ఏనుగుల దాడి.. పంట నష్టం | elephants crowd attack on crops in chittur distirict | Sakshi

ఏనుగుల దాడి.. పంట నష్టం

Feb 3 2015 11:35 AM | Updated on Oct 4 2018 6:03 PM

గజరాజుల దాడులతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

చిత్తూరు: గజరాజుల దాడులతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వి.కోట మండల పరిధిలోని పెద్దూరు, నారాయణతండా, రామాపురం తండాలలో రెండు రోజుల నుంచి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.  మంగళవారం తెల్లవారుజామున 22 ఏనుగులు పంటపొలాలపై దాడులు చేశాయి. ఏనుగుల ధ్వంసంతో టమాట, బీన్స్ పంట నామరూపాల్లేకుండా పోయింది. దీంతో  గ్రామస్తులు భయంతో ఇళ్లను నుంచి బయటకు రావడంలేదు. పంటల నష్టంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
(వి.కోట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement