాడు – నేడు కింద చేపట్టిన పనులను యనమల తుని నియోజకవర్గానికి వెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. నాడు–నేడుతోపాటు అమ్మఒడి, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, సంపూర్ణ పోషణ తదితరాలకు మూడేళ్లలో రూ.53,337 కోట్లు వ్యయం చేశాం. జాతీయ ఆరోగ్య సూచికలో 2017–18లో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా ఇవాళ 10వ స్థానంలో ఉందని యనమల పచ్చి అబద్ధాలాడుతున్నారు. 2019–20లో ఏపీ 4వ స్థానంలో ఉంది. వైద్య రంగంలో 2017–18లో 65.13 స్కోర్తో నాలుగో స్థానంలో ఉంటే 2019–20లో 69.95 స్కోర్తో మార్కులు పెరిగాయి. మా ప్రభుత్వం 104, 108 వాహనాలు 1,108 కొనుగోలు చేసింది. ► సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018–19లో 68 మార్కులుంటే 2020–21లో 77 మార్కులకు పెరిగాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో యనమల తనకు అనుకూలమైన లెక్కలు తీసుకుని వక్రీకరిస్తున్నారు. 2018–19లో తొలి అడ్వాన్స్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,80,332 కోట్లుగా అంచనా వేయగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల శాఖ ప్రకటించిన మూడో రివైజ్ట్ అంచనాల మేరకు రూ.6,26,614 కోట్లకు తగ్గింది. అంటే 11 శాతం నుంచి వృద్ధి 5.66 శాతానికి తగ్గింది. మరి ఇది ఎవరి నిర్వాకం? ఎవరిని తప్పుబట్టాలి? ► టీడీపీ హయాంలో అప్పులు భారీగా పెరిగాయి. టీడీపీ పాలనలోవార్షిక సగటు అప్పుల వృద్ధి 19.44 శాతం కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 15.46 శాతం మాత్రమే. కోవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఇబ్బందులు ఎదురైనా ఆర్థికంగా మెరుగ్గానే ఉన్నాం. ► నీటిపారుదల, వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. టీడీపీ హయాంలో పది లక్షల ఎకరాలకు అదనంగా నీరు ఇచ్చినట్లు అవాస్తవాలు చెబుతున్నారు. పోలవరాన్ని పక్కనపెట్టి కమీషన్ల కోసం పట్టిసీమ చేపట్టారు. పోలవరం జాప్యానికి టీటీపీ సర్కారు నిర్వాకమే కారణం. టీడీపీ హయాంలో రహదారుల నిర్మాణానికి ఏడాదికి రూ.2,110 కోట్లు వ్యయం చేస్తే ఇప్పుడు రూ.2,800 కోట్లు వెచ్చిస్తున్నాం. ► టీడీపీ హయాంలో సగటున ఏడాదికి రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే ఇప్పుడు రూ.13,201 కోట్లు వస్తున్నాయి. పెద్ద, మెగా పరిశ్రమలు 107 రాగా ఎంఎస్ఎంఈలు 1,06,249 యూనిట్లు వచ్చాయి. వాటి పెట్టుబడి రూ.14,656 కోట్లు. మరో 57 ప్రాజెక్టులు రూ.91,243 కోట్ల పెట్టుబడితో పురోగతిలో ఉన్నాయి. నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు రూ.1,06,800 కోట్లతో నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 63,509 ప్రాజెక్టుల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. -
యనమలపై మంత్రి బుగ్గన మండిపాటు.. రాళ్లేయడమే లక్ష్యమా?
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు విసరడమే లక్ష్యంగా విపక్షం వ్యవహరిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. రైతులు, ప్రజల అవసరాలను తీరుస్తుంటే టీడీపీ నేత యనమల తదితరులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నిన్నటి దాకా శ్రీలంక అంటూ దుష్ప్రచారం చేసి ఇప్పుడు నెజీరియా, జింబాబ్వే అంటూ యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని యనమలకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై టీడీపీ ఆరోపణలను ఖండిస్తూ బుగ్గన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇబ్బందులున్నా వెనుకంజ వేయలేదు.. సానుకూల దృక్పథం చంద్రబాబు బృందం డిక్షనరీలోనే లేదు. కోవిడ్తో ప్రపంచమంతా అల్లాడిన 2020–21 ఆర్థిక పరిస్థితి గురించే యనమల పదేపదే మాట్లాడుతుంటారు. కోవిడ్తో జనజీవితం అతలాకుతలం అయింది. ఆదాయ వనరులకు గండి పడింది. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సుమారు రూ.8 వేల కోట్లు తగ్గింది. మహమ్మారి కట్టడి, వైద్య సదుపాయాలు, టెస్టింగ్, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, ఉచిత బియ్యం సరఫరాకు ప్రభుత్వం అదనంగా రూ.7,130 కోట్లు వ్యయం చేసింది. ఇలాంటి పరిస్థితిలోనూ నవరత్నాల అమలులో ఎక్కడా వెనకడుగు వేయలేదు. నాడు అసాధారణ అప్పులు.. ఐదేళ్ల టీడీపీ హయాంలో అప్పులు 19.6% పెరిగితే వైఎస్సార్సీపీ పాలనలో మూడేళ్లలో పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న అప్పులతో కలిపి (రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నప్పటికీ) 15.5% మాత్రమే పెరిగాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా 19.6% వృద్ధితో అప్పులు చేశారు. గత సర్కారుతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది. డీబీటీతో రూ.57,512 కోట్లు రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు కరోనా వేళ ఉపాధి కోల్పోయి ఇళ్ల నుంచి కదలలేకపోయారు. వారి ప్రాణాలను కాపాడుకుంటూనే డీబీటీ ద్వారా నేరుగా రూ.57,512 కోట్లు పారదర్శకంగా జమ చేసి ఆదుకున్నాం. ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ప్రజలకు అందించడం కోవిడ్ సమయంలో ఎక్కడా లేదు. అయినా ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ యనమల పదేపదే బురద చల్లుతున్నారు. కరోనా చెలరేగిన 2020–21 గురించి కాకుండా 2021–22 గురించి టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరు? ఆ నిర్వాకాలతోనే ఆంక్షలు గత సర్కారు ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలు కాగ్ నివేదికలో స్పష్టంగా ఉన్నాయి. టీడీపీ పాలనలో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.17,000 కోట్లు అదనంగా అప్పు చేయటాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. గత సర్కారు నిర్వాకాలను కారణంగా చూపిస్తూ ఇప్పుడు రుణ పరిమితిపై ఆంక్షలు విధిస్తోంది. యనమలవి పచ్చి అబద్ధాలు రాష్ట్ర అప్పులు రూ.8,00,000 కోట్లు అనే లెక్కలు యనమలకు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. అది పచ్చి అబద్ధం. గణాంకాలతో వాటిని రుజువు చేయగలరా? పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న వాటితో కలిపి రాష్ట్ర అప్పు రూ.1,71,176 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. 2019లో టీడీపీ సర్కారు దిగిపోతూ పెండింగ్లో పెట్టిన రూ.40,000 కోట్ల బిల్లులు పెనుభారంగా మారాయి. విద్యుత్తు కొనుగోలు, పంపిణీ సంస్థలకు సంబంధించిన అప్పు రూ.46,200 కోట్ల మేర అదనంగా పెంచేసి విద్యుత్తు రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బతీశారు. దురదృష్టకరమైన రాష్ట్ర విభజన, టీడీపీ అస్తవ్యస్త పాలన, కోవిడ్ వల్ల దెబ్బతిన్న రాష్ట్ర అర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం. మెరుగ్గా మూలధన వ్యయం 2014–19లో మూలధన వ్యయం రూ.15,227 కోట్లు కాగా వైఎస్సార్సీపీ పాలనలో సగటున రూ.18,362 కోట్లు ఉంది. మూలధన వ్యయాన్ని ప్రధానంగా విద్య, ఆరోగ్యంపై వెచ్చిస్తున్నాం. అప్పులపై వడ్డీలు – వడ్డీ రేట్లు టీడీపీ హయాంలో సగటున 8.49% వడ్డీలతో అప్పులు తెస్తే మా ప్రభుత్వం 6.96 శాతానికే అప్పు తెచ్చింది. టీడీపీ సర్కారు ఎడాపెడా చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కడుతున్నాం. గత సర్కారు రకరకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పుల రూపంలో ప్రజాధనాన్ని పక్క దోవ పట్టించలేదా? రైతు సాధికార సంస్థ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పవర్ సెక్టార్, డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ల పేరుతో టీడీపీ సర్కారు అప్పులను దారి మళ్లించడం నిజం కాదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికీ లెక్క ఉంది. నేరుగా రూ.1,70,000 కోట్లను ప్రజలకు పారదర్శకంగా అందచేసింది. నిబంధనల ప్రకారమే.. ఆయా ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను బట్టి ఎన్నిసార్లైనా వేస్ అండ్ మీన్స్కు వెళ్లవచ్చు. ఆది ఆర్బీఐ కల్పించిన సదుపాయం. మేం నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే ఎందుకు అనుమతిస్తుంది? ఓవర్ డ్రాఫ్ట్ అదనపు అప్పు కాదు. 2018 –19లో ఒకసారికి రూ.1,510 కోట్లు ప్రకారం 144 రోజులకు ఓడీకి అనుమతిస్తే రూ.19,654 కోట్లు తీసుకున్నారు. అంటే 107 రోజులు (74.30%) ఓడీ పొందారు. 2019 20లో ఒకసారికి రూ.1,510 కోట్లు ప్రకారం 144 రోజులు ఓడీకి అనుమతిస్తే రూ.17,631 కోట్లు తీసుకున్నాం. అంటే 57 రోజులు (39.58%) ఓడీ పొందాం 2020 –21లో ఒకసారికి రూ.2,416 కోట్లు ప్రకారం 200 రోజులు ఓడీకి అనుమతిస్తే రూ.31,812 కోట్లు తీసుకున్నాం. అంటే 103 రోజులు (51.50%) ఓడీ పొందాం. మరి యనమల చెబుతున్న కాకి లెక్కలు (330 రోజులు) ఎక్కడ నుంచి వచ్చాయి?. -
టిడిపి సీనియర్ నేత యనమల లేఖపై జిల్లా ప్రజల ఆగ్రహం
-
రూల్ ప్రకారమే రుణాలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగానికి, నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని, ఎక్కడా వాటిని ఉల్లంఘించలేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్కు ఆర్బీఐ నిబంధనల మేరకే ప్రభుత్వం వెళ్లిందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలపై ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే వ్యవహరించామని, ఇందులో ఎక్కడా తప్పు లు జరగలేదన్నారు. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లడం, కార్పొరేషన్ల ద్వారా పూచీకత్తు ఇచ్చి రుణాలు తీసుకోవడాన్ని నేరంగా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చిత్రీకరించడం దారుణమని, సీబీఐ విచారణ కోరడం విడ్డూరమన్నారు. యనమల ఆర్థిక మంత్రిగా ఉండగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా రుణాలు తీసుకున్నారని, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్కు కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఆయన హయాంలో తీసుకుంటే ఒప్పు.. ఇప్పుడు తీసుకుంటే నేరమా? అని ప్రశ్నించారు. వీటి గురించి గత సర్కారు హయాంలో నోరెత్తని కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా కథనాలు ఎందుకు ప్రచురిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈమేరకు బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► రాష్ట్ర ప్రభుత్వం ఏటా వివిధ సంస్థల నుంచి రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్ బయట రుణాలు తీసుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణాలకు పూచీకత్తు ఇస్తుంది. ఇదేమీ కొత్త కాదు. రాజ్యాంగ విరుద్ధమూ కాదు. ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికి కేంద్రం అనుమతి అవసరం లేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాల్లో చూస్తే ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ సంస్థల ద్వారా రూ. 1,35,292.51 కోట్లు రుణం తీసుకున్నట్లుంది. ► విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీతో వివిధ సంస్థల ద్వారా చేసిన అప్పు రూ.14,028.22 కోట్లు కాగా 2014–19లో టీడీపీ సర్కారు ఏకంగా రూ.63,664.64 కోట్లకు పెంచేసింది. యనమల ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ బయట అప్పులు 450 శాతం పెరిగాయి. పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో ఏకంగా రూ.20,000 కోట్లు అప్పు చేశారు. ► టీడీపీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.63,664.64 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.1,17,503.08 కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసే అప్పులను ఎక్కడా దాచడం లేదు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాల్లో వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ► ఓ పత్రిక అప్పులపై అవాస్తవాలను ప్రచురించింది. రాష్ట్రం మొత్తం అప్పులు రూ. 6,26,836 కోట్లుగా పేర్కొనడం అవాస్తవం. రాష్ట్ర అప్పులు రూ.4,13,000 కోట్లు కాగా అధికారికంగా విడుదల చేసిన అంచనాల మేరకు అది రూ.3,90,670 కోట్లే. ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ.1,38,603.58 కోట్లుగా పేర్కొనడంలో కూడా నిజం లేదు. ► గత సర్కారు హయాంలో అప్పులు ఏకంగా 20.39 శాతం మేర పెరగ్గా ఇప్పుడు కేవలం 15.46 శాతమే పెరిగాయి. కోవిడ్ కారణంగా ఒకపక్క ఆదాయం క్షీణించగా మరో పక్క వ్యయం పెరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా పారదర్శకంగా నగదు బదిలీతో పేదలను ప్రభుత్వం ఆదుకుంది. సామాజిక, ఆర్థిక ప్రగతి, మానవ వనరుల వృద్ధి వ్యయాన్ని కూడా అభివృద్ధిగానే పరిగణించాలి. ► వేస్ అండ్ మీన్స్కు 2018–19లో ఆర్బీఐ 144 రోజులు అనుమతిస్తే గత సర్కారు 107 రోజులు వినియోగించుకుంది. 2020–21లో కోవిడ్ సమయంలో ఆర్బీఐ 200 రోజులు అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 103 రోజులే వినియోగించుకుంది. వేస్ అండ్ మీన్స్ను ఆర్బీఐ నిబంధనలకు లోబడి తక్కువ వడ్డీకి వినియోగించుకోవడంలో తప్పులేదు. ► దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.45 శాతం ఉండగా ఇప్పుడు కోవిడ్ సమయంలోనూ ఏపీ వాటా 5.01 శాతంగా ఉంది. ► కాగ్ ప్రస్తావించిన రూ.48,384 కోట్లు సర్దుబాటు మాత్రమే.. అది వ్యయం కాదు. ఇందులో కేవలం రూ.224.73 కోట్ల మేర మాత్రమే నగదు లావాదేవీలు జరిగాయి. మిగతా మొత్తం అంతా సర్దుబాటు మాత్రమే. దీనిపై కాగ్కు వివరణ ఇచ్చాం. గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే దీనికి కారణం. ► 2015–16లో టీడీపీ హయాంలో ఏకంగా 14,721 కొత్త వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలను తెరిచారని, దీనిపై రికార్డులు లేవని కాగ్ ఆడిట్లో తప్పుబట్టింది. 42,999 వ్యక్తిగత డిపాజిట్ల నుంచి రూ.41,001.13 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని, ఈ ఖాతాలు, ఖర్చులకు సంబంధించి ప్రామాణికతను పరిశీలించేందుకు సరైన యంత్రాంగం లేదని కాగ్ ఆడిట్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం టీడీపీ నేతలకు, వారి అనుకూల మీడియాకు కనపడదా? -
అసెంబ్లీకి వెళ్తాం..చంద్రబాబు మాత్రం హాజరుకారు
సాక్షి, అమరావతి: వచ్చే శాసన సభ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతామని టీడీపీ నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం సభకు రారని, మిగిలిన సభ్యులంతా హాజరుకావాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం జరిగిన జూమ్ కాన్ఫరెన్స్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే సీఎంగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు చెప్పిన మాటకు ఆయన కట్టుబడే ఉన్నారని, ఆయన సభకు రారని తెలిపారు. అమరావతి, పోలవరం, హోదా తదితర సమస్యలను లేవనెత్తుతామన్నారు. రాజధానిపై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినా వైఎస్సార్సీపీ సభ్యులు కొత్తగా చట్టం తీసుకొస్తామంటున్నారని విమర్శించారు. సమస్యలను చర్చించేందుకు వస్తున్నామని యనమల స్పష్టం చేనశారు. చివరి వరకూ బాబు సాగదీత అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై చంద్రబాబు ఎప్పటిలానే నాన్చుడు ధోరణి అవలంబించారు. వాస్తవానికి 10 రోజుల క్రితమే తన ఎమ్మెల్యేలను సభకు పంపాలని నిర్ణయించారు. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చర్చలు జరుపుతున్నట్లు లీకులిచ్చారు. ఒక దశలో గైర్హాజరవుతున్నట్లు లీకులిచ్చారు. చివరికి హాజరవుతున్నట్లు ప్రకటించారు. -
‘తప్పుడు లెక్కలతో ప్రజలను బురిడీ కొట్టించలేరు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేట్లపై టీడీపీవి తప్పుడు లెక్కలని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-2020లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతంగా ఉన్నట్ల తెలిపారు. వ్యవసాయరంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి ఉన్నట్లు చెప్పారు. 20202-2021 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్లో ఏపీకి 3వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపులో ఏపీకి 5,6 స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు. చదవండి: AP: ఏఎన్యూకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకు తప్పుడు లెక్కలతో టీడీపీ నేతలు ప్రజలను బురిడీ కొట్టించలేరని ఆయన మండిపడ్డారు. ప్రతి పక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు దాచిపెట్టి టీడీపీకి అనుకూలమైన లెక్కల చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
అబద్ధాల్లో అపూర్వ సోదరులు
సాక్షి, అమరావతి: బీసీల సంక్షేమానికి 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ వ్యయం చేసిన నిధుల కంటే 26 నెలల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సవాల్ విసిరారు. అబద్ధానికి చంద్రబాబు అన్న అయితే యనమల తమ్ముడి లాంటివారన్నారు. ఈ ఇద్దరూ అపూర్వ సహోదరుల్లా తప్పుడు అంకెలు చెబుతూ అసత్యాలను వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా పది వేల మంది బీసీల్లో ఒకరికి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చి బానిసల్లా చూసిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట మేరకు బీసీలకు సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. 25 సంక్షేమ పథకాల ద్వారా రూ.1,04,241 కోట్లను వివిధ వర్గాల ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేయగా బీసీలకు రూ.50,315 కోట్లను అందజేశారని వివరించారు. నగదేతర పథకాల ద్వారా వివిధ వర్గాలకు రూ.1,40,438 కోట్ల ప్రయోజనం చేకూరగా బీసీ వర్గాలకు రూ.69,662 కోట్ల మేర మేలు జరిగిందని చెప్పారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ఒక్క బీసీ నేతనూ రాజ్యసభకు పంపలేదన్నారు. వైఎస్సార్సీపీ ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిందని తెలిపారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు కేటాయించేలా ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇటీవల పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారని వివరించారు. బీసీ వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన చంద్రబాబు, యనమల ఎప్పుడైనా చేశారా? అని మంత్రి చెల్లుబోయిన ప్రశ్నించారు. -
'దివీస్'పై దిగజారుడు రాజకీయం
సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడి దృష్టిలో అది వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ. అధికారం లేకుంటే మాత్రం కాలుష్యం వెదజల్లే పరిశ్రమ!!. ఇదీ తెలుగుదేశం పార్టీ ద్వంద్వ నీతి. ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబరేటరీస్కు చెందిన యూనిట్ విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... తమ నిర్వాకాలన్నీ రాష్ట్ర ప్రజలు మరిచిపోయారని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫార్మా యూనిట్ ఏర్పాటుకు దివీస్ సన్నాహాలు మొదలుపెట్టడాన్ని సాకుగా తీసుకుని.. వాస్తవాలను కప్పిపుచ్చి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటన మరీ చిత్రం. ఎందుకంటే దివీస్కు అనుమతులిచ్చిందీ, కాకినాడ సెజ్ నుంచి భూములు వెనక్కి తీసుకుని మరీ కేటాయింపులు చేసిందీ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వమే. పైపెచ్చు దివీస్కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా కోన ప్రాంతంలో 82 రోజుల పాటు పోలీసు రాజ్యం.. అరెస్టుల పర్వం కొనసాగించింది కూడా టీడీపీ సర్కారే. దివీస్ ప్రతిపాదనకు బాబు కేబినెట్ ఆమోదం తెలపడం, అందుకనుగుణంగా తొలుత ప్రభుత్వం, ఆ తర్వాత ఏపీఐఐసీ జీవోలు ఇవ్వడం, తక్కువ ధరకే భూములు కట్టబెట్టడం.. ఈ మొత్తం వ్యవహారాన్ని వెనక నుంచి నడిపించిన నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు... ఇపుడు ప్లేటు ఫిరాయించడాన్ని స్థానికులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. 2015లో కేసెజ్ నుంచి దివీస్కు భూమి కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో, భూ కేటాయింపు ప్రక్రియను పూర్తిచేస్తూ ఏపీఐఐసీ ఇచ్చిన ఉత్తర్వులు బాబు హయాంలో జరిగింది ఇదీ.. ► వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీఎంఆర్ కాకినాడ సెజ్ (కేసెజ్) కోసం (పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కోసం) ప్రభుత్వం కాకినాడ సమీపంలో 10,400 ఎకరాల భూమి సేకరించి ఇచ్చింది. ► 2014 సెప్టెంబర్ 27న దివీస్ ల్యాబొరేటరీస్ కాకినాడ సమీపంలోనే సముద్ర తీర కోన ప్రాంతం, తొండంగి మండలం ఒంటిమామిడి వద్ద సుమారు రూ.790 కోట్ల పెట్టుబడితో ఫార్మా యూనిట్ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ తయారీ) ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసింది. ► ఈ ప్రతిపాదన రాగానే ఫైల్ వాయువేగంతో కదిలింది. కాకపోతే దివీస్ ప్రతిపాదించిన ప్రాంతంలో భూమి అప్పటికే కే–సెజ్కు కేటాయించి ఉంది. ► దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. కేసెజ్పై ఒత్తిడి తీసుకువచ్చి దానికి కేటాయించిన భూమిలో.. 2,094.74 ఎకరాలతో కూడిన ఒక భాగంలో 505 ఎకరాలను దివీస్కు ఇప్పించేలా ఒప్పించారు. ► ఇందుకు బదులుగా మరోచోట కేసెజ్కు 279.38 ఎకరాల భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీన్ని నాటి కేబినెట్ ఓకే చేసింది. ► యనమల సభ్యుడిగా ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీబీ) సిఫారసుల మేరకు.. దివీస్కు ప్రత్యేక రాయితీలిస్తూ 2015 జూలై 15న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ► మంత్రివర్గ ఆమోదానికి అనుగుణంగా కేసెజ్ నుంచి 505 ఎకరాలు వెనక్కి తీసుకొని దివీస్కు కేటాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2015 సెప్టెంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసింది. ► ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీఐఐసీ కూడా 2015 అక్టోబర్ 17న ఉత్తర్వులు జారీ చేసి భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. కారు చౌకగా ఎకరం రూ.6 లక్షలకు కట్టబెట్టింది. ► అయితే దివీస్కు ఇచ్చిన 505 ఎకరాలు కే సెజ్ మధ్యలో ఉండటంతో దానిలోకి వెళ్లడానికి కనీసం రోడ్డు కూడా లేక ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. ► తాజాగా అప్రోచ్ రోడ్డు నిర్మించుకునేందుకు దివీస్ చర్చలు జరుపుతోంది. ► తమ యూనిట్తో ఎలాంటి కాలుష్యం ఉండదని చెబుతూ.. హైదరాబాద్తో పాటు విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఉన్న యూనిట్లలో తాము తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను స్థానికులకు తెలియజేస్తోంది. ► పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి, సముద్రపు నీటిలో ఉండే ఉప్పు శాతం కంటే తక్కువ స్థాయికి తెచ్చి పైప్లైన్ ద్వారా సముద్రంలో 1.5 కి.మీ దూరంలో కలిపేలా తీసుకుంటున్న చర్యలను సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. ► దీనివల్ల మత్స్య సంపదకు, భూగర్భ నీటికి ఎటువంటి హాని కలగదంటూ అవగాహన కల్పిస్తున్నారు. ► ఈ వాస్తవాలన్నిటినీ పక్కనబెట్టి ఇదేదో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా... కోన ప్రాంతం దెబ్బతింటుందంటూ యనమల యాగీ చేయటమే విచిత్రం. ‘కోన’పై ఉక్కుపాదం దివీస్ పరిశ్రమపై 2016 జూన్ 22న పంపాదిపేటలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 14 గ్రామాల నుంచి వందలాది మంది 2016 ఆగస్టు నుంచి ఉద్యమం నడిపారు. ఆ ఏడాది చివరి వరకూ సాగిన ఈ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బడుగు, బలహీనవర్గాలు, దళిత రైతులు, మత్స్యకారులపై కక్ష కట్టి, కోన ప్రాంతంలో 82 రోజుల పాటు పోలీసు రాజ్యం నడిపించింది. బయటి ప్రాంతాల నుంచి బంధువులను కూడా కోన గ్రామాలకు రానివ్వకుండా పొలిమేరల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వకుండా నెలల తరబడి 144 సెక్షన్ కొనసాగించి భయానక వాతావరణం సృష్టించారు. మహిళలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించారు. సుమారు 400 మందిని అరెస్టు చేశారు. బాబు హయాంలో పంపాదిపేట గ్రామంలో మహిళలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు దివీస్ను తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే కోన ప్రాంతంలో దివీస్ పరిశ్రమ చిచ్చు పెట్టింది టీడీడీ ప్రభుత్వమే. దివీస్ పరిశ్రమకు 500 ఎకరాలు కేటాయించినట్టు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. పరిశ్రమ వద్దంటూ పోరాటం చేస్తున్న మమ్మల్ని హింసించారు. తప్పుడు కేసులు బనాయించారు. అప్పుడలా చేసి ఇప్పుడు స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. – అంగుళూరి అరుణ్కుమార్, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు, కొత్తపాకలు గ్రామం, తొండంగి మండలం కోన ప్రజలపై దాష్టీకం ప్రదర్శించారు టీడీపీ ప్రభుత్వం అనుమతించిన దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన మాపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా దౌర్జన్యకాండ జరిపారు. అరెస్టులు చేశారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా విచక్షణారహితంగా లాఠీలతో జులుం ప్రదర్శించారు. దివీస్కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. – చొక్కా కాశీ ఈశ్వరరావు, మత్స్యకార నాయకుడు, నర్శిపేట గ్రామం, తొండంగి మండలం -
యనమలకి చిన్న మెదడు చితికినట్లుంది
సాక్షి, అమరావతి: రెండు పారిశ్రామిక సంస్థల మధ్య జరిగిన వాటాల విక్రయ లావాదేవీలను ముఖ్యమంత్రికి ముడిపెట్టిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి చిన్న మెదడు చితికినట్లుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ సెజ్లో జీఎంఆర్, అరబిందో కంపెనీల మధ్య షేర్ల విక్రయాన్ని రాజకీయం చేస్తూ యనమల చేసిన ప్రకటనపై కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అరబిందో కంపెనీ రైతుల నుంచి భూములను లాక్కోలేదు. జీఎంఆర్ నుంచి కొనుగోలు చేసింది. జీఎంఆర్ రైతుల నుంచి భూములను తీసుకున్నప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది. మరి అప్పుడు మీరేం చేశారు? మీ హయాంలోనే ఇదంతా జరిగింది’ అని పేర్కొన్నారు. కాకినాడలో సెజ్కు శ్రీకారం చుట్టి ఇవాళ నీతులు వల్లించడం యనమలకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ సెజ్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. (లక్షన్నర మందికి 3 లక్షల ఎకరాలు) ►కంపెనీలు తమ వాటాలను విక్రయించడం అతి సహజం. ఒకవేళ అదే తప్పయితే హెరిటేజ్ కంపెనీ షేర్లను ఫ్యూచర్ గ్రూపునకు ఎందుకు అమ్మారు? ►కాకినాడ సెజ్ వ్యవహారంలో జీఎంఆర్కే లాభం చేకూర్చాలనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కు ఇచ్చిన ఎంతో విలువైన కమర్షియల్ భూముల్లో వేల కోట్ల విలువ చేసే 500 ఎకరాలను ఎందుకు వెనక్కుతీసుకుంటారు? మీకు ఆమాత్రం తెలియదా? ►మ్యాట్రిక్స్ ప్రసాద్ మీ పార్టీ వారితో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే మంచి పారిశ్రామికవేత్తా? అదే ప్రసాద్ సాక్షిలోనో, మీకు నచ్చని మరోచోటో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే చెడ్డ పారిశ్రామికవేత్తగా చిత్రీకరిస్తారా? ►సీఎం జగన్ పాదయాత్ర సమయంలో కాకినాడ వచ్చినప్పుడు సెజ్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కమిటీని నియమించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆ దిశగా మేం కృషి చేస్తుంటే మేమేదో కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలా? ►మీ హయాంలో 600 ఎకరాల్లో దివీస్ హేచరీస్ ఏర్పాటు యత్నాలపై ప్రజలు తిరగబడ్డ విషయాన్ని మరిచారా? ►చంద్రబాబు హయాంలో దేశవ్యాప్తంగా 82 ప్రభుత్వ ఆస్తులను అమ్మితేఅందులో 52 ఆంధ్రప్రదేశ్కు చెందినవని మరచిపోవొద్దు. కాకినాడ నడిబొడ్డున ఉన్న గోదావరి ఫెర్టిలైజర్స్ను విక్రయించిన ఘనత మీదే. -
బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి..
