Forest Officials
-
అటవీశాఖ అధికారులపై కేశవపట్నం గ్రామస్తుల దాడి..!
-
ఆదిలాబాద్: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల రాళ్ల దాడి
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ఇదీ చదవండి: మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు -
కాకులను వేటాడిన దంపతులకు జరిమానా
తిరువళ్లూరు: పూండి కాపు అటవీ ప్రాంతంలోని కాకులను వేటాడి తరలిస్తున్న ఇద్దరికి రూ.5వేల జరిమానాను తిరువళ్లూరు అటవీశాఖ అధికారులు విధించారు. తిరువళ్లూరు జిల్లా పూండి–నయపాక్కం ప్రాంతంలో కాపు అటవీ ప్రాంతం వుంది. ఈ ప్రాంతానికి చెందిన రమేష్ అతడి భార్య పూచ్చియమ్మాల్ ఇద్దరు పూండి కాపు అటవీ ప్రాంతానికి వెళ్లి కాకులను వేటాడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఫారెస్టు రేంజర్ అరుల్నాథన్ నేతృత్వంలోని అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో ఇద్దరు నయపాక్కం గ్రామానికి చెందిన వారు. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు వున్నట్టు గుర్తించారు. వీరు నిత్యం కాకులను వేటాడి తింటున్నారని విక్రయించడం లేదని రమేష్ అటవీశాఖ అధికారులకు వివరించారు. దీంతో అటవీ శాఖ అధికారులు రమేష్ వద్ద వున్న 19 కాకులను స్వాధీనం చేసుకుని వాటిని అక్కడే పూడ్చివేశారు. అనంతరం నిషేదిత అటవీప్రాంతంలో ప్రవేశించారన్న నెపానికి ఐదువేల రూపాయలను జరిమాన విధించి వారిని పంపించారు. ఈ సంఘటనపై రేంజర్ స్పందిస్తూ పూండిలో కాకులను వేటాడి చైన్నెలోని రోడ్డు సైడ్ బిరియానీ సెంటర్లకు విక్రయించారన్న విషయంపై విచారణ తమ పరిధిలోకి రాధన్నారు. కాకులను వేటాడిన దంపతులు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్న నెపంతో రూ.5వేలు జరిమానా విధించి వదిలేశామన్నారు. -
ప్రభుత్వ అధికారిపై దాడి.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు మూడేళ్ల జైలు శిక్ష
జైపూర్: బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో, ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్, అతడి సహాయకుడు 2022లో ఫారెస్ట్ అధికారి రవి కుమార్ మీనాపై దాడి చేశారు. రాజావత్ తన మద్దతుదారులతో కలిసి డీసీఎఫ్ ఆఫీసులోకి వెళ్లి సదరు అధికారిని బెదిరింపులకు గురి చేసి... అనంతరం అధికారిపై చేయి చేసుకున్నారు. అయితే, ఓ పనికి సంబంధించి సదరు అధికారితో వాగ్వాదం తర్వాత ఆగ్రహానికి లోనైనా రజావత్.. దాడి చేశారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు అతని సహాయకుడు మహావీర్ సుమన్ కూడా ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాతో వైరల్ అయ్యాయి.అయితే, ఈ ఘటనపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) రవికుమార్ మీనా ఫిర్యాదు మేరకు రజావత్, సుమన్లపై 2022 మార్చి 31న ఐపీసీ సెక్షన్లు 332, 353, 34, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నయాపురా పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్బంగా తాజాగా రజావత్, సుమన్లకు ప్రత్యేక కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. సెక్షన్ 353 (ప్రభుత్వ అధికారి తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) సహా పలు సెక్షన్ల కింద కోర్టు వారిద్దరిని దోషులుగా నిర్ధారించారు. ఇదే సమయంలో దోషులకు ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించింది.దోషిగా తేలిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రజావత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై హైకోర్టులో అప్పీలు చేస్తాను. కోటలోని లాడ్పురా మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్-3 కింద అభియోగాల నుంచి విముక్తి పొందారని చెప్పుకొచ్చారు. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో రజావత్, సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అమ్మను ఎత్తుకుని కొండ దించిన ఆఫీసర్
-
నెలకు 5,000 ఖర్చు చేయలేక.. మొసళ్ల నదిలో వదిలేశారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఒక మొసలికి ఆహారంగా రోజుకు సుమారు అర కిలో మాంసం వరకు సరిపోతుంది. వీటికి రోజువిడిచిరోజు ఓ కిలో వర కు బీఫ్ ఆహారంగా వేస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం నెలకు ఎక్కు వలో ఎక్కువ రూ.ఐదు వేల వరకు.. ఏడాదికి రూ.60 వేలకు మించి ఖర్చు కావు. ఈ మాత్రం నిధులు లేవనే సాకుతో అటవీశాఖ అధికారులు మంజీరా అభయారణ్యం వద్ద ఉన్న మొసళ్ల పునరావాస కేంద్రాన్నే మూసివేశారు. ఈ కేంద్రంలో ఉన్న మొసళ్లను నదిలో వదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మూడింటిని కూడా మేపలేక..సంగారెడ్డికి సమీపంలో ఉన్న మంజీరా అభయార ణ్యం విభిన్న పక్షి జాతులకు నిలయం. మంజీరా డ్యాం వద్ద ఉన్న చిత్తడి నేలల్లో ఏటా వివిధ దేశాల నుంచి వలస పక్షులు కూడా వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ డ్యాంవద్ద అటవీశాఖకు సంబంధించి మొసళ్ల పునరావాస కేంద్రం ఉంది. ఇందులో రెండు ఆడ, ఒక మగ మొసలి ఉండేవి. వీటికి మేతకు నిధులు రావడం లేదని ఆ మొసళ్లను నదిలో వది లేసి ఈ కేంద్రాన్ని మూసివేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు ఖర్చు చేస్తుంటే, ఈ నామమాత్ర నిధులు రావడం లేదంటూ మొసళ్లను నదిలో వదిలేసి చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీస్తోంది.పెదవి విరుస్తున్న వన్యప్రాణుల ప్రేమికులుమొసళ్ల పునరావాస కేంద్రాన్ని మూసివేయడం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు, సందర్శకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యాం వద్దకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు కూడా ఈ అభయారణ్యానికి వస్తుంటారు. ఈ కేంద్రం మూసి ఉండటంతో వీరంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. కాంపా నిధులూ కేటాయించలేరా?వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కాంపా (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ) నిధులు మంజూరు చేస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.కోట్లలో నిధులు వస్తున్నప్పటికీ., ఈ మొసళ్ల సంరక్షణ కేంద్రానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
Mulugu District: బెంగాల్ టైగర్ వచ్చేసింది!
ములుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులపాటు కలవరం సృష్టించిన పులి ములుగు జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు దాటుకుంటూ మంగళవారం గోదావరి తీరం వెంబడి ఉన్న వెంటాపురం(కె) మండలంలోని బోదాపురంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తమ పరిధిలోని ట్రాపింగ్ కెమెరాలు, అడుగు జాడలు, సంచారానికి సంబంధించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలోకి వచ్చింది బెంగాల్ టైగర్గా గుర్తించారు. బెంగాల్ టైగర్ ఏజెన్సీలోకి రావడం ఇదే మొదటిసారి అని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ సంయోగానికి వచ్చి ఉంటే ఆడపులి ఏటూరునాగారం –కొత్తగూడ వైల్డ్లైఫ్ ఏరియాలో ఉండే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోకి వచ్చిన మగపులి గోదావరి తీరం దాటి వెంకటాపురం(కె) మండలం, మంగపేట మండలం చుంచుపల్లి ఏరియా మీదుగా మల్లూరు గుట్టవైపు వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి జాడలను తెలుసుకోవడానికి గతంలో ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు ప్రస్తుతం వాటర్ పాయింట్ ఏరియాల్లో కెమెరాలను బిగించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పులి అలజడికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ కెమెరాల్లో క్యాప్చర్ కాలేదని అధికారులు చెబుతున్నారు. బెంగాల్ టైగర్ ఏజెన్సీలోకి ప్రవేశించిన విషయం తెలుసుకున్న గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.మేటింగ్ సీజన్..ప్రతీఏడాది చలికాలంలో పెద్దపులులు సంయోగం(మేటింగ్) కోసం సంచరిస్తూ ఉంటాయి. అటవీ రికార్డుల ప్రకారం మగపులి ఆడపులితో సంయోగం చెందడానికి వాసన ఆధారంగా ముందుకు అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో ఆడపులి సైతం మగపులి వాసనను పసిగడుతూ అటువైపుగా ఆకర్షితమవుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బెంగాల్ టైగర్గా భావిస్తున్న మగపులి ప్రతిరోజూ 20 కిలోమీటర్ల వరకు సంచరిస్తుంది. రాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ నుంచి 120కిలో మీటర్లు దాటి ములుగు జిల్లాలోకి వచ్చిందంటే ఈ పరిధిలో సంయోగానికి మరో ఆడపులి ఉండే ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు చెబుతున్నారు. పులి ఆరు రోజులుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఏజెన్సీలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పులి సంయోగ సమయంలో ఆందోళనగా ఉంటుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల ఆదివాసీ గూడేలు, గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో చలికాలంలో పులులు జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్లైఫ్ ఏరియాలో సంచరించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అయితే సంచార సమయంలో జిల్లాలోకి వచ్చిన పులుల్లో ఒకటి ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలికాగా, మరో రెండు పులులు(ఎస్–1), ఓ చిరుత పులి క్షేమంగా అడవులను దాటుకుంటూ వాటి వాటి గమ్యస్థానాలను చేరుకున్నాయి.ఉచ్చులకు బలికాకుండా చూసేందుకు ప్రయత్నాలు2022లో ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోకి వచ్చి గర్భంతో ఉన్న పులి(ఎస్–1) వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలోకి వచ్చిన అరుదైన జాతికి చెందిన బెంగాల్ టైగర్ ఎక్కడ వేటగాళ్ల ఉచ్చులకు బలవుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ముందడుగు వేసి వేటగాళ్లగా గతంలో రికార్డుల్లో ఉన్న వారితో పాటు గ్రామాల వారీగా హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం.ప్రజలు భయాందోళనకు గురికావొద్దుజిల్లాలోకి బెంగాల్ టైగర్ ప్రవేశించిన మాట వాస్తవం. ప్రస్తుతం మంగపేట మండలం చుంచుపల్లి– మల్లూరుగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించాం. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఉదయం, సాయంత్రం పూట పంట పొలాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఒంటరిగా వెళ్లొద్దు. సాధ్యమైనంత వరకు గుంపులు, గుంపులుగా ఉండడం మంచింది. ఎక్కడైనా పులి సంచారం వివరాలు తెలిస్తే వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించాలి. అటవీ శాఖ అధికారులు ప్రజలకు అండగా ఉంటారు.– రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ -
ఆంధ్రా ఒడిషా బోర్డర్లో పెద్దపులి కలకలం
సాక్షి,శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి కదలికలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. కాశీబుగ్గ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఏ.మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం మండలంలోని పలు గ్రామాలలో పులి కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.ఒంటరిగా రాత్రిపూట పొలాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు.ఇటీవలే ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.ఇదీ చదవండి: AP: ఆమెకు టెర్రర్ -
మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచరించినట్లు నిన్న (శుక్రవారం) సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఆ వీడియోపై అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు. మియాపూర్ సంచరించింది చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు నిర్ధారించారు. శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ సంచరించిన జంతువు.. చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: కలెక్టర్..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు? -
నంద్యాలలో చిరుత సంచారంతో కలకలం?
నంద్యాల జిల్లా: జిల్లా మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అయితే స్థానికులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాద ముద్రలు సేకరించారు. పాదముద్రలు సరిగ్గా లేకపోవడంతో.. అది పులినా లేక మరేదైనా జంతువు అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసతమైతే కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, కొద్ది నెలల క్రితం నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చిరుత సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. -
జీపీఎస్ ట్రాకర్తో రాబందు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నాలుగు రోజులుగా కెమెరా లేని జీపీఎస్ ట్రాకర్తో తిరుగు తున్న రాబందును అటవీశాఖ అధికారు లు గురువారం చిన మిడిసిలేరు ప్రాంతంలో పట్టుకున్నారు. ఆదివారం నీరసంగా, కదల్లేని స్థితిలో నాయకకాలనీలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో ఈ రాబందు కనిపించగా స్థానికులు మాంసాహారం పెట్టగా తినేసి వెళ్లిపోయింది. ఈ విషయం బయటపడటంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మహారాష్ట్రకు చెందిన ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ వారు నాగపూర్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఆగస్టు 10న ఇలాంటి రాబందులను వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ రాబందు ఎక్కువ దూరం వెళ్లలేకపోతుండటాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించిన అక్కడి అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్లు తెలిసి అటవీశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వగా చర్ల రేంజ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రేంజ్ కార్యాలయానికి తరలించి ఆహారం అందించి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ రాబందు తిరుగుతుండటంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపించారనే చర్చ జరిగింది. చివరకు పరిశోధనల కోసం విడిచిపెట్టినట్లు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
UP: తోడేళ్ల దాడుల వెనక ప్రతీకార కోణం!
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా తోడేళ్ల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు.అయినా ఇవి కొన్ని గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ తోడేళ్ల దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో చిన్నారులనే టార్గెట్ చేస్తున్నాయి ఈ తోడేళ్ల గుంపు.అయితే తాజాగా ఈ తోడేళ్లు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయని అన్నారు. ‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలు, పల్లలకు హాని తలపెడితే.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయి. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చనే అనుమానం ఉంది’’ అని ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.బహ్రైచ్లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని, ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. -
అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. కానీ!: బెంగాల్ మంత్రి
కోల్కతా: అటవీశాఖ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు దిగివచ్చరు. జైళ్లశాఖ మంత్రి పదవికి ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపించారు. అయితే తాను సీఎం మమతా బెనర్జీకి తప్ప మరో అధికారికి(అటవీ అధికారిణికి) క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పారు.‘నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించాను. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. కేవలం నేను ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతాను. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వాళ్ళు ఎలా హింసిస్తున్నారో చూసి చలించిపోయాను. నేను ఒక అనుచిత పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. కానీ నేను చెప్పిన దాని కోసం క్షమాపణలు చెప్పలేను. నేను ఏం చేసినా ప్రజల కోసమే’ అని గిరి అన్నారు. అయితే పుర్బా మేదినీపూర్ జిల్లాలోని తాజ్పూర్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దుకాణాలు ప్రారంభించేందుకు చిన్నతరహా వ్యాపారుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు.కాగా రామ్నగర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిల్ గిరి మమతా మంత్రివర్గంలో జైళ్లశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1998లో టీఎంసీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తాను సహనం కోల్పోవడానికి దారీతిసన పరిణామాలను సీఎంకు వివరంగాచెబుతానని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని గిరి మీడియా అడగ్గా.. 2026 వరకు తన పదవీకాల ఉందని, అప్పటి వరకు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తానని తెలిపారుఇదిలా ఉండగా మంత్రి అఖిల్ గిరి అదివారం అటవీ శాఖ మహిళా అధికారి మనీషా సాహుపై బెదిరింపులకు పాల్పడ్డారు. తేజ్పుర్ బీచ్ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. దీంతో మంత్రి గిరి స్థానికుల సమక్షంలో మహిళా అధికారిపై మాటల దూషణలకు దిగారు. మనీషా సాహు పదవీకాలన్ని తగ్గించాలని హెచ్చరించారు. అధికారిని బెదిరించిన వీడియో వైరల్గా మారడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వ్యవహారం సీఎం మమతా వరకు చేరింది. దీంతో ఆమె మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాడలని, అంతేగాక మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆదేశించారు. -
అటవీ అధికారులపై గిరిజనుల దాడి
-
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం
సాక్షి, నాగర్కర్నూల్: అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చెంచులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న తాము బయటకు వెళ్లి బతకలేమని, తాము అడవిలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అడవుల్లో పులులకు ఆటంకం లేకుండా జనసంచారాన్ని తగ్గించడంతోపాటు మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే పేరిట నట్టడవిలోని చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న సార్లపల్లి చెంచుపెంట వాసులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లా డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ నుంచి రీలొకేషన్కు అనుమతి రావడంతో ఈ నెల 5న గ్రామస్తుల నుంచి ఒప్పందాలపై సంతకాల సేకరణ ప్రారంభించింది. రీలొకేషన్లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, లబ్ధిదారుల మధ్య ఎంఓయూ కోసం అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2–3 నెలల్లోనే సార్లపల్లి వాసుల రీలొకేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సార్లపల్లి తర్వాత విడతల వారీగా కుడిచింతలబైల్, కొల్లంపెంట, కొమ్మెనపెంట వాసులను సైతం అడవి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను చెంచులు వ్యతిరేకిస్తున్నారు. తమను అడవి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మల్లాపూర్ పెంటలోని చెంచుల ఆవాసాలు ఎనీ్టసీఏ ద్వారా పునరావాస ప్యాకేజీ.. అయినా చెంచులు విముఖం అడవి లోపల నివసిస్తున్న వారిని బయటకు తరలిస్తే ఒక్కో కుటుంబానికి ఎన్టీసీఏ ద్వారా రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనుంది. వీరి పునరావాసం కోసం నాగర్కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద అటవీశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. రూ.15 లక్షల ప్యాకేజీ వద్దనుకుంటే బాచారం వద్ద 220 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం, జీవనోపాధి కోసం 5 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేస్తారు. సార్లపల్లిలో 269 కుటుంబాలు ఉండగా, వాటిలో 83 కుటుంబాలే చెంచులు. మిగతా కుటుంబాల్లో ఇతర వర్గాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎనీ్టసీఏ ప్యాకేజీకి ఇప్పటివరకు 186 కుటుంబాలు ఒప్పుకోగా వాటిలో చెంచు కుటుంబాలు ఆరే ఉన్నాయి. అడవి నుంచి బయటకు తరలింపునకు మెజార్టీ శాతం చెంచు కుటుంబాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలకు దూరం.. నల్లమల అటవీప్రాంతంలో మొత్తం 88 ఆవాసాల్లో చెంచులు నివసిస్తున్నారు. వీటిలో 20 ఆవాసాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్నాయి. అడవిలో అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడి చెంచులు కనీస మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదు. అడవిలో ఉన్న అప్పాపూర్ గ్రామ పంచాయతీ మినహా మరెక్కడా చెంచుపెంటల్లో కనీసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల లేవు. మేం అడవిలోనే ఉంటాం.. బయటకు పోలేం ఏళ్లుగా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మేం బయటకు పోయి జీవించలేం. మా వల్ల వన్యప్రాణులు, పులులకు ఎలాంటి హాని లేదు. ఇప్పుడు కూడా ఉండదు. దయచేసి మమ్మల్ని అడవి నుంచి విడదీయద్దు. మేమంతా అడవిలోనే ఉంటాం. –చిగుర్ల లింగమ్మ, చెంచు మహిళ, సార్లపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా మమ్మల్ని ఆగం చేయొద్దు.. అడవిలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఆగం చేయద్దు. మేం బయటి ప్రపంచంలో బతకలేం. బాచారం లాంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఏజెన్సీ నియమాలు, హక్కులు వర్తించవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచులు మాకంటే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. – కుడుముల మల్లేశ్, చెంచు యువకుడు, సార్లపల్లి స్వచ్ఛందంగా ముందుకొస్తేనే.. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసమే స్థానికులకు మరోచోట పునరావాసం కలి్పస్తున్నాం. రీ లొకేషన్లో ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే తరలింపు ఏర్పాట్లు చేస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ జిల్లా -
Tripura: అక్బర్, సీత సింహాలు.. త్రిపుర సర్కారు కీలక నిర్ణయం
అగర్తల: మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని వివాదాస్పద పేర్లు పెట్టిన ఉదంతంలో త్రిపుర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ విషయంలో బాధ్యున్ని చేస్తూ ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( వైల్డ్లైఫ్ అండ ఎకో టూరిజం) ప్రబిన్ లాల్ అగర్వాల్ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సింహాలకు పెట్టిన పేర్లు హిందూ మతస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఇప్పటికే కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఉన్నతాధికారి సస్పెన్షన్ నిర్ణయం తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి తీసుకువచ్చిన రెండు సింహాల్లో మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని త్రిపుర సెపాయిజాలా జూ అధికారులు పేర్లు పెట్టారు. ఇది వివాదస్పదం అవడంతో వీహెచ్పీ కోర్టుకు వెళ్లింది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు -
పక్కా ప్లాన్తోనే...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశువులను చంపుతున్నాయన్న ప్రతీకారంతోనే కొందరు పులులను మట్టుబెట్టుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుమురంభీం జిల్లా కాగజ్నగర్ డివిజన్లో రెండు పులుల్లో ఒకటి స్పష్టంగా ఇదే కారణంగా చనిపోయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. తమ పశువులను చంపి తింటున్న పులులను లేకుండా చేయాలని భావించి వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన పశువు యజమాని, ముగ్గురు పశువుల కాపరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇందుకోసం ఉచ్చులు, విష ప్రయోగం కూడా చేసినట్టు తెలుస్తోంది. కళేబరంపై గడ్డి మందు చల్లి.. ఇటీవలే ఓ రైతుకు చెందిన పశువును పులి చంపి తినేసింది. సాధారణంగా ఒకసారి వేటాడితే, పులి ఆ మాంసాన్ని వారం దాకా భుజిస్తుంది. మళ్లీ వస్తుందని తెలుసుకొని ఎద్దు కళేబరంపై గడ్డి మందు చల్లి మట్టుబెట్టారు. మొదట ఉచ్చులు కూడా వేసినట్టు సమాచారం. గడ్డి మందు చల్లిన పశువు కళేబరాన్ని తిని ఎస్9 మగపులి చనిపోగా, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎస్6కు చెందిన రెండు పిల్లల జాడ ఇంకా తెలియదు. వాటిని ట్రేస్ చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ పులిపై ఎలా విష ప్రయోగం చేశారో నలుగురు నిందితులు బుధవారం అడవిలో అధికారుల ముందు యథాతథంగా చేసి చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన పశువుల రైతుల వివరాలు అటవీ అధికారులు సేకరిస్తుండగా, నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కాగజ్నగర్ పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. పరిహారంలో జాప్యం కాగజ్నగర్ రేంజ్ దరిగాం, సర్కెపల్లి పరిధిలోనే ఆరు పులులు ఉన్నాయి. తరచూ పశువులపై దా డులు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం పశువుల విలువ మేరకు వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో పశువులను చంపుతున్నాయనే కోపంతోనే కొందరు విష ప్రయోగం చేసి పులుల మరణానికి కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి.పులుల సంరక్షణ పకడ్బందీగా చేస్తున్నామని చెప్పే అధికారులు కిందిస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో పశువుపై దాడి రెండు రోజుల క్రితం కాగజ్నగర్ రేంజ్ ఉట్పల్లి శివారులో ఓ పశువును పులి చంపేసింది. అప్రమత్తమైన అధికారులు కెమెరాలు బిగించారు. అక్కడకు మళ్లీ భుజించేందుకు పులి వస్తే ట్రేస్ అవుతాయి. ఇక్కడ సంచరించే ఆరింటిలో రెండు చనిపోగా, మరో నాలుగింటి జాడపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అటవీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
చిరుత కలకలం: బయటికి రావద్దంటూ పోలీసుల హెచ్చరికలు
న్యూఢిల్లీలోని సైనిక్ ఫాంహౌజ్లో చిరుతపులిసంచారం కలకలంరేపింది.శనివారం తెల్లవారుఝామునరాత్రి వాహనదారులకు కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక వీడియోలో, చిరుతపులి గోడపై నుండి దూకి అడవిలోకి పారిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, రాత్రి బయటకు రావద్దంటూ ప్రకటన జారీ చేశారు. ఫాంహౌజ్కు కొద్ది దూరంలో చిరుత సంచారంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారి సుబోధ్ కుమార్ సమాచారం ప్రకారం చిరుత గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో రెండు కేజ్లను ఏర్పాటు చేయడం తోపాటు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 80-90 కిలోల బరువున్న పూర్తిగా పెరిగిన చిరుతపులి అని తెలిపారు. అటవీ, ఢిల్లీ పోలీసులకు చెందిన 40 మంది సిబ్బందిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అధికారి తెలిపారు. అలాగే ఫాంహౌజ్ వైపు ఎవరూ వెళ్లకుండా స్థానికులను అప్రమత్తం చేశామని ట్రాప్ బోనులను ఏర్పాటు చేసి, వాటి సమీపంలో గుమిగూడ వద్దని ప్రజలకు సూచించినట్లు తెలిపారు. ట్రాప్ బోనులకు సమీపంలో గుమిగూడవద్దని ప్రజలకు సూచించినట్లు పోలీసు అధికారి తెలిపారు.. ఇందులో భాగంగానే అందరూ ఇళ్లనుంచి బయటికి రావద్దని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం. #WATCH | Announcements are being made in Delhi's Sainik Farm area urging people to stay indoors after a leopard was spotted in the area, earlier today. https://t.co/P4nFo6i3rx pic.twitter.com/HzKnabl7qB — ANI (@ANI) December 2, 2023 -
వలలో చిక్కి.. చెట్టుకు వేలాడిన చిరుత
అడ్డతీగల: కోతుల బెడద నివారణ కోసం వరి చేను చుట్టూ అమర్చిన వలలో చిక్కిన చిరుత పులి తప్పించుకుపోవడానికి చెట్టు పైకి ఎక్కి.. దానికి వేలాడుతూ రాత్రంతా అవస్థ పడింది. అటవీ అధికారులు వచ్చి రక్షించినా.. తీవ్ర గాయంతో చివరకు ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం శివారున రేగులపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం రేగులపాడు వద్ద చెట్టుకు వేలాడుతున్న చిరుతను చూసిన స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంపచోడవరం డీఎఫ్వో జీజీ నరేంద్రన్, అడ్డతీగల సబ్ డీఎఫ్వో బి.శ్రీరామారావు, అడ్డతీగల రేంజి అధికారి షేక్ షెహన్షా, ఎస్ఐ అప్పలరాజు ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వల నడుముకు చుట్టుకుపోయి వేలాడుతున్న చిరుతను రక్షించేందుకు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం జూ నుంచి రెస్క్యూ టీంని రప్పించి రాజమహేంద్రవరం నుంచి బోను తెప్పించారు. రాత్రి నుంచి చెట్టుకు వేలాడడంతో చిరుత అలసిపోయిన విషయం గమనించి.. ట్రాక్టర్లో నిచ్చెన ఉంచి దాని మీద ఆధారపడి చిరుత సేదతీరేలా చేశారు. మంచినీటిని అందించారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను బోనులోకి చేరవేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం చిరుత మరణించింది. దీంతో అటవీ అధికారులు పోస్ట్మార్టం నిర్వహించి ఘటనా స్ధలంలోనే చిరుతను దహనం చేశారు. కొన్నిగంటల పాటు వల నడుం చుట్టూ చుట్టుకుపోవడంతో చిరుత పెనుగులాడటం, ఆహారం లేక నీరసించి పోవడంతో మృతి చెందిందని డీఎఫ్వో నరేంద్రన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతలు మరిన్ని ఉండవచ్చని, ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
తిరుమలలో చిరుతను ట్రాప్ చేసిన అటవీశాఖ అధికారులు
-
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. మూడు నెలల వ్యవధిలో బోనులో చిక్కిన ఐదవ చిరుత ఇది. నరసింహ ఆలయం- ఏడవ మైలు రాయి మధ్య ఏర్పాటు చేసిన ట్రాప్లో ఈ చిరుత చిక్కినట్లు అటవీ శాఖఅధికారులు తెలిపారు. నాలుగు రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దీని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్లో చిక్కింది. ఇక కాసేపట్లో అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ చైర్మన్ భూమన చిరుతను బంధించిన ప్రాంతానికి వెళ్తున్నట్లు సమాచారం. ఇక.. తిరుపతిలో 'ఆపరేషన్ చిరుత’ కొనసాగుతోంది. తాజాగా చిక్కిన చిరుతతో కలిపి ఐదింటిని అధికారులు బంధించినట్లయ్యింది. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. భద్రతే ప్రధాన ప్రాముఖ్యత.. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. సక్సెస్ అవుతున్నారు. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, తాజాగా.. సెప్టెంబర్ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. ఇదీ చదవండి: కర్ర పంపిణీపై విమర్శలు.. స్పందించిన టీటీడీ -
తిరుమల: ఎట్టకేలకు చిక్కిన చిరుత.. ఆపరేషన్ సక్సెస్
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కింది. దీంతో ఇకపై నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా సంచరించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో చిరుత.. బోను దాకా వచ్చిపడకుండా పోతోంది అది. అలా వారం గడిచింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిక్కింది. ఈ చిరుత పట్టివేతతో.. ఆపరేషన్ చిరుత ముగిసినట్లేనని అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో.. ఇకపై భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించే అవకాశం ఉందని అంటున్నారు. టీటీడీ అప్రమత్తత చిన్నారి కౌశిక్పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. విజయవంతమయ్యారు. మరో 500 ట్రాప్ కెమెరాల ఏర్పాటు చిరుత చిక్కిన ప్రదేశాన్ని సీసీఎఫ్వో నాగేశ్వరరావు పరిశీలించారు. ‘‘చిరుతను ఎస్వీ జూపార్క్కు తరలించాం. ఇది మగ చిరుత. రెండేళ్ల వయసుంది. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు నిరంతరం ఉంటాయి. నడకమార్గంలో ప్రస్తుతం 300 కెమెరాలు ఉన్నాయి. మరో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. -
ఫారెస్ట్ అధికారిపై చర్యలకు ఓకే చెప్పిన హైకోర్టు
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక సంస్థలపైనా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని, అడవులు, సరస్సులు, నదులు, అన్ని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులు, ప్రభుత్వాలపై ఉందని పేర్కొంది. రంపపు కోత మిల్లులను అటవీ ప్రాంత పరిధి నుంచి తరలించే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో కర్నూలు ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేసిన చాణిక్యరాజు అనే అధికారిపై చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. చాణిక్యరాజుకు ఊరటనిస్తూ ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) 2017లో ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారానికి ఆరు నెలల్లో తార్కిక ముగింపు తీసుకురావాలని సూచించింది. -
పులి మాంసం రుచి చూద్దామని..!
కర్ణాటక: కొందమాల్ జిల్లా బల్లిగుడా రేంజ్, తుమ్మిదిబందో పోలీస్ స్టేషన్ పరిధిలోని రైకియా అటవీ ప్రాంతంలో పులిని వేటాడి హతమార్చి, మాంసం తిందామనుకున్న 13మంది ప్రబుద్ధులను అటవీశాఖ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బల్లిగుడ అటవీ ప్రాంతంలో రైకియా గ్రామస్తులు బుధవారం రాత్రి ఉమ్మడిగా పులిని వేటాడారు. అనంతరం గ్రామం సమీపంలోని తోటలో అంతా కలిసి వాటాలు వేసుకున్నారు. ఇంటికి తీసుకు వచ్చి, కమ్మగా వండుకున్నారు. ఎట్టకేలకు.. పులి మాంసం రుచి చూద్దామనుకొని సిద్ధమవుతున్న సమయంలో విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ, పోలీసులు అధికారులు దాడి చేశారు. ఈ మేరకు 13మంది గ్రామస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పులి చర్మం, గోళ్లు, ఇతర అవయవాలు, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పులి వయస్సు, బరువు ఇతర వివరాలేమీ తెలియలేదు .ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. జింక మాంసం.. కిలో రూ.1500లు రాయగడ: రాయగడ రిజర్వ్ ఫారస్ట్లో జింకను వేటాడి, మాంసాన్ని విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆశాఖ డిప్యూటీ రేంజర్ సంజయ్కుమార్ సాహు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయగడ సమీపంలోని మానిక్జోల గ్రామంలో జింక మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ అధికారి గౌరీశంకర్ సాహు, గార్డు సంతోష్ పాణిగ్రాహి, సిబ్బంది దాడులు నిర్వహించారు. పితామహల్ గ్రామానికి చెందిన మాధవ ఉలక(43), మానిక్జోలకు చెందిన మాధవ ఉలక(41) వేటాడి తెచ్చిన జింక మాంసాన్ని గ్రామంలో కిలో రూ.1,500ల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. నిందితుల్లో కొంతమంది పరారు కాగా, ఇద్దరు పట్టుబడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరు పరిచారు. వారినుంచి 3కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఆదర్శంగా నిలుస్తున్న ఫారెస్ట్ అధికారి మమతా ప్రియదర్శి
డ్యూటీ సమయంలో బుద్ధిగా కూర్చుని తమ పని తాము చేసుకుని సమయం అయిపోగానే ఇంటికి వెళ్లిపోయే అధికారులు కొందరయితే, ఆఫీసు పని వేళల తరవాత కూడా పని గురించి ఆలోచించి వినూత్న నిర్ణయాలతో అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమతా ప్రియదర్శి. పర్యావరణం గురించి అవగాహన కల్పించడంతో పాటు జంతువులకు మనుషులకు మధ్యన సంధి కుదురుస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. జంషెడ్పూర్ డివిజినల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తోంది మమతా ప్రియదర్శి. ఫారెస్ట్ అధికారిగా అడవులను సంరక్షించడంతో పాటు పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. ప్రకృతి ప్రాముఖ్యత, కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ రేపటి పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న మార్పులు, నీటి సంరక్షణ, మనుషులు– జంతువుల మధ్య ఏర్పడే సంఘర్షణలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రకాల డాక్యుమెంటరీలను ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా 347 గ్రామాలు, వివిధ స్కూళ్లలో ప్రదర్శించిన డాక్యుమెంటరీలతో రెండున్నర లక్షలమందికిపైగా అవగాహన కల్పించింది. వ్యాన్కు పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి చెబుతున్నారు. ఈ కార్యక్రమం గురించి ఆమె మాటల్లోనే... ‘‘ఈ మధ్యకాలంలో తరచూ అడవుల్లో మంటలు రేగి చాలా వృక్షాలు కాలిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. అసలు అడవులు ఎందుకు తగలబడుతున్నాయో కూడా ఈ చుట్టుపక్కల నివసిస్తోన్న చాలామందికి తెలీదు. ఏనుగులకు, మనుషులకు మధ్య తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటన్నింటిని అధిగమించడానికి తీసుకొచ్చిందే ఈ కార్యక్రమం. అందుకే ఆడియో–వీడియో జంతువులకు ఎలాగూ అర్థం చేయించలేము. మనమే అర్థం చేసుకుని వాటికి అడ్డు తగలకుండా, మూగజీవాలు మనకి ఇబ్బంది కలిగించకుండా మనమే సర్దుకుపోవాలి. అందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ... కూర్చోబెట్టి చెపితే ఎవరూ వినరు. అందుకే ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వారి ఆసక్తిని ఇటు మళ్లిస్తున్నాం. కొంతవరకైనా గుర్తుపెట్టుకుని పాటిస్తారు. ఈ డాక్యుమెంటరీలలో నాలుగు విభిన్న అంశాలపై వీడియోలు ప్లే చేస్తున్నాం. మనుష్యులు– జంతువుల సంఘర్షణ మొదటిది, రెండో వీడియోలో అడవులు తగలబడినప్పుడు ఏం చేయాలి... మూడో అంశంగా కర్బన ఉద్గారాలు విడుదలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. నాలుగో అంశం మొక్కల పెంపకం, మొక్కలను ఎలా కాపాడాలి, నీటిసంరక్షణ గురించి సరళమైన భాషలో చెబుతున్నాం. వీటివల్ల విద్యార్థులు, గ్రామస్థులకు సులభంగా అర్థమవుతుంది. స్కూళ్లు, పబ్లిక్ ప్లేసుల్లో.. ఇప్పటిదాకా స్కూళ్ళతో పాటు, గ్రామాల్లోని పబ్లిక్ పేసుల్లో వ్యాన్ వీడియోలు ప్లేచేసి వీలైనంత అవగాహన కల్పించాం. పాఠ్యపుస్తకాల్లో సిలబస్ కాకుండా కొత్త విషయాలు తెలుసుకున్నందుకు వాళ్లు చాలా సంతోషపడుతున్నారు. -
తిరుమల: బోనులో చిక్కిన చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు. నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి(శుక్రవారం, జూన్ 23) 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడినట్లు తెలుస్తోంది. డీఎఫ్వో ఏమన్నారంటే.. బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుతను బంధించాం. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ చిరుతను ఇంకా వేటాడడం పూర్తిగా అలవాటు కాలేదు అని డీఎఫ్వో తెలియజేశారు. చిన్నారి కౌశిక్ను పరామర్శిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పక్కన చికిత్స అందిస్తున్న వైద్యుడు తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇదీ చదవండి: గోవధ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? -
అనుమానాస్పద స్థితిలో మూడు చిరుతల మృతి
సాక్షి, చైన్నె: తమిళనాడు, నీలగిరి జిల్లా కూడలూరు అటవీ ప్రాంతంలో మూడు చిరుతలు మృతిచెందాయి. అనుమానాస్పద స్థితిలో ఈ మరణాలు ఉండడంతో అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. నీలగిరి జిల్లా కూడలూరు పరిధిలో బంధిపుర పులుల అభయారణ్యం ఉంది. ఇక్కడి మంగళ గ్రామంలో ఏడాది వయస్సు ఉన్న ఓ చిరుత మరణించినట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. చిరుతల మధ్య గొడవ జరిగిన తరహాలో ఆ పరిసరాలు ఉండడం, దాడిలో ఈ చిరుత మరణించి ఉంటుందని భావించారు. పోస్టుమార్టం సైతం నిర్వహించారు. అదేసమయంలో కూత వేటు దూరంలోని తేహం అనే ప్రాంతంలో మరో మగ చిరుత మృతదేహం బయటపడింది. ఈ రెండు చిరుతలు పరస్పరం దాడి చేసుకుని మరణించి ఉంటాయని భావించారు. అయితే, ఇక్కడికి సమీపంలోని కుందలుపేట వద్ద మరో చిరుత మరణించి ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇది విషంతో కూడిన మాంసం తినడంతో మరణించినట్ట విచారణలో తేలింది. ఈ చిరుతలు మరణించి మూడు రోజులై ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో సిబ్బంది విచారిస్తున్నారు. -
ముచ్చెమటలు పట్టిస్తున్న ‘అరి కొంబన్’
సాక్షి, చైన్నె: తమిళ అటవీ అధికారులను అరి కొంబన్ ఏనుగు ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిని పట్టుకునేందుకు అధికారులు ఉరకులు.. పరుగులు తీస్తున్నారు. అయితే దీనికి మత్తు మందు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల ఈ ఏనుగును పట్టుకునే సమయంలో కేరళ అధికారులు అనేక డోస్లుగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో మరోసారి ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. వివరాలు.. కేరళను వణికించిన అరి కొంబన్ఏనుగు ఆదివారం తమిళనాడు సరిహద్దులోని తేని జిల్లా కంబం పట్టణంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ ఏనుగు వీరంగం సృష్టిస్తుండడంతో దీనిని అడవిలోకి తరిమేందుకు వందలాదిగా అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. కంబం పట్టణం ఈ ఏనుగు పుణ్యమా నిర్మానుష్యంగా మారింది. ఉదయాన్నే ఈ ఏనుగు కంబం నుంచి వీడి పొరుగున ఉన్న సురులి పట్టి గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఈ ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి నిర్ణయించినా, చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది వరకు ఈ ఏనుగును కేరళ అధికారులు పట్టుకునే క్రమంలో పలు డోస్లుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు తేలింది. ప్రస్తుతం మళ్లీ ఇంజెక్షన్ ఇచ్చిన పక్షంలో ఏనుగు ఆరోగ్యానికి ఏదేని ముప్పు తప్పదేమో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మంత్రి సమీక్ష.. ఈ ఏనుగును అడవిలోకి తరిమి కొట్టడం లేదా, ఎలాగైనా పట్టుకునే విధంగా కుంకీలను రంగంలోకి దించారు. కోయంబత్తూరు జిల్లా ముదుమలై శరణాలయం నుంచి స్వయంబు అనే ఏనుగుతో పాటుగా మరో రెండు కుంకీలను రంగంలోకి దించారు. ఈ మూడు కుంకీలు సురులి పట్టి పరిసరాలల్లో తిష్ట వేశారు. అరి కొంబన్ను మచ్చి చేసుకునే విధంగా కుంకీలు ప్రయత్నాల్లో ఉన్నాయి. అరి కొంబన్ రూపంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడంతో పాటుగా దానిని పట్టుకునేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక ఆపరేషన్పై అటవీ శాఖ మంత్రి మది వేందన్ దృష్టి పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం అటవీ, పోలీసు అధికారులు, కలెక్టర్లు, వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. అరి కొంబన్ను ఎలాగైనా పట్టుకుని తీరాలని నిర్ణయించారు. అలాగే, ఈ ఏనుగు కారణంగా ప్రాణ హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలను గ్రామంలో విస్తృతం చేశారు. -
ఉప్పు తప్పించును వేసవి ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వేసవి మండిపోతుండటంతో జంతువుల ఆరోగ్య పరిరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. మనుషుల్లాగే వన్యప్రాణులు కూడా శరీరంలో ఖనిజాల (మినరల్స్) శాతం తగ్గిపోతే అనారోగ్యం బారిన పడతాయి. రోజువారీ ఆహారంలో భాగంగా ఖనిజాలు.. కూడా సరిగా అందితేనే జీవ క్రియలు సజావు గా సాగుతాయి. అయితే అడవుల్లో బతికే జంతువులు సహజ సిద్ధంగా తినే మేత ద్వారా ఉప్పు (సోడియం)ను తీసుకుంటాయి. బండలు, కర్రల్ని, నీటి మడుగుల వద్ద మట్టిని నాకుతూ శరీర సమతాస్థితిని కాపాడుకుంటాయి. అయితే గతంలో కంటే ప్రస్తుతం సహజసిద్ధ ఉప్పు లభ్యత తగ్గిపోయింది. మరోవైపు వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా మరింత ఎక్కువగా మినరల్స్ అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో తగినంత ఉప్పు అందకపోతే వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీని ని దృష్టిలో ఉంచుకుని వాటి ఆవాసాల్లోనే నీటి కుంటల వద్ద అధికారులు ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో ఈ పద్ధతిలో జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మట్టి, ఉప్పును కలిపి.. సహజమైన ఉప్పు, చెరువు మట్టి రెండింటినీ కలిపి (70 శాతం ఉప్పు, 30 శాతం చెరువు పూడిక మట్టి) కుప్పలా తయారు చేస్తారు. ఒక అడుగు లేదా అడున్నర ఎత్తులో నీటి కుంటలకు సమీపంలో జంతువులకు కనిపించేలా ఉంచుతారు. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులు కాళ్లు, కొమ్ములతో కుప్పల్ని గీరుతూ, మట్టిలో ఉన్న ఉప్పును నాలుకతో చప్పరిస్తుంటాయి. ఒక దాన్ని చూసి మరొకటి అలా నాకుతూ ఉంటాయి. ఒక్కోసారి గుంపులుగా కూడా వస్తుంటాయి. అలా పదే పదే నాకడం వల్ల వాటికి అవసరమైనంత ఉప్పు లభిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలకు ప్రత్యేకంగా ఉప్పును నాకిస్తుంటారు. ఈ విధానాన్నే అధికారులు అడవిలో ఉపయోగిస్తున్నారు. మొదట మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఉప్పు గడ్డలను వాడేవారు. అయితే వాటి గడువు తేదీ, ప్రాసెస్ కారణంగా జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటవీ సిబ్బందే సాధారణ ఉప్పును మట్టితో కలిపి జంతువులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఖనిజ లోపం ఏర్పడకుండా.. వన్యప్రాణుల్లో ఖనిజ లోపం రాకుండా నీటికుంటల వద్ద ఉప్పు గడ్డలను ఏర్పాటు చేస్తున్నాం. దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మట్టిలో ఉన్న ఉప్పును అవి చప్పరిస్తున్నాయి. ఇది వాటి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. – ఎస్.మాధవరావు ఎఫ్డీవో, జన్నారం, మంచిర్యాల జిల్లా -
తప్పిపోయిన 'ఆశ'.. ప్రాజెక్టు చీతా బృందంపై గ్రామస్థుల దాడి
మధ్యప్రదేశ్ కునే నేషనల్ పార్క్లో ప్రాజెక్ట్ చీతా బృందంపై గ్రామస్థులు దాడి చేశారు. రక్షిత ప్రాంతం నుంచి తప్పిపోయిన చీత 'ఆశ' కోసం అధికారుల రాత్రి వేళలో గస్తీ నిర్వహించింది. ఈ క్రమంలో దారిదోపిడి దొంగలు అనుకుని స్థానిక గ్రామస్థులు ఆ బృందంపై దాడి చేశారు. ప్రాజెక్టు చీతాలో భాగంగా మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చీతాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో చీత ఆశ రక్షిత ప్రాంతం నుంచి బయటకు తప్పిపోయింది. చీత మెడకు కట్టిన జీపీఎస్ ట్రాకర్ను గమనిస్తూ ఫారెస్ట్ అధికార బృందం రాత్రి వేళలో గస్తీ నిర్వహిస్తోంది. బురఖేడా గ్రామ సమీపంలో చీత కోసం వెతుకుతున్నారు. గ్రామం చుట్టూ అప్పటికే నాలుగు సార్లు తిరిగారు. అయితే పశువులను దొంగలించిన ఘటనలు ఇటీవల ఆ గ్రామంలో జరిగిన నేపథ్యంలో.. చీత కోసం గాలిస్తున్న అధికారులను దొంగలని స్థానికులు భావించారు. అంతేగాక వారు ధరించిన దుస్తులు కూడా వారి అనుమానాలను మరింత పెంచాయి. దీంతో రాళ్లతో, కర్రలతో చీతా బృందంపై దాడి చేశారు గ్రామస్థులు. ఈ ఘటనలో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ వాహనం కూడా పాడైపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చదవండి: రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే.. -
కామారెడ్డి: ఫారెస్ట్ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అటవీ అధికారుల్ని తండా వాసులు బంధించారు. అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తండావాసుల్ని అడ్డుకోగా.. వాళ్లు ఉల్టా అధికారుల్ని బంధించారు. పోలీసుల కథనం ప్రకారం.. అక్కాపూర్ -మైసమ్మ చెరువు దుర్గమ్మ గుడి తండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండా వాసులు.. అధికారుల్ని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: నెహ్రూ ఓఆర్ఆర్ ప్రవేట్ చేతుల్లోకి.. -
హెటిరోలో చిక్కిన చిరుత
జిన్నారం(పటాన్చెరు): జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలోకి శనివారం వేకువజామున చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు హెటిరో డ్రగ్స్ హెచ్బ్లాక్లోకి చిరుత చొరబడింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిరుతను చూసి హెచ్బ్లాకులోని డోర్లను మూసి పరిశ్రమ యాజమాన్యం, అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. అటవీ అధికారులు చిరుతను పట్టేందుకు ఆపరేషన్ చేపట్టారు. మేకను ఎర చూపుతూ ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. హెచ్ బ్లాకులోని పై భాగంలో ఉన్న పైపులపై నిద్రించి ఉన్న చిరుతపైకి పైపుల ద్వారా నీటిని పడేలా ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కిందికి దిగి ఉరుకులు, పరుగులు పెట్టింది. అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి చిరుత వెళ్లకపోవటంతో జూపార్కుకు చెందిన వైద్యులు తుపాకి పేల్చి మత్తును ఎక్కించారు. స్పృహ కోల్పోవటంతో బోనులో బంధించి హైదరాబాద్లోని జూపార్కుకు తరలించారు. ప్రస్తుతం చిరుత యాక్టివ్గా ఉందని, ఎవరికీ ఎలాంటి నష్టం కలుగలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎఫ్ఓ శ్రీధర్రావు తెలిపారు. -
ఎఫ్ఆర్వో హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అటవీఅధికారి (ఎఫ్ఆర్వో) చళ్లమళ్ల శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలేంటో వివరించాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో అడవుల పరిరక్షణకు సంబంధించిన ఓ పిటిషన్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్ల ధర్మాసనం విచారణ చేసింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో చళ్లమళ్ల శ్రీనివాసరావు అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వార్తాపత్రికల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అడవుల పరిరక్షణ వ్యవహారంపై కోర్టు నియమించిన కేంద్ర సాధికారిత కమిటీ నుంచి నివేదికను తీసుకోవాలని సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అమికస్క్యూరీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే -
భద్రాద్రి కొత్తగూడెం ఏర్రబోడులోని గొత్తికోయలకు అటవీ అధికారుల నోటీసులు
-
అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారు ఎర్రబోడులో నివాసం ఉంటున్న గొత్తికోయలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఎర్రబోడుకు చెందిన ఇద్దరు గొత్తికోయలు ఈనెల 22న చేసిన దాడిలో ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనతో తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికింది. ఈ క్రమంలో బెండాలపాడు పంచాయతీ పాలకవర్గం సైతం గొత్తికోయలను ఈ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేసింది. ఇక ఆదివారం ఎఫ్డీఓ అప్పయ్య అధ్వర్యంలో వివిధ రేంజ్ల అధికారులు, సిబ్బంది సుమారు 50 మంది.. గొత్తికోయల ఇళ్ల వద్దకు వెళ్లి ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. కాగా తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించి, ఫొటోలు తీసుకుని అనంతరం వాటిని తొలగించారని గొత్తికోయలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని తొలుత అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటనపై ఎఫ్డీఓ అప్పయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. అడవి నుంచి ఖాళీ చేయాలని గొత్తికోయలకు నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఎఫ్ఆర్వో హత్యతో అడవిలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది భయపడుతున్నారని చెప్పారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం వారు అడవుల్లో ఉండేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే అందరికీ శిక్షా ? మా గూడెంలోని ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు చర్యకు మా అందరికీ శిక్ష విధిస్తారా. ఛత్తీస్గఢ్లో శాంతిభద్రతల పరిస్ధితి అధ్వానంగా ఉండగా ప్రాణభయంతో జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాం. పోడు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాం. మా తెగకు చెందిన పొడియం తుల, మడకం నంగా రేంజర్ శ్రీనివాసరావుపై దాడి చేసి హతమార్చడాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. వారు చేసిన తప్పునకు మేమంతా ఎందుకు శిక్ష అనుభవించాలి. మాకు ఇక్కడ రేషన్కార్డులు, ఆధార్కార్డులు, ఉపాధి పనుల కార్డులు ఇచ్చారు. ఓటుహక్కు కూడా కల్పించారు. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలతో మేం ఎక్కడికి వెళ్ళాలి. తెలంగాణ ప్రభుత్వం మాపై కనికరించాలి. – రవ్వ రమేశ్, గొత్తికోయ కులపెద్ద, ఎర్రబోడు -
అటవీ అధికారులు, సిబ్బందికి అండగా నిలవండి
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతునిచ్చి, భరోసా కల్పించాలని పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో సమావేశమై, వారి సమస్యలను పరిష్కరించాలని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో అటవీశాఖ, క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలపై డీజీపీ సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ ఆయా అంశాలను గురించి వివరించారు. -
పోడు సర్వేకు బ్రేక్.. విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోడు సర్వేకు బ్రేక్ పడింది. ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు హత్యను నిరసి స్తూ అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాఖ సిబ్బంది గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేయడంతో పాటు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే గాందీచౌక్లోని గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇక శుక్రవారం నుంచి డివిజన్, జిల్లా స్థాయిలో ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమ కు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేష న్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని నినదించారు. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ను బహిర్గతం చేయాల న్నారు. ఇక ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన దర్యాప్తును పారదర్శకంగా చేయా లని డిమాండ్ చేశారు. నిందితులను తామే పట్టు కుని పోలీసులకు అప్పగించినట్లు ఉద్యోగులు తెలిపారు. దరఖాస్తులపై గందరగోళం.. పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. దర ఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోడు సర్వే చివరి దశకు చేరిందని ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది చెబుతున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతలోనే ఎఫ్ఆర్ఓ హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి. పోడు సర్వేలో అటవీ సిబ్బంది కీలకం కాగా.. వీరు లేకుండా రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వేకు వెళ్లే అవకాశాలు లేవు. ఇదీ చదవండి: Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి -
Telangana: తుపాకులకు హోంశాఖ రెడ్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ రేంజ్, ఇతర అధికారులకు ఆయుధాలివ్వాలనే ప్రతిపాదనను గతంలోనే అటవీశాఖ నిశితంగా పరిశీలించింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపుతో పాటు, తమ అవసరాలకు తగ్గట్టుగా ఏ రకమైన ఆయుధాలు కావాలి అన్న దానిపైనా అధ్యయనం జరిపారు. సెల్ప్ లోడింగ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్) కోసం తయారీదారులను సంప్రదించే వరకు ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరాక.. హోంశాఖ అభిప్రాయం కోసం పంపించారు. అయి తే హోంశాఖ ఇందుకు నిరాకరించినట్లు అటవీ అధికారవర్గాల సమాచారం. అటవీ ప్రాంతాల్లోని అధికారులకు ఆయు« దాలు అందజేస్తే అవి తీవ్రవాదులు, నక్సలైట్లు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడే ప్రమాదముందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పోలీసుల సహకారం తీసుకోండి.. అటవీ అధికారులకు పోలీస్ స్టేషన్ మాదిరిగా ఒక స్టేషన్, ఆయుధాలు భద్రపరిచే ‘బెల్రూమ్’వంటివి లేకపోవడాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అదీగాక ఆయుధాలను ఉపయోగించడంలో అటవీ అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ లేకపోవడాన్ని కూడా హోంశాఖ ఎత్తిచూపినట్టు తెలుస్తోంది. ఏవైనా ఘటనలు జరిగితే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచిస్తూ ఈ ప్రతిపాదనను అటకెక్కించినట్లు సమాచారం. చదవండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?! -
28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్పై దాడి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావులపై కర్రలతో దాడి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య. తెలంగాణ రాష్ట్రంలో అడవుల సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై పగ పెంచుకున్న గొత్తికోయలు మంగళవారం ఆయనపై దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో.. ‘అటవీ సిబ్బందికి ఆయుధాలు’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అడవుల సంరక్షణ కోసం విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా శ్రీనివాసరావు హత్యతో చలించిన ఎఫ్ఆర్ఓల సంఘం నాయకులు ఆ యుధాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ’కార్య క్రమం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో 28 ఏళ్ల కిందట అటవీ, ఆబ్కారీ శాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత పదేళ్లుగా రెండు శాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు, పోడు భూముల సాగు నియంత్రణ సమస్యగా మారింది. 2013 సెప్టెంబర్ 15న నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పెంబిలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు 11 మంది సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్ఓ గంగయ్య (42)పై.. అక్కడున్న జనం గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఏడుగురిని గాయపరిచారు. అప్పుడున్న సీఎం కిరణ్కుమార్రెడ్డి అప్పటి అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డితో ఆయుధాల అప్పగింతపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక దాడులు జరగ్గా.. దాడులు జరిగినప్పుడు ఆయుధాల విషయం చర్చించడం ఆ తర్వాత మరిచిపోవడం ఓ తంతుగా మారింది. ‘పోడు’నేపథ్యంలో పెరుగుతున్న దాడులు ఒక వైపు అర్హులైన గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పోడు కోసం అడవులు నరుకుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి 4,14,219 దరఖాస్తులు రాగా.. అందులో 10.36 లక్షల ఎకరాలకు సంబంధించిన 3.59 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. భద్రాద్రి నుంచి 2,99,478 ఎకరాలపై 305 గ్రామాల నుంచి 83,663 అర్జీలు ఉన్నట్లు వరంగల్ సీసీఎఫ్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు పోడు భూముల సర్వే నేపథ్యం కూడా ఉండటంతో..ఈ అంశం భవిష్యత్తులో సర్వే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ ఆయుధాలు ఇస్తేనే పోడు భూముల సర్వే అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్రావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హ్యత నేపథ్యంలో ఎఫ్ఆర్ఓల సంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించకుండా పోడు భూముల సర్వేకు వెళ్లేది లేదు. ఆయుధాలు ఇవ్వాలని, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. – షౌకత్ అలీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం -
ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్కు అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావుపై దాడి ఘటనతో.. అటవీశాఖ సిబ్బంది డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో రేపటి నుంచి(గురువారం) నుంచి విధుల బహిష్కరణకు ఫారెస్ట్ సిబ్బంది పిలుపు ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినట్లే ప్రభుత్వం తమకూ ఆయుధాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరు అవుతామని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు వాళ్లు. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రకటన ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఖమ్మం ఈర్లపుడిలో గుత్తికోయల దాడిలో మరణించిన శ్రీనివాసరావుకు అంత్యక్రియలు ఇవాళ(బుధవారం) ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. ఫారెస్ట్ సిబ్బంది తమ నిరసన తెలియజేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు, శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడి అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు ఆయన తమ వద్ద ప్రస్తావించిన అంశాన్ని సైతం వాళ్లు లేవనెత్తారు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడుల అంశాన్ని చాలాకాలంగా ప్రభుత్వాల ముందు ఉంచుతున్నామని, ఈ పర్వంలో శ్రీనివాసరావు మృతి ఆఖరిది కావాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. ఈ క్రమంలో దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. -
చంద్రుగొండ మండలం బెండలపాడులో అటవీ అధికారిపై దాడి
-
కొమరం భీం జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలో పులి కలకలం
-
TS: మూడు జిల్లాలను వణికిస్తున్న మ్యాన్ ఈటర్స్
సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: చలితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను పెద్దపులి కూడా వణికిస్తోంది. పులి దాడిలో ఓ రైతు మృతి చనిపోవడంతో కలవరపాటుకి గురి చేస్తున్నాయి. పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని ఎనిమిది మండలాల ప్రజలను పులుల కదలికలు జనాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వాటిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం చేస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. గురువారం దాదాపు పన్నెండు గంటలపాటు పులి సంచారించిందన్న ప్రచారం.. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు ఉదయం పూట వాకింగ్కు వెళ్లడంపై ఆంక్షలు విధించారు పోలీసులు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ పహారా కాస్తున్నారు. బయటకి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చివరి సారిగా పులి జాడ తెలియగా.. టౌన్ దాటి పెద్ద వాగు గుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఖానాపూర్ శివారులో సిడాం భీము అనే వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది. ఆ పులే కాగజ్ నగర్లోనూ సంచరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక.. కాలి ముద్రల ఆధారంగా పులి ఆనవాలును నిర్ధారించుకునే యత్నం చేస్తున్నారు. ఇక పులి సంచారంతో స్థానికులు భయం భయంగా గడిపారు. తలుపులు తీయడానికే జనం వణికిపోతున్నారు. మూడు జిల్లాలు, 8 మండలాలు, 18 గ్రామాలను ఇప్పుడు మ్యాన్ ఈటర్స్ వణికిస్తున్నాయి. తొలుత మ్యాన్ ఈటర్స్ కాదని అధికారులు ప్రకటించినా.. ఖానాపూర్ రైతు మరణంతో ఆ భయం రెట్టింపు అయ్యింది. మరోవైపు అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోకారి దారిలో పులి కలకలం రేగింది. రోడ్డు దాటుతూ వాహనదారులకు పులి కనిపించిందన్న ప్రచారంతో అక్కడా భయం నెలకొంది. మైక్ల ద్వారా ప్రజలను బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. దహేగాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పులి పంజా విసిరినట్లు తెలుస్తోంది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. తీవ్ర యత్నం అటవీ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తమ ప్రయత్నం గురించి అధికారులు వివరిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 20 మంది ప్రత్యేక అటవీశాఖ టీంతో ట్రాకింగ్ చేస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో పులి సంచార ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నారు. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడ అటవీ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించారు. కోల్బెల్ట్లోనూ ప్రచారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోనూ పులి సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు, సింగరేణి కార్మికుల్లో భయాందోళన నెలకొంది. విషయం దృష్టికి రావడంతో.. శ్రీరాంపూర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పులి ఆనవాళ్లు కనిపించలేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఇదీ చదవండి: దళితబంధులో ఎమ్మెల్యేల జోక్యమా? -
Viral Story: తప్పతాగి పడిపోయిన ఏనుగుల గుంపు.. అందులో నిజమెంత?
సాక్షి, భువనేశ్వర్: ఏనుగులు తప్పతాగి పడిపోవడంమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని షిల్పాద గిరిజన గ్రామ ప్రజలు అదే చెప్తున్నారు. తాము నాటు సారా తయారీ కోసం పులియబెట్టిన ద్రావణాన్ని 24 ఏనుగుల గుంపు తాగేసి సోయి తప్పి పడిపోయాయని అంటున్నారు. స్థానిక గిరిజనులు చెప్తున్న వివరాల ప్రకారం.. షిల్పాదా జీడిమామిడి అడవిలోకి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లాం. అక్కడే తమకు మహువా (ఇప్ప పూలు) పువ్వులతో నాటు సారా తయారు చేసుకునే కుటీరం ఉంది. మొత్తం 24 ఏనుగుల గుంపు తమ కుటీరం వద్ద ఒక్కోటి ఒక్కోచోట పడుకుని ఉన్నాయి. అవి నిద్రకు ఉపక్రమించాయేమోనని తొలుత భావించాం. వాటిని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ, సారా తయారీకని మహువా పువ్వులను నీటిలో పులియబెట్టిన ద్రావణాన్ని అక్కడ నిల్వ ఉంచాం. అది కనిపించలేదు. ఆ కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. కొన్ని ఖాళీగా కనిపించాయి. అప్పుడు తెలిసింది.. అవి ఆ ద్రావణాన్ని ఫూటుగా సేవించి మత్తుగా పడుకుని ఉన్నాయని! వెంటనే విషయాన్ని అటవీ అధికారులకు తెలిపామని నిరయా సేథి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏనుగుల్లో 9 మగ, 9 ఆడ, 6 గున్నవి ఉన్నాయని వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!) అటవీ అధికారులు ఏమన్నారంటే.. పాటనా అటవీ రేంజ్ అధికారులు షిల్పాద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు భారీ డ్రమ్ములను వాయించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏనుగులు నిద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పాటనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘసీరాం పాత్రా తెలిపారు. అయితే, గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏనుగులు సారా తయారీ ద్రావణాన్ని తాగడంపై క్లారిటీ లేదని.. అవి గాఢ నిద్రలో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, మహువా పూల శాస్త్రీయ నామం మధుకా లోంగిఫోలియా. భారత్లోని పలు ప్రాంతాల గిరిజన ప్రజలు ఈ పూలతో సారా తయారు చేసుకుంటారు. (చదవండి: ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర) -
TS: పరిహారం కోసం వెళ్లిన పోశన్నకు షాక్
క్రైమ్: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో షాక్ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావాల్ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది. దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు. -
మనుషుల రక్తానికి రుచి మరిగింది.. 9 మందిని చంపి చివరకు ఇలా..
