అన్ని మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం డిమాండ్ చేసింది. విద్యుత్ ఛార్జీలు చెల్లించాలంటూ విద్యుత్ సంస్థలు ఇటీవలి కాలంలో పంచాయతీలకు నోటీసులు ఇస్తున్నాయని, అరుుతే, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన పంచాయతీలు ఆ ఛార్జీలను చెల్లించే స్థితిలో లేవని సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్రావు, గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి భూమన్నయాదవ్ తదితరులు బుధవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో తెలిపారు.