సాక్షి, అమరావతి: పెద్దల సభ అంటే సూచనలు ఇవ్వాలి గాని, సంఘర్షణలకు వేదికగా ఉండకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు. ఆమె సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అని ఎద్దేవా చేశారు. పెద్దల సభను దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పునరుద్దరిస్తే...శాసనమండలిలో ఇవాళ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానుల బిల్లుపై వారి తీరు చూస్తుంటే... చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారని అన్నారు. పెద్దల సభ అంటే అందరూ గౌరవించేలా ఉండాలే కానీ, శాసనమండలిని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారని, మండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న మండలి అవసరం లేదని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. శాసనమండలిని రద్దు చేయమని తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గట్టిగా కోరుతామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. శాసనసభ ఆమోదించిన బిల్లును అగౌరపరిచారని, అమరావతిలో బినామీల భూముల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. ‘బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో.. నారా లోకేష్ గ్రహించాలి. యనమల మహా మేధావిగా ఫీల్ అవుతున్నారు..రెండుసార్లు ఓడిపోయారు. పెద్దల కోసం ఏర్పాటు చేసిన సభకు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారు. చంద్రబాబు ఓటమిపాలైనా ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదు. ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన యనమల మహా మేధావిలా ఫీలవుతున్నారు. ఇండియా టుడే సర్వేల బెస్ట్ సీఎం సర్వేలో 4వ స్థానంలో జగన్గారు ఉన్నారు. ఆయన పనితీరును ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. టీడీపీ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలతో బేరసారాలు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి అవసరమే లేదు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు’ అని చురకలు అంటించారు. -
ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులకు ఎవరైనా ర్యాంకింగ్స్ ఇస్తే చంద్రబాబుకు ఆఖరు స్థానం కూడా దొరకదంటూ ఎద్దేవా చేశారు. 8 నెలల్లో ఒక జెండా లేదు. ప్రజా సమస్యల మీద గళమెత్తిన సందర్భం లేదు. ఇసుక మాఫియాను కాపాడేందుకు కొరత అంటూ రంకెలు వేశాడు. కడాన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారమెత్తి జోలెతో ఊరేగాడంటూ' చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. మరో ట్వీట్లో.. 'అప్పట్లో కౌన్సిల్ను పునరుద్ధరించాలని వైఎస్సార్ ప్రతిపాదించినప్పుడు ఇదే చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. ప్రస్తుతం సీఎం జగన్ కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్లీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు. విజనరీది మాట మీద నిలకడ లేని బతుకు' అంటూ విమర్శలు గుప్పించారు. యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్కు తెలుసు.. కాగా మరో ట్వీట్లో..టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు వెన్ను పొడిచి ఆయన అకాల మరణానికి కారకుడైన వారిలో చంద్రబాబు తర్వాత రెండో దోషి యనమల. పెద్దాయన ఉసురు తగిలి తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతూ పత్తి గింజలా ప్రగల్భాలు పలుకుతున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా! -
యనమలకు మంత్రి బొత్స సవాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేశారని యనమల ఆరోపించారు. అయితే యనమల తీరుపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బిల్లుకు సమయం కావాలని యనమల ఆడగడంపై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని, బిల్లు పెట్టి గంటలో చర్చ చేపట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభా నడపాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో రాజధాని అంశంపై బొత్స మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలను యనమల చదివి వినిపించారు. అయితే టీడీపీ పార్టీ పాంప్లెట్గా పనిచేసే పత్రికలను సభలో ఎలా చదువుతారని మంత్రి బొత్స తప్పుపట్టారు. చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
టీడీపీ మేనిఫెస్టో ఆలస్యం.. అందుకేనా?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను విడుదల చేసే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దోబూచులాడుతున్నారు. ముసాయిదా మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైనా విడుదల చేయకుండా నాలుగు రోజుల నుంచి వాయిదా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని చూసుకుని మార్పులు చేసి తమ మేనిఫెస్టోను విడుదల చేయాలని చూస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. అంటే వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను కాపీ కొట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. యనమల రామకృష్ణుడు అధ్యక్షతన నెల రోజులక్రితం చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టో కమిటీని నియమించారు. మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు పెట్టాలో యనమల నిర్ణయించి.. దానిని మళ్లీ చంద్రబాబు సూచనల ప్రకారం మార్పులు చేసి 74 పేజీలతో ముసాయిదాను సిద్ధం చేశారు. 4 రోజుల క్రితమే దాన్ని బాబు విడుదల చేస్తారని టీడీపీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేశారు. అప్పట్నుంచీ రోజూ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు. చివరికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టోను విడుదల చేసేవరకూ తమ మేనిఫెస్టో విడుదల చేయకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే హామీలు, అంశాలుంటే నష్టపోతామని, కాబట్టి అది వచ్చాక దాన్నిబట్టి తమ మేనిఫెస్టోలో మార్పులు చేశాకే విడుదల చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టడం తెలిసిందే. వృద్ధాప్య ఫించన్ను రూ. 2 వేలు చేస్తామని జగన్ ప్రకటిస్తే దాన్ని ఎన్నికలకు 3 నెలలు ముందుగా హడావుడిగా అమలులోకి తెచ్చారు. రైతు భరోసా, ప్రతి కులానికి కార్పొరేషన్, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటిని కాపీ కొట్టారు. తాజాగా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అధికారంలోకి రాగానే కేంద్రానికి లేఖ రాస్తామని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినట్లు లీకులివ్వడం గమనార్హం. కాగా పార్టీ వైఖరి ప్రకారం రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేయకుండా ప్రత్యర్థి మేనిఫెస్టో కోసం ఎదురు చూడడమేంటని టీడీపీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
యనమల సోదరులది రాజకీయ వ్యాపారం
తుని: యనమల సోదరులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. ప్రజల సోమ్మును అడ్డదారిలో దోచుకుని, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. తుని పట్టణం రెండో వార్డులో శనివారం ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ యనమల సోదరులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజాయితీకి నిలువు టద్దమని యనమల రామకృష్ణుడు చెప్పుకుంటున్నారని, వందల కోట్లు ఆస్తులను ఎలా కూడబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న బాతుల కోనేరు స్థలాన్ని దొడ్డుదారిలో బినామీలతో ఆక్రమించారని, ప్రస్తుతం ఆ స్థలాన్ని గజానికి రూ.లక్షకు బేరం పెట్టారన్నారు. రైల్వే ట్రాక్ ఆవతల ఉన్న పది వార్డులకు చెందిన నీరు పోవడానికి ఏర్పాటు చేసిన కాలువను కలిపేసుకున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి పనికి ముడుపులు తీసుకుని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. పేదలకు ఉచితంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అవినీతికి కేరాఫ్ అడ్రాస్గా మార్చారన్నారు. పురుడు పోసుకోవడానికి పేదలు వెళితే రూ. 6 వేలు వసూలు చేస్తున్నారని, ఇందుకు తమకు అనుకూలమైన ఏజెంట్లను పెట్టుకున్నారన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చారని, వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చే వారిని పిలిపించి బెదరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను సొమ్ములకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో జననేత జగన్మోహన్రెడ్డి అదే రీతిలో పాలన చేస్తారన్నారు. సువర్ణ పాలన కోసం వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్, సీనియర్ నాయకుడు అనిశెట్టి నాగిరెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్ పాల్గొన్నారు. -
మహిళా డాక్టర్పై యనమల కక్ష సాధింపు
-
ప్రభుత్వ వైద్యురాలిపై ఆర్థికమంత్రి కక్షసాధింపు
-
‘కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారు’
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యతిరేక పార్టీలను వేధింపులకు గురుచేస్తుందని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేక కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని వేధిస్తున్నారని విమర్శించారు. ఇందుకు హీరో శివాజీ వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటి సంస్థల నుంచి రేపోమాపో నోటీసులు రానున్నాయని బీజేపీ నేతలే చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీపై ఆపరేషన్ గరుడ చేస్తున్నారని శివాజీ ఎప్పటి నుంచో చెబుతున్నారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అవినీతిపరుల అండతో ప్రజాదరణ ఉన్నవారిని కాలరాయాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చే నిధులను ఆపేసింది, అది చాలక కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేధింపు చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామవాదులంతా ఏకం కావాలన్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని యనమల కోరారు. -
పొత్తులపై పూర్తి నిర్ణయం ఆయనదే!
సాక్షి, అమరావతి: టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టకోబోతోందన్న ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. అయితే కాంగ్రెస్తో పొత్తు ఒక్క తెలంగాణలోనేనా లేక ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగించాలా అని ఆ పార్టీ తర్జనభర్జన పడుతోందని తెలుస్తోంది. పొత్తులపై ఇప్పటికే మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల సలహాలు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు. తారాస్థాయిలో జరగుతున్న పొత్తుల అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మీడియా చిట్చాట్లో స్పందించారు. పొత్తుల అంశంపై గురువారం రాత్రి 11 గంటల వరకు మంత్రుల సమావేశం జరిగిందని.. నేతలందరికీ సీఎం ఒక డైరెక్షన్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో పూర్తి నిర్ణయాధికారం అధ్యక్షుడికే వదిలేశామని పితాని స్పష్టం చేశారు. వ్యతిరేకత పెరుగుతుండటంతోనే ‘ముందస్తు’కు: యనమల టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లినట్లు అనిపిస్తోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు పడతాయనే ఆందోళన కూడా ఒక కారణం కావచ్చన్నారు. కేంద్రం తెలంగాణపై సానకూలంగా ఉంటుందని.. కానీ ఏపీపై కపట ప్రేమ ప్రదర్శించిందని విమర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, మధ్యంతర భృతి ప్రకటన చేసినా.. అమలు చేసే పరిస్థితి ఎంత వరకు ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు. -
పంటినొప్పి..!
-
యనమల రూటే వేరయా!
-
పంటి వైద్యం ఇంటలేదా?!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటి చికిత్సకు దిక్కులేదా? అసలు రాష్ట్రంలో పంటి వైద్య నిపుణులే లేరా? మరి ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు.. మరో 30 లక్షల మంది వైద్యం ఎక్కడ చేయించుకుంటున్నారు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దంత వైద్యం(రూట్కెనాల్) కోసం సింగపూర్ వెళ్లి రూ.2.88 లక్షల ప్రభుత్వ సొమ్ము వెచ్చించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తదితరులకు వైద్యపరంగా ఎంత ఖర్చయితే అంత ప్రభుత్వమే చెల్లించాలన్న నిబంధనలున్నా.. రూట్కెనాల్ ట్రీట్మెంట్కు రూ.2.88 లక్షలా! అంటూ సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. బుధవారం యనమల దంతవైద్యానికి సంబంధించిన సొమ్ము విడుదల చేస్తూ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా ఉద్యోగులకు గానీ, పెన్షనర్లకుగానీ, వారి కుటుంబ సభ్యులకుగానీ, 4 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పేద రోగులకుగానీ.. హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటే డబ్బు చెల్లించేది లేదంటూ ఏకంగా సర్కారే నిబంధనలు విధించింది. పెద్ద పెద్ద జబ్బులకు రాష్ట్రంలో మౌలిక వసతులు లేకపోవడం, సరైన డాక్టర్లు లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత డబ్బులు పెట్టుకుని ఇతర నగరాల్లో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు, పెన్షనర్లకు రూట్కెనాల్ ట్రీట్మెంట్కు ఒక్కో సిట్టింగ్కు రూ.3,500కు మించి లేదు. మొత్తం రమారమి రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. అలాంటిది ఒక్కసారి సింగపూర్లో రూట్కెనాల్ చేయించుకున్న యనమలకు రూ.2.88 లక్షలు చెల్లించడంపై సామాన్యులు, ఉద్యోగులు, పెన్షనర్లూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటే పన్ను వారికి వెళుతోంది కాబట్టి ఇక్కడే వైద్యం చేయించుకోవాలని చెప్పిన సర్కారు.. మరి మన పన్ను సింగపూర్కు వెళ్లదా.. అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకోన్యాయం.. ఉద్యోగులకోన్యాయమా.. అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దంత వైద్యకళాశాలకు చెందిన ఓ వైద్యుడు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఆస్పత్రిని బట్టి, డాక్టర్ను బట్టి ఒక్కో సిట్టింగ్కు రూ.2,500 నుంచి రూ.3000 అవుతుందని.. మూడు సిట్టింగ్లలో ఈ వైద్యం పూర్తవుతుందని చెప్పారు. -
వివాదస్పదంగా మారిన జెండా వందనం
-
మంత్రి యనమలకు ఘోర అవమానం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ఘోర అవమానం జరిగింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల విషయంలో యనమలకు సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం యనమల కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే, కృష్ణా జిల్లాలో పంద్రాగస్టు నాడు జెండా ఎగరేసే అవకాశం మంత్రి పరిటాల సునీతకు ముఖ్యమంత్రి ఇచ్చారు. సీనియర్ మంత్రి, బీసీ నేతను కాదని జూనియర్ మంత్రి అయిన సునీతకు సీఎం అవకాశం ఇవ్వడం గమనార్హం. ఫిరాయింపు మంత్రి అమర్నాథ్రెడ్డికి సైతం జెండా ఎగురవేసే అవకాశం దక్కింది. కానీ యనమలకు అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది సీనియర్ మంత్రి అయిన కేఈ కృష్ణమూర్తికి కూడా ఇదేవిధంగా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది జెండా ఆవిష్కరణ విషయంలో తనకు అవమానం జరగడంతో మంత్రి యనమల మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా తూర్పు గోదావరిలో యనమలకు అవకాశమున్నా.. చంద్రబాబు ఇవ్వకపోవడంతో యనమల కినుకు వహించినట్టు తెలుస్తోంది. అవకాశం దక్కని మంత్రులు! మంత్రి యనమల రామకృష్ణుడితోపాటు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి కళా వెంకట్రావు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి కే అచ్చెన్నాయుడులకు అవకాశం దక్కలేదు. కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మంత్రి కళా వెంకట్రావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి కాకపోయినప్పటికీ.. ఆయనకు జిల్లాలోనే జాతీయ పతాకం ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా జెండా ఎగురవేయనున్న మంత్రుల జాబితా ఇదే విజయనగరం- గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం - నిమ్మకాయల చినరాజప్ప తూర్పుగోదావరి - కాల్వ శ్రీనివాసులు పశ్చిమగోదావరి - ప్రత్తిపాటి పుల్లారావు కృష్ణా - పరిటాల సునీత గుంటూరు- సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రకాశం - పీ. నారాయణ నెల్లూరు - ఎన్. అమర్నాథ్రెడ్డి కడప - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కర్నూలు - కేఈ కృష్ణమూర్తి అనంతపురం- డీ ఉమామహేశ్వరరావు చిత్తూరు - ఎన్ ఆనందబాబు -
పీడీ ఖాతాలపై నోరు విప్పని యనమల
-
టీడీపీపై కాపుల అగ్రహం
-
కాపులకు టోపీ పెట్టారు
-
దారిలో యాక్సిడెంట్ అవుతుంది.. అంతమాత్రాన!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బీజేపీతో తమ పార్టీ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ప్రయాణం ఒక యాక్సిడెంట్ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాజమండ్రి వెళ్లాలని కారులో వెళతాం. దారిలో యాక్సిడెంట్ అవుతుంది. అంతమాత్రాన ప్రయాణం తప్పు అసలేం కదా. బీజేపీతో పొత్తు కూడా అలాంటిదే’ అని ఆయన సమర్థించుకున్నారు. టీడీపీ-బీజేపీ నాలుగేళ్లు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం పంచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ.. ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కమలానికి కటీఫ్ చెప్పేసింది. మొదట కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఓకే అంటూ ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు.. ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యంతో బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. హోదా నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. -
కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది
సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక కులాన్ని బీసీ జాబితాలో చేర్చే విషయం ఉమ్మడి జాబితాలోని అంశమన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై తమ పరిధిలో చేయాల్సిందంతా పక్కాగా చేశామని చెప్పారు. ‘‘ఈ విషయంలో రాష్ట్రం చేయాల్సింది చేశాం. చట్టం చేసి కేంద్రానికి పంపాం. మా పరిధిలో ఉండేది అది. తరువాత రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలనేది కేంద్రం పరిధిలోని అంశం’’ అని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ రాష్ట్రం పరిధిలోని అంశం కాదని, అది కేంద్రం మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘రాజ్యాంగంలో క్లియర్గా ఉంది. ఈ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సి ఉంది. ఈ పని పార్లమెంటు మాత్రమే చేయాలి. అందుకోసం కేంద్రం ప్రతిపాదించాల్సి ఉంటుంది’’ అని అన్నారు. ‘‘ప్రస్తుతం మరాఠాలు, పటేళ్లు రిజర్వేషన్లుకోసం పట్టుపడుతున్నారు. అలాగే యూపీలోనూ, హర్యానాలోనూ, ఇంకా పలు రాష్ట్రాలలో ఇదే తరహా డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరిపి చేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటరాదనేది వాస్తవమే. కానీ ఈ లిమిటేషన్లు తీసేసే అధికారం కేంద్రానికుంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం కేంద్రానికుంది. కేంద్రం అనుకుంటే చేయవచ్చు. అన్ని రాష్ట్రాలను సంప్రదించి చేయాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఎందుకు చేయడం లేదు? కనీసం అవునా, కాదా అనేది కూడా ఎందుకు చెప్పడం లేదు?’’ అని యనమల ప్రశ్నించారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా వారు ప్రశ్నించరు.. కాపు రిజర్వేషన్లపై జగన్ ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని యనమల ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్లపై గతంలో జగన్ అనుకూలంగా.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని కేంద్రాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావట్లేదని యనమల విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. పదో షెడ్యూల్లోని ఆస్తుల పంపిణీని పట్టించుకోవట్లేదు విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని నేతలు సుప్రీంకోర్టును, పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నారని యనమల ఈ సందర్భంగా విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ప్రకారం కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదని తప్పుపట్టారు. ఉన్నత విద్యాసంస్థల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏడాదిలోపు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని, ఏడాది దాటితే కేంద్రం కలుగజేసుకుని పరిష్కరించాల్సి ఉందని, కానీ కేంద్రం ఇంతవరకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 9వ షెడ్యూల్లోని అంశాలను కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. పదవ షెడ్యూల్లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల విలువ లెక్కించి జనాభా ప్రాతిపదికన ఏపీకి 58%, తెలంగాణకు 42% ప్రకారం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రం స్పందించట్లేదన్నారు. పంపిణీ చేయాల్సిన అవసరం లేదంటూ అఫిడవిట్లో పేర్కొనడం దారుణమన్నారు. -
రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమే
-
జీఎస్టీ శ్లాబులు తగ్గించే యోచన
విశాఖసిటీ: దేశంలో పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకే పన్ను.. ఒకే శ్లాబు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయలేమని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జీఎస్టీ మొదటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా యనమల మాట్లాడుతూ గతంలో వ్యాట్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే మార్కెట్ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని 29 రాష్ట్రాలూ వ్యతిరేకించకపోవడం హర్షణీయమన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ వస్తువులకు ట్యాక్స్లలో తేడా ఉంటుందన్నారు. ఒకే పన్ను విధానంలో ఒకే శ్లాబ్ పద్ధతి చాలా కష్టతరంతో కూడుకున్నదనీ, దీనికి బ్యాలెన్స్ చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో జీరోతో మొదలై ఐదు శ్లాబులుగా విభజించారన్నారు. ఈ విధానం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం వాస్తవమన్నారు. శ్లాబుల సంఖ్య తగ్గించే యోచనలో జీఎస్టీ కౌన్సిల్ ఆలోచిస్తోందనీ, ఈ నెల 21న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు రానుందని తెలిపారు. వాణిజ్య, వర్తకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జెమ్టెడ్ గూడ్స్ను జీఎస్టీ నుంచి తప్పించాలన్నారు. ప్రస్తుతం చక్కెర పరి శ్రమ ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో దానిపై సెస్ వెయ్యొద్దంటూ జీఎస్టీ కౌన్సిల్లో ప్రతిపాదించా మని వెల్లడించారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనీ, వాటన్నింటినీ శతశాతం పరిష్కరిస్తే జీఎస్టీ 100 శాతం ఉత్తమ ఫలితాలు రాబడుతుందన్నారు. కొన్ని వస్తువులపై పన్ను రేటు తగ్గింపు? ఎంపీ హరిబాబు మాట్లాడుతూ గతంలో అమల్లో ఉండే విధానాలతో వినియోగదారుల నుంచి వసూలు చేసిన పన్నుల్ని ప్రభుత్వాలకు చేరకుండా కొంతమంది వ్యాపారులు వ్యవహరించేవారనీ, జీఎస్టీ వచ్చిన తర్వాత వారి దారులు మూసుకుపోవడం వల్లే వ్యతిరేకతను వ్యక్తం చేశారన్నారు. 17 రకాల పన్నులు, 23 రకాల సెస్సులను ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై పన్ను రేటును తగ్గించే యోచనలో ఉన్నట్లు హరిబాబు వెల్లడించారు. అదే విధంగా రిటర్న్స్ సరళీకృతం చేసేందుకు త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం వెలువడనుందని తెలిపారు. -
మంత్రుల గోబెల్స్ ప్రచారం..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బీసీలకు అన్యాయం జరిగిందనే గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని.. బీసీలకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కులవృత్తి చేసుకునే వారిని నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని అన్నారు. బీసీలకు సమాజంలో గౌరవప్రదమైన జీవనం లేకుండా చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్దేనని కృష్ణమూర్తి గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్ ఏమైందంటూ ప్రశ్నించిన ఆయన దీనిపై యనమల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బడ్జెట్ నిధులు, సబ్ ప్లాన్కి చట్టబద్ధత, బీసీలకు ఇస్తామన్న నామినేటెడ్ పోస్టులు ఎక్కడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తుంటే ఎందుకు నోరు మోదపడం లేదంటూ కాల్వ, యనమల తీరుపై విరుచుకుపడ్డారు. టీటీడీ చైర్మన్ పదవి యనమల వియ్యంకుడుకి ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లా అని ప్రశ్నించారు. టీడీపీ హయంలో బీసీలకు ఏం చేశారో చెప్పలేని మీరు.. బీసీలు టీడీపీ వెంటే ఉంటారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
యూపీలో బీజేపీకి మూడో గర్వభంగం..
సాక్షి, అమరావతి : ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద చెంప పెట్టని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతోనైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన పథకాల రూపకల్పన, అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందువల్లనే నాలుగు లోక్సభ రెండు, 11 అసెంబ్లీ స్ధానాల్లో పదింటిలో బీజేపీ అభ్యర్ధులు ఓడిపోయారని , ఇది ఉత్తర ప్రదేశ్లో బీజేపీకి మూడో గర్వభంగం అన్నారు. వరుసగా బీజేపీ అభ్యర్ధులు ఓడిపోతున్నా, ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. ఒక్క పాల్ఘర్ మినహా బీజేపీకి ఎక్కడా పరిస్థితులు సానుకూలంగా లేవని తెలిపారు. భారతీయ జనాతాపార్టీ పట్ల ఏర్పడిన వ్యతిరేకతే ప్రతిపక్షాల ఐక్యతకు పూనాది అయిందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ప్రారంభమైన బీజేపీ పతనం రానున్న ఎన్నికల వరకు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఇక మోదీ శకం ముగిసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. -
మోదీ, అమిత్ షాపై యనమల తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీడీపీ మహానాడు వేదికగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన మహానాడులో ప్రసంగించిన ఆయన...అమిత్ షా, మోదీలు నియంతలు అంటూ ధ్వజమెత్తారు. వారిద్దరిని ముస్సోలిని, హిట్లర్లతో పోల్చారు. ‘గత ఎన్నికల్లో బీజేపీతో జతకడితేనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు. బీజేపీ ఉన్నా.. లేకపోయినా టీడీపీ అధికారంలోకి రావాలని 2014లో ప్రజలు కోరుకున్నార’ని ఆయన అన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం వల్లే ఆ పార్టీకి అధికారం దూరమైందని యనమల పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం దేశంలో రాజకీయ పునరేకీకరణకు తార్కాణమని యనమల అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటామని ఆయన అన్నారు. గడిచిన కాలంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో టీడీపీ చురుకైన పాత్ర పోషించాలని మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. -
మోత్కుపల్లి.. అప్పుడెందుకు నోరు మెదపలేదు?
సాక్షి, అమరావతి : ‘మోత్కుపల్లికి గవర్నరో, రాజ్యసభ సభ్యుడు లాంటి పదవులు లేకపోయేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ గురించి ఇలాంటి విమర్శలు చేయడం సరికాద’ని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. మహానాడులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియ శిష్యుడినని ప్రకటించుకుని ఇప్పుడిలా పార్టీని విమర్శించటం సరికాదన్నారు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీని విమర్శిస్తూ.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జీవో నంబరు 25ను అమలు చేసి దళితులను పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ విషయాలేవి మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు, మాదిగలకు తగిన గుర్తింపు ఇవ్వని విషయం మోత్కుపల్లికి కనిపించడం లేదని విమర్శించారు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెత మోత్కుపల్లి లాంటి వారిని చూసే పుట్టిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తల్లిలాంటి టీడీపీ పార్టీ పట్ల కృతజ్ఞతగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని మోత్కుపల్లిని హెచ్చరించారు. -
పెట్రో ధరల బాధ్యత కేంద్రానిదే -యనమల
సాక్షి, అమరావతి: అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్న చమురు ధరలపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చు తగ్గుల సందర్భంగా కేంద్రం తీరుపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. పెరిగినపుడు పెంచడమే తప్ప, ధరలు తగ్గినపుడు దేశీయంగా ఎందుకు తగ్గించడం లేదని మండిపడ్డారు. పెరుగుతున్న ధరల ప్రభావం మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో కేంద్రప్రభుత్వం కూడా ధరలు పెంచటం వల్ల ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని యనమల వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర తగ్గినప్పుడు కేంద ప్రభుత్వం తగ్గించడంలేదనీ, పెరిగినపుడు మాత్రం సదరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైనది పద్దతి కాదని యనమల పేర్కొన్నారు. మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినపుడు ప్రజలు మీద భారం పడకుండా చేసే భాద్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలన్నారు. తద్వారా ప్రజల మీద భారం తగ్గించాలని ఆయన కోరారు. -
ఓటుకు కోట్లు ఆడియోపై విచారణకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సాధ్యం కాని అభివృద్ధి ఒక్క ఏడాదిలో ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియో టేపులపై విచారణ చేపట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓటుకు కోట్లు కేసులో బాబు ఆడియో టేప్లు 90 శాతం మ్యాచ్ అవుతున్నాయి. బాబు ఆడియో టేపుపై కూడా యనమల డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని’ పార్థసారధి అన్నారు. గాలి జనార్దన్రెడ్డి కంపెనీకి మొట్టమొదట లీజుకు ఇచ్చింది చంద్రబాబేనని పార్థసారధి గుర్తుచేశారు. జనార్దన్రెడ్డిని చంద్రబాబు సింగపూర్లో కలిసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జనార్దన్రెడ్డినే కాదు.. చంద్రబాబుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎవరినీ పట్టించుకోవడం లేదు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని పార్థసారధి విమర్శించారు. రైతులకు మద్ధతు ధర లేక అల్లాడుతుంటే సోమిరెడ్డి పట్టించుకోవడం లేదని.. అలాగే మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను వదిలిపెట్టి కర్ణాటక గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ధర్మపోరాటం పేరుతో బాబు దగా.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. బీజేపీ, టీడీపీ ఇద్దరు కలిసి చేసిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదని, మాయ మాటలు చెప్పి రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక ప్రభుత్వం ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని పార్థసారధి అన్నారు. -
బీజేపీకి అవకాశం.. మండిపడ్డ యనమల!
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ : కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ఆరెస్సెస్ భావజాలంతో పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బీజేపీ పట్ల గవర్నర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, కేవలం ఒక్క కలం పోటుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని యనమల అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని పట్టపగలే హత్యచేశారు. ప్రజాస్వామ్యవాదులు వజుభాయ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గవర్నర్ తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారం అంటే పక్షపాతంతో వ్యవహరించడం కాదని హితవు పలికారు. యనమల తన ప్రకటనలో పేర్కొన్న అంశాలివే.. ‘కర్ణాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదు. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదు. కానీ గవర్నర్ బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రానికో రకంగా వ్యవహరించరాదు. దేశం మొత్తం ఒకే విధానం అనుసరించాలి. అలాగైతే గోవా, మేఘాలయ, మణిపూర్లలో గవర్నర్లు వేరే విధంగా వ్యవహరించారు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ను మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. 10 నెలల క్రితం బిహార్లో అత్యధిక సీట్లు సాధించిన ఆర్జేడీని, గోవాలో కాంగ్రెస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ఆహ్వానించలేదు. గవర్నర్ వజుభాయ్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. భారత రాజ్యాంగానికి ద్రోహం చేశారు, నేతల కొనుగోళ్లకు అవకాశం కల్పించారు. యడ్యూరప్ప శనివారం మెజార్టీ నిరూపించుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. గవర్నర్ చేసిన తప్పును కొంతమేర సుప్రీంకోర్టు చక్కదిద్దిందని అభిప్రాయపడ్డారు. -
రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 వ ఆర్ధిక సంఘం విధివిధానాలను మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు. కేంద్రం రాష్ట్రాలను అణిచి వేస్తోంది రాష్ట్రపతిని కలిసిన అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజ్యాంగపరంగా ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం స్వతంత్ర వ్యవస్థ. 14వ ఆర్థిక సంఘం సమయంలో కూడా 1971 జనాభా ప్రతిపాదనే పరిగణనలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఇప్పుడు కూడా 15వ ఆర్థిక సంఘంలో 1971 జనాభానే తీసుకోవాలని ఇపుడు కూడా డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల ఆర్థిక హక్కులకు కేంద్రం భంగం కలిగించరాదు. ఏపీ సర్కారు రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలకు హక్కులున్నాయి, విధానాలున్నాయి. కేంద్రం బలవంతంగా ఆర్థిక విధానాలను రాష్ట్రాలపై రుద్దరాదు. కేంద్ర ప్రభుత్వ దయదాక్షిణ్యాలపై రాష్ట్రాలు ఆధారపడేలా కేంద్రం వ్యవహరిస్తోంది. రాష్ట్రాలకు భిక్షం వేసేలా 15వ ఆర్థిక సంఘం వ్యవహరిస్తే అంగీకరించం. రాష్ట్రాలు రాజ్యాంగపరంగా హక్కులను కాపాడుకుంటాయి. రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్తో ఉపయోగం ఉండదు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాయరాదు.15 వ ఆర్థిక సంఘం సిఫార్సులపై జూన్లో జాతీయ స్థాయిలో సదస్సు ఏర్పాటు చేస్తాము. వెనుకబడిన రాష్ట్రాల పేరుతో కేంద్రం అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలను నాశనం చేయాలనుకుంటే చూస్తూ కూర్చోము. కేంద్రం కావాలనుకుంటే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయాలి. కేంద్రం రాష్ట్రాలను అణచి వేసేందుకు చూస్తోందనేందుకు కర్ణాటక ఉదాహరణ.’ అన్నారు -
‘బీజేపీది సాంకేతిక విజయం మాత్రమే’
సాక్షి, అమరావతి: కర్ణాటక ఎన్నికల విజయం గురించి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో ఓట్లు తక్కువగా వచ్చినా.. సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, అదే కర్ణాటకలో జరిగిందని అన్నారు. అక్కడ బీజేపీది సాంకేతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలని, 2019 ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని బీజేపీ అనుకుంటే పొరపాటే అని తేల్చి చెప్పారు. బీజేపీకి వచ్చింది కేవలం 36 శాతం ఓట్లు మాత్రమేనని, ప్రజా వ్వతిరేఖ నిర్ణయాల వల్లే ఆ పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని పేర్కొన్నారు. కన్నడ ప్రజలు మోదీ నియంతృత్వ విధానాల పట్ల విసిగిపోయారని తెలిపారు. కానీ బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీయేతర పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిసింది. ఎన్నికల ఫలితాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు. కర్ణాటకలో బీజేపీ సంఖ్యా పరంగా గెలిచినా.. ఓట్ల పరంగా ఓటమిపాలైందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడు అన్నారు. 60 శాతానికి పైగా కన్నడ ప్రజలు బీజేపీని వ్యతిరేఖించారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా ప్రచారం చేయలేదని యనమల పేర్కొన్నారు. -
నేడు అమరావతిలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందన్న నేపథ్యంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సోమవారం అమరావతిలో సమావేశమవుతున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల్లో ప్రధానంగా 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపులను సిఫార్సు చేయాలని ఉంది. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతాయని, ఏటా 8000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇదే తరహాలో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు నష్టపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలన్నీ 2011 జనాభాకు బదులు 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం ఈ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఆర్థిక రంగ నిపుణులు సమావేశమై 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనల కారణంగా ఏ విధంగా రాష్ట్రాలను అన్యాయం జరుగుతుంతో కూలంకుషంగా చర్చించనున్నారు. అనంతరం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలని నిర్ణయించారు. 1971 జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 5.05 శాతంగా ఉంటుంది. అదే 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో రాష్ట్ర జనాభా 4.09 శాతమే ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాలి: యనమల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా రూపొందించిన 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల కారణంగా దేశంలోని 11 రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. విభజన అనంతరం ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు ఉన్నట్టు ఆర్బీఐ సహా అన్ని సంస్థలూ నివేదించాయని యనమల తెలిపారు. కేంద్రం ఇప్పటివరకూ రూ.4 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. ప్రస్తుతం కేంద్ర పథకాలు 60:40 నిష్పత్తిలో అమలు చేస్తున్నారని దీని వల్ల రాష్ట్రాలపై 30 శాతం అదనపు భారం పడుతోందని అన్నారు. -
మాకు ఈ ఖర్మేంటి?!
సాక్షి, అమరావతి: బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వాణిజ్య శాఖ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. గతేడాది జీఎస్టీ అమలుకు ఇబ్బందులొస్తాయని భావించిన ప్రభుత్వం వీరి బదిలీలను నిలిపివేసింది. ఈ ఏడాదైనా బదిలీలు చేస్తారు కదా అని ఎదురుచూస్తున్న వారు.. సాధారణ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా పరిమితులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పరస్పర అంగీకారం, రిక్వెస్ట్ బదీలకు మాత్రమే అనుమతిస్తూ జీవో ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ! వాణిజ్య శాఖలో 557 గెజిటెడ్ ఆఫీసర్లు, 102 సర్కిల్స్లోని సిబ్బందిలో 80 శాతం మందికిపైగా ఉద్యోగులు అయిదేళ్లు దాటినా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇలా ఒకే వ్యక్తి ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తే డీలర్లతో పరిచయాలు పెరిగి అది వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖర్చులు టీఏ, డీఏ ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటు పిల్లల చదువుల పరంగా, ఇటు ఆర్థికంగా నష్టపోతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగ సంఘం చెబుతోంది. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి బదిలీ అయి, పిల్లల చదువుల కోసం చాలామంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కానీ గడిచిన నాలుగేళ్లుగా 20 శాతానికి మించి ఉద్యోగులకు బదిలీలు చేయకపోవడం, గతేడాది అసలు పూర్తిగా లేకపోవడంతో వీరు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు ఎక్కువని, అలాగే అమరావతి పరిధిలో పనిచేసే వారికి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) అదనంగా లభిస్తుందని.. అయితే గ్రామీణ ప్రాంతంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు. ఆర్థిక మంత్రిని కలుస్తాం.. వాణిజ్య శాఖలో సాధారణ బదిలీలకు అనుమతించాలని త్వరలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆల్ ఇండియా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ బదిలీలకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
డిగ్రీ చదివిన వారికే నిరుద్యోగ భృతి
సాక్షి, అమరావతి: డిగ్రీ పూర్తి చేసిన వారినే నిరుద్యోగ భృతికి అర్హులుగా పరిగణించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సమావేశమైంది. డిగ్రీ తరువాత ఉన్నత విద్య అభ్యసించే వారిని అనర్హులుగా పరిగణించాలని, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. కుటుంబంలో కేవలం ఒక్కరికే భృతి అందించేలా విధివిధానాలు రూపొందించాలని తీర్మానించింది. అలాగే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులతోపాటు ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసేవారు నిరుద్యోగ భృతికి అనర్హులు. అర్హులైన నిరుద్యోగుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు మంత్రులు సూచించారు. జిల్లా కేంద్రంగా ఒక అధికారిని నియమించి, దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదనంగా దరఖాస్తులు వస్తే, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో నిర్ణయానికొచ్చారు. ఉపాధి దొరకగానే భృతి కట్ 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. అలా ఉపాధి కల్పించిన వెంటనే వారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి తొలగించి, కొత్తవారికి అవకాశం కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా విధివిధానాలు పక్కాగా రూపొందించాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. నిరుద్యోగుల్లో అసంతృప్తి అర్హతల పేరిట నిరుద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సర్కారు తాజా నిర్ణయాలపై నిరుద్యోగులు తీవ్ర అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ తర్వాత పెద్ద చదువులు చదువుకున్న చాలామంది ఇప్పటికీ ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. వీరికి భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
కేంద్రం ఏం చేద్దామనుకుంటోంది : యనమల
సాక్షి, అమరావతి : ఆంధధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారుల సమావేశం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల బ్యాంకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని, ఏటీఎంలు మూతపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉండటంలేదని.. కనీసం వెయ్యి రూపాయలు కూడా దొరకడం లేదన్నారు. ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నగదు కొరతతో రియల్ఎస్టేట్ రంగం పడిపోయిందని, ఎకనామిక్ యాక్టివిటి జరగడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వృద్ధిరేటు శాతం తగ్గిపోయిందని, భవిష్యత్తులో మనీ సర్క్యూలేషన్ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందుల వస్తాయని యనమల అన్నారు. రాష్ట్రంలో చాలా వరకు ఏటీఎంలు మూతపడ్డాయని, ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని యనమల అభిప్రాయపడ్డారు. నగదు కొరతపై చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. నల్లధనాన్ని అరికడతామని నాడు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని, కానీ అది పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా నోట్ల రద్దు వల్ల ఇతరత్రా సమస్యలు అనేకం తలెత్తాయిని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2వేల నోట్లు కనిపించకుండా పోయాయని, కనీసం వందనోట్లు కూడా ఎక్కడ దొరకడం లేదంటూ యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు డబ్బు సర్క్యులేషన్లో ఉంటేనే ఆర్ధిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్థంభిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు. నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వాలపై పడుతోందని, బ్యాంకుల్లో నగదు లేమిని నివారించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఏం చేద్దామనుకుంటుందో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి యనమల వ్యాఖ్యలతో బ్యాంకు అధికారులు విభేదించారు. ఆర్బీఐ నుంచి వేల కోట్లు విలువ చేసే కొత్త నోట్లు అందించామని తెలియచేశారు. -
గొడ్డు చాకిరీ.. గొర్రె తోక జీతం
కాకినాడ రూరల్ : చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు నానా అవస్థలు పడుతున్నారు. పనిని బట్టి పారితోషికం అంటూ నియామకాలు చేసుకున్న ప్రభుత్వం, వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. వేతనాలు పెంచే అవకాశం లేదని ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడంతో వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు తగ్గించడం మొదలు, గర్భిణులకు, శిశువులకు టీకాలు, పల్స్ పోలియో చుక్కలు, ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు అయ్యేలా చూడడం తదితర పనుల్లో ప్రభుత్వం వీరి సేవలను ఉపయోగించుకుంటోంది. రూరల్ నియోజకవర్గంలో 172 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. అన్ని పనులు వీరితోనే.. గ్రామాల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, తదితర విష జ్వరాలు ప్రబలితే తొలుత వైద్యసేవలు అందించేది ఆశ వర్కర్లే. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులు ఎంతమంది ఉన్నారనే సమాచారం సేకరిస్తారు. ప్రసవం కేసులు కాకినాడ జీజీహెచ్కి రిఫర్ చేసి వారి వెనువెంటనే ఉంటూ ప్రసవం పూర్తి అయ్యే వరకు సేవలందిస్తున్నారు. వేతనం తక్కువ.. వీరికి నెలకు రూ.800 నుంచి రూ.1200కి మించి ఇవ్వడంలేదు. పల్స్ పోలియో కార్యక్రమంలో (రోజంతా పనిచేస్తే) రూ.75, గర్భిణిని ఆసుపత్రిలో పరీక్షకు తీసుకువస్తే రూ.60, ప్రభుత్వాసుపత్రిలో పరీక్షకు పంపితే రూ.300, కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయిస్తే రూ.150, బాలింతను పర్యవేక్షిస్తే రూ.20, టీబీ రోగికి ఐదు నెలల పాటు మందులు అందజేస్తే రూ.300, ఇంటింటికి తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తే ప్యాకెట్కి రూపాయి చొప్పున అందజేస్తున్నారు. ఏటా ఆశ కార్యకర్తలకు యూనిఫారం ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా ఇవ్వడం లేదు. ఇటీవలే 36 గంటలపాటు ఆందోళన నిర్వహించిన కార్యకర్తలు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని మంత్రి యనమల రామకృష్ణుడు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు కూడా. డిమాండ్లు ఇవీ.. ∙కనీస వేతనం అమలు చేయాలి. ∙కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలి. ∙రూ.ఐదు లక్షల ప్రమాద బీమా అర్హత కల్పించాలి. ∙104 సేవల బకాయిలు చెల్లించాలి. ∙రెండేళ్లుగా ఇవ్వని యూనిఫాంతో పాటు అలవెన్స్ చెల్లించాలి. ∙అర్హులైన ఆశలకు ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలి. .ఇప్పటికే శిక్షణ పొందిన వారిని సెకండ్ ఏఎన్ఎంగా తీసుకోవాలి. -
బడ్జెట్లో కంటే ఎక్కువే ఖర్చు చేశాం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అదనంగా మరో 36 కొత్త పథకాలను ప్రవేశపెట్టామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక, ఆదరణ పథకం, నిరుద్యోగ భృతి, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ వంటి కొత్త పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు. 2018-19 బడ్జెట్ గురించి మంగళవారం యనమల శాసనమండలిలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత మూడేళ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. బడ్జెట్ పెద్దదైనా ఖర్చుచేయడం లేదని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. విమర్శలు చేసేముందు బడ్జెట్లో కేటాయింపులు, జరిగిన ఖర్చులు గమనించాలన్నారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు చేశాం. ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుందని కాగ్ చెప్పింది. రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.4వేలకోట్లు మాత్రమే ఇవ్వడం దారుణం. రైతులకు, మహిళలకు రుణమాఫీ చేస్తే కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన అప్పులు పంచడంతో మన రాష్ట్రానికి అప్పులు ఎక్కువచ్చాయి. విభజనకు ముందు చేసిన అప్పుకు రూ.10వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం. భారతదేశంలోని రాష్ట్రాలన్నీ 9శాతం వడ్డీకి అప్పు తెస్తే మన రాష్ట్రం 7.9కే అప్పు తెస్తోంది. 2018-19 లో రైతులకు, మహిళలకు చెల్లించాల్సిన అప్పును మొత్తం తీరుస్తాం..నదుల అనుసంధానం వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది’ అని తెలిపారు. -
అమరావతికి అరకొర
ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో నిత్యం హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం దానికి మున్సిపాల్టీ స్థాయి నిధులు కూడా కేటాయించలేదు. రూ.వేల కోట్ల నిధులతో రాజధాని ప్రాజెక్టులు చేపట్టినట్లు, వాటికి ప్రణాళికలు రూపొందించినట్లు చేస్తున్న ప్రకటనలకు, బడ్జెట్లో చేసిన కేటాయింపులకు పొంతనే లేదు. మంత్రి యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని ప్రాజెక్టులకు రూ.678 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. అందులో భూసమీకరణ కోసం రూ.166 కోట్లు చూపగా, ప్రాజెక్టులకు రూ.457 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాజధాని నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో అంతుబట్టడంలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, అమరావతి ఆశ్చర్యపోతున్న సీఆర్డీఏ వర్గాలు రాజధానిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల విలువే రూ.30 వేల కోట్లు ఉన్నట్లు సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. రోడ్డు గ్రిడ్లో భాగంగా నిర్మిస్తున్న ఆర్టీరియల్, మేజర్, సబ్ ఆర్టీరియల్ రోడ్ల పనులకు రూ.6 వేల కోట్లకుపైగా కావాలని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ పరిపాలనా నగరంలో ముఖ్య కట్టడాలకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, ముఖ్యమంత్రి, గవర్నర్ నివాస భవనాలను ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిజైన్ల ప్రక్రియను త్వరలో పూర్తి చేసి ఈ భవనాలకు టెండర్లు పిలుస్తామని చెబుతోంది. అలాగే కృష్ణానదిపై రూ.1400 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. బడ్జెట్ కేటాయింపులు చూసి రాజధాని ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో అంతుబట్టడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది బడ్జెట్లో రాజధానికి రూ.1,429 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది అందులో సగం కూడా కేటాయించకపోవడం పట్ల సీఆర్డీఏ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ బడ్జెట్లో కేటాయించిన రూ.678 కోట్లు సిబ్బంది జీతాలు, కన్సల్టెన్సీల ఫీజులకు కూడా చాలవని అంటున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో చేసేదంతా హడావుడేనని ఆచరణ హీనంగా ఉందని స్పష్టమవుతోంది. జిల్లాకో స్మార్ట్ సిటీకి దిక్కు లేదు మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు కేటాయించిన నిధులపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ శాఖకు మొత్తం రూ.7741 కోట్లు కేటాయించారు. స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాలకు కేటాయించిన నిధులకు, అక్కడ జరుగుతున్న పనులకు పొంతన ఉండటం లేదు. జిల్లాకో స్మార్ట్ సిటీ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఈ బడ్జెట్లో వాటి ప్రస్తావనే లేదు. రాబోయే రోజుల్లో అమరావతిని స్మార్ట్ సిటీ నగరాల్లో మొదటి గ్రీన్ఫీల్డ్ సిటీగా ఉంచుతామని, మిగిలిన నగరాలకు ఒక సూచికగా ఉంటుందని చెబుతున్న సీఎం అందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. స్మార్ట్ నగరాలుగా ప్రకటించిన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలకు గత ఏడాది కంటే నిధులు అధికంగా కేటాయించారు. అయితే గతేడాది వీటికి కేటాయించిన రూ.250 కోట్లలో రూ.50 కోట్లలోపే ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది వీటి కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టులకు కేంద్రం తన వాటా నిధులను విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల్లో జాప్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమృత్ పథకానికి గతేడాది రూ.300 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.490 కోట్లు కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ధి సంస్థలకు ఆర్థిక జవసత్వాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటాయించలేదు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రూ.5 కోట్లనే విడుదల చేసింది. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి గతేడాది రూ.100 కోట్లను కేటాయిస్తే ఈ బడ్జెట్లో రూ.300 కోట్లను కేటాయించారు. అన్న క్యాంటీన్లకు ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాథమిక మౌలిక సౌకర్యాల కోసం రూ.75 కోట్లు, నగర పంచాయతీలు, గ్రేడ్–3 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాలకు రూ.119 కోట్లు ప్రతిపాదించారు. -
కాకిలెక్కలు.. సర్కస్ ఫీట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు పెట్టిన 2018–19 రాష్ట్ర బడ్జెట్లో అంకెలు ఘనంగా కనిపిస్తున్నా అన్నీ కాకిలెక్కలేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారం కోసం ఉద్దేశించిందే తప్ప.. ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. ఎన్నికల ఏడాది కనుక ఈ బడ్జెట్లోనైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యింది. ఊహాజనిత లెక్కలతోనే ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ కేటాయింపులు సరిపుచ్చారు. ఒక్క హామీకి కూడా న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయలేదు. కేంద్ర గ్రాంట్లపై ఆశలు.. భారీ రెవెన్యూ వ్యయంతో రూపొందించిన బడ్జెట్కు ఆర్థిక వనరులు ఎక్కువగా కేంద్ర గ్రాంట్లు, అప్పులపైన ఆధారపడినట్లు స్పష్టమైంది. అంతే కాకుండా ఏకంగా రాష్ట్ర సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని భారీగా చూపెట్టారు. అంటే అదనంగా పన్నులైనా వేయాలి లేదా గొప్పల కోసం రాని ఆదాయాన్ని వస్తుందని అంచనా వేసైనా ఉండాలి అని నిపుణులంటున్నారు. అలాగే కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో రూ.50,696 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర నుంచి గ్రాంటు రూపంలో రూ.37,548 కోట్లు వస్తాయని అంచనా వేయగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2018–19లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏకంగా రూ.50,695 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ లెక్కలన్నీ ఊహాజనితమే తప్ప వాస్తవ రూపం దాల్చవనేది ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.53,715 కోట్లు వస్తాయని అంచనా వేయగా సవరించిన అంచనాల్లో రూ.52,715 కోట్లే వస్తాయని పేర్కొన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.65,535 కోట్లు్లగా అంచనా వేశారు. అంటే ఏకంగా రూ.12,820 కోట్లు పన్నుల రూపంలో అదనంగా ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.29,605 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూలోటు పెరిగినా మిగులేనా.. విచిత్రంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో రూ.415 కోట్ల రెవెన్యూ లోటును చూపెట్టగా.. ఇప్పుడు సవరించిన అంచనాల్లో రెవెన్యూ లోటు రూ.4,018 కోట్లకు పెరిగిపోయింది. అయినా సరే 2018–19కి మాత్రం రెవెన్యూ మిగులు బడ్జెట్ను ప్రతిపాదించారు. ఏకంగా రూ.5,235 కోట్ల రెవెన్యూ మిగులతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనలను సడలించుకుని అప్పులు ఎక్కువగా తీసుకోవడానికి వెసులు బాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక వర్గాలే పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపులకు, వాస్తవ వ్యయానికి పొంతన లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులనే తిరిగి సవరించిన అంచనాలుగా పేర్కొన్నారంటే వాస్తవంగా వ్యయం ఎంత చేసిందీ చెప్పకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. మద్యం నుంచి ఆదాయాన్ని భారీగా ఆశిస్తున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మద్యం నుంచి రూ.5,886 కోట్లు వస్తాయని పేర్కొనగా 2018–19లో రూ.7,357 కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. రవాణా, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ ద్వారా భారీగా ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ♦ సామాజిక ఆర్థిక సర్వే 2017-18 తెలియకుండా పన్ను పీకుతున్నారు రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2016–17లో రూ.44,181 కోట్లుగా ఉన్న సొంత పన్నుల ఆదాయం.. ఈ ఏడాది రూ.52,717 కోట్లకు చేరింది. ఇదే సమయంలో సొంత పన్నేతర ఆదాయంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2016–17లోరూ.3,989 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈసారి రూ.5,347 కోట్లకు పెరిగింది. ఈ రెండూ కలిపితే రాష్ట్ర సొంత ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.48,170 కోట్ల నుంచి రూ.58,064 కోట్లకు చేరింది. -
నిరుద్యోగులకు మళ్లీ మొండిచేయి..
సాక్షి, అమరావతి: ఇంటికో ఉద్యోగం – ఉపాధి కల్పిస్తామని, ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు నాలుగేళ్ళుగా వంచిస్తూనే ఉన్నారు. రెండేళ్లపాటు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. గత సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇంతవరకు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన నెలకు రూ. 3వేల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయి ఉంది. సంవత్సరానికి రూ. 36వేల కోట్లు.. నాలుగేళ్ళలో రూ. 1.44 లక్షల కోట్లు ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయిపడింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా కలుపుకుంటే రూ. 1.80 లక్షల కోట్లు. మరి రూ. 1,000 కోట్లు ఏమూలకు? 2016లో ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతరుల వివరాలు ప్రభుత్వం నమోదు చేసింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఏ తరగతిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక లెక్క తయారు చేసింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 24 లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నది. పదో తరగతి చదివిన వారు 6.25 లక్షల మంది, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి సాంకేతిక అర్హతలు కలిగిన వారు 2.89 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతున్నది. పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర అర్హతలు కలిగిన వారు 2.07 లక్షల మంది ఉన్నట్లు ఆరు నెలల క్రితం ప్రభుత్వం అధికారిక లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే చూసినా అన్ని తరగతులకు సంబంధించి 33,70,315 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎస్సీ నిరుద్యోగులు 6,11,309, ఎస్టీ నిరుద్యోగులు 1,38,328, బీసీ నిరుద్యోగులు 16,20,823, దివ్యాంగ నిరుద్యోగులు 11,683, ఇతరులు 9,88,172 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఈ 33,70,315 మందికి నెలకు రూ.2వేల చొప్పున ఎంత ఇవ్వాలి? ఇపుడు కేటాయించిన రూ.1,000 కోట్లు ఏ మూలకు..? -
సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం
సాక్షి, అమరావతి: సమసమాజ లక్ష్య సాధన కోసం సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. స్థూల ప్రణాళికలు, సూక్ష్మ అమలు.. అనే విధానంతో తాను ప్రవేశపెట్టే వివిధ పథకాలు తమ ప్రభుత్వ ఉద్దేశాలను ద్విగుణీకృతం చేస్తాయని తనకు గట్టి నమ్మకం ఉందన్నారు. సాధ్యమైన ఆదాయ వనరులను మదింపు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన అన్ని బకాయిలు అందుతాయనే ఆకాంక్షతో రెవెన్యూ మిగులు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరుల అంచనాలను ప్రాధాన్యాలతో సర్దుబాటు చేయడం కష్టమైన చర్యని పేర్కొన్నారు. అన్ని వర్గాల జీవనాన్ని మెరుగుపర్చడమే ప్రభుత్వ పథకాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించారు. అనేక సవాళ్ల మధ్య కూడా పట్టుదల, దృఢ చిత్తంతో మనం సాధిస్తున్నపురోగతి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2017 –18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే బడ్జెట్ 21.70 శాతం పెరిగిందని వివరించారు. మొత్తం 52 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని సరిగ్గా మధ్యాహ్నం 11.29 గంటలకు ప్రారంభించి, 12.55కు పూర్తిచేశారు. రూ.19 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.19,070 కోట్లతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గురువారం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.18602.98 కోట్లు కాగా 467.38 కోట్లు పెట్టుబడి వ్యయం. రైతు సంక్షేమం, పంటల ఉత్పాదక పెంపే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రుణమాఫీకి రూ.4,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
బడాయి అంకెలు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దాదాపు రెండు లక్షల కోట్లకు చేరువగా.. భారీ బడ్జెట్... కేంద్రం నుంచి రూ.50,696 కోట్ల గ్రాంట్లు.. సొంత ఆదాయం రూ.65,535 కోట్లు.. కేంద్ర పన్నుల్లో వాటా రూ.33,930 కోట్లు.. మిగులు రూ.5,235 కోట్లు.. ఏ రంగం చూసినా వేల కోట్ల కేటాయింపులు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించిన 2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఇలాంటి బడాయి అంకెలెన్నో కనిపిస్తాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి.. ఎన్నికల ఏడాది.. అందులోనూ చివరి బడ్జెట్ కనుకే అంకెల్లో అంత బడాయి.. అసలు సంగతి షరామామూలే... భారీగా కేటాయింపులు చేయడం, వాటికి సర్దుబాటు చేయలేక చతికిల పడటం రివాజుగా మారింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చుకు.. బడ్జెట్లో కేటాయింపులకు పొంతనే లేదు. రుణమాఫీ పేరుతో రైతులను దారుణంగా వంచించారు. ఈ బడ్జెట్లోనూ వారికి ఒరిగింది శూన్యం. రూ.87,612 కోట్ల రుణాలున్నా చంద్రబాబు రూ.24వేల కోట్లేనని కుదించారు. వాటికి కూడా దశలవారీగా ఇచ్చింది అరకొరే.. వడ్డీలలో పావు వంతుకు కూడా మాఫీ సొమ్ము సరిపోలేదు. బాబును నమ్మి డిఫాల్టర్లుగా మారిన రైతులు వడ్డీలేని రుణాలకే కాదు కొత్త రుణాలకూ దూరమయ్యారు. అచ్చం అలానే నిరుద్యోగులకూ ముఖ్యమంత్రి చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు.. ఇంటికో ఉద్యోగం– ఉపాధి అన్నారు... ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు... జాబు కావాలంటే బాబు రావాలన్నారు... ఇంకేముంది తలరాత మారిపోతుందని నిరుద్యోగులు తబ్బిబ్బయ్యారు.. ఎన్నికలు ముగిశాయి... చూస్తుండగానే నాలుగేళ్లు నడిచివెళ్లిపోయాయి.. కొత్తగా ఒక్క ఉద్యోగం లేదు సరికదా ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతున్నారు.. పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉపాధి అవకాశాలను పెంచి ఆర్థిక రంగ పరిపుష్టికి దోహదపడే సంజీవని వంటి ప్రత్యేకహోదాను గాలికొదిలేశారు. ఎన్నికల ఏడాది కనుక ఈ 2018–19 బడ్జెట్లోనైనా తమకు న్యాయం చేస్తారని నిరుద్యోగులు ఎదురుచూశారు. వారికి ముఖ్యమంత్రి ‘చిల్లర’తో సరిపెట్టారు. నిరసనలు చూసి గతేడాది నిరుద్యోగులకు ఆర్థికసాయం అంటూ రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క పైసా కూడా విదల్చలేదు. అవి ఎటుపోయాయో తెలియదు. ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు రూ.1,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబానికి రెండువేల చొప్పున నెలకు మూడువేల కోట్లు బకాయి. ఏడాదికి రూ.36వేల కోట్లు.. నాలుగేళ్లకు రూ.1.44 లక్షల కోట్లు బకాయి. ఈ ఏడాది మరలా రూ.36 వేల కోట్లు బకాయి. అంటే మొత్తం రూ.1.76 లక్షల కోట్లు నిరుద్యో గులకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి ఉన్నదన్నమాట. మరి ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.1,000 కోట్లు ఏమూలకు? అవి కూడా వారికి ఖర్చుచేస్తారో లేదో దేవుడికే ఎరుక... ఇవే కాదు.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చడానికి నాలుగు బడ్జెట్లలో కేటాయించింది శూన్యం.. ఐదో బడ్జెట్లోనూ అదే ఒరవడిని కొనసాగించారు. హామీలన్ని టినీ అటకెక్కించారు. కమీషన్లకు వీలున్న సాగునీటిపారుదల శాఖకు మాత్రం భారీ కేటాయింపులు జరిపినా పనులు జరుగుతున్న దాఖలాలే లేవు. వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుకు సరేసరి.. డ్వాక్రా మహిళలకూ టోకరా ఇచ్చారు. రుణమాఫీకి సరిపడా కేటాయింపులే లేవు. ప్రజారోగ్యానికి కీలకమైన ఆరోగ్యశ్రీకి కోతలు విధించి..108 అంబులెన్సులు, 104 పథకా లకు ఎప్పటిలాగే అరకొర కేటాయించారు. సంక్షేమానికి నిధులు పెంచినట్లు కనిపిస్తున్నా గతేడాది ఖర్చు చేయని నిధులు వెక్కిరిస్తున్నాయి.. -
ఏపీ బడ్జెట్ 2018-19 హైలైట్స్
-
యనమల బడ్జెట్ ఇలా..
సాక్షి, అమరావతి : 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ లక్షా 91వేల 63 కోట్లతో ఏపీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ 1,50,270 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ 28,678 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటును రూ 24,205 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే బడ్జెట్ 21.70 శాతం పెరిగింది. కేంద్రం నుంచి సరైన సాయం అందడం లేదని, కేంద్రం సహకరిస్తే మరింత పురోగతి సాధించే అవకాశం ఉండేదని యనమల పేర్కొన్నారు. నిరాశ, నిస్తేజంల మధ్యే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇతర రాష్ర్టాలతో సమానంగా ఎదిగేందుకు పట్టుదలతో పోరాడతామన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకు సాగుతున్నామన్నారు. బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశామని యనమల చెప్పారు. -
ఐటీకి ఆసరా ఏదీ..?
సాక్షి, అమరావతి : ఐటీలో రాబోయే సంవత్సరాల్లో లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఏపీని ఐటీ హబ్గా మారుస్తామని గొప్పలు చెబుతున్న ఏపీ సర్కార్ బడ్జెట్లో మాత్రం నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో ఐటీకి భారీగా కేటాయింపులు చేపట్టాల్సిన క్రమంలో కేవలం రూ 1007 కోట్లను కేటాయించింది. గత ఏడాది అత్యల్పంగా రూ 364 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో మూడురెట్లు పెంచినట్టు ఆర్భాటంగా ప్రకటించింది. ఐటీ రంగానికి ఊతమిచ్చే స్టార్టప్లకు రూ 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అమరావతి వెలుపల విశాఖ, అనంతపురం సహా పలు ప్రాంతాల్లో ఐటీని అభివృద్ధి చేయాల్సిన క్రమంలో బడ్జెట్లో ఈ రంగానికి జరిపిన కేటాయింపులు నిరుత్సాహంగా ఉన్నాయనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఏపీ బడ్జెట్: ఇరిగేషన్కు అరకొరే..
సాక్షి, అమరావతి : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ కీలక రంగాలకు మొక్కుబడి కేటాయింపులు జరిపింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన నీటిపారుదల రంగానికి కేవలం రూ 16,978 కోట్లే కేటాయించింది. వీటిలో పోలవరానికి రూ 9,000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు గత నాలుగేళ్లలో కేవలం రూ 8000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రూ 9000 కోట్లు ఎలా ఖర్చుచేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు పెరిగిన అంచనా వ్యయాల నేపథ్యంలో నిర్మాణ దశలో ఉన్న పలు ప్రాజెక్టులకు ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగానికి రూ 12,355 కోట్లు కేటాయించింది. కరవు, గిట్టుబాటు ధరలు లేక సతమతమవుతున్న అన్నదాతను ఆదుకునే క్రమంలో ఇవి అరకొర నిధులే. -
ఏపీ బడ్జెట్ 2018-19 హైలైట్స్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో ఉదయం11.30గంటలకు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి అతిముఖ్యమైనది కాగా ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్.. మొత్తం బడ్జెట్ రూ.లక్షా 91 వేల 63 కోట్లు రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు వృద్ధిరేటు : 10.96శాతం సంక్షేమ రంగం సాంఘిక సంక్షేమానికి రూ.13,722కోట్లు వెనుకబడిన వైశ్యులకు రూ. 35కోట్లు కాపులకు రూ.వెయ్యి కోట్లు కాపు సామాజిక విద్యార్థులకు రూ.750కోట్లు దూదేకులవారికి కేటాయింపులు.. రూ.40కోట్లు నాయీ బ్రాహ్మణులకు రూ.30కోట్లు వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100కోట్లు వాల్మీకీ బోయిలకు రూ. 50కోట్లు క్రిస్టియన్ మైనారిటీలకు రూ.75కోట్లు మహిళా శిశు సంక్షేమానికి రూ.2839 గిరిజన సంక్షేమం రూ.250 కోట్లు బీసీ సంక్షేమం రూ.4477కోట్లు కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902కోట్లు సామాజిక భద్రతకు రూ.3వేల 29కోట్లు చేనేతల సంక్షేమానికి రూ.250కోట్లు డ్వాక్రా మహిళలకు రూ.1000 కోట్లు చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100కోట్లు నీరు చెట్టు పథకానికి రూ.500 కోట్లు విద్యుత్, వ్యవసాయం, సాగునీటి రంగం సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు ఇరిగేషన్ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు వ్యవసాయానికి రూ.12వేల 355కోట్లు విద్యుత్ రంగానికి రూ.5వేల 52కోట్లు రుణమాఫీకి రూ.4100కోట్లు పరిశ్రమలు, రవాణా పరిశ్రమలకు రూ.3వేల 78కోట్లు రవాణా రంగానికి రూ.4వేల 653కోట్లు పర్యావరణ రంగానికి రూ.4వేల 899కోట్లు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రూ.300కోట్లు రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,653కోట్లు రోడ్ల అభివృద్ధికి రూ.1413 కోట్లు గ్రామీణ, గృహ, పట్టణ రంగాలు గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575కోట్లు మున్సిపల్ శాఖకు రూ.7,761కోట్లు మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623కోట్లు విశాఖ చెన్నై కారిడార్ రూ.1168కోట్లు స్మార్ట్ సిటీలకు రూ.800కోట్లు స్వచ్ఛభారత్కు రూ,1450కోట్లు ఆర్టీసీకి రూ.200కోట్లు అమరావతి నిర్మాణానికి రూ.7,741కోట్లు అమృత్ పథకానికి రూ.490 కోట్లు విద్యా, వైద్యం, సాంకేతిక రంగం సాధారణ విద్యారంగానికి రూ.24,180కోట్లు సాంకేతిక విద్యకు రూ.818కోట్లు స్కిల్ డెవలప్మెంట్కు రూ.300 కోట్లు మోడల్ స్కూల్స్ రూ.377కోట్లు రెసిడెన్షియల్ స్కూల్స్కు రూ.670కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635 కోట్లు వైద్యరంగానికి రూ.8,463కోట్లు సమాచార శాఖకు రూ.224కోట్లు వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20కోట్లు సాంస్కృతిక రంగం రూ.94.98కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవలు రూ.1000 కోట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ.357కోట్లు మున్సిపల్ శాఖకు రూ.7,761కోట్లు ఎంఎస్ఎంఈ రంగానికి రూ.200 కోట్లు పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075కో్ట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద రూ.1000కోట్లు వ్యవసాయ బడ్జెట్ రూ.19,070కోట్లు -
నేడు ఏపీ బడ్జెట్
సాక్షి, అమరావతి: భారీ రెవెన్యూ వ్యయంతో కూడిన బడ్జెట్ను ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం రూ.1,96,800 కోట్ల వ్యయంతో 2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రెవెన్యూ వ్యయం రూ.1,63,660 కోట్లు, కేపిటల్ వ్యయం కింద రూ.33,160 కోట్లను ప్రతిపాదించనున్నారు. 14వ ఆర్థిక సంఘం అంచనా మేరకు ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని రూ.8,70,330 కోట్లు గా పేర్కొన్నారు. రూ.30,000 కోట్ల మేర అప్పులు చేయనున్నారు. ఏపీ సొంత పన్నులు ద్వారా రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. -
టీడీపీలో పోటీ పడుతున్న ‘ఆ ముగ్గురు’
సాక్షి, అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో వాటిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ మొదలైంది. రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి మార్చి 23వ తేదీన ఎన్నిక జరగనుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి టీడీపీ తరఫున దేవేందర్గౌడ్ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులో తెలంగాణకు చెందిన దేవేందర్గౌడ్కి ఏపీ, ఏపీకి చెందిన సీఎం రమేష్కు తెలంగాణ ప్రాతినిథ్యం లభించింది. ప్రస్తుతం ఏపీలో ఖాళీ అవనున్న మూడు స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కనుండగా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని ప్రకటించింది. టీడీపీ తనకు వచ్చే రెండు స్థానాలను ఎవరికి కేటాయించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. పోటీలో ఆ ముగ్గురూ... టీడీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్న యనమల తనను రాజ్యసభకు పంపాలని చాలాకాలం నుంచి చంద్రబాబును కోరుతున్నారు. అయితే అసెంబ్లీ, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఆయనను రాజ్యసభకు పంపితే తనకు ఇబ్బంది అవుతుందేమోననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నాను కాబట్టి తనకు ఇవ్వాలని కంభంపాటి కోరుతుండగా, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనకు ఇవ్వాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ చంద్రబాబు సుముఖంగా లేనట్లు సమాచారం. ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి ఈసారి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే వర్ల రామయ్య, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీయేతర వ్యక్తులకూ అవకాశం? భవిష్యత్తు అవసరాలు, కార్పొరేట్ లాబీయింగ్ కోసం పార్టీయేతర వ్యక్తులకు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో పార్టీకి చెందిన ప్రముఖుడికి కూడా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది: యనమల
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తెలిపిందని, విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర పథకాల కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90:10 శాతంగా ఇస్తామని కేంద్రం చెప్పడంతో ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. -
మార్చి 8న ఏపీ బడ్జెట్!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. సప్తమి పర్వదినం సందర్భంగా మార్చి 8వ తేదీన (గురువారం) ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తారు. -
మనసులో మాట బయటపెట్టిన యనమల
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మనసులో మాట బయటపెట్టారు. అవకాశం లభిస్తే రాజ్యసభ ద్వారా పార్లమెంట్కు వెళ్లేందుకు సిద్దమని అన్నారు. తాను ఎక్కడ ఉండాలన్నది తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. అది కావాలి... ఇది కావాలి అని తానెప్పుడూ పార్టీ అధిష్టానాన్ని అడగలేదని అన్నారు. 35 ఏళ్లు రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన తనది సుదీర్ఘ అనుభవమని చెప్పారు. నా అవసరం ఎక్కడ ఉంటుందన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. -
మీ ఇళ్లల్లో పెళ్లి జరిగితే సెలవులిచ్చేస్తారా?
సాక్షి, అమరావతి : ‘‘మా దళితుల ఇళ్లల్లో వివాహానికి ఎవరినీ రానివ్వరు. అదే మీ వాళ్ల ఇళ్లల్లో పెళ్లి జరుగుతుంటే మాత్రం ఏకంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలనే నిలిపేస్తారా? ఏకంగా సెలవులు ఇచ్చేస్తారా?’’ అని మంత్రి యనమల రామకృష్ణుడిపై శాసన మండలి సభ్యురాలు శమంతకమణి విరుచుకుపడ్డారు. బుధవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల, శమంతకమణి పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా యనమలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏమయ్యా.. మా దళితులకు ఎలాగూ పదవులు ఇవ్వరు. గౌరవం ఎటూ లేదు. కనీసం మా ఇంట్లో వివాహం జరుగుతుంటే ఎవరినీ రానివ్వకుండా చేశారు. అదేపనిగా అందరినీ పోలవరం ప్రాజెక్టు వద్దకు అంటూ తీసుకెళ్లారు. మా మనవరాలి (శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాల కుమార్తె) పెళ్లి ఈ నెల 16న అనంతపురంలో జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఆహ్వానించినా వారిని రానివ్వకుండా పోలవరానికి తీసుకుపోయారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనివాస్ కుమార్తె పెళ్లి 23వ తేదీన అనంతపురంలో జరుగుతుందని ఏకంగా రెండు సభలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చేస్తారా? ఏం.. మా ఇళ్లల్లో శుభకార్యాలకు ఎవరూ రాకూడదా? ఇదేం న్యాయమయ్యా మీకు?’’ అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పలేక యనమల మౌనంగా ఉండిపోయారు. పయ్యావుల కేశవ్ సోదరుడి కుమార్తె వివాహం కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కుమారుడితో గురువారం అనంతపురంలో జరగనుంది. -
నువ్వా.. జగన్ను విమర్శించేది!
సీతానగరం (రాజానగరం): ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు సహకరించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు. మండలంలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ను మాట్లాడకుండా చేసి, ఆయన చావుకు కారణం వారిద్దరే అయ్యారని అన్నారు. కాంగ్రెస్లో ఓడిపోయినా పిలిచి పదవి ఇస్తే, ఎన్టీఆర్ పార్టీని, జెండా గుర్తును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని.. అలాగే స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో ఎన్టీఆర్ను మాట్లాడనీయకుండా అవమానించిన వ్యక్తి యనమల అని అన్నారు. వారిని అసెంబ్లీలో చూడలేకే ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. తమ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడమే కాకుండా.. వారిలో నలుగురిని మంత్రులుగా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి, వారిచేతే సమాధానాలు ఇప్పించే పరిస్థితి సృష్టించి, ప్రజాస్వామ్యంతో పరిహాసమాడుతున్న చంద్రబాబు వైఖరిని నిరసిస్తూనే జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించారన్నారు. జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయనేత అని, చంద్రబాబు విలువలను భ్రష్టు పట్టించే వ్యక్తి అని అన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని అబద్ధాలకోరు చంద్రబాబు అని విమర్శించారు. జగన్ పాదయాత్రతో టీడీపీలో గుబులు ఏర్పడిందన్నారు. జగన్ను ఎంతమంది విమర్శించినా పాదయాత్ర కొనసాగుతుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్బాబు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు తదితరులు పాల్గొన్నారు. -
యనమల నోటిని దానితో శుభ్రం చేసుకోవాలి!
సాక్షి, విజయవాడ: దివంగత నేత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడించింది టీడీపీ నేతలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్ మండిపడ్డారు. చంద్రబాబు వెనుకనుంచి వెన్నుపోటు పొడిస్తే.. యనమల రామకృష్ణుడు ముందునుంచి ఎన్టీఆర్ను పొడిచారని దుయ్యబట్టారు. యనమల నోటిని ఫినాయిల్తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. గతంలో స్పీకర్ కుర్చీకే ఆయన తీరని మచ్చ తెచ్చారని విమర్శించారు. విజయవాడలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఎన్టీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని, అందుకే ఎన్టీఆర్ చూపిన బాటలోనే అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా తామూ నడుస్తామని చెప్పామని జోగి రమేశ్ అన్నారు. -
ఏపీ టీడీపీపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
ఏపీ టీడీపీపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
ఏపీ టీడీపీపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : దీపావళికి ఒకరోజు ముందే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి థౌజండ్ వాలా పేల్చారు. ఏపీ టీడీపీ నేతలే టార్గెంట్గా మాటల రాకెట్లు పేల్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇక్కడి టీడీపీ నేతలను జైల్లళ్లో పెడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం ఆయనకు వంగివంగి దండాలు పెట్టడం ఎంతవరకు సమయంజసమని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును టీ నేతలు పట్టించుకున్నారా? : ‘‘కేసీఆర్ ఏపీ మంత్రి పరిటాల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఆయనకు ఏపీ టీడీపీ నేతలు వంగివంగి దండాలు పెట్టారు. అదే, చంద్రబాబు.. సీతక్క ఇంట్లో పెళ్లికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ మంత్రులుగానీ, నాయకులుగానీ ఏపీ సీఎంను పట్టించుకున్నారా? ఇది టీడీపీ నేతల అత్యుత్సహప్రదర్శనకాదా! ఏపీలో పయ్యావుల కేశవ్ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఆయన గురించి నేను మాట్లాడేది ఏముంటుంది?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. యనమలకు కేసీఆర్ రూ.2వేల కోట్లు : ఏపీ టీడీపీ సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్కు మధ్య ఆర్థిక సంబంధాలున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘యనమలకు కేసీఆర్ రూ.2000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేసీఆర్పై ఈగవాలనీయకుండా యనమల చూసుకుంటారు. ఏపీ టీడీపీ నేతలు.. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టేవారిలా తయారయ్యారు.’’ అని రేవంత్ అన్నారు. తెలంగాణలో పార్టీలు లేవు : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీలంటూ లేవని, సీఎం కేసీఆర్, ఆయనపై వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని రేవంత్ అన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణకు తాను నాయకత్వం వహిసస్తానని చెప్పుకొచ్చారు. పలు ఉద్యమాల నుంచి మొన్నటి సింగరేణి ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీతో కలిసి తాము పనిచేశామని గుర్తుచేశారు. చంద్రబాబు మాకు స్వేచ్ఛ ఇవ్వాలి : ‘‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకునే స్వేచ్ఛను చంద్రబాబు మాకు ఇవ్వాలి. ఒకవేళే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కాంగ్రస్తో కలిస్తే తప్పేంటి? విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు తిరిగొచ్చిన వెంటనే ఆయనను కలుస్తా. టీఆర్ఎస్లో టీటీడీపీ విలీనం లేదా పొత్తు వ్యవహారంపై బాబు చెప్పే మాటను బట్టి నేను నిర్ణయం తీసుకుంటా’’ అని రేవంత్ వెల్లడించారు. అందుకే దత్తాత్రేయ మంత్రి పదవి తొలిగించారు : తెలంగాణలో బీజేపీ లేదు కనుకనే బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలిగించారని రేవంత్రెడ్డి అన్నారు. ఏపీలో కూడా పొత్తు ఉండబోదని బీజేపీ తేల్చిచెప్పింది. మరలాంటప్పుడు తెలంగాణలో పార్టీని ఎలా కాపాడుకోవాలనేదానిపై టీడీపీకి స్పష్టత ఉండాలికదా అని వ్యాఖ్యానించారు. -
జంప్ జిలానీలకు ఝలక్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జంప్ జిలానీలకు ఝలక్ ఇచ్చే రాజకీయాలు టీడీపీలో ఊపందుకున్నాయి. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములే మిన్న అన్నట్టుగా పార్టీ ఫిరాయించిన నేతలకే అధిష్టానం పెద్దపీట వేయడంతో సీనియర్లు వ్యూహం మార్చుతున్నారు. స్థానికంగా దెబ్బకొడితే దారికొస్తారని ఫిరాయింపు నేతలకు ప్రత్యామ్నాయంగా పావులు కదుపుతున్నారు. ఆధిపత్యానికి భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకోవడంతోపాటు అస్థిత్వం కోల్పోయి ప్రమాదంలో ఉన్నామని గ్రహించిన యనమల రామకృష్ణుడు తన రాజకీయ చతురతకు పదునుపెడుతున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై తొలి బాణం వదులుతున్నారు. ఫిరాయింపు నేతల రాకతో ప్రతికూల పరిస్థితులు ఫిరాయింపు నేతలొచ్చాక సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడినే లక్ష్యంగా టీడీపీలో వ్యూహాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ యువనేత లోకేష్బాబు డైరెక్షన్లో యనమల హవా తగ్గించే యత్నాలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కటీ కార్యరూపం దాల్చాయి. యనమల అడ్డుకట్ట వేసినప్పటికీ జ్యోతుల నవీన్కు జెడ్పీ చైర్మన్ పీఠం కట్టబెట్టారు. అన్నవరం దేవస్థానం ఈఓ నియామకం విషయం ఏమైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాకినాడ మేయర్ విషయంలోనూ తన మాట చెల్లుబాటు కాలేదు. చివరకు కాకినాడ డీఎస్పీ పోస్టు నియామకంలో కూడా యనమలకు ప్రాధాన్యతలేకుండా పోయింది. తొండంగి మండలంలో నడుస్తున్న అక్రమ హేచరీల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. మేల్కొన్న యనమల... ఇప్పుడీ పరిణామాలే యనమలను రెచ్చగొట్టేలా చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలాగే వదిలేస్తే తన అస్థిత్వంకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన యనమల ఫిరాయింపు నేతలకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంపై గురిపెట్టారు. తనను దెబ్బకొట్టే రాజకీయాలు చేస్తున్న వారిలో ఒకరైన వరుపుల సుబ్బారావును లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే యాదవ సామాజిక వర్గ నేతలతో మంతనాలు జరుపుతూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు తెరలేపారు. రంగంలోకి తమ్ముడు –అంతర్గతంగా రగలిపోతున్న వరుపుల అన్న ఆదేశాలతో తమ్ముడు కృష్ణుడు బరిలోకి దిగారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల యాదవుల ఐక్యత పేరుతో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే శంఖవరం మండలం కత్తిపూడి సమీపంలో ఇటీవల యనమల కృష్ణుడి సారథ్యంలో జిల్లా యాదవ మహాసభను నిర్వహించడం, దానికి ఆయన కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహించడం పాఠకులకు విదితమే. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల్లోని తమ వర్గానికి చెందిన వారందర్నీ రప్పించారు. ఆ తర్వాత రౌతులపూడి మండలంలో యాదవ ప్రాబల్యం ఉన్న ఎస్.అగ్రహారం, గిడజాం, లచ్చిరెడ్డిపాలెం, రౌతులపూడి, శృంగవరం గ్రామాల్లో కృష్ణాష్టమి, దుర్గాష్టమి వేడుకల పేరుతో యనమల కృష్ణుడు విస్తృత పర్యటనలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. అంతేకాకుండా అదే కులానికి చెందిన శంఖవరం మండల టీడీపీ అధ్యక్షుడు బద్ది రామారావును అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. శంఖవరం, రౌతులపూడి మండలాల్లో యనమల రామకృష్ణుడు ఎక్కడ పర్యటించినా తనే వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వరుపుల ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో చోటుచేసుకున్న ప్రత్యామ్నాయ రాజకీయాలతో అంతర్గతంగా రగలిపోతున్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్రంపై జీఎస్టీ ప్రతికూల ప్రభావం లేదు
సాక్షి, అమరావతి: జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర వృద్ధిరేటుపై ఎటువంటి ప్రతికూల ప్రభావంలేదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధిరేటు పెరుగుతోందన్నారు. గతేడాదిలో ఆరు నెలల కాలానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 10.71 శాతంగా ఉంటే అది ఈ ఏడాది 11.73గా నమోదయ్యిందన్నారు. గురువారం విజయవాడలో వాణిజ్య శాఖ్య పన్నుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా యనమల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ఒక్క రియల్ ఎస్టేట్ రంగంపై మాత్రమే ప్రతికూల ప్రభావం చూపిందని, దీంతో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. ఈ ఏడాది వాణిజ్య శాఖకు రూ. 40,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తే మొదటి ఆరు నెలల్లో ఇందులో 44 శాతం చేరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోతోందన్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోలేనే రూ. 30,000 కోట్ల వరకు అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పెట్రోల్పై అదనంగా పెంచిన రూ. 4 వ్యాట్ను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు యనమల స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో బంకులు మూత పడుతుండటంతో అదనపు వ్యాట్ను రూ. 2 వరకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
చెక్...
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆర్థిక శాఖా మంత్రిగా ‘లెక్క’ల్లోకి తీసుకుంటున్న యనమల రామకృష్ణుడిని జిల్లాలో మాత్రం ‘లెక్కలో’ లేని వ్యక్తిగా తీసిపారేస్తున్నట్టుగా ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. చినబాబు క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించాక పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న యనమలను వ్యూహాత్మకంగా దూరం పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. అధిష్టానం వేస్తున్న ఎత్తులకు అనుగుణంగా జిల్లాలో యనమల ప్రత్యర్థి వర్గం పైఎత్తులు వేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఆయన ఏది చెప్పినా దానికి భిన్నంగా అధిష్టానం చేస్తూ పోతుండడంతో మంత్రి అనుచరులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకుంది. ఈ మూడేళ్లలో ఆయన అనుకున్న వాటిలో పార్టీ ఫిరాయించిన జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకోవడం ఒక్కటే నెరవేరింది. మిగతావన్నీ బెడిసికొట్టాయి. ఆ మధ్య కార్తికేయ మిశ్రాను వద్దని యనమల చెప్పినప్పటికీ జిల్లా కలెక్టర్గా నియమించారన్న వాదనలు ఉన్నాయి. జెడ్పీపై బెడిసికొట్టిన యత్నాలు... ఇటీవల జ్యోతుల నవీన్ను జెడ్పీ చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అసంతృప్తిని రాజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. యనమల అభిప్రాయానికి భిన్నంగా నామన రాంబాబును బలవంతంగా రాజీనామా చేయించి, జ్యోతుల నవీన్ను జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టింది. దీం తో యనమల అనుచర వర్గమంతా నిరాశకులోనై తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. ఆ తర్వాత అన్నవరం దేవస్థానం ఈఓ విషయంలో కూడా యనమల వర్గానికి మొండి చేయి ఎదురైంది. ముఖ్యం గా యనమల సిఫార్సు చేసిన పూర్వపు ఈఓ, ప్రస్తుత పెనుగంచి ప్రోలు ఈఓ రఘునాథ్ ఇక్కడికి రాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు చెక్ పెట్టారు. మేయర్ విషయంలోనూ అంతే... కాకినాడ కార్పొరేషన్ మేయర్ విషయంలో మరో సారి యనమలకు చుక్కెదురైంది. తాను చెప్పినోళ్లకే మేయర్ పదవి ఖరారవుతుందని అనుచరుల వద్ద చెప్పుకున్నప్పటికీ అధిష్టానం సీల్డ్ కవర్ రాజకీయంతో పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ విషయంలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వారి బంధు త్వ నేతలు చక్రం తిప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎంపీ తోట నర్సింహం ఆధ్వర్యంలో యనమల ప్రత్యర్ధి నేతలంతా ఒక్కటై అధిష్టానం స్థాయిలో తమదే పైచేయి అనిపించుకున్నారు. డీఎస్పీ పోస్టు కూడా వేసుకోలేని దుస్థితి.. తాజాగా కాకినాడ డీఎస్పీ పోస్టు విషయంలో య నమల మాట చెల్లుబాటు కావడం లేదు. కాకినాడ డీఎస్పీగా పనిచేసిన ఎస్.వెంకటేశ్వరరావుకు బది లీ తప్పని సరయింది. రెండు నెలల క్రితం కొవ్వూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. వాస్తవానికైతే, ఈ పోస్టులో తనవారినొకర్ని వేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. చివరికి యనమల చెబితే ఏదీ కాదనే సంకేతాలను క్యాడర్లోకి పంపిస్తోందని, ఇదంతా చినబాబు డై రెక్షన్లోనే జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
ఎలక్షన్... మంత్రులకు టెన్షన్
♦ అంటీముట్టనట్టుగా మంత్రి యనమల ♦ చిన రాజప్పకు పరీక్ష సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ కీలక నేతలకు కఠిన పరీక్షగా మారాయి. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత.. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. చంద్రబాబు అంటే మండిపడుతున్న కీలక సామాజికవర్గాలు.. అభివృద్ధికి నోచుకోని కాకినాడ స్మార్ట్సిటీ.. ఇలా అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇక జిల్లాకు చెందిన మంత్రులకైతే అగ్నిపరీక్షే. ప్రజావ్యతిరేకతను ఎదురొడ్డి కాకినాడ కార్పోరేషన్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపై మంత్రులు ముల్లగుల్లాలు పడుతున్నారు. ఆమడ దూరంలో యనమల ఇటు పార్టీలోను.. అటు మంత్రివర్గంలో సీనియర్గా ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణడు కార్పోరేషన్ ఎన్నికలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయనెప్పుడూ ఇదే పంధాను అనుసరిస్తుంటారు. కాని గత కొంతకాలంగా జిల్లాలో తనమాట చెల్లుబాటు కాని పరిస్థితుల్లో పూర్తిగా దూరంగా ఉండే అవకాశముందని టీడీపీ నేతలంటున్నారు. జెడ్పీ చైర్మన్ విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాలేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మాటకే అదిష్టానం ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే వాదనలు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు రావడం యనమల పాత్ర చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక అంతా సర్వేలు, ఐవీఆర్ఎస్ విధానంతో ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడం కూడా ఆయన పాత్ర పెద్దగా లేదన్నట్టుగా చేసింది. రాజప్ప చుట్టూ ఉచ్చు... ఇక ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మాత్రం ఈ ఎన్నిక అగ్నిపరీక్షే. రాజప్ప కార్పొరేషన్ను ఆనుకుని ఉన్న పెద్దాపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ మార్పు వంటి విషయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల బాధ్యత కూడా పార్టీ ఆయనకే అప్పగించింది. దీంతో గెలిపించాల్సిన బాధ్యత సహజంగా రాజప్ప మీదనే ఉంది. రాజప్పకు సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలోను, ఉద్యమాన్ని ఆణిచివేసే విషయంలో రాజప్ప సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా ముద్రగడను ప్రతీ విషయంలోనూ టార్గెట్ చేస్తూ రాజప్ప మాట్లాడడం ద్వారా కాపువర్గీయులు రాజప్ప పేరు చెబితేనే మండిపడుతున్నారు. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ సామాజికవర్గం ఓట్లను పొందేందుకు కాపు మహిళకు మేయర్ పదవి కేటాయిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. కేవలం ఎన్నికల లబ్ధికోసమేనని ఆ సామాజికవర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజప్ప ఆ సామాజికవర్గాన్ని ఎంత వరకు పార్టీ మెప్పించకువస్తారనేది వేచి చూడాల్సిందే. హోమ్... ఆర్థిక వంటి కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న రాజప్ప, యనమల ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే రాజకీయంగా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తోంది. -
యనమల శిబిరానికి జ్యోతుల వర్గం చెక్..
- జెడ్పీ షాక్ నుంచి తేరుకోక ముందే మరో దెబ్బ – మంత్రి యనమల శిబిరానికి జ్యోతుల వర్గం చెక్ – అన్నవరం ఈఓ విషయంలో పంతం నెగ్గించుకుంటున్న ఫిరాయింపు నేతలు – రఘునాథ్పై ఆరోపణల కేసు తిరగదోడుతూ అడ్డగింత – వలసల పెత్తనేమేమిటంటూ టీడీపీలో విస్తృత చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీలో ఫిరాయింపుదారులే పవర్ఫుల్ అవుతున్నారు. వారి ముందు సీనియర్లైన మంత్రుల సైతం దిగదుడుపుగానే మిగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం జంప్ జిలానీలకే పెద్దపీట వేస్తోంది. వారికోసం సీనియర్లను పక్కన పెట్టి దాసోహమైపోతోంది. ఇప్పుడా పార్టీకి బలం, బలహీనత ఫిరాయింపుదారులేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీలో ఎవరి హవా సాగుతుందో....ఎవరి మాట చెల్లుబాటు కావడం లేదో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి యనమల శిబిరానికి వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సత్యదేవుని ఆలయ కార్యనిర్వహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు విజయనగరం జిల్లా జేసీ–2గా బదిలీ అయ్యాక వారి స్థానంలో కొత్తగా ఎవర్నీ నియమించలేదు. ఈ పోస్టు కోసం టీడీపీలో రెండు గ్రూపులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. చెరో ఒకర్ని ప్రతిపాదించడంతో అన్నవరం కొండపై రాజకీయం రసకందాయంగా మారింది. ఈ పోస్టును కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ఈఓ మంచెనపల్లి రఘునాథ్, ద్వారకా తిరుమల ఈఓ వేండ్ర త్రినాథరావు ప్రధానంగా ఆశిస్తున్నారు. వీరికి ఒక్కో వర్గం అండగా నిలిచింది. పోస్టింగ్ కోసం లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నవరం దేవస్థానం పూర్వపు ఈఓ, ప్రస్తుత పెనుగంచి ప్రోలు ఈఓ రఘునా«థ్ను తీసుకొచ్చేందుకు మంత్రి యనమల వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ద్వారకా తిరుమల దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వేండ్ర త్రినాథరావును తీసుకురావడానికి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరపుల సుబ్బారావు శిబిరం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రేసులో ఉన్న వారికి ఇప్పటికే ఇరువర్గాలు తమ సిఫార్సు లేఖ కూడా ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి యనమల అండదండలతో రఘునాథ్ త్వరలోనే ఈఓగా వచ్చేస్తున్నారని ఇప్పటికే విస్తృత ప్రచారం జరిగింది. దాదాపు పెండింగ్ ఫైళ్లన్నీ పరిష్కారం చేయించుకుని తనకు అనుకూలంగా లైన్ క్లియర్ చేసుకున్నారన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల శిబిరానికి చెందిన కొందరు రఘునా«థ్ను ఎలా నియమిస్తారో చూస్తామని...ముందు ఆయనపై ఉన్న ఆరోపణల కేసును ఎలా ఎదుర్కోవాలో చూసుకోవడం మంచిదనే సంకేతాలు పంపించారన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలూ తమకు ఇష్టమైన వ్యక్తిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. తెరపైకి రఘనాథ్ ఆరోపణల కేసు... అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం నువ్వానేనా అన్నట్టుగా జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో పూర్వపు ఈఓ రఘునాథ్ ఆరోపణల కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో భాగంగా విచారణకు కూడా ఆదేశించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో 2008 ఆగస్టు నెలలో అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసిన కాలంలో రఘునాథ్పై ఏసీబీ దాడులు చేసింది. ఆ దాడుల అనంతరం రఘునా«థ్ను పెనుగంచి ప్రోలు దేవస్థానానికి బదిలీ చేశారు. అనంతరం ఆయనకు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ప్రచారం కూడా జరిగింది. దీంతో ఏసీబీ దాడులతో మసకబారిన తన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకునేందుకు కనీసం చివరి ఏడాదైనా (ఆయనకు ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంది) అన్నవరం దేవస్థానంలో ఈఓగా పనిచేసి తానేంటో నిరూపించుకునే లక్ష్యంతో మంత్రి యనమల సాయంతో తీవ్రంగా ప్రయత్నిండగానే అనూహ్యంగా ఆరోపణల కేసు తెరపైకి రావడం అధికార వర్గాల్లోనే కాదు టీడీపీలోనూ చర్చనీయాంశమమయింది. రెండు మూడు రోజుల్లో రఘునాథ్కు పోస్టింగ్ వస్తుందనుకున్న సమయంలో విచారణకు ప్రభుత్వం ఆదేశాలివ్వడమంటే తెరవెనుక రాజకీయమేదో జరిగిందన్న అనుమానాలు రెకేత్తుతున్నాయి. ఏదో విధంగా రఘునాథ్ను ఈఓగా రాకుండా అడ్డుకోవడంతోపాటు మంత్రి యనమల శిబిరానికి జలక్ ఇచ్చినట్టుగా ప్రత్యర్థి శిబిరం వ్యూహాత్మకంగా పావులు కదిపిందని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రభుత్వ స్థాయిలో ఫిరాయింపు నేతలు తమకున్న పలుకుబడినంతా ఉపయోగించి యనమల శిబిరంపై పైచేయి సాధించినట్టయిందని...తద్వారా తమకు అనుకూలమైన వేండ్ర త్రినాథరావు ఈఓగా రావడానికి మార్గం సుగమం చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. జెడ్పీ చైర్మన్ విషయంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎవరెంత కాదన్నా...మంత్రి యనమల అండతో నామన రాంబాబు ససేమిరా అన్నా...అధిష్టానం స్థాయిలో ఫిరాయింపుదారులు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. బలవంతంగా నామనను రాజీనామా చేయించి ఆ సీట్లో ఫిరాయింపు నేత కూర్చొన్నారు. ఈ విషయంలో ఎంత హైడ్రామా నడిచినా చివరికి జంప్ జిలానీలదే పైచేయి అయింది. -
'మంత్రి యనమలపై ఫిర్యాదు చేస్తాం'
-
మంత్రి యనమలపై ఫిర్యాదు చేస్తాం: విశ్వేశ్వరరెడ్డి
నంద్యాల: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. 30 ఏళ్ల సర్వీసుకే ఉద్యోగులను ఇంటికి పంపించేలా జీవోలు తయారు చేయడం దారుణమన్నారు. నంద్యాలలోని శిల్పామోహన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఉద్యోగాలను తగ్గించే కుట్రకు ఏపీ ప్రభుత్వం తెరతీయడాన్ని సాక్షి పేపర్ ఆధారాలతో బయటపెట్టినా ప్రభుత్వ వైఖరిలో మాత్రం మార్పు రాలేదన్నారు. మరోవైపు ‘సాక్షి’పై మంత్రి యనమల రామకృష్ణుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, యనమల వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వారి కుట్రను ఆధారాలతో బయటపెట్టిన తర్వాత కూడా తమ తప్పును తెలుసుకుని జీవో నిర్ణయంపై క్షమాపణ చెప్పకపోగా ప్రభుత్వం అదే ధోరణితో నడుచుకుంటున్నారు. ఏపీలో ఖాళీగా ఉన్న 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రస్తుత ఉద్యోగులపైనే భారం వేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, ఉద్యోగుల పట్ల, వారి పోరాటల పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటుంటూ ప్రభుత్వం వారిని అణిచివేయడంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన తీవ్రమవుతుందని చెప్పారు. ప్రస్తుతం తీసుకురానున్న జీవోలపై కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మా వద్ద ఆధారాలు ఉన్నా కూడా టీడీపీ ప్రభుత్వం మాత్రం తప్పును తెలుసుకోకుండా ఇంకా బుకాయించాలని చూస్తోందన్నారు. 50 ఏళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ ఆఖరికి ఉద్యోగులపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. -
యనమల విలవిల... జ్యోతుల మిలమిల
► యనమల వర్సెస్ జ్యోతుల ► పట్టుకోసం పాకులాట ► అంతర్గతపోరు చివరి మజిలీలో ఫలించని యనమల యత్నాలు ► రక్తికడుతున్న టీడీపీ రాజకీయాలు జిల్లా తెలుగు దేశం పార్టీలో సమతూకం కుదరడం లేదు. బలవంతపు పెళ్లిలా తంతు చేస్తున్నా రాజకీయ చదరంగంలో పావులు కదలిక ఆగడం లేదు. మరింత జోరందుకుంటోంది. వలస వచ్చిన వాడికి తృణమో, పణమో అర్పించుకోకపోతే అసలకే ఎసరు వస్తుందేమోనని వడివడిగా రాజకీయ పరిణామాలల్లో మార్పు తీసుకురావాలనుకున్న అధిష్టానానికి గత మూడు నెలలుగా చుక్కెదురవుతూ వస్తోంది. జిల్లా మినీ మహానాడుకు ముందే ఈ వివాదాలకు చెక్ పెడదామనుకున్న ‘పెద్దలు’ వచ్చి రాయ‘బేరాల’కు దిగినా ఫలితం దక్కలేదు. ఆలస్యంగానైనా అనుకున్నట్టుగానే పదవుల పందేరానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నా అసమ్మతి రాగానికి మాత్రం తాళం పడేటట్టుగా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాకినాడ : టీడీపీ రాజకీయాలు పాము, ముంగిస కథలా నడుస్తున్నాయి. ఎవర్ని ఎవరు మింగేస్తారో గాని ఎత్తుకు పైఎత్తులతో అంతర్గత రాజకీయాలు ఆసక్తిగా సాగుతున్నాయి. టీడీపీలోకి రాకుండా జ్యోతులను అడ్డుకునేందుకు యనమల కడదాకా పోరాడారు. జ్యోతులకు మంత్రి పదవి దక్కనివ్వకుండా యనమల విజయం సాధించారు. యనమల అభ్యంతరం తెలిపినా తన కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో అధిష్టానం వద్ద జ్యోతుల లైన్ క్లియర్ చేసుకోవడంతో ఇకపై అసలు సిసలైన రాజకీయాలు ఆవిష్కృతం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు... జ్యోతులకు యనమల బద్ద విరోధి. అంతర్గత రాజకీయాల్లో యనమలతో ఇమడలేకనే పార్టీ (పీఆర్పీ) మారారు. ఆ తర్వాత అధికారం వస్తుందన్న ఆశతో జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీలో చేరారు. కానీ అధికారం రాకపోవడంతో ప్రతిపక్ష నేతగా ఉండలేక... పదవీ వ్యామోహం, ప్యాకేజీలకు ఆశపడి మళ్లీ టీడీపీలోకి వలస వెళ్లారు. అయితే, టీడీపీలోకి వచ్చేముందు మంత్రి యనమలతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. చివరికి చంద్రబాబు సూచన మేరకు రాజీ ధోరణితో యనమల్ని కలిసి ఒప్పించుకున్నారు. అధినేత ఆదేశాల్ని తోసిపుచ్చలేక యనమల కూడా కాదనలేకపోయారు. టీడీపీలోకి వచ్చాక మంత్రి పదవి వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ఈసారి యనమల పట్టు వదల్లేదు. తన ప్రత్యర్థికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో తన ఉనికికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనననే భయంతో అధిష్టానం వద్ద గట్టిగానే పోరాడి జ్యోతులకు బెర్త్ దొరకకుండా విజయం సాధించగలిదారు. దీంతో జ్యోతుల తీవ్ర నిరాశ నిస్పృహకు లోనవడంతో ఏదొ ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరచాలన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ చేయలేరన్న ధీమాతో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును బలి పశువును చేసేందుకు పావులు కదిపారు. నామనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి, జెడ్పీ చైర్మన్ పదవిని జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్కు కట్టబెట్టేందుకు పార్టీలో ఎట్టకేలకు ఒప్పందం కుదిర్చారు. జ్యోతులకు వ్యతిరేకంగా పావులు జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తే జిల్లాలో జ్యోతులు పట్టు పెరుగుతుందన్న భయంతో నామన రాంబాబుకు వెనకుండి యనమల పావులు కదిపారు. జంప్ జిలానీకి పదవి ఎలా ఇస్తారని, చైర్మన్గా పనిచేసుందుకు సరిపోమా అన్న నినాదంతో నామనతో జెడ్పీ వైస్ చైర్మన్ వర్గీయులను ముందుకు ఉసిగొల్పారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమేంటని పలువురు జెడ్పీటీసీలు నిరసనకు దిగారు. అధిష్టానం దిగి రాకుంటే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడమనే సంకేతాలను 22 జెడ్పీటీసీలుచే తెరవెనుక ఉండి యనమల వర్గం నిరసన గళం వినిపింపచేయించింది. కానీ తాటాకు చప్పుల్లేవీ పనిచేయలేదు. కాపు ఉద్యమం జిల్లాలో తీవ్రంగా నడుస్తున్న సమయంలో ఆ సామాజిక వర్గ నేతను పిలిచి అన్యాయం చేశారన్న అపవాదును మూటగట్టుకోవల్సి వస్తుందన్న ఉద్దేశంతో జ్యోతులకు జై కొట్లక తప్పిందికాదు. దీంతో యనమల వర్గానికి చెక్ పెట్టినట్టయింది. ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా... ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. నామన రాంబాబును తొలగించి జ్యోతుల నవీన్ను జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టడం వల్ల టీడీపీలో నెంబర్ టూ, సీనియర్ మంత్రిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడుపైనే ప్రధాన ప్రభావం పడబోతోంది. జ్యోతులకు, యనమలకు మధ్య ఉన్న వైరం జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. జిల్లా పరిషత్ కేంద్రంగా చక్రం తిప్పే యోచనలో జ్యోతుల ఉన్నారు. జిల్లా స్థాయిలో తన కనుసన్నల్లో పనులు జరిగేలా పావులు కదిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యనమల వర్గం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. లోకేష్ కోటరీ డైరెక్షన్లో అదిష్టానం కూడా వ్యూహాలు మార్చుకుని వెళ్లడంతో యనమలకు మరింత సంక్లిష్టం పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సీనియర్లను వరుసగా పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో యనమల కూడా ప్రాధాన్యత తగ్గి లోకేష్ కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారన్న చర్చ నడుస్తోంది. కార్తికేయ మిశ్రాను వద్దని యనమల చెప్పినప్పటికీ జిల్లా కలెక్టర్గా నియమించారని, ఈ విషయంలో యనమలను పట్టించుకోలేదన్న వాదనలున్నాయి. అటు జెడ్పీ చైర్మన్ పదవి విషయంలోనూ, ఇటు కలెక్టర్ నియామకంలోనూ యనమలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే అధిష్టానం వద్ద పట్టు తగ్గినట్టు స్పష్టమవుతోంది. ఇకపై రాష్ట్ర పద్దులు చూసుకోవడం తప్ప జిల్లాలో చేసేందేమి ఉండదదని, చక్రం తిప్పే పరిస్థితి అస్సలుండదని యనమల ప్రత్యర్థి వర్గం సంబరపడుతోంది. -
జీఎస్టీపై ఎలాంటి అపోహలు వద్దు
-
‘యనమల ఇంతలా దిగజారి మాట్లాడతారా..’
హైదరాబాద్: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి ఏం జరిగినా దానికి వైఎస్ జగనే కారణం అంటూ ఆరోపణలు చేయడం తప్పించుకొని తిరిగే చర్యే తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఈమెయిల్స్ వ్యవహారంతో తమ పార్టీకి సంబంధం లేదని, చంద్రబాబువల్ల, ఆయన ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్లే ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసుకుంటారేమో తప్ప తమ పార్టీకి అందులో ఏ మాత్రం జోక్యం లేదని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించడం లేదన్న అంబటి దానికి కూడా వైఎస్ఆర్సీపీదే బాధ్యత అంటూ ఆరోపిస్తున్నారని, అభివృద్ధిని వైఎస్ఆర్సీపీనే అడ్డుకుంటుందని పిచ్చిప్రేలాపనలు చేస్తుందని ధ్వజమెత్తారు. అభివృద్ధి లేమికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు ఆయన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏదో మాయాజాలం చేసి చూపించారని, దూరంగా ఉన్నవాళ్లకు గొప్పగా ఉంటుందేమోగానీ ఓసారి అమరావతి వచ్చి చూస్తే అసలు రంగు బయటపడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే ఉందని, మరో మరో రెండేళ్లలో కూడా చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేరని అన్నారు. దీంతో తన చేతగానితనం నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీపై నిందలు వేయడం మొదలుపెట్టిందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసి తప్పించుకోవాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎవరూ అభివృద్ధిని అడ్డుకోరని హితవు పలికిన అంబటి అభివృద్ధి పేరుతో కోట్లు మింగేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ కచ్చితంగా ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు కంటే ముందే టీడీపీలోకి వచ్చిన యనమల అత్యంత దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2018లో రాజ్యసభ సభ్యత్వం కోసమే యనమల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఎంత నీతిమాలిన పని అయినా చేయగలిగిన వ్యక్తి యనమల అన్నారు. -
‘ఆయన ఏం పోస్టింగ్స్ పెట్టారో తెలియదు’
అమరావతి: ఐవైఆర్ కృష్ణారావు ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ... ఐవైఆర్ ఏం పోస్టింగ్లు పెట్టారో తనకు తెలియదన్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని యనమల అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది తనకు తెలియదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు ఐవైఆర్ ఎక్కువ నిధులు అడిగారని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని చెప్పామన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్లో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారని, అయితే అందుకు తాము అంగీకరించలేదన్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారనే ఆరోపణలతో ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఏపీ సర్కార్ తొలగించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన చైర్మన్గా వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. -
30న మరోసారి జీఎస్టీ కౌన్సిల్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం సమావేశమైంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెల 30న మరోసారి సమావేశం కావాలని కౌన్సిల్ నిర్ణయించింది. మిగిలిన వస్తువుల శ్లాబులపై సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. కౌన్సిల్ ఏర్పాటు తర్వాత జీఎస్టీ మండలి సమావేశం కావడం ఇది 17వసారి. వివిధ రకాల వస్తువులకు ఇప్పటికే జీఎస్టీ శ్లాబులను మండలి ఖరారు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని యనమల జీఎస్టీ కౌన్సిల్ను కోరారు. అలాగే బీడీ, గ్రానైట్, మిషన్ భగీరథ పనులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేటీఆర్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. -
యనమల అరాచక పాలనకు చరమగీతం తప్పదు
ప్లీనరీలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : అధికారం అండతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం చామవరం శివారులో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ ప్లీనరీకి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, 2004కు ముందు టీడీపీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉండేది కాదన్నారు. ఇప్పుడు గుండెధైర్యంతో ఎక్కడైనా ఎప్పుడైనా సభలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు. ఎన్నో కేసులు పెట్టి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ వెరవక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో వేలాదిమంది తనవెంట నడవడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. మూడు నియోజకవర్గాలకు సేవలందించే తుని ఏరియా ఆస్పత్రిని టీడీపీ నాయకులు ఆదాయ వనరుగా చేసుకుని పేదల రక్తాన్ని సొమ్ముల రూపంలో పిండుకుంటున్నారన్నారు. తుని నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్, భూములవంటివాటిని విచ్చలవిడిగా దోచుకునేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆర్థిక మంత్రి సొంత గ్రామమైన ఏవీ నగరంలో 105 మందికి చెందిన పింఛన్ల సొమ్మును స్వాహా చేస్తున్నా స్పందించలేదన్నారు. నిజంగా సిగ్గుంటే దీనిపై విచారణ జరిపించి పేదలకు పింఛను సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో సభాప్రాంగణం కిక్కిరిసింది. టీడీపీని ఎప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడానికి ప్లీనరీకి వచ్చిన జనసందోహమే నిదర్శనమని రాజా అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్లీనరీ ఇన్చార్జి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, పెండెం దొరబాబు, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
-
జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
అమరావతి: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లు వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒకే దేశం...ఒకే పన్ను విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు రైతులను ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లు ఆమోదం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు దేవినేని నెహ్రు, ఆరేటి కోటయ్య, రుక్మిణిదేవి, నారాయణరెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. -
జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టిన యనమల
-
పెరిగిన సిమెంట్ ధరలపై 27న మళ్లీ భేటీ
విజయవాడ: పెరిగిన సిమెంట్ ధరలపై కంపెనీల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం సోమవారం సమావేశమైంది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సబ్ కమిటీ జరిగింది. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కనీసం రూ.60 తగ్గించాలని తాము సిమెంట్ కంపెనీ ప్రతినిధులను కోరినట్లు తెలిపారు. ఈ నెల 27న మళ్లీ సమావేశం అవుతామన్నారు. సిమెంట్ ధరలు తగ్గించడానికి అంగీకరించకపోతే ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ రద్దు చేస్తామన్నారు. పంచాయతీరాజ్ పనులకు రూ.230, ఆర్అండ్బీ పనులకు రూ.240, పోలవరం పనులకు రూ.250 బస్తా సిమెంట్ సరఫరా చేసేందుకు కంపెనీలు అంగీకరించాయని తెలిపారు. అలాగే సామాన్యులకు అమ్మే సిమెంట్ మాత్రం రూ.390 వరకూ పెంచారని వెల్లడించారు. -
రెండు రోజుల పాటు అసెంబ్లీ: యనమల
సాక్షి, అమరావతి: వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో గానీ రెండు రోజుల పాటు అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహిస్తామని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, అనంతరం రాష్ట్రం జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో జీఎస్టీ సన్నద్ధత, గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వ్యయంపై సమీక్ష నిర్వహించారు. -
నిజమైన ఫ్యాక్షనిస్టులు ఆ సోదరులే
అవినీతిని ప్రోత్సహిస్తున్న మంత్రి యనమల ఏరియా ఆసుపత్రిలో దోపిడీ చేస్తున్న తమ్ముళ్లు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : రాష్ట్రంలో ఏకైక ఫ్యాక్షనిస్టు మంత్రి యనమల రామకృష్ణుడే నని తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా అన్నారు. శుక్రవారం స్థానిక శాంతినగర్లోని పార్టీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంతో అనుభవం ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఫ్యాక్షనిస్టని విమర్శించడం మాని, ముందు తుని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అరాచకాలను అరికట్టాలని హితువుపలికారు. అధికారం ఉందనే బలుపుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలను పోలీసులతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కోసం నీతులు చెప్పడం కాదు.. మీ పార్టీ నాయకులను కట్టడి చేసి చూపాలని సవాల్ చేశారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేదలను జలగల్లా పీడుస్తున్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. సర్కారీ ఆసుపత్రికి వచ్చే పేదల నుంచి మీ బినామీలు డబ్బులు వసూలు చేస్తున్న విషయం గురువారం బయటపడిందన్నారు. రాష్ట్రంలోని ఎక్కువ డెలివరీలు చేస్తున్న ఏరియా ఆసుపత్రిలో అవినీతి జలగలు సామాన్యుల రక్తాన్ని పీల్చుతున్నాయన్నారు. సగటున రోజుకు 40 వరకు కాన్పులు జరుగుతుండగా.. ఒకొక్కరి నుంచి రూ.నాలుగు వేలు వసూలు చేస్తున్నారని, అంటే రోజుకు రూ. లక్ష తమ్ముళ్ల జేబులోకి వెళుతోందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్షంలో ఉన్న మనం కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని కార్యకర్తలకు సూచించారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, మీకు నేను అండగా ఉంటానని కార్యకర్తలకు రాజా భరోసా కల్పించారు. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ధర్నాకు వందల సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. -
పాపం.. పెద్దోళ్లు..!
► పార్టీలు మారినా ఫలితం లేదాయే : జ్యోతుల ► సిద్ధాంతకర్తనైనా గుర్తింపు రాకపోయే : గోరంట్ల ► ఇద్దరు సీనియర్ నేతల అంతర్మథనం ► జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు ► రాజీలు కుదిర్చినా ససేమిరా... ఒకరు పలు పార్టీలకు వ్యూహకర్త ... ఇంకొకరు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే పురుడు పోసిన సిద్ధాంత కర్త. ఇందులో ఒకరు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ...ఇంకొకరు రాజమహేంద్రవరం శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏ పార్టీలోనూ జ్యోతులకు స్థిరత్వం లేక చంచల స్వభావంతో ఎటు గాలివీస్తే అటు అడుగులు వేయడంతో ఆ అడుగులు ఎక్కడా బలంగా నిలదొక్కుకోలేని దుస్థితి. ‘ఉన్నది వదిలేవు ...లేనిది కోరేవు ... ఒక పొరపాటుకి యుగములు వగచేవు’ అంటూ ఓ సినీ రచయిత గీతా విలాపంలా తయారయింది నెహ్రూ పరిస్థితి. ఇక గోరంట్ల వ్యథ మరో విధంగా ఉంది. టీడీపీ సిద్ధాంత కర్తల్లో ఒకరినైన నన్నా విస్మరించేదంటూ చిందులు తొక్కుతున్నారు. పార్టీ అధినేత ఎన్టీ రామారావునే అత్యంత క్రూరంగా బయటకు పంపించేసి ... ఆయన మరణానికి కారణమైన ‘బాబు’ దగ్గరా ఆ సుద్దులంటూ ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. వీరి ఎదుగుదలను వెనుకనుంచి అడ్డుకున్నది యనమలేనని అనుచర వర్గం ఆగ్రహంతో ఉంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు కొందరు నేతలను అత్యున్నత స్థాయికి తీసుకుపోతుంటాయి. మరికొందరినైతే రాజకీయంగా అధఃపాతాళానికి నెట్టేస్తాయి. ఇందులో రెండో రకం నాయకుడిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మూడు దశాబ్దాల చరిత్ర కలిగి అపారమైన అనుభవం ఉన్న జ్యోతుల కూడా రాజకీయాల్లో ఒక దాని తరువాత మరొకటి తప్పటడుగులే వేశారు. టీడీపీ సైకిల్ చక్రాన్ని వదిలేసి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో ముందడుగు వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఆ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును జగ్గంపేటలోనే జగన్మోహన్రెడ్డి ప్రకటించి నెహ్రూకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నమ్మి వచ్చిన నెహ్రూకు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. జగన్మోహన్రెడ్డి అంతటితోనే సరిపెట్టకుండా శాసనసభా పక్ష ఉప నేతను చేసి నెహ్రూ గౌరవాన్ని ఇనుమడింప జేశారు. ఇంతా చేస్తే టీడీపీకి ఫిరాయించేశారు. అందుకు మంత్రి పదవా లేక, ఇంకేమైనా ప్రలోభాలు కారణమయ్యాయో తెలియదుగానీ నమ్మి ఒక మెట్టుపైకి తీసుకువెళ్లిన పార్టీని నడిసంద్రంలో ముంచేశారు. ఆ ప్రభ ఏదీ...? ఆవిర్భావం నుంచి ఉన్న టీడీపీని వీడకుండానైనా ఉండాల్సింది. ఎంతకాలం తాను ఆ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ప్రత్యర్థి యనమల రామకృష్ణుడు ఉన్నంత కాలం ఇక మంత్రి పదవి అనేది అందని ద్రాక్ష అనే నిర్థారణకు వచ్చి టీడీపీని వీడి బయటకు వచ్చేశారు. ఆ పార్టీని వీడి బయటకు వస్తే వచ్చారు, ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంచి నిర్ణయమే తీసుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. అటువంటి పార్టీని కాదనుకుని నెహ్రూ బయటకు వెళ్లి మరో తప్పటుడుగు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథిగా జిల్లాలో ఏమూలకు వెళ్లినా ప్రజలు, పార్టీ నేతలు వెన్నంటి నిలిచేవేవారు. అటు నియోజకవర్గంలో ఇటు జిల్లా అంతటా చక్రం తిప్పే పరిస్థితి. అటువంటిది తిరిగి టీడీపీకి వెళ్లాక నియోజకవర్గ నాయకుడిగానే మిగిలిపోయారు. మెట్ట ప్రాంతంలో ఏలేరు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నెహ్రూ అదే ఏలేరుకు నీరు సరఫరా చేసే పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు పిఠాపురంలో సీఎం శంకుస్థాపన కార్యక్రమంలో అందరిలో ఒకరిగా మిగిలిపోయారు. అందరికంటే చివర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే నెహ్రూ స్థాయిని ఏ రకంగా తగ్గించేశారోనని ఆ రోజే మెట్ట నేతల మధ్య గుసగుసలు వినిపించాయి. పాపం సిద్ధాంతకర్త...? నెహ్రూ పరిస్థితి ఇలా ఉండగా మంత్రి పదవి రాలేదని పార్టీ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. గోరంట్లకు మద్ధతుగా నగరపాలక సంస్థ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు రెండు రోజుల్లో రాజీనామాలకు కూడా సిద్ధపడతామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటై ఉంటుందా అని పార్టీలో చర్చ నడుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని నిరాశ చెందిన మరో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను విలేకర్లు కలిసిన సందర్భంలో ఆయన కాస్త వేదాంత «ధోరణిలో మాట్లాడినట్టుగా కనిపించింది. ‘మంత్రి పదవి ఆశిస్తాం, కానీ అధినేత పెట్టుకున్న ప్రమాణాలకు ఫిట్ అవ్వలేకపోయి ఉండవచ్చునని’ చెప్పుకు రావడం గమనార్హం. బాబు తీరుపై కొందరు బయటపడగా ... లోలోన అంతర్గతంగా గుర్రుగా ఉన్న మరికొందరు భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. నీడలా యనమల టీడీపీలో మంత్రి కాకుండా అడ్డుపడ్డ నాయకుడే తాజా మంత్రివర్గ విస్తరణలో సైతం మోకాలడ్డటంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఎంత పనిచేశాయనే నిర్వేదం తప్ప నెహ్రూ చేయగలిగిందేముంటుందని అనుచరులే సముదాయించుకుంటున్నారు. పార్టీ మారిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమైపోయారు. జిల్లా స్థాయిలో టీడీపీ కార్యక్రమాలు జరిగినా నలుగురిలో ఒకరిగానే మిగిలే వారు. ఈ రకంగా ఒక దాని వెంట మరొకటి వేసిన తప్పటడుగులు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత ఉనికినే సవాల్ చేశాయి. నెహ్రూలో ఉన్న మునుపటి పోరాట పటిమ ఇప్పుడు కూడా ఉంటాదనుకుంటే పొరపాటే. వయస్సు కూడా ఇందుకు సహకరించాలి. తాజా విస్తరణలో ఛాన్స్ వస్తేగిస్తే పూర్వపు ప్రాభవాన్ని తిరిగి పొందవచ్చునన్న నెహ్రూ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లడంతో రాజకీయ భవిష్యత్తు అంధకారమై నిర్వేదంలో ఉన్నారంటున్నారు. నెహ్రూను బుజ్జగించేందుకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఆశ పెడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ పదవులేవీ తమ నాయకుడి ప్రతిష్టను పెంచలేవనే అభిప్రాయంతో జ్యోతుల అనుచరవర్గం అభిప్రాయపడుతోంది. పదవుల పందేరంపై భగ్గుమంటున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా రాష్ట్రంలో పలువురు నేతల స్పందనలను గమనిస్తూ కిం కర్తవ్యం ఏమిటా అని నెహ్రూ అనుచరవర్గం తర్జనభర్జనపడుతోంది. -
బీకాంలో ఫిజిక్స్.. ఎంకామ్లో ఎంఫిల్
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘ఏపీ బడ్జెట్ ఎలా ఉందండీ మాస్టారూ’ అడిగాడు గోపాత్రుడు.పేపర్ చదువుతోన్న గిరీశం ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. ‘జీడీపీయో ఏదో 11.6 శాతం ఉందంట కదండీ’ మళ్లీ తానే అడిగాడు గోపాత్రుడు. ‘అవునోయ్, దేశానికే అంత లేదు. దేశం జీడీపీ 7.1 శాతమే’. ‘అదేనండీ మా సెందరబాబంటే ఏటనుకుంటున్నారు? పేకాటాడించేత్తారాయన’ అన్నాడు గోపాత్రుడు. ‘నీ అసాధ్యం సంతకెళ్లా, నువ్వు కూడా బడ్జెట్ ఫాలో అవుతున్నావేంట్రా’ అని ఆశ్చర్యంగా అడిగాడు గిరీశం. ‘అవునండీ బాబూ. మా సెందరబాబు సిఎం అయ్యాక అన్నీ ఫాలో అవుతున్నా’ అన్నాడు గోపాత్రుడు నవ్వుతూ. ‘ఒరేయ్ మరి మీ చంద్రబాబు సిఎం అయ్యాక వ్యవసాయం ఎలా ఉందిరా’ అని అడిగారు గిరీశం. ‘అంటే... అంతకుముందు కంటే తగ్గిందిలెండి’ అన్నాడు. ‘సరేలేరా అది వదిలేయ్, ఇండస్ట్రీలూ గట్రా బాగా వచ్చాయా?’ ‘అబ్బే... అయింకా రాలేదండి. కానీ వత్తాయండి. వచ్చాక బోలెడు డెవలప్మెంటూ గట్రా ఉంటాదండి’ అన్నాడు గోపాత్రుడు. ‘డిస్కంలు కూడా నష్టాల్లో ఉన్నాయట?’ అడిగాడు గిరీశం. ‘అవునండీ. ఎదవది. ఏకంగా 62 శాతం లాసండీ బాబూ’. ‘రుణమాఫీకి బడ్జెట్లో బాగా డబ్బిచ్చారా?’ అడిగాడు గిరీశం. ‘అంటే డబ్బులకి కొంచెం ఇబ్బంది కదండీ... 80వేల చిల్లర కోట్లకు గాను మూడువేల కోట్లు ఇచ్చారండి’ అన్నాడు గోపాత్రుడు. ‘పోనీ నిరుద్యోగులకు ఉద్యోగాలు బాగా వచ్చాయా?’‘ఉద్యోగాలెక్కడివండీ బాబూ. నేవు. కొత్త పరిశ్రమలు వస్తే ఉద్యోగాలొస్తాయండి’ అన్నాడు గోపాత్రుడు. ‘మరి భృతి?’ అని అడిగారు ‘అదీ నేదండీ బాబూ!’ అని అన్నాడు గోపాత్రుడు. ‘రాష్ట్రం ఆదాయం బాగా పెరిగిందేంట్రా?’ అడిగాడు గిరీశం. ‘నేదండీ బాబూ. డబ్బులకి కటకటలాడే కదా పాపం మా సెందరబాబు అప్పులు చేసుకుంటున్నారు’ అన్నాడు గోపాత్రుడు. ‘మరి ఏదీ బాగా లేనపుడు జీడీపీ 11 శాతం కంటే ఎక్కువ ఎలా వచ్చిందంటావ్?’ అని గిరీశం నవ్వుతూ అడిగాడు. గోపాత్రుడు బుర్రగోక్కున్నాడు. ఏం తట్టలేదు. ‘ఏమోనండీ బాబూ! అయన్నీ నాకెట్లా తెలుస్తాయి. మీరే చెప్పండి’ అని ఆత్రంగా అడిగాడు. గిరీశం నవ్వేసి ‘ఏం లేదురా, ఈ లెక్కలన్నీ మన జలీల్ ఖాన్ చెప్పి ఉంటారు. మ్యాథ్స్లో కూడా ఆయన జీనియస్ కదా. ఆయన లెక్కలు నీకూ నాకే కాదు ఎవ్వరికీ అర్థం కావు. ఆఖరికి మీ చెందరబాబుకి కూడా అర్థం కావు. జలీల్ఖాన్ ఏమో బీకాంలో ఫిజిక్స్ బ్యాచ్.. మీ చెందరబాబు నాయుడేమో ఎంకామ్లో ఎమ్మే, ఎంఫిల్ గట్రా ఇంకేమేం చదివేశాడో. ఇద్దరూ కలిసి యనమల రామకృష్ణుడికి ఏం లెక్కలు చెప్పేసి ఉంటారో. అందుకే జీడీపీ అలా పెరిగిపోయి ఉంటుంది’ అన్నాడు గిరీశం. గోపాత్రుడికి లీలగా అర్థం అవుతోంది. గిరీశం మాస్టారు తనని ఆట పట్టిస్తున్నారని అనుమానం వచ్చింది. - నానాయాజీ 'బీకాంలో ఫిజిక్స్'పై చంద్రబాబు ఆరా..! అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్ఖాన్ ఫిజిక్స్’ -
అన్ని వర్గాలకు న్యాయం చేశాం: చంద్రబాబు
-
హామీలకు బాబు మంగళం
నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ►కీలక రంగాలకు బడ్జెట్లో అరకొర కేటాయింపులేనా? ►రైతులకు రుణమాఫీ ఏదీ? కొత్త రుణాల జాడెక్కడ? ►డ్వాక్రా మహిళలను మోసం చేశారు ►చంద్రబాబు హయాంలో బడ్జెట్ కేటాయింపులకు అర్థమే లేదు సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు లెక్కలేనన్ని హామీలిచ్చారని, గద్దెనెక్కాక వాటి అమలు సంగతి మరచిపోయి, ప్రజలను దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకం, ఇళ్ల నిర్మాణం, ఎస్టీ, ఎస్టీల సంక్షేమం, నిరుద్యోగ భృతి వంటి కీలక అంశాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆయా రంగాలకు నిధుల కేటాయింపు తీరు దారుణంగా ఉందని విమర్శించారు. జగన్ బుధవారం సాయంత్రం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల తీరును వివరించారు. అరకొర నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే... బాబు వచ్చారు.. బంగారం వేలం వేస్తున్నారు రుణమాఫీ కోసం ఈ బడ్జెట్ రూ.3,600 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకూ మూడేళ్లలో రుణ మాఫీ పథకానికి రూ.10,600 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు ఇచ్చారని అనుకోవచ్చు. రైతుల వ్యవసాయ రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉంటే చంద్రబాబు ఏడాదికి ముష్టివేసినట్లు రూ.3,500 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినట్లు చెబుతూ రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడుతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.16,000 కోట్లు చెల్లిస్తున్నారు. వడ్డీలో పావలా వంతు భాగం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు రైతులకు పంట రుణాలు అందడం లేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. కానీ, బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ నోటీసులు ఇచ్చాయి. గతంలో వడ్డీ లేకుండా రూ.లక్ష వరకూ, పావలా వడ్డీతో రూ.3 లక్షల వరకూ రుణం లభించేది. ఇవాళ వడ్డీలేని రుణ పథకానికి కేవలం రూ.172 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ కింద ఇచ్చే రుణాలకు రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. డ్వాక్రా మహిళలపై తొలగని రుణ భారం డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు మైకులు పట్టుకుని చెప్పాడు. ఇప్పుడు దాని గురించి నోరెత్తడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. వాటిని చెల్లించవద్దని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు కాబట్టి మహిళలు చెల్లించలేదు. ఇవాళ బ్యాంకులు ఆ అప్పులపై 18 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆ వడ్డీ సంవత్సరానికి రూ.2,600 కోట్లు. మూడేళ్లలో రూ.7,500 కోట్లు ఇప్పటికే దాటిపోయింది. నాలుగో సంవత్సరం వచ్చింది కాబట్టి డ్వాక్రా మహిళలపై వడ్డీ భారమే రూ.10 వేల కోట్లు. పైగా వారికి రూ.4,900 కోట్లు అప్పు ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. మళ్లీ రూ.1,600 కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్(పెట్టుబడి నిధి) కింద ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. 2015–16 సంవత్సరానికి రూ.575 కోట్లు వడ్డీలేని రుణాలకు ఇవ్వాల్సిన వడ్డీని చంద్రబాబు ఇవ్వలేదు. 2016–17కు సంబంధించి మరో రూ.996 కోట్లు ఇవ్వలేదు. కేవలం రూ.110 కోట్లు ఖర్చుపెట్టారు. 2015 సెప్టెంబర్ నుంచి ఇంతవరకూ వడ్డీలేని రుణాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. చదువులకు మంగళం పాడాల్సిందేనా? ఫీజు రీయింబర్స్మెంట్కు బడ్జెట్లో రూ.1,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015–16లో 15,13,883 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేస్తే, ఇందులో భారీగా కోతలు విధించారు. వీరికి రూ.2,578 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ప్రభుత్వం విడుదల చేసింది రూ.1,579 కోట్లు మాత్రమే. అంటే ఈ సంవత్సరంలో బకాయిలే రూ.999 కోట్లు ఉన్నాయి. 2016–17లో 15,80191 మంది దరఖాస్తు చేస్తే ఇందులో కోతలు కోసి 14.42 లక్షల మందికి తగ్గించారు. వారికి ఇవ్వాల్సింది రూ.2,481 కోట్లయితే ఇచ్చింది మాత్రం రూ.527 కోట్లే. అంటే ఇంకా రూ.1,954 కోట్లు ఇవ్వాలి. ముగ్గులేనా.. ఇళ్లు నిర్మిస్తారా? రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు కడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఒకసారి గమనిస్తే 2014–15లో రెండు లక్షల ఇళ్లు కడతామన్నారు. కొత్తగా ఒక్క ఇల్లయినా నిర్మించలేదు. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన 5.3 లక్షల ఇళ్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. ఇళ్లు కట్టిస్తామని మూడేళ్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం 48 వేల ఇళ్లకు ముగ్గులు (మార్కింగ్) వేశామంటున్నారు. గతేడాది బడ్జెట్లో గృహాల కోసం రూ.1,321 కోట్లు కేటాయిస్తే అందులో రూ.490 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ సొమ్ములోనూ రూ.132 కోట్లు వేతనాలకే ఖర్చయ్యింది. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.1,455 కోట్లు కేటాయించగా, కేపిటల్ కింద రూ.129 కోట్లు పెట్టారు. అంటే ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో బాబుకే తెలియాలి. ఎస్సీ, ఎస్టీలపై ముఖ్యమంత్రి డాంబికాలు ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు చూస్తే తెలుస్తుంది. 2016–17లో రూ.9,457 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేశామన్నారు. అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.5,673 కోట్లే. అంటే ఖర్చు 59 శాతానికి మించలేదు. ఎస్టీలకు సంబంధించి రూ.3,435 కోట్లకుగానూ రూ.2,187 కోట్లు ఖర్చు చేశారు. అయినా వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు చంద్రబాబు డాంబికాలు పలుకుతున్నారు. ఖర్చు పెట్టకపోయినా జనం పడి ఉంటారులే! చంద్రబాబు హయాంలో బడ్జెట్ కేటాయింపులకు అర్థమే లేకుండాపోయింది. ముందుగా మాటలు చెబితే పనైపోతుంది, ఆ తరువాత ఖర్చు పెట్టినా.. పెట్టకపోయినా çప్రజలు పడి ఉంటారులే అన్నది చంద్రబాబు నైజం. పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకునేటప్పుడు కూడా మంత్రి పదవులిస్తామంటూ తొలుత ఆశలు చూపారు, ఆ తరువాత వారు ఇంకెక్కడికి పోతారు, పడి ఉంటారులే అనే ఉద్దేశంతో మాటను దాటవేస్తారు. బీసీలకు బాబు దగా బీసీల సంక్షేమం కోసం గత మూడేళ్లలో కేటాయింపుల మేరకు ఖర్చు పెట్టలేదు. 2014–15లో రూ.2,665 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.2,242 కోట్లు ఖర్చు చేశారు. 2015–16లో రూ.3,195 కోట్లకుగాను రూ.2,573 కోట్లు ఖర్చు పెట్టారు. 2016–17లో రూ.5,103 కోట్లుగాను కేవలం రూ.4,338 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చూపారు. ఇలా ప్రతి అంశంలోనూ మోసమే కనిపిస్తోంది. ముష్టి వేసినట్లుగా నిరుద్యోగ భృతి జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. జాబు వచ్చేంత వరకూ ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ మెనిఫెస్టోలో కూడా పెట్టారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇలా ఇంటికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.3,500 కోట్లు.. ఏడాదికి రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం బడ్జెట్లో ముష్టి వేసినట్లుగా కేవలం రూ.500 కోట్లు విదిల్చారు. ఆ సొమ్మును కూడా టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీల సభ్యుల పిల్లలకే ఇస్తారు. రూ.100 కోట్లతో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తారట! రాష్ట్రంలో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించబోతున్నామని, ఏపీ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రమని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక హాస్టల్కు వెళ్ళాను. అక్కడ మరుగుదొడ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. నీళ్లు లేవు. పొద్దున్నే ఎక్కడికి వెళ్తారని పిల్లలను అడిగితే చెంబులు, బాటిళ్లు పట్టుకుని కొండలు ఎక్కుతున్నామని చెప్పారు. 7.50 లక్షల మరుగుదొడ్లు కడతానని చెప్పిన చంద్రబాబు దానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు కేవలం రూ.100 కోట్లు. 7.50 లక్షల మరుగుదొడ్లు కట్టాలంటే ఒక్కొక్కటీ రూ.15 వేలు వేసుకున్నా రూ.1,050 కోట్లు కావాలి. ప్రభుత్వం ఇస్తానన్నది రూ.వంద కోట్లు. ఈ సొమ్ము ఏమూలకు సరిపోతుంది? ఎవరిని మోసం చేస్తారు? ఆరోగ్యశ్రీకి అరకొర నిధులే ఆరోగ్యశ్రీకి రాష్ట్ర బడ్జెట్లో అరకొరగా రూ.1,000 కోట్లే కేటాయించారు. గతేడాది 910 కోట్లు అడిగితే బడ్జెట్లో రూ.500 కోట్లే కేటాయించారు. ప్రకాశం జిల్లాలో మేము ధర్నాలు చేస్తే మరో రూ.262 కోట్లు ఇచ్చారు. 2015–16 కింద రూ.280 కోట్ల బకాయిలు ఉన్నాయి. 2016–17 కింద ఇంకా రూ.488 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘108’ కోసం అధికారులు రూ.75 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం ఇచ్చింది రూ.60 కోట్లు. బకాయిలు రూ.15 కోట్లు ఉన్నాయి. ‘104’కు రూ.80 కోట్లు అడిగితే రూ.37.5 కోట్లు కేటాయించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు, క్యాన్సర్ బాధితుల పరిస్థితి దారుణంగా మారింది. -
ప్రాజెక్టులు పెండింగే..
⇒ రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ⇒ కోటి ఎకరాలకు నీరందిస్తామని ప్రచారం.. ⇒ ప్రస్తుతం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కావాలంటే ఇంకా రూ.60 వేల కోట్లు కావాలి సాక్షి, అమరావతి: సాగునీటి రంగానికి తాజా బడ్జెట్లో కేవలం రూ.12,770.26 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేస్తున్న నిధులే రూ.7,665.30 కోట్లు ఉన్నాయి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల్లో కేవలం రూ.5,104.96 కోట్లను మాత్రమే సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇక మిగిలింది ఒక్క బడ్జెట్ (2018–19) మాత్రమే. ఈ లెక్కన ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో, కోటి ఎకరాలకు నీళ్లు అందేది ఎప్పుడో. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో, ప్రభుత్వ నేతలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఎలా ఉండదో బడ్జెట్ కేటాయింపుల్ని చూస్తే అర్థమవుతుంది. టీడీపీ అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తోంది. అరకొర కేటాయింపులతో కానీ నేటికీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని దుస్థితి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని.. వాటిని సత్వరమే పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్లందిస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాలుగు బడ్జెట్లు (2014–15, 2015–16, 2016–17, 2017–18) ప్రవేశపెట్టారు. గత మూడు బడ్జెట్లలో కలిపి రూ.19,468.76 కోట్లు కేటాయించారు. మరోవైపు కమీషన్ల కోసం పనులు అస్మదీయులకు అప్పగించి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేశారు. దీంతో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా సుమారు రూ.60 వేల కోట్లు అవసరమని అంచనా. నాబార్డు నుంచి అన్ని నిధులు అనుమానమే.. ప్రాజెక్టులకు 2017–18 బడ్జెట్లో 2016–17తో పోల్చితే 60 శాతం అధికంగా కేటాయించినట్లు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. వాస్తవంగా చూస్తే ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేసిన నిధులు రూ.7,665.30 కోట్లు. అయితే దేశంలోని పోలవరం సహా వంద ప్రాజెక్టులను పీఎంకేఎస్వై (ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన) కింద పూర్తి చేసేందుకు నాబార్డు నుంచి రుణం మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. పీఎంకేఎస్వైకి రుణం మంజూరు చేసేందుకు వీలుగా ఎల్టీఐఎఫ్ (దీర్ఘకాలిక నీటిపారుదల నిధి) కింద రూ.40 వేల కోట్లను నాబార్డుకు మంజూరు చేస్తామని 2017–18 బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ఈ రూ.40 వేల కోట్లలో ఒక్క మన రాష్ట్రానికే రూ.7,665.30 కోట్ల రుణాన్ని నాబార్డు మంజూరు చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల నుంచి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,931.54 కోట్లను విడుదల చేస్తే.. ఇందులో గతేడాది డిసెంబర్ 26న నాబార్డు ఇచ్చిన రుణం రూ.1,981.54 కోట్లు కావడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే నాబార్డు నుంచి రూ.7,665.30 కోట్ల రుణం మంజూరయ్యే అవకాశాలు తక్కువేనని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు ఇవ్వకుంటే అంతే.. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం) కింద గుండ్లకమ్మ, తాడిపూడి, పుష్కర, తారకరామతీర్థ సాగరం, ముసురుమిల్లి, ఎర్రకాల్వ, మద్దిగెడ్డ తోటపల్లి ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల్లో అధికశాతం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. గతేడాది ఏఐబీపీని కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో పీఎంకేఎస్వై పథకాన్ని ప్రారంభించింది. 2017–18లో ఆ ఎనిమిది ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని అమాంతంగా పెంచేసింది. ఎనిమిది ప్రాజెక్టులకు కేంద్రం వాటా కింద రూ.785.30 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఇప్పటిదాకా ఆమోదముద్ర వేయలేదు. కానీ ప్రభుత్వం ఆ ఎనిమిది ప్రాజెక్టులకు నాబార్డు రుణం పేరిట నిధులు కేటాయించింది. ఒకవేళ నాబార్డు రుణం ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. కేవలం రూ.154 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి.. ఆరు లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉండేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పనా? ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేసేందుకు రూ.1,638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టినట్లు సర్కార్ ప్రకటించింది. తొమ్మిది నెలల్లోగా ఈ ఎత్తిపోతలను పూర్తి చేసి పోలవరం ఎడమ కాలువ కింద 2.15 లక్షల ఎకరాలకు 2017 ఖరీఫ్లో నీళ్లందిస్తామని హామీ ఇచ్చింది. కానీ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేవలం రూ.2 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. హంద్రీ–నీవా, గాలేరు–నగరి తొలి దశ, గుండ్లకమ్మ, వంశధార రెండో దశ, పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి 2017 ఖరీఫ్లో 8.86 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని బడ్జెట్లో పేర్కొంది. కానీ ఆ మేరకు నిధులు కేటాయించలేదు. కమీషన్ల కోసం హంద్రీ–నీవా అంచనా వ్యయం రూ.6,850 కోట్ల నుంచి రూ.11,722 కోట్లకు పెంచేసిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.1,900 కోట్లకుపైగా అవసరం. కానీ.. బడ్జెట్లో కేవలం రూ.479.20 కోట్లను కేటాయించారు. గాలేరు–నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), వెలిగొండ, సోమశిల, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులదీ ఇదే దుస్థితి. ఎన్నికల హామీ: డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ హామీని పక్కన పెట్టారు. ప్రతి మహిళకు పది వేల చొప్పున మూడు విడతలుగా పెట్టుబడి నిధిగా ఇస్తామన్నారు. ⇒ డ్వాక్రా రుణమాఫీకి చేయడానికి 14,204 కోట్లు కేటాయించాల్సి ఉంది. ⇒ రూ. 14,360 కోట్లు మేర సంఘాల జీరో వడ్డీ డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. -
డిస్కమ్లకు ‘అర’కొర..
- కోరిన సబ్సిడీ రూ. 6822 కోట్లు - ఇచ్చింది మాత్రం రూ. 3300 కోట్లు - ప్రజలపై భారీగా చార్జీల మోత సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలకు బడ్జెట్లో సర్కారు మొండిచేయి చూపింది. ఫలితంగా భారీగా విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను ప్రభుత్వం ప్రోత్సహించింది. దీనివల్ల 2017–18లో రూ. 7,922 కోట్ల మేర ఆర్థిక లోటు ఏర్పడుతుందని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. విద్యుత్ చార్జీల రూపంలో రూ. 1,100 కోట్లు సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. మిగిలిన రూ. 6,822 కోట్లు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయితే తాజా బడ్జెట్లో కేవలం రూ. 3,300 కోట్లు ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుంది. దీనివల్ల డిస్కమ్లు మరో రూ. 4,622 కోట్లు (రూ. 3522 కోట్లు +రూ. 1100 కోట్లు) సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రభుత్వం సబ్సిడీలో భారీగా కోత పెట్టడం వల్ల ప్రజలపై ఆ మేరకు భారం వేయకతప్పదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం 10 వేల మిలియన్ యూనిట్ల మిగులులో కేవలం 2 వేల మిలియన్ యూనిట్లు మాత్రమే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని డిస్కమ్లు ఏపీఈఆర్సీకి తెలిపాయి. మిగలిన 8 వేల మిలియన్ యూనిట్లను ఏపీ జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయడమే మార్గమని పేర్కొన్నాయి. కొనుగోలు విద్యుత్ వల్ల యూనిట్ ధర గరిష్టంగా రూ. 5లు ఉంటుందని, ఇవన్నీ ఆర్థిక లోటు పెరగడానికి కారణాలుగా డిస్కమ్లు చెబుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఇప్పటికే విద్యుత్« ధర యూనిట్ రూ. 2లోపే ఉంది. ఈ కారణంగా కొన్ని పరిశ్రమలు, రైల్వే విభాగం ఓపెన్ యాక్సెస్కు వెళ్లాయి. ఈ రకంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సబ్సిడీ భారం ఆశించినంత ఇవ్వకపోవడంతో ప్రజలపై భారం పడే వీలుంది. సర్కారుది మోసమే: వేణుగోపాల్ రావు విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 3,300 కోట్ల సబ్సిడీనే బడ్జెట్లో కేటాయించడం దారుణమని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం వేణుగోపాల రావు వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై భారీగా విద్యుత్ భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒత్తిడి చేసిందని, అయినవారి జేబులు నింపడమే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని ఆయన అన్నారు. పెద్దలకు దోచిపెట్టి, పేదలపై భారం మోపే ప్రభుత్వ ప్రయత్నం మోసపూరితమని ఆయన విమర్శించారు. -
రూ.43 వేలకు పెరగనున్న తలసరి అప్పు
2017–18 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ.2,16,026.59 కోట్లు సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. చేస్తున్న అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించకపోవడంతో రాష్ట్ర ప్రజానీకంపై అప్పుల భారం పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల అప్పు ప్రకారం తలసరి అప్పు రూ.38,597 కాగా 2017–18లో చేసే అప్పులతో తలసరి అప్పు రూ.43,205కు పెరగనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరం మార్చికి రాష్ట్ర అప్పు రూ.2,16,026.59 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఈ అప్పులో రూ.33,477.52 కోట్లు తెలంగాణ, ఏపీ మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర అప్పుల మొత్తం రూ.1,92,983.97 కోట్లుగా పేర్కొన్నారు. అంటే 2017–18 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి కొత్తగా రూ.23,042.62 కోట్ల అప్పు చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. -
కాశీపట్నం చూడర బాబు
రుణమాఫీతో ఆనందంగా ఉన్న రైతన్నను చూడు సంతోషంతో గంతులేస్తున్న డ్వాక్రా మహిళలను చూడు.. బంగారం ఇంటికి తెచ్చుకున్న అక్కచెల్లెమ్మలను చూడు.. రెండువేలు అందుకుంటున్న నిరుద్యోగ తమ్ముళ్లను చూడు.. ఇదీ.. ఈ రకంగా సాగింది నారావారి నాలుగో బడ్జెట్ విన్యాసం కానీ వాస్తవానికి వీటిలో ఏ ఒక్కటీ జరగలేదు.. అన్నీ బడాయి కబుర్లే హామీలలో ఒక్కటీ అమలు చేయలేదు.. రాజధాని అడుగు ముందుకు పడలేదు యనమలవారి బడ్జెట్ ప్రసంగం అంతా గారడి మాటలతో చేసిన విచిత్రమైన విన్యాసాలే.. అంకెలకు వాస్తవానికి పొంతనే లేదు.. బడాయి కబుర్లు.. బాబుగారికి వీరతాళ్లు.. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇచ్చిన హామీలన్నిటికీ చంద్రబాబు బడ్జెట్ సాక్షిగా మరోమారు మంగళం పలికారు. రైతులను, డ్వాక్రా మహిళా సంఘాలను యథాప్రకారం మళ్లీ మోసం చేశారు. వడ్డీలకే చాలని అరకొర విదిలింపులతో ఉసూరనిపించారు. నాలుగో బడ్జెట్లోనైనా కనికరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పటివరకు రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలనెలా రూ. 3,500 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. మూడేళ్లు గడచినా... నాలుగు బడ్జెట్లు నడిచినా... వారికి ఒరిగింది శూన్యం. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం పేరుతో ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు విదిలించారు. వాటితో ఎంత మంది నిరుద్యోగులకు ఎంత భృతి ఇస్తారో వారికే ఎరుక. చేనేత కార్మికులకు వెయ్యి కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామనే హామీని కూడా బాబు సర్కారు విస్మరించింది. ఆర్యోగ శ్రీకి అరకొర కేటాయింపులే చేశారు. వికలాంగులు, వృద్ధులు, వితంతు పింఛన్లదీ అదే పరిస్థితి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీకి ఈ బడ్జెట్లోను మంగళం పలికారు. గత మూడు బడ్జెట్లలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఈ బడ్జెట్లో కూడా అదే అదే మొండిచేయి చూపిం చారు. ఏడు లక్షల బాత్రూమ్లు నిర్మించనున్నామని ఘనంగా ప్రకటించారు. అందుకు రూ.1,050 కోట్లు అవసరమైతే రూ.100 కోట్లు కేటాయించారు. అదీ పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్కి అర్హులైన విద్యార్థుల సంఖ్యను దారుణంగా కోతవేస్తున్న ప్రభుత్వం.. ఆ కొద్దిమందికి కూడా అవసరమైనన్ని నిధులు విడుదల చేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నది. ఈ బడ్జెట్లోనూ అదే కొనసాగింది. కొన్ని రంగాలకు అంకెలు ఘనంగా కనిపిస్తున్నప్పటికీ వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే స్పష్టత లేదు. దాంతో ఇవన్నీ కాగితాలకే పరిమితమని రాష్ట్రప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. స్థూలంగా చూస్తే... కబుర్లు కోటలుదాటాయి.. కాళ్లు పాతాళంలోనే ఉన్నాయి.... అదీ చంద్రబాబు నాలుగో బడ్జెట్ తీరు... -
విజన్ 2029 సాకారమే లక్ష్యం
రూ.1.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల సాక్షి, అమరావతి: సవాళ్లను అధిగమించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం ద్వారా విజన్ 2029ను సాకారం చేసేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అంతర్జాతీయ, దేశీయ, స్థానిక పరిణామాలకు అనుగుణంగా పాలనా విధానాలను సవరించుకుంటూ, సంస్కరణలు చేపట్టడం ద్వారానే ఆశించిన భవిష్యత్ను సాధించుకోగలుగుతామన్నారు. సమర్థంగా ఆదాయ వనరులను సమీకరించడం, ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తామన్నారు. 2017 – 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,56,999.40 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను బుధవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. 2016 – 17తో పోల్చితే ఈ బడ్జెట్ అంచనాలు 15.70 శాతం ఎక్కువ అని చెప్పారు. 2016 – 17 బడ్జెట్ కేటాయింపులను ఆంగ్లంలో చదివిన యనమల ఈ పర్యాయం మాత్రం తడబడుతూ, సరిదిద్దుకుంటూ తెలుగులో 46 పేజీల బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి చేశారు. భవిష్యత్తులో పెరగనున్న ఆదాయం ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రానుందని యనమల పేర్కొన్నారు. ‘దీర్ఘకాలంలో ఈ విధానం వల్ల రాష్ట్రాల ఆదాయం పెరగనుంది. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా ప్రైవేట్ రంగానికి చెందిన వనరులను కూడా సమీకరించుకోవడానికి అనువుగా ఆర్థిక విధానాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు, విదేశీ పథకాల ద్వారా అందుతున్న నిధులన్నింటినీ పోగుచేసి జీవన ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నాం. నైపుణ్య పెంపు, శిక్షణతో ఉద్యోగావకాశాలు మెరుగుపర్చడం ద్వారా ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం పొందేలా చూడట మే ఈ ప్రయత్నాల అంతిమ లక్ష్యం’ అని పేర్కొన్నారు. ఇక రెవెన్యూ – క్యాపిటల్... ఇప్పటిదాకా బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర విభాగాలు ఉన్నాయని, ఇప్పుడు బడ్జెట్ను రెవెన్యూ వ్యయం, క్యాపిటల్ వ్యయంగా వర్గీకరించామని యనమల చెప్పారు. ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు.. ♦ విజన్ 2029 ప్రకారం ప్రతి ఏటా 12 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ♦ వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,091 కోట్లు , గ్రామీణాభివృద్ధికి రూ.19,565 కోట్లు కేటాయించాం. ♦ వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా ఎనిమిది మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు నెలకొల్పడానికి ప్రయత్నాలు. ♦ రాష్ట్రంలో మరో 7 ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లష్టర్లు ♦ వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న భూమిలేని నిరుపేద దళిత మహిళలకు వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అందించే పథకం పునరుద్ధరణ. ఈ పథకం కింద యూ నిట్ ధర ఎకరానికి రూ.15 లక్షలదాకా పెంచడంతోపాటు 75% సబ్సిడీ, వడ్డీ నిమిత్తం ఆర్థిక సాయం. ♦ ఎస్సీల గృహాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత విద్యుత్తును 50 యూనిట్ల నుంచి 75 యూనిట్లకు పెంపు. ♦ తోటపల్లి, గాలేరు నగరి సుజల స్రవంతి మొదటి దశ, హంద్రీ–నీవా సుజల స్రవంతి, వంశధార రెండో దశ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 2018 నాటికి పూర్తి. ♦ త్వరలోనే రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు ప్రారంభం. ♦ ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే కొత్త ఎక్సైజ్ విధానానికి సవరణలు. ♦ రానున్న రెండేళ్లలో పది లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం. ప్రత్యేక హోదా లేదు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని ఆర్థిక మంత్రి యనమల తేల్చి చెప్పారు. గతంలో టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి చెప్పినట్లే యనమల కూడా నెపాన్ని 14వ ఆర్థిక సంఘంపైకే నెట్టేశారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయం హామీని పొందగలిగాం. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం..’ అని యనమల పేర్కొన్నారు. రూ.18,214 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ సాక్షి, అమరావతి: రైతు సంక్షేమం–లాభసాటి వ్యవసాయం పేరిట 2017–18 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో రూ.18,214 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో రుణమాఫీ పథకానికి రూ.3,600 కోట్లు, రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.3,300 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.6,040 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్తిపాటి ప్రవేశపెట్టిన నాలుగో వ్యవసాయ బడ్జెట్ (నూతన అసెంబ్లీలో తొలి బడ్జెట్)లో రైతన్న జీవితాలను స్వర్ణమయం చేయడమే ఆశయంగా ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.5,525 కోట్లను ప్రతిపాదించగా ఇందులో ప్రణాళిక వ్యయం రూ.1,170 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.4,355 కోట్లుగా ఉంది. -
ఆహా... ఏమి మోసం!
బడ్జెట్ మాయాజాలంపై ప్రతిపక్ష నేత జగన్ ధ్వజం ► ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం బడ్జెట్లో కనిపించలేదు ► ప్రభుత్వ లెక్కలన్నీ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి ► 11.6 వృద్ధి రేటుతో ఏపీ నం.1స్థానంలో ఉంటే కొత్త లక్ష్యాలెందుకు? ► ప్రత్యేక హోదాపై గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారు ► ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జీఎస్డీపీలో 5.12% అప్పులు తెచ్చారు ► రుణమాఫీపై రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారు ► ఫీజు రీయింబర్స్మెంట్, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీకి అరకొర నిధులేనా? సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017–18 వార్షిక బడ్జెట్ మొత్తం మోసాలమయం, లెక్కల మాయాజాల మేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఈ బడ్జెట్లో కనిపించ లేదని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం సాయం త్రం విజయవాడలోని ఆర్అండ్బి అతిథిగృహంలో శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో డొల్లతనాన్ని తూర్పారబట్టారు. బడ్జెట్ లో ప్రభుత్వం చూపిన లెక్కలన్నీ రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయన్నారు. బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసినట్లుగా చూపుతున్న ప్రభుత్వ వ్యయానికి వచ్చేటప్పటికి కుదిస్తోందన్నారు. జీడీపీ పెరుగుదల విషయంలో సీఎం అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో జగన్ ఇంకా ఏం చెప్పారంటే... మనం ప్రపంచంలోనే నంబర్ వన్! ‘‘బడ్జెట్లోని ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఏపీ ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11.6 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైందని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి నమోదైతే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగు™ øందని చెప్పవచ్చు. ఒకవేళ ఆ అభివృద్ధి కనుపిం చకపోతే రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్లు లెక్క. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బాబు చెప్పారు. 2022 నాటికి ఏపీ దేశంలోనే ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం కానుందని అంటు న్నారు. 2019 నాటికి ఇలా అవుతుంది, 2050 నాటికి రాష్ట్రం అలా అయిపోతుందని లక్ష్యాలు పెట్టుకుంటు న్నారు. కానీ, ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా సగటు జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంగా ఉంది. ఇక భారతదేశ జీడీపీ 7.1 శాతంగా నమోదైందని ఐఎంఎఫ్ పేర్కొంది. దేశ జీడీపీ 7.1 శాతంగా ఉండగా, సీఎం చెబుతున్నట్లు ఏపీలో 11.6 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉంటే ప్రపంచంలో మనం ఇప్పటికే నంబర్ వన్ స్థానంలో ఉన్నామన్న మాట. మరి అలాంటప్పుడు 2022, 2029, 2050 నాటికి రాష్ట్రం నంబర్ 1 స్థానానికి చేరుతుందని చంద్రబాబు కొత్తగా లక్ష్యాలను నిర్దేశించడం ఏమిటి? హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు 14వ ఆర్థిక సంఘం నిలిపివేసింది కాబట్టే రాష్ట్రానికి హోదా రావడం లేదని బడ్జెట్లో చెప్పారు. అందుకు సమానమైన ప్రత్యేక సాయాన్ని పొందగలిగామని పేర్కొన్నారు. హోదా ఇవ్వాలని గానీ, ఇవ్వొద్దని గానీ చెప్పడం తమ పరిధిలో లేదని, అలాంటి సిఫార్సులు తాము ఎప్పుడూ చేయలేదని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డితోపాటు సభ్యులు అభిజిత్ సేన్, గోవిందరావు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు వారు ఇచ్చిన లేఖలను నేను యువభేరీ సభల్లో ఎన్నోసార్లు చూపించాను. కానీ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన పడుతున్న పాట్లు చూస్తుంటే నిజంగా బాధేస్తోంది. నష్టాలు పెరిగితే అవార్డులొచ్చాయా? ఏపీలో ఉన్న ఎస్పీడీసీఎల్(దక్షిణ), ఈపీడీసీఎల్ (తూర్పు) విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఐదు అవార్డులు వచ్చినట్లు సీఎం ఘనంగా చెప్పుకున్నారు. వాస్తవాలను పరిశీలిస్తే 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు సంస్థలూ రూ.2,394 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు సంస్థలకూ కలిపి నష్టాలు రూ.3,899 కోట్లకు పెరిగాయి. మరి నష్టాలు 62.72 శాతం పెరిగితే అవార్డులు వస్తాయా! ఇక క్రిసిల్ రేటింగ్లు చూస్తే ఒక డిస్కం రేటింగ్ బీ ప్లస్ నుంచి బీకి పడిపోయింది. మరో డిస్కంకు మాత్రం ఉన్న రేటింగే కొనసాగింది. డిస్కంల రేటింగ్లు తగ్గి, నష్టాలు పెరిగితే ఐదు అవార్డులు ఎలా వస్తాయి? బడ్జెట్ ఉమ్మడిని మించిపోయిందా! ఏపీ బడ్జెట్ పరిమాణం రూ.1,56,999 కోట్లుగా ఉం ది. విభజనకు ముందు ఉమ్మడి ఏపీ బడ్జెట్ రూ.1,40,742 కోట్లుగా ఉండేది. ఈ ఆర్థిక సంవత్స రంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బడ్జెట్లు కలిపి రూ.3.05 కోట్ల మొత్తానికి పైగానే ఉన్నాయి. అంటే విభజన జరిగి మూడేళ్లు కూడా దాటక ముందే కేవలం ఏపీ బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రం బడ్జెట్ను దాటేసింది. తెలంగాణ బడ్జెట్ కూడా ఉమ్మడి బడ్జెట్ను దాటింది. ఏపీ పరిస్థితి అంత గొప్పగా ఉందా? అని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రచారంలో నిజం లేదని తెలుస్తుంది. అప్పుల కుప్పను చూపరేం! 2016–17 బడ్జెట్ రూ.1,35,688 కోట్లు ఉంటే, అందులో రూ.1,16,812 కోట్లు ఖర్చు చేసినట్లు చూపారు. అయితే, అప్పులు తెచ్చుకున్న విషయం ఎక్కడా చూపలేదు. గత డిసెంబర్ నాటికి రూ.30,953 కోట్ల అప్పులు తెచ్చుకున్నట్లు ‘కాగ్’ నివేదిక పేర్కొంది. ఎఫ్ఆర్బీఎఫ్ నిబంధనల ప్రకారం మొత్తం జీఎస్డీపీలో 3 శాతం కంటే ఎక్కువ అప్పులు తెచ్చుకోవడం వీలు కాదు. అంటే ఏపీ అప్పులు రూ.20,497 కోట్ల కంటే ఎట్టి పరిస్థితుల్లో మించకూడదు. కానీ, బాబు సర్కారు మాత్రం 2016 డిసెంబర్ నాటికే 5.12 శాతం అప్పు తెచ్చుకుంది. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం. ఇక అత్తగారి సొత్తు అన్నట్లుగా పింఛనుదారుల డబ్బును ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. పడిపోయిన పంటల దిగుబడి ఒక్క ఏడాదిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి, 2015–16 ఆర్థిక సంవత్సరంలో 8 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించడం ద్వారా 8 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటకు నీరందించామని బడ్జెట్లో పేర్కొన్నారు. రూ.2,500 కోట్ల విలువగల దిగుబడి సాధించామన్నారు. ప్రస్తుతం 56 టీఎంసీల నీటిని ఖరీఫ్ సాగుకు మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలోనే 10.6 లక్షల ఎకరాల పంటను కాపాడగలిగామన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేను గమనిస్తే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008–09లో 42.70 లక్షల హెక్టార్లలో పంటలు వేసి 1,66,016 టన్నుల దిగుబడిని రాష్ట్రం సాధించింది. 2014–15లో 41.36 లక్షల హెక్టార్లలో పంటలు వేసి 1.43 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. అదే విధంగా 2016–17లో 41.34 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తే 1.56 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్లు టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత విస్తీర్ణంతోపాటు పంటల దిగుబడి కూడా తగ్గింది. మరో నివేదిక ప్రకారం స్థూలంగా సాగయిన భూమిని చూస్తే 2013–14లో 40.96 లక్షల హెక్టార్లు ఉంటే 2014–15లో అది 38.86 లక్షల హెక్టార్లకు పడిపోయింది. 2015–16లో 35.47 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అదే నెట్ ఇరిగేటెడ్ ఏరియాను చూస్తే 2013–14లో 30.14 లక్షల హెక్టార్లు కాగా, 2014–15లో 29.27 లక్షల హెక్టార్లు, 2015–16లో పట్టిసీమ నుంచి నీటిని కృష్ణాలో కలిపామని ప్రభుత్వం చెప్పుకుంటున్న తర్వాత కూడా 27.43 లక్షల హెక్టార్లకు పడిపోయింది. పులిచింతలకు రూ.127 కోట్లిస్తే చాలు... పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.136.45 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించి, 42 టీఎంసీల నీటిని తీసుకొస్తే, ప్రకాశం బ్యారేజీ నుంచి 55 టీఎంసీల నీటిని సముద్రంలోకి పంపించారు. పక్కనే ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు రూ.127 కోట్లు కడితే చాలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామాలను ఖాళీ చేయిస్తామని తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా అడుగుతోంది. ఆ డబ్బు కడితే పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలను నిలువ చేసుకోవచ్చు. అదే కనుక జరిగి ఉంటే ఇవాళ కృష్ణా డెల్టా ఎండిపోయే పరిస్థితే వచ్చేది కాదు. ఇదీ చంద్రబాబుకున్న గొప్ప విజన్ (దార్శనికత). బాబు వచ్చారు.. బంగారం వేలం వేస్తున్నారు రుణమాఫీ కోసం ఈ బడ్జెట్ రూ.3,600 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకూ మూడేళ్లలో రుణ మాఫీ పథకానికి రూ.10,600 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు ఇచ్చారని అనుకోవచ్చు. రైతుల వ్యవసాయ రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉంటే చంద్రబాబు ఏడాదికి ముష్టివేసినట్లు రూ.3,500 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినట్లు చెబుతూ రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్స్ పెడుతున్నారు. రైతులు ప్రతి సంవత్స రం వడ్డీ కింద రూ.16,000 కోట్లు చెల్లిస్తున్నారు. వడ్డీలో పావలా వంతు భాగం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు రైతులకు పంట రుణాలు అందడం లేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. కానీ, బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ నోటీసులు ఇచ్చాయి. గతంలో వడ్డీ లేకుండా రూ.లక్ష వరకూ, పావలా వడ్డీతో రూ.3 లక్షల రుణం లభించేది. ఇవాళ వడ్డీలేని రుణ పథకానికి కేవలం రూ.172 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ కింద ఇచ్చే రుణాలకు రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. డ్వాక్రా మహిళలపై తొలగని రుణ భారం డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు మైకులు పట్టుకుని చెప్పాడు. ఇప్పుడు దాని గురించి నోరెత్తడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. వాటిని చెల్లించవద్దని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు కాబట్టి మహిళలు చెల్లించలేదు. ఇవాళ బ్యాంకులు ఆ అప్పులపై 18 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆ వడ్డీ సంవత్సరానికి రూ.2,600 కోట్లు. మూడేళ్లలో రూ.7,500 కోట్లు ఇప్పటికే దాటిపోయింది. నాలుగో సంవత్సరం వచ్చింది కాబట్టి డ్వాక్రా మహిళలపై వడ్డీ భారమే రూ.10 వేల కోట్లు. పైగా వారికి రూ.4,900 కోట్లు అప్పు ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. మళ్లీ రూ.1,600 కోట్లు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్(పెట్టుబడి నిధి) కింద ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. చదువులకు మంగళం పాడాల్సిందేనా? ఫీజు రీయింబర్స్మెంట్కు బడ్జెట్లో రూ.1,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015–16లో 15,13,883 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేస్తే, ఇందులో భారీగా కోతలు విధించారు. వీరికి రూ.2,578 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ప్రభుత్వం విడుదల చేసింది రూ.1,579 కోట్లు మాత్రమే. అంటే ఈ సంవత్సరంలో బకాయిలే రూ.999 కోట్లు ఉన్నాయి. 2016–17లో 15,80191 మంది దరఖాస్తు చేస్తే 14.42 లక్షల మందికి తగ్గించారు. వారికి ఇవ్వాల్సింది రూ.2,481 కోట్లయితే ఇచ్చింది మాత్రం రూ.527 కోట్లే. అంటే ఇంకా రూ.1,954 కోట్లు ఇవ్వాలి. 100 కోట్లతో 7.50 లక్షల మరుగుదొడ్లా..! రాష్ట్రంలో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించబోతున్నా మని, ఏపీ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రమని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక హాస్టల్కు వెళ్ళాను. అక్కడ మరుగుదొడ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. నీళ్లు లేవు. పొద్దున్నే ఎక్కడికి వెళ్తారని పిల్లలను అడిగితే చెంబులు, బాటిళ్లు పట్టుకుని కొండలు ఎక్కుతున్నామని చెప్పారు. 7.50 లక్షల మరుగుదొడ్లు కడతానని చెప్పిన చంద్రబాబు దానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు కేవలం రూ.100 కోట్లు. 7.50 లక్షల మరుగుదొడ్లు కట్టాలంటే ఒక్కొక్కటీ రూ.15 వేలు వేసుకున్నా రూ.1,050 కోట్లు కావాలి. ముగ్గులేనా.. ఇళ్లు నిర్మిస్తారా? రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు కడతామని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఇళ్లు కట్టిస్తామని మూడేళ్లు గా చెబుతున్నారు. ప్రస్తుతం 48 వేల ఇళ్లకు ముగ్గులు (మార్కింగ్) వేశామంటున్నారు. గతేడాది బడ్జెట్లో గృహాలకు రూ.1,321 కోట్లు కేటాయిస్తే రూ.490 కోట్లే ఖర్చు చేశారు. ఈ సొమ్ములోనూ రూ.132 కోట్లు వేతనాలకే ఖర్చయ్యింది. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.1,455 కోట్లు కేటాయించగా, కేపిటల్ కింద రూ.129 కోట్లు పెట్టారు. అంటే ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో బాబుకే తెలియాలి. ఎస్సీ, ఎస్టీలపై ముఖ్యమంత్రి డాంబికాలు ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు చూస్తే తెలుస్తుంది. 2016–17లో రూ.9,457 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేశామన్నారు. అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.5,673 కోట్లే. అంటే ఖర్చు 59 శాతానికి మించలేదు. ఎస్టీలకు సంబంధించి రూ.3,435 కోట్లకుగానూ రూ.2,187 కోట్లు ఖర్చు చేశారు. ఖర్చు పెట్టకపోయినా జనం పడి ఉంటారులే! చంద్రబాబు హయాంలో బడ్జెట్ కేటాయింపులకు అర్థమే లేకుండాపోయింది. ముందుగా మాటలు చెబితే పనైపోతుంది, ఆ తరువాత ఖర్చు పెట్టినా.. పెట్టకపోయినా ప్రజలు పడి ఉంటారులే అన్నది బాబు నైజం. పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకునేట ప్పుడు మంత్రి పదవులిస్తామంటూ తొలుత ఆశలు చూపారు, ఆ తర్వాత వారు ఇంకెక్కడికి పోతారు, పడి ఉంటారులే అనే ఉద్దేశంతో మాటను దాటవేస్తారు. బీసీలకు బాబు దగా బీసీల సంక్షేమం కోసం గత మూడేళ్లలో కేటాయింపుల మేరకు ఖర్చు పెట్టలేదు. 2014–15లో రూ.2,665 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.2,242 కోట్లు ఖర్చు చేశారు. 2015–16లో రూ.3,195 కోట్లకుగాను రూ.2,573 కోట్లు ఖర్చు పెట్టారు. 2016–17లో రూ.5,103 కోట్లకు గాను కేవలం రూ.4,338 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చూపారు. ఇలా ప్రతి అంశంలోనూ మోసమే కనిపిస్తోంది. ముష్టి వేసినట్లుగా నిరుద్యోగ భృతి జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. జాబు వచ్చేంత వరకూ ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ మెనిఫెస్టోలో కూడా పెట్టారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇలా ఇంటికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.3,500 కోట్లు.. ఏడాదికి రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం బడ్జెట్లో ముష్టి వేసినట్లుగా కేవలం రూ.500 కోట్లు విదిల్చారు. ఆరోగ్యశ్రీకి అరకొర నిధులే ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో అరకొరగా రూ.1,000 కోట్లే కేటాయించారు. గతేడాది 910 కోట్లు అడిగితే బడ్జెట్లో రూ.500 కోట్లే కేటాయించారు. ప్రకాశం జిల్లాలో మేము ధర్నాలు చేస్తే మరో రూ.262 కోట్లు ఇచ్చారు. 2015–16 కింద రూ.280 కోట్ల బకాయిలు ఉన్నాయి. 2016–17 కింద ఇంకా రూ.488 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘108’ కోసం అధికారులు రూ.75 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం ఇచ్చింది రూ.60 కోట్లు. బకాయిలు రూ.15 కోట్లు ఉన్నాయి. ‘104’కు రూ.80 కోట్లు అడిగితే రూ.37.5 కోట్లు కేటాయించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం అందించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ బాధితుల పరిస్థితి దారుణంగా తయారైంది. పవన్ కల్యాణే కాదు... ఎవరినైనా కలుపుకుపోతాం.. పవన్ కల్యాణ్ గురించి విలేకరులు ప్రస్తావించగా జగన్ స్పందిస్తూ.... ‘‘ప్రస్తుతం పవన్ పరిస్థితి చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్(కూర్చొమ్మంటే కూర్చుం టాడు, నిల్చోమంటే నిల్చుంటాడు) అనే విధంగా ఉంది. ముందు ఆయన ఆ పరిస్థితు ల్లో నుంచి బయటపడాలని కోరుకుంటు న్నాను. చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయా లపై పోరాడడానికి ఎవరు ముందుకొచ్చినా ఆప్యాయంగా ఆహ్వానిస్తాం. కలుపుకునే కార్యక్రమం చేస్తాం’’ అని స్పష్టం చేశారు. -
అన్ని వర్గాలకు న్యాయం చేశాం: చంద్రబాబు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017-18)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ సమతూకంగా ఉందని, అన్ని వర్గాలకు న్యాయం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేశామని, నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు ఇచ్చామని తెలిపారు. మంజునాథ్ కమిషన్ నివేదిక రాగానే కాపులకు రిజర్వేషన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అలాగే బీసీ సబ్ ప్లాన్కు రూ.10వేల కోట్లు ఇచ్చామని, వచ్చే రెండేళ్లలో పది లక్షల ఇళ్లు కట్టిస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగం 14 శాతం వృద్ధి సాధించిందని చంద్రబాబు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,56,999 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
ఏపీ బడ్జెట్ హైలైట్స్ 2017-18 పార్ట్-2
-
బడ్జెట్లో హోదాపై తేల్చేసిన యనమల!
-
ఏపీ బడ్జెట్ హైలైట్స్ 2017-18
-
బడ్జెట్లో హోదాపై తేల్చేసిన యనమల!
విజయవాడ: 'రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాం. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము' ఇది ఏపీ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, హక్కు అయిన ప్రత్యేక హోదాను వదులుకున్నట్టు ఆయన ఈ ప్రసంగం ద్వారా చెప్పకనే చెప్పేశారు. ప్రత్యేక హోదా కోసం ఓ వైపు ప్రజలు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ.. హోదాను వదిలేసి ప్యాకేజీ కోసం పాకులాడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో యనమల ప్రకటన చేయడం విమర్శలకు తావిస్తున్నది. రెండు నెలల కిందట ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా విశాఖలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఆ పార్టీ నేతలను విమానాశ్రయంలోనే నిరంకుశంగా బధించి.. అనంతరం హైదరాబాద్కు చంద్రబాబు సర్కారు తిప్పి పంపింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం మరో దఫా పోరాటం కోసం వైఎస్ఆర్సీపీ, ప్రజలు సిద్ధమవుతుండగా.. హోదా లేదంటూ యనమల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం ఏపీ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. -
ప్రపంచస్థాయి రాజధాని లక్ష్యం: యనమల
విజయవాడ: దేశంలోనే ఆంధప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ను బుధవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే రాజధానిని అమరావతికి తరలించామని తెలిపారు. 9 రంగాల ఆధారంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలన్నదే మన ప్రయత్నం ఒకవైపు ప్రాచీన సంస్కృతిలో వేళ్లూనికొని.. మరోవైపు ప్రపంచస్థాయి ఆకాంక్షలకు రాజధాని అద్దం పట్టాలి. మన రాజధాని నగరం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలబడనుంది 9 రంగాల ఆధారంగా రాజధాని నిర్మాణం రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటు లాంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. గత రెండున్నరేళ్లకాలంలో వివిధ ప్రమాణాల ప్రకారం మనం గొప్ప పురోగతి సాధించాం రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం రాష్ట్ర రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు 192 రోజుల్లోనే నూతన శాసనసభ భవనాన్ని నిర్మించుకోగలిగాం ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశాం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టేదిశగా కదులుతున్నాం ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ సాధించాం విజన్ 2029 నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది మా ప్రభుత్వం జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలు గెలుచుకుంది శక్తి, ఇంధన రంగాల్లో రాష్ట్రానికి ఐదు పురస్కారాలు దక్కాయి 1-7-2017 నుంచి జీఎస్టీన ప్రవేశపెట్టబోతున్నాం అన్ని రకాల పన్నులను జీఎస్టీ ద్వారా వసూలు చేయడం(పెట్రోలియం, మద్యపానీయాల పన్నులు మినహా) వల్ల రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది. పన్నుల ఎగవేత తగ్గుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార నిర్వహణకు ఆకర్షణీయ గమ్యంగా 'సన్రైజ్ ఆంధ్రప్రదేశ్'ను చూస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో ఎదురైన కష్టనష్టాలను తట్టుకొని ఏపీ ప్రజలు నిలబడగలిగారు డిజిటల్ చెల్లింపుల పద్ధతుల్ని అమలుపరచడంలో మనం దేశానికే మార్గదర్శకంగా ఉన్నాం. ఈ ఏడాది 27 శాతం వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయంలో ప్రగతి సాధించాం నీతి ఆయోగ్ వ్యవసాయ సూచికలో రాష్ట్రానికి 7వ స్ధానం ఈ బడ్జెట్ ద్వారా సుస్ధిర ఆర్ధికాభివృద్ధి, ఆర్ధిక ప్రగతి సాధించనున్నట్లు ఆర్ధిక మంత్రి చెప్పారు బడ్జెట్ వ్యయం వర్గీకరణ ఇప్పటివరకు బడ్జెట్ను ప్రణాళికా, ప్రణాళికేతర పద్దుల వర్గీకరించగా.. ఇకనుంచి బడ్జెట్ వ్యయాన్ని రెవెన్యూ వ్యయం-క్యాపిటల్ వ్యయాలుగా వర్గీకరించారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి రూ.1,56,999 కోట్లతో బడ్జెట్ రెవెన్యూ వ్యయం రూ.1,25,912 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.31,087 కోట్లు 2016-17లో రెవెన్యూలోటు రూ.4,597 కోట్లు(రాష్ట్ర జీడీపీలో 0.73 శాతం), ఆర్ధిక లోటు రూ.19,163 కోట్లు (రాష్ట్ర జీడీపీలో 3.06 శాతం) గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ సదుపాయాలపై సుస్థిర శ్రద్ధ రైతుల రుణమాఫీకి తదుపరి వాయిదా కింద రూ.3,600 కోట్ల కేటాయింపు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రంగాలకు రూ.21,140 కోట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ రూ. 7,021 కోట్లు పట్టణాభివృద్ధికి రూ.5,207 కోట్లు నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం కోసం రూ. 500 కోట్లు వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.9,091కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.19,565 కోట్లు పర్యావరణం, అడవులు, సైన్సు, టెక్నాలజీ శాఖకు రూ.384 కోట్లు పారిశ్రామిక కారిడార్లకు రూ.369 కోట్లు, ఆర్అండ్బీకు రూ.73 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్ధల పునరుద్ధరణకు రూ.125 కోట్లు, ఇందుకోసం ప్రత్యేక సంస్ధను ఏర్పాటు చేసే యోచన పరిశ్రమల శాఖకు రూ.2,086 కోట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖకు రూ.364 కోట్లు పర్యాటక రంగం రూ.285 కోట్లు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రూ.72 కోట్లు స్ట్రీలు, శిశువులు, వికలాంగులు, సీనియర్ పౌరుల సంక్షేమానికి రూ.1,773 కోట్లు గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగుల కోసం రూ.1,456 కోట్లు డా.ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.1000 కోట్లు గ్రామీణ రోడ్లకు రూ.262 కోట్లు నైపుణ్యాల అభివృద్ధికి రూ.398 కోట్లు దేశంలో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రానున్న సంవత్సరం వ్యవసాయాభివృద్ధికి రూ. 7,342 కోట్లు కేటాయింపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6.78శాతం వాటాతో మత్స్యరంగం గణనీయస్థానంలో ఉంది మాంసం ఉత్పత్తిలో నాలుగో స్ధానం, పాల ఉత్పత్తిలో ఐదో స్ధానంలో ఉన్నాం. ఏపీని ఇండియా ఆక్వాహబ్గా పరిగణిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతానికి 8 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు కృష్ణపట్నంలో కోస్టల్ ఎకనమిక్ ఎంపాయిమెంట్ జోన్ ఏర్పాటుకు చర్యలు జెరూసలెం యాత్ర సబ్సిడీ రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు -
ఏపీ బడ్జెట్ హైలైట్స్ 2017-18
అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలకు ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులతోనే సరిపెట్టింది. రుణమాఫీకి మొండిచేయి చూపించి కేవలం 3600 కోట్లు కేటాయించింది. నిరుద్యోగ భృతిపై యువత పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం మరోసారి వమ్ము చేసింది. నిరుద్యోగ భృతి అని కాకుండా.. నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం పేరుతో కేవలం రూ. 500 కోట్లు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బుధవారం శాసనసభలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017-18)లోని ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే.. బడ్జెట్ హైలైట్స్ ► మొత్తం బడ్జెట్ రూ. 1,56,999 కోట్లు ► రెవిన్యూ వ్యయం రూ. 1,25,911 కోట్లు ► పెట్టుబడి వ్యయం రూ. 31,087 కోట్లు ► వ్యవసాయ రంగానికి రూ. 9,090 కోట్లు ► గ్రామీణాభివృద్ధికి రూ. 19,565 కోట్లు ► సాగునీటి రంగానికి రూ. 12,770 కోట్లు ► విద్యుత్ రంగానికి రూ. 4,274 కోట్లు ► పరిశ్రమలు, గనులకు రూ. 2,085 కోట్లు ► రవాణా శాఖకు రూ. 3,946 కోట్లు ► జనరల్ ఇకో సర్వీసెస్కు రూ 4,813 కోట్లు (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ►విద్యారంగానికి రూ. 20,384 కోట్లు ►క్రీడలు, యువజన శాఖకు రూ. 1,005 కో్ట్లు ► సాంకేతిక విద్యకు రూ. 765 కోట్లు ► ఆరోగ్యశాఖకు రూ. 7,020 కోట్లు ► నీటిపారుదల, పారిశుద్ధ్య రంగానికి రూ. 1,575 కోట్లు ► హౌసింగ్ శాఖకు రూ. 1,456 కోట్లు ► పట్టణాభివృద్ధి శాఖకు రూ. 5,207 కోట్లు ► సంక్షేమ రంగానికి రూ. 11,361 కోట్లు ► రుణమాఫీకి రూ. 3,600 కోట్లు ► హోంశాఖకు రూ. 5,221 కోట్లు ► రహదారులు, భవనాల శాఖకు రూ. 4041 కోట్లు ► నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కోసం రూ. 500 కోట్లు. ► రాజధాని అభివృద్ధికి రూ. 1,061 కోట్లు ► ఐటీ శాఖకు రూ. 364 కోట్లు ► పౌరసరఫరాల శాఖకు రూ. 2,800 కోట్లు ► పింఛన్లకు రూ. 4,376 కోట్లు ► నిరుపేదల విద్యుత్ సబ్సిడీకి రూ. 3,300 కోట్లు ► ఆరోగ్య శ్రీకి రూ 1000 కోట్లు ► ఎస్టీ సబ్ప్లాన్కు రూ. 3,528 కోట్లు ► గ్రామీణ రహదారులకు రూ. 262 కోట్లు ► డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద రూ. 1,600 కోట్లు ► అన్నా క్యాంటీన్లకు రూ. 200 కోట్లు ► మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 100 కోట్లు ► కాపు కార్పొరేషన్కు రూ. 1000 కోట్లు ► బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ. 75 కోట్లు ► క్రైస్తవ కార్పొరేషన్కు రూ. 35 కోట్లు ► ఎన్టీఆర్ సుజల స్రవంతికి రూ. 100 కోట్లు ► ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 100 కోట్లు ► సాంస్కృతిక శాఖకు రూ. 78 కోట్లు ► స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 17,073 కోట్లు ► వికలాంగుల సంక్షేమానికి రూ. 90 కోట్లు ► ఎల్పీజీ కనెక్షన్లకు రూ. 350 కోట్లు ► మత్స్యశాఖకు రూ. 282 కోట్లు ► విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి రూ. 450 కోట్లు ► షాదీఖానాలకు రూ. 1500 కోట్లు ► వరద నివారణకు రూ. 700 కోట్లు ► పర్యావరణ శాఖకు రూ. 4,813 కోట్లు ► పశుగణాభివృద్ధికి రూ. 1,112 కోట్లు ► పన్నుల ఆదాయం రూ. 82,855 కోట్లుగా అంచనా ► బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా రూ. 29,138 కోట్లు ► బడ్జెట్లో రాష్ట్ర పన్నుల వాటా రూ. 53,717 కోట్లు ► పన్నేతర ఆదాయం రూ. 5,092 కోట్లు ► కేంద్రం ఇచ్చే నిధుల అంచనా రూ. 37,548 కోట్లు ► ఎక్సైజ్ ఆదాయం రూ. 5,886 కోట్లు ► సేల్స్ ట్యాక్స్ ఆదాయం రూ. 39,321 కోట్లు -
నేడే బడ్జెట్
⇒ 10.25 గంటలకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి యనమల ⇒ 31 వరకు అసెంబ్లీ సమావేశాల పొడిగింపు.. బీఏసీలో నిర్ణయం సాక్షి, అమరావతి రాష్ట్ర వార్షిక బడ్జెట్(2017–18)ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం 10.25కు అసెంబ్లీలో ప్రవేశపెట్టను న్నారు. మంగళవారం వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీలోని తన కార్యాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్రాజు పాల్గొన్న సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి కారణంగా 13న సభ జరక్కపోవడం, 14న ఆయన మృతికి సంతాప తీర్మానం, దానిపై చర్చ తర్వాత సభ వాయిదా పడిన నేపథ్యంలో 30, 31 తేదీల్లోనూ సభ జరపాలని తీర్మానించారు. 16న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటాయి. 17న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఇవ్వగా, 18, 19 తేదీల్లో సాధారణ సెలవులు కావడంతో సభ జరగదు. తిరిగి 20వ తేదీన ప్రారంభమైన సభలో బడ్జెట్పై చర్చ అనంతరం వాటిపై ఆర్థిక మంత్రి సమాధానాలిస్తారు. 21 నుంచి 25 వరకూ సభ జరుగుతుంది. 26న సెలవు. ఆమోదించాల్సిన కొన్ని బిల్లులుండడంతో 27వ తేదీన రెండుపూటలా సభ నిర్వహిస్తారు. 28వ తేదీన సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతారు. 29న పండుగ సెలవు తర్వాత 30, 31 తేదీల్లో రెండుపూటలా సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. నేడు మంత్రివర్గ సమావేశం మరోవైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించడం కోసం బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. -
నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించలేం
యనమల రామకృష్ణుడు స్పష్టీకరణ సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటించేలా ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 11.30 గంటలకు 2017–18 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని యనమల తేల్చిచెప్పారు. ఉద్యోగాలు లేనివారికి ఉచితంగా ఆర్థిక సాయం అందించడం సాధ్యం కాదని చెప్పారు. ఉద్యోగాలు లేని యువతకు డబ్బులిచ్చి ఊరికే తిరగమనడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. -
‘అంగీకరించాల్సింది ప్రతిపక్షం కాదు, కేంద్రం’
అమరావతి : రాష్ట్ర వృద్ధిరేటుపై తాము అనుసరించిన మెథడాలజీ సమగ్రంగానే ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము చూపించిన గ్రోత్ రేట్లను అంగీకరించాల్సి ప్రతిపక్షం కాదని, ప్రభుత్వ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలన్నారు. ఈసారి బడ్జెట్లో యూత్ పాలసీని తీసుకొస్తామని, నిరుద్యోగ భృతి ఎలా ఇవ్వాలన్నది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయని, రెవిన్యూ తగ్గుతోందని యనమల అన్నారు. గత ఏడాది బడ్జెట్ కంటే ఈసారి అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పుష్కరాలు, రాధాని నిర్మాణాలకు అధికంగా నిధులు ఖర్చు పెట్టామని తెలిపారు. బీసీలు, సంక్షేమ రంగాలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయని మాట వాస్తవమే అని అంగీకరించారు. ఇక మీదట అలా జరగకుండా చూస్తామని తెలిపారు. త్వరలో ఎంబీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని యనమల పేర్కొన్నారు. -
రోజాపై మళ్లీ వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారా?
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రోజాపై మరోసారి ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందా? ఆమెను దాదాపు ఏడాదిపాటు సభలో అడుగుపెట్టనివ్వకుండా చేసిన ప్రభుత్వం తిరిగి మరోసారి ఆమెను సభలోకి రాకుండా అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేస్తుందా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్యే రోజా కచ్చితంగా సభకు క్షమాపణలు చెప్పాలని యనమల మంగళవారం మీడియాకు చెప్పారు. షరతులతో కూడిన క్షమాపణలు ఉండబోమని అన్నారు. ఎమ్మెల్యే రోజా బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. నేడు సభా హక్కుల కమిటీ నివేదిక ఇస్తుందని, దానిపై సభాపతి నిర్ణయం తీసుకుంటారని యనమల చెప్పారు. సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యల్లో సస్పెన్షన్ గడువు ముగిసినందునే సభకు రోజా వస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై ప్రస్తుతం సభా హక్కుల కమిటీ నివేదిక రూపొందించిందని యనమల చెప్పారు. దీని ప్రకారం సభలో అందరిముందు ఆమె క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. -
2న తాత్కాలిక అసెంబ్లీ భవనం ప్రారంభం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని మార్చి 2వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రారంభోత్సవం చేయించేందుకు చివరివరకూ ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. దీంతో తానే స్వయంగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే నెల 2న ఉదయం 11.25 గంటలకు మంచి ముహూర్తమని పండితులు తెలపడంతో దాన్ని ఖరారు చేశారు. ప్రారంభానికి ముందే కార్యకలాపాలు ప్రారంభానికి ముందే సోమవారం నుంచి అధికారికంగా అసెంబ్లీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి తాత్కాలిక అసెంబ్లీ భవనంలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కార్యాలయం తెలిపింది. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం సోమవారం ఉదయం నుంచి తాత్కాలిక అసెంబ్లీ నుంచే విధులు నిర్వహించనున్నారు. -
వెలగపూడిలోనే బడ్జెట్ సమావేశాలు
-
వెలగపూడిలోనే బడ్జెట్ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను వెలగపూడిలోనే నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి మార్చి 31వరకు, లేదా ఏప్రిల్ తొలి వారం వరకు సమావేశాలు కొనసాగుతాయి. బడ్జెట్ రూపకల్పనపై నేడు విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కాగా బడ్జెట్ సమావేశాలనే కాకుండా రానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలన్నిటినీ అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 6న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 13న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆర్ధిక వ్యయ ప్రణాళిక ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త పథకాలకు కేటాయింపులు ఉన్నట్లు కనిపించడం లేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్నందున ఇటీవల కొన్ని శాఖల్లో చెల్లింపులు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సమస్యలను అధిగమించాం: చంద్రబాబు అధికారులతో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రెండేళ్లలో ఆదాయం పెంచుకోగలిగామన్నారు. ఇబ్బందులున్నా విన్నూత్నంగా ఆలోచించి సమస్యల్ని అధిగమించిగలిగామన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలన్నిటికీ ఆధార్ అనుసంధానం చేయడం వల్ల లెక్కల్లో కచ్చితత్వం, పారదర్శకత వచ్చిందన్నారు. ఎన్నికల హామికి కట్టుబడి రైతులకు రుణాల ఉపశమనం కల్పించినట్టు తెలిపారు. ఉపకార వేతనాల అందజేతలో సాంకేతిక విధానాలు అనుసరించామన్నారు. వేసవిలో కూడా విద్యుత్ కొరత లేకుండా చేశామన్నారు. ఈసారి వర్షపాతం తక్కువగా ఉందని, రిజర్వాయర్లలో నీళ్లు లేవన్నారు. విద్యదుత్పత్తిపై దృష్టి పెట్టకపోయినా ఈ రంగంలో ఇబ్బంది లేదన్నారు. చిత్తూరు జిల్లాలో 35 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయిందన్నారు. పట్టిసీమ పూర్తి చేయడం వలన కృష్ణా డెల్టాలకు నీరివ్వగలిగామని, అది రాయలసీమకు కలిసొచ్చిందన్నారు. -
జీఎస్టీ వచ్చినా రాయితీలు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ చాంబర్స్ డిమాండ్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ పారిశ్రామిక పాలసీల కింద ఇస్తున్న రాయితీలను జీఎస్టీ తర్వాత కూడా అమలు చేయాలని, దీనికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ చాంబర్స్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రకటించిన పలు ప్రోత్సహకాలు జీఎస్టీ తర్వాత ఎలా అమలు చేస్తారన్న దానిపై స్పష్టత లేదని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎదుర్కొనేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ విధానాల్లో అనేక రాయితీలు ప్రకటించినా అవి జీవోల రూపంలో రావట్లేదని విమర్శించారు. ఏపీ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కరరావు కూడా మాట్లాడుతూ పలు డిమాండ్లను ప్రస్తావించారు. -
త్వరలో ఏపీకి రూ.7వేల కోట్లు: యనమల
విజయవాడ : ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు రూ.12వందల కోట్లు రావాల్సి ఉందని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. అయితే తాము అడిగిన దానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు తేడా ఉందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. అందువల్లే రూ.7వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని యనమల తెలిపారు. జనవరి 31 వరకూ అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారని, ఫిబ్రవరి 20 తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సకాలంలో నిధులు విడుదల చేశామన్నారు. రెండంకెల వృద్ధి సాధనలో విజయం సాధించామని, పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమని యనమల తెలిపారు. -
ఏపీ ఆర్ధిక పరిస్ధితి ప్రమాదకరంగా ఉంది
-
రెయిన్ గన్స్ పెట్టినా పంటలను రక్షించలేకపోయాం
అమరావతి: అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రెయిన్ గన్స్ పెట్టినా పంటలను రక్షించలేకపోయామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ఏడాదికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్పై మంత్రి కసరత్తు ప్రారంభించారు. సోమవారం ఆర్థిక, వ్యవసాయ రంగ ప్రముఖులతో మంత్రి సమావేశమయ్యారు. వ్యవసాయంపై నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. వర్షాభావ, కరువు ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘చంద్రబాబు మోసం చేస్తున్నారు’
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ’ చంద్రబాబు ఏపీలో వృద్ధిరేటు పెరిగిందంటున్నారు. అవన్నీ కాకిలెక్కలే, తప్పుడు గణాకాల వల్ల రాష్ట్రం వెనుకబడిపోతుంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేము అన్ని ఆధారాలతోనే వృద్ధిరేటు గణాంకాలు బయటపెట్టాం. మేం చెప్పింది అవాస్తవమని చెప్పగలరా?. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఏవిధంగా మోసగిస్తుందో ఈ కాకిలెక్కలే నిదర్శనం. యనమల ఎందుకిలా ప్రజలను మోసగిస్తారు?. సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతుంది. వృద్ధిరేటుపై మా దగ్గరున్న గణాంకాలన్నీ మీకు పంపిస్తాం. ఉన్నవి మూతపడుతుంటే...కొత్త పరిశ్రమలు వచ్చాయనడం సమంజసమా?. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కనీసం ఒక్క పెట్టుబడి అయినా వచ్చిందా?’ అని సూటిగా ప్రశ్నించారు. -
‘చంద్రబాబు మోసం చేస్తున్నారు’
-
పెద్ద నోట్ల రద్దుపై యనమల అసంతృప్తి
-
యనమలా..నాటి లేఖల మాటేమిటి?
ఆర్థిక మంత్రికి కాంట్రాక్టు అధ్యాపకుల ప్రశ్న భానుగుడి(కాకినాడ) : అధికారం లేనపుడు ఒకలా.. అధికారం చేతికొచ్చాక మరోలా..రంగులు మార్చే ఊసరవెల్లిలా యనమల ప్రవర్తన ఉండడం దురదృష్టకరమని కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ పేర్కొంది. సోమవారం పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ యరమాటి రాజాచౌదరి మాట్లాడుతూ అధికారంలో లేనపుడు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి తమ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెగ్యులరైజేషన్ విçషయమై లేఖలు రాసి, ఎన్నికల సమయంలో హామీలిచ్చి, అధికారంలోకొచ్చాక తమ గురించి పట్టించుకోకుండా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వేలమంది అరకొర వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిన కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని కాంట్రాక్టు› లెక్చరర్లు వాపోయారు. ఈ సందర్భంగా యనమల చిత్రపటానికి మోకాళ్లపై మొక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నేడు కలెక్టరేట్ ఎదుట భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొంటున్నారని, పలువురు వామపక్ష నాయకులు తమకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. -
'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రూ.9 నుంచి 10 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి లోటు బడ్జెట్ రూ.24 వేల కోట్లకు చేరే అవకాశముందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అందుకు అడ్డుగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని యనమల అన్నారు. మంత్రి తాజా వ్యాఖ్యలతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. -
ఆర్థిక సంక్షోభంలో మంత్రి యనమల ఎక్కడ ?
-
శ్రీకాకుళం వరకూ గోదావరి జలాలు
మంత్రి యనమల తుని రూరల్ : రూ.4,500 కోట్లతో నిర్మించే పోలవరం ఎడమ కాలువ, రూ.1,650 కోట్లతో ఏర్పాటు చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లా వరకూ గోదావరి జలాలను అందించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా తుని మండలం కుమ్మరిలోవ కాలనీలో పోలవరం ఎడమ కాలువ నిర్వాసితులనుద్దేశించి గురువారం ఆయన మాట్లాడారు. నాలుగు జిల్లాలకు ప్రయోజనకరంగా ఉండే పోలవరం ఎడమ కాలువకు, ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతలు ఏర్పాటు చేసి ఏలేరు రిజర్వాయర్కు, అక్కడ నుంచి పోలవరం ఎడమ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లా వరకూ గోదావరి జలాలు తరలిస్తామన్నారు. రూ.6 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే పోలవరం ఎడమ కాలువకు అందరి సహకారం అవసరమన్నారు. రెండు విడతల్లో రైతులకు రూ.24 వేల కోట్లు, మహిళలకు రూ.6 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రూ.1,000 కోట్లు రుణమాఫీ చేసినట్టు చెప్పారు. రైతులకు, మహిళలకు మూడో విడత రుణమాఫీ నిధులు వచ్చే ఏడాది మార్చి తర్వాత ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఒక్కో మహిళకు అందించే రూ.10 వేలను తమ అవసరాలకు వాడుకునేలా అనుమతి ఇచ్చామని, అయితే వ్యాపార కార్యకలాపాలకు వినియోగించాలని యనమల విజప్తి చేశారు. -
మేం నల్లధనాన్ని సర్దుకోలేదు
మంత్రి యనమల అంగర (కపిలేశ్వరపురం) : టీడీపీ, బీజేపీ తమ నల్లధనాన్ని సర్దుకున్నాకా నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రకటించారంటూ కమ్యూనిస్టు పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మండలంలోని పడమర ఖండ్రిక, అంగర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం పాల్గొన్నారు. రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధనం వెలికితీయోచ్చని యనమల అన్నారు. పడమర ఖండ్రికలో పంచాయతీ భవనం, అంగరలోని పోలీస్ స్టేషన్ భవనం, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్లను మంత్రులు ప్రారంభించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీపీ కాదా వెంకట రాంబాబు, జెడ్పీటీసీ జుత్తుక సూర్యావతి, జేసీ సత్యనారాయణ, ఆర్డీఒ సుబ్బారావు, పువ్వల చిట్టిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్సై వాసా పెద్దిరాజు పాల్గొన్నారు. -
డిసెంబర్ 15లోగా అసెంబ్లీ భవన నిర్మాణం
- గడువును నిర్దేశించామన్న స్పీకర్ కోడెల - శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే సాక్షి, అమరావతి: వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తిచేసేందుకు డిసెంబర్ 15ను గడువుగా నిర్దేశించినట్లు శాసనసభాపతి డా.కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈమేరకు నిర్మాణ సంస్థతో పాటు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సోమవారం ఉదయం శాసనమండలి చైర్మన్ డా.చక్రపాణి, డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీశ్రెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి యనమల రామకృష్ణుడు, శాసనసభ ఇన్ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ, డీజీపీ నండూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తదితరులతో కలసి నూతన అసెంబ్లీ, కౌన్సిల్ భవన నిర్మాణాలను పరిశీలించారు. శాసనసభ శీతాకాల సమావేశాలు వెలగపూడిలోనే జరుగుతాయని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా హక్కుల సంఘానికి సిఫారసు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని నివారించేందుకు నూతన సమావేశమందిరంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిసెంబర్ ఆఖరు లేదా జనవరి మొదట్లో అసెంబ్లీ! ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా జీఎస్టీకి సంబంధించిన బిల్లులను ఆమోదించనుంది. అవసరమైతే ఒకటి, రెండు రోజులు అదనంగా సమావేశాలు నిర్వహించి శాసనసభ శీతాకాల సమావేశాలను మమ అనిపించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. -
జనాభా, ఎంపీల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవాలి
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల్లో ఓటింగ్ జరిగినప్పుడు ఓటింగ్ వెయిటేజీకి రాష్ట్రాల జనాభాను గానీ, రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీల సంఖ్యను గానీ ప్రాతిపదికగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. గురువారం ఇక్కడ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ ప్రతిపాదనలు సమర్పించినప్పుడు ఏదైనా కారణంతో కేంద్రం ఓటింగ్లో పాల్గొననప్పుడు ఏం చేయాలన్న విషయంలో నిర్ధిష్ట నిబంధన ఉండాలని సూచించారు. సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ చట్టాలను అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని, అయితే 2017 ఫిబ్రవరి మాసాంతంలో పూర్తయ్యేలా గడువు పెట్టాలని కోరారు. -
'కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కుదరదు'
విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కుదరదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పువల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ సాధ్యం కాదని భావిస్తున్నామని అన్నారు. 26 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాల పెంపును పరిశీలిస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. -
కాంట్రాక్టు లెక్చరర్లపై ఇంత వివక్షా?
ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో హామీని నెరవేర్చే పేరుతో ఏపీలోని 446 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,776 మంది, డిగ్రీ కాలేజీల్లోని 704 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై, సమస్యలపై అధ్య యనానికి 2014 సెప్టెంబర్ 9న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పర్చింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘు నాధరెడ్డి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ గత రెండేళ్లలో ఒక్క సమావే శాన్ని కూడా నిర్వహించక పోవడం ప్రభుత్వ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు నిదర్శనం. కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ విజయవాడలో 25-02-2015న నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతామని హామీనిచ్చారు. మరోవైపున సీఎంతో సహా, కేబినెట్ సబ్ కమిటీ సభ్యు లను అసోసియేషన్ ప్రతినిధులు ప్రతి జిల్లాలో కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థిస్తున్నా ఇదిగో అదిగో అంటూ మభ్యపెడుతూ, కాలం గడుపుతున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చర ర్ల క్రమబ ద్దీకరణకు అడ్డంగా ఉన్న 2/94 చట్టాన్ని సవరించడానికి అడుగులేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తా మని తెలంగాణ సీఎం కేసీఆర్ పలుసార్లు స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్టు అధ్యాపకులను గతంలోనే క్రమబద్ధీ కరించారు. కానీ రాష్ట్రంలోని 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో విద్యాశాఖలోని అత్యధికంగా ఉన్న 5,757 మంది కాంట్రాక్టు లెక్చరర్లను గుర్తించడం వరకే పరిమిత మైన ఏపీ ప్రభుత్వం వీరి సమస్యను దాటవేయడంతోనే పొద్దు గడుపుతోంది. గత 16 ఏళ్లుగా మూసివేత దిశగా ఉన్న ప్రభుత్వ కళాశాలలకు ప్రాభవం తీసుకురావ డంలో కాంట్రాక్టు అధ్యాపక వ్యవస్థ సాటిలేని కృషి సల్పింది. విద్యార్థుల సంఖ్య పెంపుదల, పరీక్షా ఫలితాల సాధనలో గణనీయ ప్రగతిని సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కానీ కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం పట్ల నేటి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. 10వ వేతన సవరణ సంఘం కాంట్రాక్టు లెక్చరర్లకు మూలవేతనం, డీఎ ఇవ్వమని సిపార్సు చేసినా వాటి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరితో ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నడూ లేనివిధంగా 2016-17 సంవత్సరానికి రెన్యువల్ ప్రక్రియ ఉత్తర్వుల జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో గత 4 నెల లుగా పనిచేస్తున్నప్పటికీ జీతాలు అందుకోలేని స్థితి. ఈ ఏడాదిలో జీతం లేని వేసవిని, జీతం అందని కాలాన్ని కలుపుకుంటే సుమారు 6 నెలలుగా వేతనాలు లేకుండా కాంట్రాక్టు అధ్యాపకులు క్షోభకు గురవుతున్నారు. దినదినగండంగా ఉన్న ఉద్యోగాన్ని నమ్ముకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోగా అదనపు నిబంధనలు, అవ రోధాలు కల్గించడం దారుణం. దీంతో తమ ఉద్యోగాల కొనసాగింపు అంశంలో ఏర్పడుతున్న అవరోధాలు గమ నించడానికే వారి శక్తియుక్తులన్నీ సరిపోతున్నాయి. ఈ ఉదాశీనత కొనసాగితే అధ్యాపకులు మిలిటెంట్ పోరా టాలకు పాల్పడాల్సి వస్తుంది. ప్రభుత్వం మొండి వైఖ రిని విడనాడి కాంట్రాక్టు లెక్చరర్లను ఆదుకోవాలి. కుమ్మరకుంట సురేష్, అధ్యక్షులు, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్, ప్రకాశం జిల్లా మొబైల్ : 94910 03093 -
త్వరలో అసెంబ్లీ నిర్మాణంపై సమావేశం
అమరావతి: ఏపీ అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు తో సమావేశం ఉంటుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శుక్రవారం ఆయన అమరావతిలో వివిధ శాఖల అధికారులు, భవన నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెక్రటేరియట్కు భిన్నంగా అసెంబ్లీ భవన నిర్మాణం ఉంటుందని మంత్రి అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. డిసెంబరు ఆఖరుకల్లా అసెంబ్లీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. పార్కింగుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎల్పీ కార్యాలయాలు, చాంబర్ల ఏర్పాటు సాగుతోందని చెప్పారు. -
‘డిసెంబరుకు అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయండి’
ఈ ఏడాది డిసెంబర్ చివరి కల్లా అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. గురువారం ఆయన సీఆర్డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసెంబ్లీ, శాసనమండలి భవనాల ప్లానింగ్ అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలోని తన చాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, స్పీకర్,మంత్రులు, అధికారుల చాంబర్లలలో సౌకర్యాలు, భద్రతపై చర్చించారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో డిసెంబరు ఆఖరుకు భవనాల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఈనెల 19వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణతో కలసి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. -
యనమల ద్వయానికి ఘాతం
ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు దివీస్ భూ సేకరణపై హైకోర్టు స్టే టీడీపీకి మాజీ జెడ్పీటీసీ గుడ్బై జిల్లా ‘దేశం’లో చర్చనీయాంశమైన పరిణామాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : దివీస్ భూ సేకరణలో బుధవారం చోటుచేసుకున్న రెండు పరిణామాలతో తునిలో యనమల సోదర ద్వయానికి భంగపాటు ఎదురైంది. అధికారం చేతిలో ఉందని బరితెగించి పోలీసు బలప్రయోగంతో రైతుల నోళ్లు నొక్కే స్తూ దివీస్ రసాయన పరిశ్రమ యాజమాన్యం కొమ్ముకాస్తున్న వీరికి ఈ పరిణామాలు చెంపపెట్టు. తుని నియోజ కవర్గంలో యనమల సోదరుల అప్రజాస్వామిక వైఖరినీ, ధాష్టీకాన్నీ ‘సాక్షి’ అనేక కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దివీస్ పరిశ్రమకు అడ్డగోలుగా జరుపుతున్న భూ సేకరణను ఒకపక్క న్యాయస్థానం తప్పుపట్టగా, మరోవైపు మత్స్యకార నాయకుడు, మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశిఈశ్వరరావు టీడీపీకి గుడ్బై చెప్పారు. ఈ రెండు పరిణామాలు యనమల సోదరులకు తుని నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బే. బలవంతపు భూ సేకరణలో యనమల సోదరుల వ్యవహార శైలికి నిరసనగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పార్టీకి రాజీనామా చేయడం జిల్లా టీడీపీలో చర్చనీయాంశమైంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, అతనికి వరుసకు సోదరుడైన కృష్ణుడిని మూడు దశాబ్దాలపాటు అందలమెక్కిస్తే తమ గుండెలపై దివీస్ కుంపటి పెడుతున్నారని ఆ నియోజకవర్గంలో అట్టడుగు వర్గాలైన యాదవులు, మత్స్యకారులు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దివీస్ రసాయన పరిశ్రమకు 500 ఎకరాలు నిరుపేద రైతుల నుంచి బలవంతంగా లాగేసుకునేందుకు గడచిన నాలుగైదు నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలకు హైకోర్టు బుధవారం ముకుతాడు వేయడంతో సోదర ద్వయం కంగుతింది. జనంలో వ్యతిరేకత తొండంగి మండలం కొత్తపాకలు, పంపాదిపేట, శృంగవృక్షంపేట, తాటాకులపాలెం, ఒంటిమామిడి తదితర 13 గ్రామాల ప్రజలు దివీస్ బలవంతపు భూ సేకరణకు ప్రయత్నిస్తున్న తీరుపై ఇటీవల దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలో భారీ బహిరంగ సభ పెట్టి యనమల సోదరులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భూ సేకరణకు వ్యతిరేకంగా నాలుగైదు నెలలుగా జరుగుతున్న ఆందోళనలపై సోదరుల సిఫార్సులతో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించి గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించారు. 144 సెక్షన్ అమలు చేయడంతో ఆగకుండా అత్యవసర పరిస్థితిని తలపించేలా ప్రజల దైనందిన జీవనాన్ని కూడా నియంత్రించే పరిస్థితుల వెనుక యనమల సోదరుల పాత్రను స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. బీసీల్లోనూ ఈసడింపు 30 ఏళ్లు యనమల సోదరులు చెప్పినట్టే ఓట్లు వేస్తూ వచ్చినందుకు ఇప్పుడు సరైన గుణపాఠం చెప్పారంటూ దివీస్ బాధిత రైతులు మండిపడుతున్నారు. జీడితోటలు, కొబ్బరి తోటలు, సపోటా చెట్లు సాగుచేసుకుంటూ, 250 హేచరీల్లో పనిచేసుకుంటూ సుమారు 20వేల మంది బతుకు బండి లాగిస్తున్నారు. వారంతా అల్పాదాయ వర్గాలైన రైతులనే విషయాన్ని కూడా విస్మరించి బడా సంస్థలకు కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు యనమల సోదరులను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాకినాడ ఎస్ఈజెడ్కు భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఇదే యనమల సోదరులు టీడీపీ అధికారంలోకి వచ్చాక దివీస్ కోసం 500 ఎకరాలు బలవంతపు భూ సేకరణకు కొమ్ముకాయడంతో అక్కడి బీసీ సామాజికవర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తునిలో పార్టీకి నష్టం ప్రాథమికంగా రూ.600 కోట్లతో ప్లాంట్ ప్రారంభించి భవిష్యత్లో దీనిని రూ.11వేల కోట్లతో విస్తరించాలనే ప్రయత్నాల్లో దివీస్ ఉంది. సేకరిస్తున్న 500 ఎకరాలలో 300 ఎకరాలు డి పట్టాభూములనే విషయం వారికి తెలియంది కాదంటున్నారు. సముద్రం ఒడ్డున ఇచ్చిన ఆ భూములను లాగేసుకోవాలనుకునే ప్రయత్నాలతో సొంత యాదవ సామాజికవర్గమే గుర్రుగా ఉంది. ఇటువంటి వ్యవహారశైలి కారణంగానే యనమల సోదరులకు రాజకీయంగా తునిలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందని ఎదురుచూశామని, కానీ మార్పు కన్పించడం లేదని దివీస్కు వంత పాడటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. వారి వ్యవహార శైలితో పార్టీ తునిలో మరింత పతనమైపోతోందని జిల్లాలో టీడీపీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. -
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.
-
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
హైదరాబాద్ : తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రత్యేక హోదాపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టిన ప్రధాన ప్రతిపక్షం మూడో రోజు కూడా సభను స్తంభింపజేసింది. ప్రత్యేక హోదాపై చర్చకు డిమాండ్ చేసిన విపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసనను తెలియజేశారు. ప్రత్యేక హోదాపై చర్చ తప్ప మరొకటి సమ్మతం కాదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా నినదించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో అసెంబ్లీ మార్మోగిపోయింది. మరో వైపు విపక్ష సభ్యుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం మూడు రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్య తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని తీర్మానం చేసింది. సభలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించిన సభ్యులపై శాశ్వతంగా వేటు వేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించారు. సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. వీడియో ఫుటేజ్ పరిశీలించాక వైఎస్సార్సీపీ సభ్యులపై ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యే స్పీకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. -
దద్దరిల్లిన శాసనసభ
- ప్రత్యేక హోదాపై చర్చకు అంగీకరించని ప్రభుత్వం - ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర నిరసన - పోడియం వద్ద విపక్ష సభ్యులను నెట్టేసిన మార్షల్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విపక్షం చేసిన ఆందోళనతో రాష్ట్ర శాసనసభ శుక్రవారం కూడా దద్దరిల్లింది. ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు రానీ యకుండా సీఎం స్టేట్మెంట్తో ‘మమ’ అనిపించాలని అధికారపక్షం, చర్చ ద్వారా చంద్రబాబు మెత క వైఖరిని ఎండగట్టాలని విపక్షం పట్టుదలతో వ్యవహరించాయి. ఉదయం 9 గంట లకు సభ ఆరంభం కాగానే ప్రశ్నోత్తరాలు ఆరంభిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే వైఎస్సార్సీపీ సభ్యు డు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేచి ప్రత్యే క హోదాపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి స్టేట్మెం ట్ మీద రూల్స్ ప్రకారం క్లారిఫికేషన్లు ఇస్తారని, అయితే స్టేట్మెంట్పై చర్చకు అనుమతిస్తామని బీఏసీలో చెప్పామన్నారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుగజేసుకుని ‘‘నిన్న కౌన్సిల్లో జరి గిన చర్చ చూశాం... సభ ఆర్డర్లో లేకపోయినా సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. చివరకు క్లారిఫికేషన్లు అంటూ రెండు నిమిషాల్లో ముగించి వాయిదా వేశారు. ఈరోజు కూడా అదే పరిస్థితి వస్తుంది. దయచేసి చర్చకు అనుమతించండి. స్టేట్మెంట్కు మేం వ్యతిరేకం’’ అని స్పష్టం చేశారు. చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యుడు గడికోట శ్రీకాంత్రెడ్డి కూడా పదేపదే కోరారు. వారి వ్యాఖ్యలపై ఆగ్రహం సభలో రెండు పక్షాల సభ్యులు వాద ప్రతివాదాలు వినిపిస్తున్న సమయంలో యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీంతో ప్రతిపక్ష సభ్యులు పోడియంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా వెంటనే మార్షల్స్ ప్రవేశించి అడ్డుకున్నారు. విపక్ష సభ్యులు-మార్షల్స్ మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సభ వాయిదా వేశారు. స్పీకర్ కంటే ముందే మార్షల్స్ తిరిగి 11.07 గంటలకు సభ పునఃప్రారంభమయ్యే సరికే (స్పీకర్ సభలోకి ప్రవేశించకముందే) పోడియం చుట్టూ మార్షల్స్ నిలబడ్డారు. విపక్ష నేత జగన్ టేబుల్ సమీపంలోనూ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా మార్షల్స్ సభలోకి రావడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ మాజీ శాసనసభ్యుల మృతిపట్ల సంతాప సందేశం చదివారు. అనంతరం 11.10 గంటలకు స్పీకర్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. -
దుబారా ఖర్చులు..బీద అరుపులు
రాష్ట్రంలో పాలకుల తీరిదీ పుష్కరాలకు ఎక్కువ ఖర్చు చేశామన్న మంత్రి యనమల లక్షల వాటర్, మజ్జిగ ప్యాకెట్లు వృథా రూపురేఖలు కోల్పోయిన రోడ్లు నిరుపయోగంగా సీసీ కెమెరాలు ‘ఆదాయం లేదు. ఖర్చులు పెరిగిపోయాయి. జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతోంది.. ఏరోజుకు ఆరోజు నెట్టుకొస్తున్నాం’ అంటూ బీద అరుపులు అరుస్తున్న పాలకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా ఆదాయం తగ్గినప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత జిల్లా అయిన తూర్పుగోదావరిలో గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాలు. పుష్కరాలకు ప్రచారం, ఆహ్వానాలు, పనులు, సౌకర్యాల పేరిట వందల కోట్ల రూపాయల దుబారా జరిగింది. సాక్షి, రాజమహేంద్రవరం: గతేడాది గోదావరి పుష్కరాలకు రూ. 1600 కోట్లు ఖర్చు పెట్టినట్టు పాలకులు ఘనంగా చెప్పుకున్నారు. కానీ అందులో అధిక భాగం దుబారా జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలెన్నో ఉన్నాయి. గోదావరి మహాపుష్కరాలు అంటూ ప్రచారానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో హోర్డింగ్లు పెట్టారు. వార్త చానెళ్లలో ప్రకటనలిచ్చారు. ప్రముఖులకు ఆహ్వానాల పేరిట ఖరీదైన ఆహ్వాన పత్రికలు వేయించారు. ప్రధాని, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించేందుకు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లారు. అయితే వారెవరూ రాకపోవడం గమనార్హం. పుష్కరాలను డాక్యుమెంటరీ ఫిల్్మ గా తీసేందుకు నేషనల్ జియోగ్రఫి చానల్కు కోట్లాది రూపాయలు చెల్లించారు. పుష్కరాలు ముగిసి ఏడాది గడచినా ఆ డాక్యుమెంటరీ ఇప్పటికీ బయటకు రాలేదు. కానరాని సుందరీకరణ ఆనవాళు పుష్కరాలకు ముఖ్య కేంద్రమైన రాజమహేంద్రవరం నగరాన్ని సుందరంగా తీర్చిద్దేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించారు. విమానాశ్రయం రోడ్దు, 216 నంబర్ జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటించారు. అయితే ఇప్పుడవి మచ్చుకు కూడా కనపించడం లేదు. ఎందుకూ పనికి రాని సీసీ కెమెరాలు... పుష్కరాల సందర్భంగా రాజమహేద్రవరం నగరం, ఘాట్ల వద్ద 171 సీసీ కెమెరాలు అమర్చారు. పుష్కరాలు ముగిసిన వెంటనే అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. మొదటి రోజు జరిగిన తొక్కిసలాటతోపాటు అనేక దొంగతనాలు జరిగాయి. సీసీ కెమెరాల నిఘాతో దొంగలను గుర్తించవచ్చు. అయితే గోదావరి పుష్కరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దృశ్యాలను రికార్డ్ చేసేవి కావని, కేవలం పర్యవేక్షణ కోసమేనని అధికారులు చెప్పడం విశేషం. లక్షలాది మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు వృథా పుష్కర భక్తులకు అందజేసేందుకు వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ లక్షలాది రూపాయలతో కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి కంపెనీ అయిన హెరిటేజ్ నుంచి మజ్జిగ ప్యాకెట్లు బస్తాల కొద్దీ తెప్పించారు. అవసరానికి మించి కొనడం, వాటిని సరిగా పంపిణీ చేయకపోవడంతో లక్షలాది ప్యాకెట్లు మిగిలిపోయాయి. లాలా చెరువు ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ చేసిన ఈ ప్యాకెట్లను పుష్కరాలు ముగిన ఐదు రోజుల తర్వాత రోడ్డు రోలర్తో తొక్కించారు. తాత్కాలికం పేరుతో వృథాపుష్కరాలకు ప్రతి పని తాత్కాలిక పద్ధతిలో చేశారు. అద్దె ప్రాతిపదికన ప్రతి ఘాట్ వద్ద మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. 12 రోజుల పాటు వాటికి చెల్లించిన అద్దెతో కొత్తవి కొనుగోలు చేయవచ్చని అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
జాతీయ గీతాలాపనకు సీఎం గైర్హాజరు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం శాసనసభలో జరిగిన జాతీయ గీతాలాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. ఉదయం 9.04 గంటలకు స్పీకరు సభలో ప్రవేశించగానే అందరూ లేచి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి ప్రధాన ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నేతకు జాతీయ గీతమంటే కూడా గౌరవం లేదని, జాతీయ గీతాన్ని బాయ్కాట్ చేయడం సలక్షణం కాదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి అదే సమయంలో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు కూడా సభలో లేరు. అంటే ఆర్థికమంత్రి యనమల పరిభాషలో ముఖ్యమంత్రికి, చీఫ్ విప్కు కూడా జాతీయ గీతమంటే గౌరవం లేదని అర్థమా? అని క్యాంటీన్లో కొందరు టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించుకున్నారు. ''వాస్తవంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టడం వల్ల ఆ సమయానికి అసెంబ్లీకి రాలేదు. ఈ విషయం తెలిసి కూడా యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ సభ్యుడు ఇలా వ్యాఖ్యానించి ఉండకూడదు. ఇలా మాట్లాడటం వల్ల మా రాయి మాకే తగిలినట్లు అయింది...'' అని అధికార పక్షానికి చెందిన ఒక శాసనసభ్యుడు వాఖ్యానించారు.