కాంగ్రెస్ విజృంభణ | Congress active | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ విజృంభణ

Published Thu, Sep 11 2014 6:13 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

కాంగ్రెస్ విజృంభణ - Sakshi

కాంగ్రెస్ విజృంభణ

హైదరాబాద్: ఏపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి విజృంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందిరాభవన్‌లో ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్‌ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం  పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి శైలజానాధ్, ఎమ్మెల్సీ పద్మరాజు మాట్లాడుతూ  రుణమాఫీపై టిడిపి సర్కార్‌ విఫలమవుతున్న తీరును ఎండగడతామని చెప్పారు.

రుణమాఫీపై వచ్చేనెల మొదటివారంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బంగారు నగలను వేలం వేయడానికి బ్యాంకులు నోటీసులిస్తున్నాయని తెలిపారు. బ్యాంకుల్లోని బంగారు నగలు వేలం వేస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement