రాజధాని నిర్మాణం పేరుతో భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కొవడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం...
'రాజధాని పేరుతో భూముల్ని లాక్కుంటే సహించం'
Oct 10 2014 8:00 PM | Updated on Jun 4 2019 5:04 PM
గుంటూరు: రాజధాని నిర్మాణం పేరుతో భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కొవడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యర్యంలో సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి అఖిల పక్షం ఏర్పాటు చేయాలని సంఘం తీర్మానించింది.
భూసేకరణ విషయంలో ఏకపక్ష నిర్ణయాన్ని సీపీఎం వ్యతిరేకించింది. రాజధాని పేరుతో రైతుల భూముల్ని లాక్కుంటే సహించేది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు.
Advertisement