మనుషుల రక్తానికి రుచిమరిగిన ఓ పులి ఏకంగా తొమ్మిది మందిని దారుణంగా చంపింది. గ్రామస్తులపై ఎగబడి పంజా విసురుతూ ప్రతాపం చూపించింది. ఈ దారుణ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చంపారన్ జిల్లాలోని బగాహ అనే గ్రామంపై పులి దాడి చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలా ఇప్పటివరకు 9 మందిని కిరాతకంగా దాడి చేసి చంపింది. EXCLUSIVE: Man-eating tiger killed in Bihar's West Champaran. The tiger was killed after 5 hours of hard work. Till now, the tiger had killed 9 people 🙂#bihar #tiger , pic.twitter.com/oBL3aj8dFR — विनीत ठाकुर (@yep_vineet) October 8, 2022 దీంతో, స్థానికుల ఫిర్యాదు మేరకు కొన్నివారాల నుంచి పులిని బంధించేందుకు ఏనుగులతో గాలించినా జాడ కనిపించలేదని అటవీ సిబ్బంది తెలిపారు. ఇక, మూడు రోజుల వ్యవధిలోనే నలుగురిని చంపినట్లు చెప్పారు. దీంతో, బీహార్ ప్రభుత్వం అనుమతి తీసుకొని షార్ప్ షూటర్లతో పులిని చంపినట్లు అటవీ సిబ్బంది వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. A man-eating tiger, which mauled 11 people to death in Bihar in past one month, was shot dead in Valmiki Tiger Reserve (VTR) on Saturday morning.#ValmikiTigerReserve #VTR #Tiger #ManEater #ManEatingTiger #TigerKing #Viral #ViralVideos #viral2022 #India pic.twitter.com/KNH28h3skU — Anjali Choudhury (@AnjaliC16408461) October 8, 2022 बिहार में मारा गया आदमखोर बाघ, 7 घंटे के ऑपरेशन के बाद हुआ टाइगर के आतंक का अंत ।#Bihar #Bagaha #Tiger #ValmikiTigerReserve pic.twitter.com/qdi2l4F90O — Mayank makkar (@Mayankmakkar6) October 8, 2022 -
గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం
-
రెండోసారి కెమెరాకు చిక్కిన రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు నెలల్లో రెండోసారి రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి) అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని పులిగొమ్మి గ్రామ శివారులోని తోటలో ఆదివారం ఆవును చంపేసింది. ఆ కళేబరం వద్ద అటవీశాఖ అధికారులు నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు. మిగిలిన కళేబరాన్ని తీసుకెళ్లేందుకు సోమవారం రాత్రి ఆ ప్రాంతానికి పెద్దపులి వచ్చిన దృశ్యాలను కెమెరాలు చిత్రీకరించాయి. ఆ చిత్రాల విశ్లేషణ కోసం గుంటూరులోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్వో) శంబంగి వెంకటేష్ చెప్పారు. ప్రాథమిక పరిశీలన మేరకు అది మగ పులి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత 4 నెలల కాలంలో కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల ఆనవాళ్లు కనిపించిన పులి ఇదేనని ఒక అంచనాకు వచ్చారు. మరో ఆవు హతం... విజయనగరం జిల్లా బొబ్బిలి ఫారెస్టు రేంజ్ పరిధిలోని బొబ్బిలి–బాడంగి మండలం సరిహద్దులోని హరిజన పాల్తేరు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి మరో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దాన్ని చంపేసి కళేబరాన్ని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లింది. మిగిలిన కళేబరాన్ని గురువారం ఉదయం గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆ ఆనవాళ్లను బట్టి ఉత్తర దిక్కుగా బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి గ్రామాల వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. (క్లిక్: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్) -
ఖమ్మం: గుడిపాడులో పోడు రైతులు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య ఘర్షణ
-
హైదరాబాద్: కడ్తాల్లోని చికోటి ఫార్మ్హౌస్లో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు
-
గుడిసెల తొలగింపుతో తిరగబడిన ఆదివాసీలు
సాక్షి, మంచిర్యాల/దండేపల్లి: అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెల తొలగింపుతో జోరు వర్షంలోనూ అటవీ, పోలీసు అధికారులు, గిరిజనులకు మధ్య రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ శివారు అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న ఆరు తాత్కాలిక గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్త తకు దారి తీసింది. గుడిసెలు తొలగించేందుకు శుక్రవారం ఉదయమే లక్సెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ దాదాపు వంద మంది సిబ్బందితో వెళ్లారు. దీంతో గిరిజనులు కర్రలు, కారం పొడితో అధికారు లపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఆరుగురు మహిళలను అధికారులు జీపుల్లో తరలి స్తుండగా గిరిజనులు దారిపొడవునా అడ్డుకుని, తమ వారిని విడిచిపెట్టాలని ఆందోళన చేశారు. అధికారులు వారిని పక్కకు నెట్టి మహిళలను తాళ్లపేట రేంజి ఆఫీసుకు తరలించారు. అక్కడ కూడా గిరిజనులు బైఠాయించి, సీపీఎం, వ్యవ సాయ కార్మిక సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు. ఆది వాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమా ండ్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ హన్మంతరావు.. ఆ మహిళ లను బైండోవర్ చేస్తూ, 6 నెలలపాటు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, లేకపోతే రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చ రించి విడిచిపెట్టారు. ఇందులో దోసండ్ల సునీత అనే మహిళ తనను ఒంటరిగా గదిలో నిర్బంధించి అధికారులు చిత్రహింసలకు గురి చేశారని రోదిస్తూ చెప్పింది. రిజర్వు ఫారెస్టులో ఆక్రమణలు చేపడుతున్నారని, గత నెల 1న అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, అప్పటి నుంచి ఇరు పక్షాలమధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. -
దొడ్డిగట్టు.. కాసులు పట్టు!
ఏలూరు రూరల్ : కొల్లేరు దొడ్డిగట్లు.. అక్రమ చెరువులకు అడ్డాగా మారాయి. కొల్లేరులోని నీటికుంటను మత్స్యకారులు దొడ్డిగట్టుగా పిలు స్తారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మ త్స్యకారులు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నా రు. ఇందుకు అటవీశాఖ అధికారులకు సొమ్ము లు ముట్టజెబుతున్నారు. సెక్షన్ ఆఫీసర్ నుంచి గార్డు వరకూ దొడ్డిగట్ల ద్వారా ఏడాదికి రూ.కోటికిపైగా మామూళ్లు అందుతున్నట్టు అంచనా. సుమారు 30 వేల ఎకరాల్లో.. 2007లో అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టిన సమయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల విస్తీర్ణంలో వందలాది చెరువు గట్లను ధ్వంసం చేశారు. కాలక్రమేణ వరదలు, వర్షాలకు ఈ చెరువు గట్లు కుంగి దొడ్డిగట్లుగా మారాయి. వీటిని పటిష్టపరిచి కొందరు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అభయారణ్యంలో సుమారు 30 వేల ఎకరాల్లో దొడ్డిగట్లు వెలిశాయి. ఎకరానికి రూ.3 వేల వరకూ.. దొడ్డిగట్లలో చేపల సాగును సెక్షన్ ఆఫీసర్లు, గా ర్డులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడతామని, గట్లు కొట్టేస్తామని మత్స్యకారులను బెదిరిస్తున్నారు. దీంతో మత్స్యకారులు అధికారులకు సొమ్ములు ముట్టజెబుతున్నారు. ఇదే అదనుగా సెక్షన్ ఆఫీసర్లు, గార్డులు కలిసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పెదపాడు సెక్షన్ పరిధిలో శ్రీపర్రు, కలకుర్రు, మానూరులో దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి ఎకరాకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సెక్షన్ పరిధిలో సుమారు 6 వేల ఎకరాల్లో చేపల సాగు ఉంది. అలాగే నిడమర్రు, ఏలూరు, భీమడోలు పరిధిలో సుమారు 24 వేల ఎకరాల దొడ్డిగట్లలో సాగు చేస్తున్న మత్స్యకారుల నుంచి అధికారులు సుమారు రూ.కోటి వరకూ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కొంత మొత్తం ఉన్నతాధికారులకు సైతం చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దొడ్డిగట్లు కొట్టేస్తాం దొడ్డిగట్లలో చేపల సాగు ను అడ్డుకుంటాం. ఏలూ రు మండలం కొక్కిరాయిలంక వెనక అక్రమ చెరు వు తవ్వకాలను అడ్డుకున్నాం. ఈ ప్రాంతంలో దొడ్డిగట్లను చేపల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నట్టు గుర్తించాం. వెంటనే పూర్తిస్థాయిలో ధ్వంసం చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఏలూరు, కైకలూరు రేంజర్ల పర్యవేక్షణలో దొడ్డిగట్లను ధ్వంసం చేయిస్తాం. –సెల్వం, డీఎఫ్ఓ హక్కులు కాపాడాలి కొల్లేరులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దొడ్డిగట్లలో చేపలు పట్టుకునే హక్కు మత్స్యకారులకు ఉంది. వేసవిలో వీటిని పట్టుకుని అమ్ముకుంటారు. దొడ్డిగట్లలో చేపల సాగు చాలా కష్టం. కొల్లేరుకు వరద వస్తే దొడ్డిగట్లు మునిగి మత్స్యకారులు నష్టపోతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి చేయగానే కొల్లేరు మొత్తం నిండుకుండలా మారిపోతుంది. అప్పుడు మ త్స్యకారులు సంప్రదాయ చేపల వేటతో జీవనం సాగించవచ్చు. –పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎంపీపీ, ఏలూరు -
అటవీ వనం కన్నీరు...గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న పచ్చదనం
ఎటపాక డివిజన్లో అటవీ వనాలుకన్నీరు పెడుతున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతోకళకళలాడుతున్న ఈ ప్రాంతంలో వనాలు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడాల్సిన ఈ ప్రాంతాలు కళావిహీనంగా మారుతున్నాయి. స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అటవీశాఖ సిబ్బంది చూసీ చూడనట్టువదిలేస్తున్నారని విలపిస్తున్నాయి. ఎటపాక: ఎటపాక డివిజన్లో అడవులు అంతరించిపోతున్నాయి. ఒక్కప్పుడు టేకు, జిట్రేకు వంటి విలువైన అటవీ వనాలకు నిలయమైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం వాటి జాడ కనిపించని పరిస్థితి నెలకొంది. అటవీ సిబ్బందిలో కొంతమంది స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లిపాక జాతీయరహదారి సెంటర్లో ఏర్పాటు చేసిన అటవీశాఖ తనిఖీ కేంద్రం మామూళ్ల వసూళ్లకే పరిమితమైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్రాలకు.. ఎటపాక, చింతూరు మండలాల అటవీ ప్రాంతంలో 18,046 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర నగరాలకు టేకు కలప రవాణా జరుగుతోంది. తెలంగాణలోని భద్రాచలం పట్టణ కేంద్రంగా కలప తరలింపులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. వీరు తెలంగాణ సరిహద్దున ఉన్న ఆంధ్రా పరిధిలోని అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. వీరికి మండలంలోని స్మగ్లర్లు సహకరిస్తుండటంతో విలువైన టేకు కలప పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. గోదావరి నదిని దాటించి.. అటవీ కలపను గోదావరి నది దాటించి అక్కడ నుంచి వాహనాల్లో పక్క జిల్లాలకు చేరవేస్తున్నారు. అటవీశాఖలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందితో ముందుగానే చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ అక్రమ రావాణా నిరాటంకంగా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లర్లు టేకు ప్లాంటేషన్లపై కూడా కన్నేశారు. నెల్లిపాక రేంజ్ పరిధిలోని బండిరేవు, మాధవరావుపేట ,ఈడీపల్లి ప్రాంతాల్లోని టేకు ప్లాంటేషన్లలో భారీ టేకు వృక్షాలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. అడవుల్లో టేకు చెట్లను నరికిన అనంతరం అక్కడనే సైజులుగా కోసి లారీ, కార్లలో విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోలేకపోతున్న చెక్పోస్టు నెల్లిపాక జాతీయ రహదారిలో అటవీ చెక్పోస్టు ఉన్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయకుండా వదిలిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో డివిజన్ నుంచి వాహనాల ద్వారా కలపను దర్జాగా తరలించుకుపోతున్నారు. సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. స్మగ్లర్లు,ఫర్నిచర్ తరలించేవారు ముందుగా చెక్పోస్టు సిబ్బందిని మేనేజ్ చేసి కలపను చెక్పోస్ట్ దాటించి భద్రాచలం చేరవేస్తున్నారు. అక్రమ కలపపై ఎవరైనా ముందస్తు సమాచారం ఇస్తే తప్ప ఇక్కడి సిబ్బంది కలప రవాణాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెక్పోస్టులో సిబ్బందితో పాటు స్మగ్లర్లు అప్పడుప్పుడు చెక్పోస్టు వద్ద ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి సమయంలో అటవీశాఖకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు చెక్పోస్టులో సిబ్బందితో పాటు కనపడుతున్నారు. స్మగ్లర్లతో చేతులు కలిపి..? ఇక్కడి అటవీ రేంజ్ పరిధిలో విధులు నిర్వహించే కొంత మంది సిబ్బంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ కలప అక్రమ రవాణా చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. సిబ్బందికి నెల వారీ మామూళ్లకు ఆశపడి పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కొందరు పరిమిట్ల ముసుగులో కలప అక్రమ దందా చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అడపా దడపా తనిఖీలు చేస్తున్న సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో కలపను పట్టుకుంటున్నా స్మగ్లర్లు బేరసారాలు సాగించి చక్రం తిప్పుతున్నారు. నెల్లిపాక రేంజ్ పరిధిలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవి. ఇప్పుడు మైదాన ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ.. పనితీరుకు ఇవి అద్దం పడుతున్నాయి. చర్యలు తీసుకుంటాం కలప అక్రమ రవాణాపై దృష్టి సారిస్తాం. అడవుల్లో కలప నరికి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. నెల్లిపాక చెక్పోస్టు వద్ద తనిఖీలు పటిష్టంగా చేపట్టి కలప రవాణాను అరికడతాం. – కొండలరావు, ఇన్చార్జి రేంజర్, నెల్లిపాక (చదవండి: ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!) -
నల్లమల అటవీ ప్రాంతం.. కార్చిచ్చుకు కళ్లెం
నల్లమల అటవీ ప్రాంతం.. నాలుగు జిల్లాల పరిధిలో పది లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సువిశాల అరణ్యంలో ఒక్క చోట అగ్గిరాజుకుంటే చాలు వందల ఎకరాల్లో బుగ్గి మిగులుతుంది. మండు వేసవిలో ఈ అగ్నిప్రమాదాల బెడద ఇంకా ఎక్కువ. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. పచ్చని అడవుల్లో కార్చిచ్చుకు కళ్లెం వేసేలా అటవీ శాఖ ఫైర్వాచర్స్ను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అగ్నినిరోధక పరికరాలను అందజేసింది. అటవీ ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు నీటిని తీసుకెళ్లేందుకు వాహనాలు సమకూర్చింది. మార్కాపురం: వేసవి వచ్చిందంటే అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతోంది. తెలిసో తెలియకో చేస్తున్న మానవ తప్పిదాలు అడవులను కాల్చివేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అడవుల్లో ప్రమాదాలు జరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వలన పర్యావరణం దెబ్బతింటోంది. నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. మార్కాపురం డీఎఫ్వో పరిధిలో 900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. మార్కాపురం డీఎఫ్ఓ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్ రేంజ్లు ఉండగా, గిద్దలూరు పరిధిలో గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల, కనిగిరి, ఒంగోలు ఉన్నాయి. దోర్నాల నుంచి శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు, గిద్దలూరు– నంద్యాల మధ్య ఘాట్ రోడ్డులో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కొంత మంది బీడీ, సిగరెట్ తాగి ఆర్పకుండా రోడ్డుపై వేస్తున్నారు. వేసవి తీవ్రత వలన అలా కిందపడిన నిప్పు గడ్డికి అంటుకుని వేగంగా వ్యాపించి అడవులను దహిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రయాణికులకు, ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నా కొంత మందిలో చైతన్యం లేకపోవటం, మరికొందరు ఏమరుపాటుగా సిగరెట్ తాగి రోడ్డు పక్కన వేయటం వలన తరచుగా అడవిలో మంటలు రేగుతున్నాయి. వీటిని చల్లార్చేందుకు అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతుంటారు. 110 మంది వాచర్ల నియామకం: ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ముందుగానే మేల్కొని అగ్నిప్రమాదాల నివారణకు శిక్షణ ఇచ్చిన ప్రత్యేక సిబ్బందిని నియమించాయి. మార్కాపురం డీఎఫ్ఓ పరిధిలో ఉన్న మార్కాపురం, గంజివారిపల్లె, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, గుంటూరు విజయపురిసౌత్ వరకు విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరిగితే తక్షణం అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేందుకు 110 మంది ఫైర్వాచర్స్ను ప్రభుత్వం నియమించింది. వీరికి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లను అందజేశారు. దీనితో పాటు అటవీ ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసి అప్పటికప్పుడు నీటిని తీసుకెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు. ఈ సిబ్బంది దోర్నాల నుంచి శ్రీశైలం వరకు, యర్రగొండపాలెం నుంచి మాచర్ల వరకు, దోర్నాల నుంచి ఆత్మకూరు వరకు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం తిరుగుతూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ అగ్నిప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం వెళ్లే ప్రయాణికుల వాహనాలను గణపతి చెక్పోస్టు వద్ద ఆపి బీడీ, సిగరెట్లు తీసివేస్తూ, అగ్నిని మండించే పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. 2020 ఏప్రిల్లో అర్ధవీడు మండలం బొమ్మిలింగం అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో అగ్నిప్రమాదం జరిగి చాలా వరకు అటవీ ప్రాంతం కాలిపోయింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చాం: ఈ ఏడాది అటవీ ప్రాంతంలో 950 అగ్ని ప్రమాద సంఘటనలు జరిగాయి. మా సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే చెంచులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రమాదం జరిగిన వెంటనే మాకు సమాచారం అందిస్తారు. దీని ద్వారా మేము సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటన స్థలానికి పంపి మంటలను ఆర్పివేస్తాం. ప్రయాణికులు కూడా అటవీ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు బీడీలు, సిగరెట్లు తాగవద్దని మా విజ్ఞప్తి. చిన్న ప్రమాదం జరిగినా ఆ నష్టాన్ని పూడ్చటం సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. – అప్పావు విఘ్నేష్, డీఎఫ్ఓ, మార్కాపురం వందల సంఖ్యలో ప్రమాదాలు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతి ఏడాది వేసవిలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన 3 నెలల్లో నల్లమలలో 950 అగ్ని ప్రమాదాలు జరగగా సిబ్బంది సకాలంలో స్పందించి ఆర్పివేశారు. గత ఏడాది ఏప్రిల్ నాటికి 1500 అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న చెట్టుకు నిప్పు అంటుకున్నా అటవీ అధికారులు ప్రమాదాన్ని గుర్తించి కౌంట్ చేస్తారు. అగ్ని ప్రమాదాల వలన పర్యావరణ కాలుష్యంతో పాటు విలువైన వృక్షసంపద, రకరకాల పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించిందంటే ఆర్పి వేయటం అటవీ, అగ్నిమాపక సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. -
UP News: కటౌట్ చూసి పరిగెత్తాలి డ్యూడ్
కటౌట్లంటే రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు భారీ ప్రచారమనే విషయం చెప్పనక్కర్లేదు. కానీ, వైవిధ్యమైన ఆలోచనలు ఎప్పుడూ జనాల ఆసక్తిని తమ వైపు మళ్లించుకుంటాయి. ఉత్తర ప్రదేశ్లో తాజాగా అలాంటి దృశ్యమే ఒకటి కనిపించింది. యూపీ మీరట్లో కోతులను తరిమేందుకు అటవీ అధికారులు.. కొండముచ్చుల (కొండెంగల) కటౌట్లను ఉంచారు. మరి ఈ ఐడియా ఫలితం ఇచ్చిందా?.. ఇచ్చిందనే అంటున్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్. ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, చిన్నచిన్న మార్పులతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. కోతుల బెడదతో ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టేందుకే జనాలు వణికిపోయిన రోజులున్నాయి. ఈ తరుణంలో అధికారులు ఇలా కటౌట్ల ప్రయోగంతో కోతుల్ని తరమడం విశేషం. ఇదివరకు లక్నో మెట్రో స్టేషన్లో ఇలా కొండముచ్చుల Langoor Cutouts కటౌట్లతో ఫలితం రాబట్టారు అధికారులు. అదే చూసే మీరట్ అధికారులు ఈ పని చేశారు. అఫ్కోర్స్.. ఇదేం కొత్త ఐడియా కాదు.. చాలా చోట్ల చూసే ఉంటారు. -
తాబేళ్ల అక్రమ రవాణా గుట్టు రట్టు!
కైకలూరు: కృష్ణాజిల్లా కొల్లేరు పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వదర్లపాడు గ్రామం వద్ద రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణా శనివారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో ఆటో, మినీ వ్యాన్ల్లో 25 బస్తాల్లో నాలుగు టన్నుల తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన పంతగాని నాగభూషణం (48), గరికిముక్కు సందీప్ (30), అదే మండలం కొండూరుకు చెందిన దేవదాసు ఏసుబాబు (27) తాబేళ్లను రవాణా చేస్తుండగా వాహనాలతో సహా అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు ఆదివారం అప్పగించారు. ఇక్కడ కేజీ తాబేలు రూ.15 చొప్పున కొని ఇతర రాష్ట్రాల్లో రూ.50 నుంచి రూ.100కి విక్రయిస్తున్నారు. తాబేళ్ల మాంసానికి గిరాకీ ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. వైల్డ్ లైఫ్ ఏలూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసరు కుమార్ ఆధ్వర్యంలో డెప్యూటీ రేంజ్ ఆఫీసరు జయప్రకాష్, బీటు ఆఫీసరు రాజేష్ నిందితులపై అటవీపర్యావరణ చట్టం 1972 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేటు ఆదేశాలతో పట్టుబడిన తాబేళ్లను కొల్లేరు సరస్సులో విడిచిపెడతామని అధికారులు చెప్పారు. -
కింగ్ కోబ్రా బుసలు.. రోషిణి ధైర్యానికి నెటిజన్లు ఫిదా
Kerala Lady Forest Officer: సాధారణంగా మనం పామును చూడగానే భయంతో వణికిపోతాం. మనకు దూరంగా పాము వెళ్తున్నా ఆగిపోతాం. అలాంటిది ఓ మహిళ ఎంతో చాకచక్యంగా ఓ పామును పట్టుకొని శభాష్ అనిపించుకుంది. ఆమె ధైర్యం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం జిల్లాలోని ఉన్న కట్టక్కడ గ్రామంలోని ఓ ఇంటి వద్ద స్థానికులు పామును గుర్తించారు. దీంతో వారు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ ఉద్యోగి రోషిణి తన బృందంతో అక్కడికి చేరుకుంది. పామును కింగ్ కోబ్రాగా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆమె ఆ పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సందర్భంగా రోషిణి ధైర్యాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. ఇదిలా ఉండగా రోషిణి పామును పట్టిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామేన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రోషిణి తిరువనంతపురంలోకి పారుతిపల్లి రేంజ్ ఆఫీసులో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లో ఉద్యోగం చేస్తోందన్నారు. ఆమె పాములను పట్టడంతో శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అయిపోయి.. ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. A brave Forest staff Roshini rescues a snake from the human habitations at Kattakada. She is trained in handling snakes. Women force in Forest depts across the country is growing up in good numbers. VC @jishasurya pic.twitter.com/TlH9oI2KrH — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) February 3, 2022 -
అడవి ఒడి నుంచి విడదీసి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అమ్రాబాద్ అభయారణ్యం నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల అధికారులు తరచూ చెంచుపెంటలకు వస్తూ.. పక్కాఇళ్లు కట్టిస్తామని, భారీగా ప్యాకేజీ ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని చెంచులు చెప్తున్నారు. తాము అడవి బయట బతకలేమని చెప్తున్నా వినడం లేదని.. చెంచుపెంటల్లోని గిరిజనేతరులకు గాలమేసి, వారితో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ మధ్య చిచ్చుపెట్టి.. అడవి నుంచి గెంటివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. తమను బలవంతంగా మైదాన ప్రాంతాలకు తరలిస్తే బతకలేమని, చెంచుజాతి పూర్తిగా నశించిపోతుందని వాపోతున్నారు. ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా.. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహబూబ్నగర్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతాన్ని రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ఏర్పాటు చేశారు. పులులు, ఇతర అడవి జంతువుల ఆవాసాన్ని పెంచడం కోసం, సంరక్షణ కోసం చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి చిరుతలు, వివిధ రకాల జంతువులను తీసుకొచ్చి నల్లమల పరిధిలో వదిలిపెట్టారు. అప్పట్లోనే అడవి మధ్యలో ఉన్న చెంచులను బయటికి తరలించాలని చూశారు. కానీ చెంచులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా పలుసార్లు ప్రయత్నాలు జరిగినా చెంచులతోపాటు ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. – తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర పరిధిలో (కృష్ణానదికి ఇవతల) మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో విస్తరించిన అటవీ ప్రాంతాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా నామకరణం చేసింది. ఇటీవల అభయారణ్యం నుంచి చెంచులను తరలించేందుకు అటవీ శాఖ మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. కొద్దిరోజుల నుంచి కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్ మండలం కొల్లంపెంటకు చెందిన చెంచుల కోసం మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లను ఇటీవల ఎఫ్డీవో రోహిత్రెడ్డి పరిశీలించారు. దీనితో అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా బతుకీడుస్తున్న చెంచు కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. అటు గాలం.. ఇటు ఉచ్చు..! అటవీ అధికారులు కొద్దిరోజులుగా చెంచులపై ఒత్తిడి పెంచుతున్నారు. చెంచుపెంటల్లో సమావేశాలు ఏర్పాటు చేసి.. మైదాన ప్రాంతానికి తరలివెళ్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. 18ఏళ్లు నిండిన యువతను కూడా విడి కుటుంబంగా పరిగణిస్తామని.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) నుంచి రూ.15 లక్షల ప్యాకేజీని వర్తింపజేస్తామని గాలం వేస్తున్నారు. కొన్నిచోట్ల భూమి కూడా ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా చాలా వరకు చెంచులు అడవి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. – రెండు, మూడు చెంచుపెంటలు మినహా మిగతా చెంచు పెంటల్లో గిరిజనేతరులు సైతం జీవిస్తున్నారు. వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎక్కువగా ఎస్సీ, బీసీ కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం పక్కా ఇల్లు, రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తామని అటవీ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో గిరిజనేతరుల్లో ఆశలు పెరిగాయి. అందులో కొందరు గిరిజనేతరులు అడవి బయటికి రావడానికి సుముఖత వ్యక్తం చేయగా.. దీన్ని ఆసరాగా చేసుకుని చెంచులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. చెంచులు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టి ‘పని’ సాధించుకునే కుయుక్తులు పన్నుతున్నట్టుగా ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో రెండు ఊర్ల తరలింపు – తొలిదశలో అభయారణ్యంలోని ఫర్హాబాద్, కొల్లంపెంటలోని చెంచులను తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఈ రెండుచోట్ల 30 నుంచి 34 కుటుంబాలు జీవిస్తున్నాయి. – కొల్లంపెంటకు చెందిన చెంచులను మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడే ఇళ్లతోపాటు భూమి కూడా ఇవ్వాలనే డిమాండ్ కొందరు చెంచుల నుంచి వ్యక్తమవుతోంది. మాచారం, దాని సమీపంలో ప్రభుత్వ భూముల్లేవు. ఇక్కడి మొల్కమామిడిలో ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన 29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. – ఫర్హాబాద్ చెంచులను లింగాల మండలం బాచారానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అక్కడి చెంచులు ఇందుకు అంగీకరించారనీ చెప్తున్నారు. కానీ ఫర్హాబాద్ చెంచులు, సమీపంలోని ఇతర పెంటల్లోని చెంచులు మన్ననూర్కుగానీ, వేరే ఏజెన్సీ గ్రామాలకుగానీ పంపితేనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్యాకేజీ రూ.15 లక్షలతోపాటు ఉచితంగా ఐదెకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తరలించే యత్నం ఎప్పట్నుంచో.. – 1999లో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు నల్లమలలోని కొన్ని చెంచు కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించారు. అమరగిరి వద్ద ప్రత్యేక పునారావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఇమడలేక ఇద్దరు చెంచులు మరణించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. – నల్లమలలో యురేనియం తవ్వకాలు, అభయారణ్యం పేరిట చెంచులను మరోసారి మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రారంభించారు. ఈ క్రమంలో కుటుంబానికి రూ.10 లక్షల నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పినా.. అడవి బిడ్డలు అంగీకరించలేదు. తర్వాత నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా బాచారం దగ్గర ఇళ్ల నిర్మాణం, నగదు కాదనుకుంటే మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగదు ప్యాకేజీని రూ.15 లక్షలకు పెంచారు. – నల్లమలలోని వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల, ఈర్లపెంటల్లో 175 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో 80శాతం కుటుంబాలతో అంగీకార పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో చెంచుల వివరాలివీ.. చెంచు పెంటలు 112 కుటుంబాలు 2,630 జనాభా 9,514 కోర్ ఏరియాలోని చెంచుపెంటలు: నల్లమల పరిధిలోని అమ్రాబాద్, వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, లింగాల మండలం అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల, ఈర్లపెంట. మా జాతి నశించిపోతుంది ఎంతోకాలంగా ఇక్కడే జీవిస్తున్నాం. ప్రభుత్వం మా చెంచులకు ఏవేవో ఆశలు కల్పించి అడవి నుంచి దూరం చేయాలని చూడటం భావ్యం కాదు. అడవి, వన్యప్రాణులతో కలిసి బతికే మా చెంచులను గ్రామాల్లోకి తీసుకుపోతే బతకలేరు. చెంచుపెంటల్లో ఉన్న చెంచులు సాగు చేసుకుంటున్న భూములకు ఎఫ్ఆర్సీ పట్టాలతోపాటు రైతుబంధు ఇచ్చి వ్యవసాయం చేసుకునేందుకు సహకరించాలి. ప్రభుత్వం బలవంతంగా అడవుల నుంచి తరలిస్తే మా చెంచు జాతి పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలి. – దాసరి నాగయ్య, చెంచు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అధికారుల మాటలు నమ్మబోం మా చెంచులను ఎలాగైనా అడవి నుంచి తరలించాలని వివిధ సంస్థలతోపాటు ప్రభుత్వ అధికారులు కుట్ర చేస్తున్నారు. ప్యాకేజీ ఇస్తామంటూ ఆరేళ్లుగా ఉత్త మాటలు చెప్తున్నారు. నమ్మకం కలిగించే చర్యలేవీ తీసుకోవడం లేదు. చెంచు కుటుంబాలకు 5 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి, ఇల్లుతోపాటు పిల్లలకు పాఠశాల, ఆస్పత్రి తదితర సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాతే మాతో మాట్లాడాలి. – చిర్ర రాములు, చెంచు, సార్లపల్లి ఇబ్బంది బదులు.. దారి చూపిస్తే పోతాం.. అన్ని వసతులు కల్పిస్తే పోవడానికి మేం సిద్ధమే. ఆరేళ్లుగా ఫారెస్టు అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారు. పొలాలు సాగు చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. ఎక్కడో అడవిలో ఏ జంతువులు చనిపోయినా మాకు సంబంధం అంటూ కేసులు పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడుకుంటూ ఉండేకంటే.. మాకు దారి చూపిస్తే వెళ్లిపోవడానికి సిద్ధమే. – సత్తయ్య, గిరిజనేతరుడు, సార్లపల్లి బయటికొస్తే బతికేదెలా? చెంచులు అడవిలో చెట్లుచేమలు, జంతువులతో కలిసి, అడవిపైనే ఆధారపడి బతుకుతున్నారు. అడవిలో సహజసిద్ధంగా దొరికే వాటితోనే కడుపు నింపుకొంటున్నారు. వారితో అడవికి ఎలాంటి నష్టం లేకపోగా.. మేలే జరుగుతోంది. ఆదివాసీలు లేకుంటే మాఫియా పెట్రేగిపోవడం ఖాయం. దానివల్ల జీవ, పర్యావరణానికి విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది. అసలు చెంచులు మైదాన ప్రాంతాల్లో జీవించగలరా? అడవిలో ఏళ్లకేళ్లుగా బతుకుతున్నవారు ఇప్పటికిప్పుడే అలవాట్లు మార్చుకోగలరా.. మైదాన ప్రాంతాల్లో మానసిక స్థితి, ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోగలిగే శక్తి చెంచులకు లేదు. ఏ ప్రభుత్వాలు కూడా వారి ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వలేవు. ముందుగా పక్కా ప్రణాళికతో వారిని విద్యావంతులుగా చేయాలి. కనీసం 7, 10 తరగతులు చదివినవారికి తగిన ఉద్యోగ అవకాశాలివ్వాలి. విద్యావంతులు పెరిగితే.. అడవిలో ఉండాలా? ఇంకెక్కడైనా ఉండాలా అన్నది చెంచులే నిర్ణయించుకుంటారు. సమాజంలో వివక్ష నుంచి తమను తాము కాపాడుకోగలుగుతారు. అంతేగానీ నిర్బంధంగా తరలిస్తే కొన్నాళ్లలో చెంచు జాతి కనుమరుగవుతుంది. పల్లెల్లో ఉన్నవారిని పట్టణాల్లో జీవించాలని ఏ ప్రభుత్వమైనా చెప్తుందా? అదే అడవిలో నివసిస్తున్న వారిని మైదాన ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడం ఎంత వరకు కరెక్టు. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఈ ఫొటోలో ఉన్న చెంచు కుటుంబం.. చిగుర్ల చిట్టెమ్మ, ఆమె భర్త ఈదయ్య, వారి ముగ్గురు కూతుళ్లు. తాతల కాలం నుంచీ వీరు సార్లపల్లిలో బతుకుతున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు బడికి పోతే.. తల్లిదండ్రులు, పెద్దబిడ్డ కలిసి అటవీ ఉత్పత్తుల సేకరణ, కూలీ పనులకు వెళ్తారు. చెంచులను అడవి నుంచి బయటికి తరలించేందుకు అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలను వారు తిరస్కరించారు. అయితే అధికారులు ఇక్కడి గిరిజనేతరులు కొందరిని రూ.15లక్షల ప్యాకేజీకి ఒప్పించి సంతకం చేయించారు. మిగతావారితోనూ సంతకం చేయించాలని.. అప్పుడే తరలింపు పని మొదలవుతుందని, డబ్బులు చేతికి అందుతాయని మెలికపెట్టారు. దీంతో సదరు గిరిజనేతరులు.. చెంచు కుటుంబాలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. చిట్టెమ్మ దంపతులనూ ఒప్పించేందుకు ప్రయత్నించారు. దీనిపై మండిపడ్డ చిట్టెమ్మ కుటుంబం.. ‘‘ఎవరు ఎటైనా పోండి.. మాకు అవసరం లేదు. అడవిని వదిలి ఎక్కడో కాని రాజ్యంలో పోయి మేం బతకలేం. బలవంతంగా తీసుకుపోతే మా చావులే కళ్లజూస్తరు’’అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఆ వృక్షానికి 24 గంటలు ఎందుకు కాపలా కాస్తున్నారో తెలుసా!!
న్యూఢిల్లీ: చిత్రంలో కనిపిస్తున్నది ఢిల్లీ ఆలిపూర్ సమీపంలోని ఖాంపూర్ గ్రామం వద్ద ఉన్న 120 ఏళ్ల మర్రి చెట్టు. దీన్ని ఈ ప్రాంత వాసులు పవిత్రంగా భావిస్తారు. ఇటీవలే కొందరు దుండగులు దీని కొమ్మలు నరికివేశారు. దీంతో ఇకపై ఈ వృక్షరాజానికి 24 గంటల పాటు వంతులవారీగా కాపలాకాయాలని ఖాంపూర్ గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక రియల్ ఎస్టేట్ మాఫియా ఈ దురాగతాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరతామన్నారు. ఘటనపై తమకు వివరాలందలేదని అటవీ శాఖ అధికారులు చెప్పారు. (చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!) -
పిట్ట నడక.. చూద్దాం రండి!
సాక్షి, మంచిర్యాల: ‘‘ఓ పుల్లా, ఓ పుడకా, ఎండుగడ్డి, చిన్నకొమ్మ, చిట్టిగూడు.. పిట్ట బతుకే ఎంతో హాయి’’ అంటూ తన పాటతో పక్షుల జీవితాన్నో ఉత్సవం చేశాడు ప్రజావాగ్గేయకారుడు గోరటి. అలాంటి పక్షుల జీవితాన్ని చూడాలనుకునేవారికో మంచి అవకాశం బర్డ్వాక్ ఫెస్టివల్. సహజ సిద్ధ ఆవాసాల్లో పక్షుల కిలకిల రాగాలు, విభిన్న పిట్టల గుంపులు, జంట పక్షుల తుళ్లింతలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం అటవీశాఖ కల్పిస్తోంది. ఈ నెల 8, 9న రెండోవిడత బర్డ్వాక్ ఫెస్టివల్ను ఆసిఫాబాద్ జిల్లా అటవీఅధికారులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల పాటు కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఈ బర్డ్వాక్ సాగనుంది. కాగజ్నగర్ అడవుల్లో పక్షుల సందడి పాలరాపుగుట్ట సహా... తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అడవుల్లో పక్షుల ఆవాసాలు చూడొచ్చు. దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న పొడుగు ముక్కు రాబంధుల ఆవాసమైన పాలరాపుగుట్టతో సహా ఎంపిక చేసిన 21 ప్రాంతాల్లో ఈ బర్డ్ వాక్ జరగనుంది. సిర్పూర్, బెజ్జూరు, పెంచికల్పేట, మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఎన్నో అరుదైన పక్షులున్నాయి. 250పక్షి జాతులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగ్పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి వన్యప్రాణి, ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు తమ ఆసక్తిని చూపించారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా అవకాశం.. కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఒకరికి రూ.2వేలు ఫీజు. వివరాలకు డీఎఫ్వో (ఆసిఫాబాద్) 9440810099, ఎఫ్డీవో(జన్నారం) 9440810103 నంబరులో సంప్రదించవచ్చు. ఈ నెల 7న కాగజ్నగర్ అటవీ ఆఫీసులో నేరుగా మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీక్షకులకు అంతర్గత రవాణా, వసతి సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. పక్షుల సంరక్షణకు దోహదం పక్షుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు కొత్త పక్షుల గుర్తింపు, అధ్యయనం కోసం ఈ బర్డ్వాక్ దోహదపడుతుంది. ఎంపిక చేసిన ప్రాం తాల్లో సందర్శకులు అధికారుల సమక్షంలో పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వన్యప్రాణి నిపుణులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు పాల్గొనవచ్చు. – ఎస్.శాంతారామ్, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్ -
పేట్రేగిన ‘ఎర్ర’ దొంగలు
భాకరాపేట: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల తమిళ దండు దందా పేట్రేగిపోతున్నది. భాకరాపేట ఫారెస్టు రేంజర్ పట్టాభి కథనం మేరకు.. మూడు రోజుల క్రితం పీలేరు రూరల్ సీఐ, ఎర్రావారిపాళెం పోలీసులు నిర్వహించిన దాడుల్లో 12 మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. పారిపోయిన మరికొంతమంది కోసం తలకోన అటవీ ప్రాంతాన్ని రెండు రోజులుగా జల్లెడ పడుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున తలకోన సెంట్రల్ బీట్ పరిధిలో గాలిస్తుండగా..దొర్రికనుమ ప్రాంతంలో దుంగలు తీసుకొస్తూ కొంతమంది తారసపడ్డారు. వీరిని చుట్టుముట్టే క్రమంలో.. ఆ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వారిని ఎదురుగానే ఎదుర్కోవాల్సి వచ్చింది. దొంగలు దుంగలు పడేసి రాళ్లు రువ్వుతూ పరుగులు దీశారు. వారిని వెంబడించగా కాటర్బాల్ సహాయంతో రాళ్లు రువ్వుతూ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు.1,103 కిలోల బరువు గల 36 దుంగలను స్వాధీనం చేసుకుని భాకరాపేట ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చినట్లు రేంజర్ తెలిపారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో ఎఫ్ఎస్వో రవిరావు, ఎఫ్బీవో వందనకుమార్, వినోద్కుమార్, శంకర్, బేస్క్యాంపు సిబ్బంది, తలకోన సీబీఈటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్లువీళ్లు ఒక్కటేనా? 2 రోజుల క్రితం జరిపిన దాడుల్లో పట్టుబడ్డ తమిళ స్మగ్లర్లు, మంగళవారం తప్పించుకున్న స్మగ్లర్లు ఒక బృందంలోని వారేనా అనే కోణంలో అటవీ అధికారులు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళ స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. -
భూమి దక్కదని ఆదివాసీ రైతు ఆత్మహత్య
బోథ్: అటవీ అధికారులు ఆ ఐదెకరాలు స్వాధీనం చేసుకుని కుంట నిర్మాణం చేపట్టడంతో మనస్తాపం చెందిన ఆదివాసీ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీడిపల్లికి చెందిన లక్ష్మణ్ (48) ఐదెకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నాడు. పోడుభూ ములకు పట్టాలిచ్చే కార్యక్రమంలో ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం లక్ష్మణ్కు చెందిన భూమిలో అటవీ అధికారులు నీటికుంట నిర్మించడానికి ప్రొక్లెయిన్తో వెళ్లారు. ఆవేదనకు గురైన లక్ష్మణ్ ఇంటి నుంచి పురుగుమందు తీసుకుని చేను వద్దకు వెళ్లాడు. తన భూమిలో నీటికుంట నిర్మాణం చేపట్టవద్దని వేడుకున్నాడు. అయినా అధికారులు పనులు ఆపకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్ పురుగుమందు తాగాడు. పక్కనున్నవారు గమనించి ఆయనను బోథ్ ఆస్పత్రికి, ఆపై ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించినా పరిస్థితి విషమించి మృతి చెందాడు. లక్ష్మణ్కు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా, లక్ష్మణ్ రాగానే పనులు ఆపేశామని బోథ్ అటవీ క్షేత్ర అధికారి సత్యనారాయణ చెప్పారు. -
ఆంధ్రా మత్స్యకారులపై తెలంగాణ అధికారుల దాడి
విజయపురిసౌత్ (మాచర్ల): పొట్టకూటి కోసం సొంత ఊరు వదిలి సుదూర ప్రాంతంలో చేపల వేట చేస్తోన్న నిరుపేద మత్స్యకారులపై తెలంగాణ అటవీ అధికారులు దాడి చేసి రూ.30 లక్షల విలువైన వలలు, పుట్టీలను దగ్ధం చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కృష్ణా నది సమీపంలో జెండాపెంట వద్ద జరిగింది. స్థానికులైన మత్స్యకారులు జీవనం కోసం కృష్ణా పరివాహక ప్రాంతమైన జెండాపెంట, పెద్దచెరువు తదితర ప్రాంతాల్లో చేపల వేట చేస్తుంటారు. ఇటీవల మార్కాపురం డీఎఫ్వో విఘ్నేశ్వర్, తెలంగాణకి చెందిన ఎఫ్డీవో రోహిత్తో పాటు పలువురు అధికారులు అనుపు జలాశయం వద్ద మత్స్యకారులతో సమావేశం నిర్వహించి కృష్ణా జలాశయంలో సాగర్ నుంచి 45 కి.మీ లోపే చేపల వేట చేయాలని సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులతో పాటు ఇతర జంతువులు సంచరిస్తున్నాయని వాటి సంరక్షణలో భాగంగా అటవీ ప్రాంతంలో చేపల వేటను నిషేధించినట్లు పేర్కొన్నారు. తమ 1,000 కుటుంబాలు 40 ఏళ్లుగా సాగర్లో చేపల వేట పైనే బతుకుతెరువు సాగిస్తున్నామని, కొంత పరిధిలోనే వేటను సాగిస్తే ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు– అధికారులు మధ్య చర్చలు విఫలం అవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కొందరు ఫారెస్ట్ అధికారులు మత్స్యకారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అకస్మాత్తుగా అటవీ శాఖ బోటులో జెండాపెంట, పెద్దచెరువు తదితర ప్రాంతాలకు చేరుకొని మత్స్యకారులపై దాడి చేశారు. పెట్రోల్తో వలలు, పుట్టీలను దగ్ధం చేశారు. బాధిత మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన చేస్తామని తోటి మత్స్యకారులు హెచ్చరించారు. -
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
సారూ.. కోతుల సంచారాన్ని నియంత్రించండి!
భట్టిప్రోలు: భట్టిప్రోలులో వానరాల సంచారం అధికమైంది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. చేతులలో చిన్న పొట్లాలతో చిన్నారులు, మహిళలు కనిపించినా వెంటపడి మరీ దాడి చేసి గాయపరుస్తున్నాయి. ముఖ్యంగా భట్టిప్రోలు విఠలేశ్వరనగర్లో కోతులు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిన బారిన పడి గాయపడి ఆసుపత్రి పాలైన వారు ఎంతోమంది. లంక గ్రామాల్లో ఉండే ఈ కోతులు ఇక్కడకు వలస వచ్చాయి. కోతుల బెడదతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. డాబాల పైకి ఎక్కితే ఎక్కడ దాడి చేస్తాయోనని భీతిల్లుతున్నారు. తలుపులు తెరిస్తే ఇళ్లల్లోకి ప్రవేశించి నానా భీభత్సం చేస్తున్నాయి. సెంటర్లో చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించే షాపులపై ఎగబడి మరీ తినుబండారాలు తీసుకొని మరీ పరిగెడుతున్నాయి. దీంతో వారు నష్ట పోతున్నారు. స్థానికులు పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా కోతుల సంచారాన్ని నియంత్రించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోతున్నారు. చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి.. -
వామ్మో.. తరగతి గదిలో ప్రవేశించిన చిరుత..
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అలీఘడ్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఒక తరగతి గదిలో చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో ఉదయాన్నే కళాశాలకు వెళ్లిన విద్యార్థిపై దాడిచేసింది. అతను భయంతో కేకలు వేస్తూ.. బయటకు పరుగులు తీశాడు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలీఘడ్లోని చౌదరి నిహాల్ సింగ్ అనే పాఠశాలలో చిరుతపులి ప్రవేశించింది. తరగతి గదిలో బెంచీల చాటున దాక్కుంది. గదిలోకి ప్రవేశించిన..లక్కీరాజ్ సింగ్ అనే బాలుడిపై వెనక నుంచి దాడిచేసి.. గాయపర్చింది. వెంటనే పులి వేరే చోటుకి పారిపోయింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత.. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ యోగేశ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం చిరుత ఒక తరగతి గదిలో దాక్కుందని పాఠశాల సిబ్బంది అటవీ అధికారులకు తెలిపారు. చిరుత పులి కదలికలు పాఠశాలలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈక్రమంలో.. అటవీ సిబ్బంది చిరుత పులిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తును ప్రజలు పాఠశాల వద్దకు చేరుకున్నారు. -
అయ్యా.. ఇక మాకు దిక్కెవరు?
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం: ‘అయ్యా.. మాకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు.. కుటుంబ పెద్దదిక్కైన నా భర్త చనిపోతే ఇక మాకు దిక్కెవరు?’ అని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ 26న ప్రొద్దుటూరు మండలంలోని బొజ్జవారిపల్లె క్రాస్ వద్ద తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఐషర్ వాహనంలో నుంచి కింద పడి మృతి చెందాడు. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. 27న పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. అయితే వాట్సప్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన భర్త మృతి చెందాడని తెలుసుకున్న తమిళనాడు ధర్మపురి జిల్లా, సిత్తేరి గ్రామానికి చెందిన మంగమ్మ ప్రొద్దుటూరుకు వచ్చారు. మృతి చెందిన వ్యక్తి తన భర్త బాలకృష్ణన్ అని తెలిపారు. ఆమెతో పాటు మరో ఆరుగురు బంధువులు ఉన్నారు. వారు మంగళవారం రూరల్ పోలీసులను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చదవండి: (మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి..) అటవీ శాఖ అధికారులపై మంగమ్మ ఆరోపణలు.. ప్రొద్దుటూరులో స్థిరపడి, బాగా తెలుగు మాట్లాడగలిగే తమిళనాడుకు చెందిన వ్యక్తిని పిలిపించి మంగమ్మ బంధువులతో పోలీసు అధికారులు మాట్లాడించి వివరాలు తెలుసుకున్నారు. బాలకృష్ణన్తో పాటు తమిళనాడులో రామన్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఆమె బంధువులు పోలీసులకు తెలిపారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియలేదన్నారు. అటవీ శాఖ అధికారుల వద్దకు వెళ్తే కనీసం వారు మాట్లాడలేదని, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త చావుకు అటవీశాఖ అధికారులే కారణమని ఆరోపించారు. కాగా, ఈ విషయమై అటవీ అధికారులను సంప్రదించగా, డీఆర్వో గుర్రప్ప స్పందిస్తూ ఈ కేసు విషయమై తమ దగ్గరకు ఎవరూ రాలేదని, తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. -
వైరల్ వీడియో: వరదలో చిక్కుకున్న తల్లీబిడ్డలను రక్షించిన అధికారులు
-
క్షణ క్షణం ఉత్కంఠ.. ప్రమాదం అంచున తల్లీ బిడ్డలు.. వారు సేఫ్, అయితే..
తమిళనాడు అటవీ అధికారులు ఓ మహిళను ఆమె కూతురిని రక్షించిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్గా మారింది. రెండు నిమిషాల నిడివిగల ఆ వీడియోలో ఓ మహిళ తన ఒడిలో చిన్నారిని పట్టుకొని జలపాతం పక్కన ఉన్న కొండ వద్ద చిక్కుకుపోగా ఆమెను అటవీ అధికారులు రక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా అత్తూరు సమీపంలోని కల్లవరయన్ కొండల్లో అనైవారి మట్టల్ జలపాతం కొండల మీద నుంచి పరవళ్లు తొక్కుతోంది. చదవండి: 150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం.. నెట్టింట ఫోటో వైరల్ ఈ క్రమంలో ప్రమాదకరంగా ఉన్న రాయిపై మహిళ తన కూతురితో చిక్కుకుపోయింది. వరద ప్రవాహంతో ఎక్కువగా ఉండడంతో ఆమె ఎటూ వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ రెస్క్యూ అధికారులు కొంతమంది యువకులు తాడు సాయంతో తల్లీబిడ్డలను రక్షించారు. అయితే అటవీశాఖ అధికారులకు సహాయం అందిస్తున్న సమయంలో చివరలో ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయారు. అప్పటికే వీడియో పూర్తయినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు నదికి అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్ -
వైరల్ వీడియో: ఇంటికొచ్చిన చిరుత.. గమనించిన కుటుంబ సభ్యులు..
-
ఇంటికొచ్చిన చిరుత.. గమనించిన కుటుంబ సభ్యులు..
దొడ్డబళ్లాపురం: ఇంట్లో చొరబడిన చిరుతపులి అక్కడే బందీ అయ్యింది. రామనగర తాలూకా జాలమంగల గ్రామంలో రేణుకాచార్య అనే వ్యక్తి ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత ప్రవేశించింది. దానిని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి చాకచక్యంగా బయటకు వచ్చి తలుపులు గడిపెట్టేశారు. దీంతో పెద్ద ము ప్పు తప్పింది. అటవీ అధికారులు చేరుకుని చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి తీసుకెళ్లారు. (చదవండి: కూతుళ్లే పుట్టారని వేధింపులు.. తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య) -
దొరికిన పులి.. అయినా మరో గిలి!
సాక్షి, చెన్నై(తమిళనాడు): నీలగిరుల్లో అటవీ అధికారులు, వేటగాళ్లను 21 రోజుల పాటుగా ముప్పుతిప్పలు పెట్టిన పులి ఎట్టకేలకు దొరికింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న ఈ పులికి మైసూర్లో చికిత్స అందిస్తున్నారు. అయితే సత్యమంగళం అడవుల్లో మరో పులి పశువుల మీద దాడి చేయడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. నీలగిరి జిల్లా కూడలూరు పరిసరాల్లో ఓ పులి జనాన్ని రెండు నెలలుగా వణికించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగుర్ని చంపింది. పదుల సంఖ్యలో పశువుల్ని హతమార్చింది. ఈ పులిని పట్టుకునేందుకు గత నెలఖారులో టీ–23 పేరిట ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. 150 మందితో కూడిన బృందం వేటకు దిగింది. ఈ పులిని కాల్చి చంపేందుకు సైతం అనుమతులు పొందారు. చివరకు కోర్టు ఆదేశాలతో వెనక్కు తీసుకున్నారు. ఈ పులి ఏ మార్గంలో వస్తున్నదో, జనం మీద దాడి చేసి ఎలా తప్పించుకుంటున్నదో అంతు చిక్క లేదు. నిఘా నేత్రాలు, డ్రోన్కెమెరాల సాయంతో గాలింపు చేపట్టారు. 21 రోజుల పాటుగా నిర్విరామంగా సాగిన ఈ పులి వేటలో శుక్రవారం ముందడుగు వేశారు. మైసూర్లో చికిత్స.. మసన కుడి – తెప్పకాడు పరిసరాల్లో ఈ పులి సంచరిస్తుండడం నిఘా నేత్రాలకు చిక్కాయి. దీంతో ప్రత్యేక బృందాలు అటు వైపుగా కదిలాయి. చేతుల్లో మత్తు ఇంజెక్షన్తో కూడిన తుపాకులతో వేట సాగించారు. పొదళ్లల్లో నక్కి ఉన్న పులి మీద మత్తు ఇంజెక్షన్ ప్రయోగించారు. కొద్దిదూరం పరుగులు తీసిన ఆ పులి సొమ్మ సిల్లింది. వెను వెంటనే మరింతగా పులికి మత్తును ఇచ్చి, బోనులో బంధించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ మంత్రి రామచంద్రన్, కార్యదర్శి సుప్రియా సాహు అక్కడికి చేరుకుని ఆ బృందాన్ని అభినందించారు. అయితే, మత్తు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో మణిగండన్ అనే అటవీ సిబ్బంది గాయపడగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ పులిని మైసూర్లోని వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ తీవ్రచికిత్స అందిస్తున్నారు. ఈ పులి చిక్కిన ఆనందంలో ఉన్న అధికారులకు సత్యమంగళంలో మరో పులి పంజా విసరడం కలవరాన్ని రేపింది. పశువుల మీద ఈ పులి దాడి చేయడంతో సత్యమంగళం పరిసర వాసుల్లో కలవరం బయలుదేరింది. ఈ పులిని పట్టుకునేందుకు మరో ఆపరేషన్ తప్పదేమో అని అటవీ అధికారులు భావిస్తున్నారు. -
పోడు వివాదానికి ఇక తెర!
సాక్షి, మహబూబాబాద్: దశాబ్దాల తరబడి పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడనుంది. అయితే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులు భూమిని విడిచి పెట్టేందుకు సిద్ధంగా లేకపోగా, ఫారెస్టు భూమిని సైతం తగ్గించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇందులో మధ్యేమార్గంగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్పర్సన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, జగదీశ్వర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఉపసంఘం మూడుసార్లు సమావేశమైంది. అయితే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోలేదని చెబుతూనే.. ఇప్పటికే ప్రాథమిక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్కు అందజేసినట్లు సమాచారం. 2005కు ముందున్నవారికే ప్రాధాన్యం! రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 2005కు ముందు నుంచి సాగులో ఉన్నవారికే హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అందుకు ఆధారాలుగా గిరిజన ప్రాంతంలోని రేషన్కార్డు, ఓటరు ఐడీ, లేదా ఫారెస్టు, పోలీసు కేసు రికార్డులు ఉంటే సరిపోతుందనే నిబంధనలు పెట్టారు. గిరిజనేతరులైతే మూడు తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ భూమిని సాగు చేసుకున్నవారు అర్హులు. ఇందుకోసం 25 ఏళ్లకు ఒక తరం చొప్పున 75 ఏళ్లు, 2005 నుంచి ఇప్పటివరకు 16 ఏళ్లు.. ఇలా మొత్తం 91 ఏళ్లుగా గిరిజనేతరులు సాగులో ఉండాల్సి ఉంటుంది. అయితే గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉన్నారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రామప్ప దేవాలయం ఎనిమిది శతాబ్దాల క్రితం నిర్మించారు. అప్పటికే అక్కడే బ్రాహ్మణులు, ఇతర కులాలవారు వ్యవసాయం చేసుకుంటూ జీవించారనే చారిత్రక ఆధారాలు ఉన్నట్లు చర్చ జరిగింది. ఇలా గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను కమిటీ చర్చించింది. గొత్తికోయలు మనోళ్లు కాదు.. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాల్సి వస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గొత్తికోయలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ములుగు, మహబూబాబాద్తోపాటు ఖమ్మం జిల్లా చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని వాజేడు ప్రాంతంలో గొత్తికోయలు ఉంటున్నారు. వీరు సంచార జీవనంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చినవారే కానీ, స్థానికులు కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఒక్కొక్కరికి నాలుగు హెక్టార్ల వరకే పట్టాలు.. అటవీశాఖ భూములే కదా.. అని గిరిజనులు, గిరిజనేతరులు వందల ఎకరాలు ఆక్రమించుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే ఒక్కొక్కరికి 4 హెక్టార్లు(పది ఎకరాలు) భూమికి మాత్రమే పట్టాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన భూమిని ఫారెస్టులో కలుపుకోవాలని భావిస్తోంది. పండుగ తర్వాతే.. పోడు భూముల పట్టాలు అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసే ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి దరఖాస్తులను ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉంచుతారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ముందుగా గ్రామపంచాయతీ, మండలస్థాయిలో, రెండో దశలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో, కలెక్టర్, భూ పరిపాలనా విభాగం, ఫారెస్టు, ఐటీడీఏ పీవో స్థాయి అధికారులు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారు. నిజమైన రైతులకు న్యాయం.. భూమినే నమ్ముకొని జీవిస్తున్న నిజమైన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఇవ్వాలి.. ఎప్పటి నుంచి భూమిని సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వాలి.. అనేవి కీలకాంశాలుగా చర్చ జరుగుతోంది. – సత్యవతి రాథోడ్, రాష్ట్ర మంత్రి, ఉపసంఘం చైర్పర్సన్ శాశ్వత పరిష్కారం చూపాలి ఏజెన్సీ మండలాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి. 2005 కంటే ముందు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందించినట్లయితే ఉన్న అడవులను స్థానికులే కాపాడుకుంటారు. – సీతక్క, ములుగు ఎమ్మెల్యే స్వేచ్ఛగా సాగు చేసుకోనివ్వాలి.. ఏజెన్సీ గ్రామాల్లోని పోడు భూముల్లో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే విధంగా చూడాలి. అర్హులైన ప్రతి వ్యక్తికి పట్టాలు ఇచ్చి రెండు పంటలకు నీరందించాలి. అప్పుడే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ఆగబోయిన రవి, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు -
హోరెత్తిన ‘పోడు’ పోరు
సాక్షి నెట్వర్క్: పోడుభూముల పోరు తీవ్రతరమైంది. వెంటనే పట్టాలివ్వాలని మంగళవారం గిరిజన రైతులు రోడ్డెక్కారు. అటవీ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లోనూ సడక్బంద్ నిర్వహించారు. కదంతొక్కారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, పోడుభూముల కోసం పోరాడే గిరిజనులను జైళ్లలో పెట్టడం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోడుసాగుదారులకు పట్టాలివ్వాలనే డిమాండ్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చేపట్టిన రాస్తారోకోలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బోయిన నర్సింహులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి, పాల్వంచల్లో కూడా రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కారేపల్లి, కొణిజర్ల, సత్తుపల్లి, పెనుబల్లిల్లోనూ వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పేద గిరిజన రైతులకు వెంటనే పట్టాలివ్వాలి పోడు భూములు గిరిజనుల హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పరిధిలోని హైదరాబాద్–శ్రీశైలం హైవేపైనున్న హాజీపూర్ చౌరస్తాలో నల్లమల సడక్బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వంశీకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, జాన్వెస్లీ హాజరయ్యారు. అంతకుముందు నారాయణ హైదరాబాద్ నుంచి హజీపూర్ వెళ్తూ డిండిలో మీడియాతో మాట్లాడా రు. కేసీఆర్ గిరిజనుల వైపు ఉంటారా, బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఉమ్మడి వరంగల్లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యాన మంగళవారం చేపట్టిన ‘సడక్ బంద్’విజయవంతమైంది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు రాస్తారోకోలు నిర్వహించారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై ఆందోళన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో సడక్ బంద్ నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని మిర్యాలగూడలో గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సూర్యాపేటలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిలోమీటర్ మేర నిలిచిన వాహనాలు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, కిసాన్ ఖేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై, బాన్సువాడ, గాంధారిలో రాస్తారోకో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్డు, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సత్తెనపల్లి, కడెంలోని పాండ్వపూర్, దస్తురాబాద్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, దహెగాం, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లో సడక్ బంద్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల, లక్సెట్టిపేట, కోటపల్లి, చెన్నూర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. ఉట్నూర్ ఎక్స్రోడ్డు వద్ద సడక్బంద్లో టీజేఎస్ అధినేత కోదండరాం పాల్గొన్నారు. -
ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు
ములుగు: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఉచ్చులు అమర్చే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ హెచ్చరించారు. జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో అమర్చిన ఉచ్చుకు పులి బలి అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్తో కలసి మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆగస్టు 1న పులి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించామన్నారు. ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా పులి కదలికలను పరిశీలించామని తెలిపారు. ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కుకొని పులి మృతి చెందిందనే సమాచారం మేరకు అప్రమత్తం అయ్యామన్నారు. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి మృతిచెందిన పులి గోర్లను, చర్మాన్ని అమ్మడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లు తెలియడంతో ఆదివారం కాటాపురం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామని చెప్పారు. ఒక వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద పులి గోర్లు, చర్మం లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలగుంపునకు చెందిన మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముఖేశ్, మడవి దేవ, మడవి గంగయ్య ఉన్నారని వివరించారు. కూలీ డబ్బులు చాలకపోవడంతో అటవీ జంతువులను వేటాడే దురాలోచనకు పూనుకొని ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పులి తిరుగుతుందనే సమాచారంతో ఉచ్చులు ఏర్పాటు చేయగా.. గత నెల 21న ఉచ్చులో పడి పులి మృతి చెందిందని శోభ చెప్పారు. పులి శరీర భాగాలను స్థానికులు మడకం రామ, మడకం ఉందయ్య, కోవాసి ఇడుము అడవిలో దాచిపెట్టారని.. విచారణలో ప్రశ్నించగా వాటిని చూపించారని తెలిపారు. స్థానిక వెటర్నరీ వైద్యుడు, ఎఫ్డీఓ వీటిని నిర్ధారించారని పేర్కొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న పీసీసీఎఫ్ శోభ పులుల సంరక్షణ అందరి బాధ్యత... అంతరించిపోయే స్థితిలో ఉన్న పులుల సంరక్షణ బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని సీసీఎఫ్ శోభ చెప్పారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, వరంగల్ సర్కిల్ సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ శివఆశీష్, ఎస్ఎస్ తాడ్వాయి ఎఫ్డీఓ ప్రశాంత్ పాటిల్, ములుగు ఎఫ్డీఓ జోగేంద్ర, పస్రా ఇన్స్పెక్టర్ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్రావు, వెటర్నరీ డాక్టర్ కరుణాకర్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!
ములుగు: కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాట్లు చేసిన ఉచ్చుకు పులి బలైంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన ఐదుగురు వేటగాళ్లు అటవీప్రాంతంలో ఉచ్చులను ఏర్పాటు చేశారు. రెండువారాల క్రితం ఏర్పాటు చేసిన ఉచ్చుకు చిక్కుకొని గేదె మృతి చెందింది. అయినా అటవీ అధికారులు స్పందించలేదు. అదే ఉచ్చుకు తాజాగా పులి బలి అయినట్లుగా సమాచారం. రెండురోజుల క్రితం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులకు పులి కళేబరం కనిపించింది. దీంతో కూపీ లాగిన పోలీసులు వేటగాళ్లను గుర్తించడంతోపాటు వారి నుంచి పులిచర్మం, ఎనిమిది గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో సంచరించిన పులి ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు ఉచ్చులు వేసిన వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించినా అటవీ, పోలీస్ అధికారులు స్పందించలేదు. -
‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’
గూడూరు: ‘కాళ్లు మొక్కుతా.. దళితులం.. పంట నాశనం చేయకండి’.. అంటూ ఓ పోడు రైతు అటవీ అధికారి కాళ్లు మొక్కాడు. అయినా కనికరం చూపకుండా అటవీ అధికారులు పంటను ధ్వంసం చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు పోడు భూముల్లో శుక్రవారం జరిగింది. కొన్ని నెలలుగా బొల్లేపల్లి శివారులోని సర్వే నంబర్ 1 నుంచి 30 గల పోడు భూముల్లో స్థానిక దళిత, గిరిజన రైతులు 1985కు ముందు నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ఆ భూమి అటవీ శాఖది పేర్కొంటుండడంతో ఏడాదిగా అధికారులు, రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి జోక్యం చేసుకోవడంతో నాటి గొడవలు సద్దుమణిగాయి. దీంతో రైతులు వారి భూముల్లో పంటలు సాగు చేసుకున్నారు. అయితే శ్రీను అనే రైతు మిర్చి పంట వేసుకోగా శుక్రవారం డీఎఫ్ఓ కిరణ్ సమక్షంలో మానుకోట అటవీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అటవీ భూమిగా పేర్కొంటూ పంటను ధ్వంసం చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఓ రైతు ఏకంగా డీఎఫ్ఓ కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపకుండా పంటను నాశనం చేసి వెళ్లిపోయారు. చదవండి: నేను గెలిస్తే కేసీఆర్ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్ -
మహిళలపై గొడ్డలితో దాడి చేసిన ఫారెస్ట్ అధికారి
-
కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు
బెజ్జూర్ (సిర్పూర్): ‘కలప అక్రమ దందా నువ్వే చేపడుతున్నావు.. ఏం అనుకుంటున్నావు.. నువ్వు ఎక్కువ చేస్తున్నావ్.. నీపై కేసులు బనాయిస్తాం..’ అంటూ బెజ్జూర్ అటవీ శాఖ ఎఫ్ఎస్వో ప్రసాద్ బుధవారం ‘సాక్షి’ బెజ్జూర్ విలేకరిని బెదిరింపులకు గురిచేశారు. ‘మాయమవుతున్న కలప’ శీర్షికతో రేంజ్ పరిధిలో కలప అక్రమ రవాణాపై ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. కలప అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు బుధవారం ఉదయం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు. నిఘా పెంచి కలప అక్రమ రవా ణాను అడ్డుకుంటామని తెలపాల్సిన అధికారులు ఇలా భయబ్రాంతులకు గురిచేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ కాల్పై ఎఫ్ఆర్వో దయాకర్ను వివరణ కోరగా ఈ విషయంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు.. ‘సాక్షి’ కథనంతో స్పందించిన అటవీ అధికారులు బుధవారం బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఎస్కే మోహిత్ అనే వ్యక్తి ఇంట్లో ప్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టి 25 టేకు కలప చెక్కలను పట్టుకున్నారు. ఈ మేరకు ప్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో అప్పలకొండ వెల్లడించారు. దీని విలువ రూ.8500లు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో బెజ్జూర్ ఎఫ్ఆర్వో దయాకర్, ఎఫ్ఎస్వో ప్రసాద్, బీట్ అధికారి వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.