
బాబు దీక్షకు సర్కారు సహకారం
చంద్రబాబు దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు పైకి నోటీసులిచ్చినా, దీక్ష విజయవంతవుయ్యేందుకు తమ వంతుగా సహకరిస్తున్నారు.
వేదిక ఖాళీ చేయూలంటూ పైపైకి నోటీసులు.. చాటువూటుగా అండదండలు
ప్రభుత్వ పెద్దలతో టీడీపీ నేతల ఎడతెగని మంతనాలు
దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్న ఏపీ భవన్ అధికారులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా ఏకంగా ప్రభుత్వ కార్యాలయమైన ఏపీ భవన్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, చంద్రబాబు దీక్ష వూత్రం అక్కడ కొనసాగుతూనే ఉంది. దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు పైకి నోటీసులిచ్చినా, దీక్ష విజయవంతవుయ్యేందుకు తమ వంతుగా సహకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో ఎలాంటి సభలు, సావుూహిక కార్యకలాపాలు నిర్వహించినా కోడ్ ఉల్లంఘనే అవుతుంది. కోడ్ అవులులో ఉన్నపుడు ప్రభుత్వ అతిథి గృహాలను జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి మినహా ఇతరులకు ఇవ్వరాదు. ఏపీ భవన్ అధికారులు మాత్రం ప్రభువును మించిన భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఏపీభవన్లోని సుమారు 40 గదులను చంద్రబాబు దీక్షకు వచ్చిన నేతలకే కేటాయించినట్లు సమాచారం. పైగా వారికి ఏ లోపం రాకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏపీ భవన్ పరిపాలనాధికారి రామ్మోహన్ టీడీపీ నేతలతో టచ్లో ఉంటూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారానికి చంద్రబాబు దీక్ష మూడవ రోజుకు చేరింది. తొలిరోజు నుంచి పూర్తి సహకారం అందిస్తున్న ప్రభుత్వం వుూడవ రోజు వురింత సహకారం అందించింది.
అడుగడుగునా సహకారం
ఏపీ భవన్లోని గురజాడ హాల్లో చంద్రబాబు విలేకరుల సమావేశానికి మాత్రమే తొలిరోజు అనుమతి తీసుకున్నారు. ఆ వెంటనే చంద్రబాబు ఏపీ భవన్ ఆవరణలోని వేదికపై దీక్ష మొదలెట్టారు. ఆ తరువాత వేదికపై పరుపులు, ఏసీలు, మైకులు, షామియానాలను పార్టీ నేతలు ఏర్పాటు చేసుకున్నారు. ఏపీ భవన్ పరిపాలనాధికారి రామ్మోహన్, భద్రతాధికారి సుబ్బన్న స్వయుంగా ఈ ఏర్పాట్లు చూశారు. కొందరు సిబ్బందిని ఇందుకే కూడా కేటాయించారు. మొదటి రెండు రోజులు చంద్రబాబు దీక్షకు అంత స్పందన కనిపించలేదు. దీంతో.. వుద్దతుదార్లతో తాము ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ైరె ళ్లు బుధవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటాయని, ఈ లోగానే దీక్షను భగ్నం చేస్తే చేసిన ఖర్చు బూడిదలో పోసినట్టే అవుతుందని టీడీపీ నేతలు ఢిల్లీ పోలీసు అధికారులు, ఏపీ భవన్ అధికారులకు విన్నవించుకున్నారు. పార్టీ కార్యకర్తలు ఢిల్లీ చేరేంతవరకూ దీక్షను భగ్నం చేయబోమంటూ హామీ ఇచ్చారు. అయితే వనంగా ఉంటే ప్రభుత్వంతో టీడీపీ కుమ్మక్కు బయుటపడవచ్చు కాబట్టి, తావుు నోటీసులిస్తూ ఉంటామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఒక నోటీసు అందచేసి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తర్వాత, బుధవారం ఢి ల్లీ పోలీస్ కమిషనర్కు లే ఖ రాశారు. నిరవధిక దీక్ష చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు పెద్దసంఖ్యలో జనం వస్తున్నారని, ఈ అనధికార దీక్ష వల్ల ఇబ్బందులు ఉంటారుు కాబట్టి, దీక్షా శిబిరాన్ని తొలగించాలని గోయుల్ కోరారు. తగిన చర్య కోసం ఢిల్లీ పోలీసులను సంప్రదించాల్సిందిగా ప్రభుత్వం తనను ఆదేశించిందని, దీక్షా శిబిరాన్ని తొలగించాలని కోరారు. దీక్షకు తావుు అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్కు రాసిన లేఖలో తెలిపారు. ఇక, బాబు దీక్ష ఏర్పాట్లు తొలగించామని చెప్పుకునేందుకు, ఏపీ భవన్ ఆవరణలోని టీడీపీ ఫ్లెక్సీలను, ఆ పార్టీవారి వంట ఏర్పాట్లను తొలగించారు. మెయిన్ గేట్కు తాళం వేశారు. తరువాతే అసలు కథ మొదలైంది. మీడియాను కూడా ఏపీభవన్లోకి అనుమతించలేదు. పరామర్శకు వచ్చిన ఎల్ఐసీ ఏజెంట్లను బయుటే నిలిపేయుడంతో వారు ధర్నాకు దిగారు. టీడీపీ నేతలు సీఎం రమేష్, కొత్తకోట దయాకర్రెడ్డి, పల్లె రఘునాథ రెడ్డి, తదితరుల నేతృత్వంలో నినాదాలు చేశారు. ప్రధాన ద్వారం వద్దనే కారు దిగి లోపలికి నడిచి రావాల్సిందిగా సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావులను భద్రతా సిబ్బంది కోరటంతో కొద్దిసేపు ధర్నా చేశారు. కారును లోపలికి అనుమతించిన తరువాత గేటుకు తాళం వేశారు. వెంటనే టీడీపీ నేత ఒకరు సిబ్బంది నుంచి తాళం చెవిని లాక్కుని గేటు తెరిచారు. పార్టీ కార్యకర్తలందరినీ లోపలకు పంపించారు. ఇక ప్రత్యేక రైళ్లలో వచ్చిన వారిని పోలీసులు దగ్గరుండి లోనికి పంపించారు. ప్రభుత్వం, టీడీపీ మధ్య వుుందస్తు అవగాహన మేరకే ఇదంతా జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వైఎస్ జగన్ దీక్షను ప్రభుత్వం విరమింపజేసిన తర్వాతే బాబు దీక్షను కూడా విరమింపజేయాలని టీడీపీ నేతలు అధికారులతో మాట్లాడుకున్నట్లు సమాచారం.
సమస్యను మీరే పరిష్కరించాలి:బాబు
విభజన నేపథ్యంలో రాష్ట్రంలో సమస్యను సృష్టించింది కేంద్రమే కాబట్టి ప్రభుత్వమే పరిష్కారం చూపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బుధవారం దీక్షా శిబిరంలో ఆయున వూట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. రాష్ర్ట విభజన తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ ఢిల్లీ నుంచి కదలబోనన్నారు. ఎన్నికల నిబంధనావళి పేరుతో తనను పంపించేందుకు ప్రయుత్నించడం తగదని అన్నారు. చంద్రబాబుకు బుధవారం అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి కూడా దీక్షా శిబిరానికి వచ్చారు. దీక్ష ప్రాంగణానికి తరలిరావాలని ఢిల్లీలోని ఆంధ్ర విద్యాసంఘం నిర్వాహకుల నుంచి ఆదేశాలు రావడంతో, సెలవుల్లో ఉన్న సిబ్బంది ఏపీ భవన్కు వచ్చి సంఘీభావం తెలిపారు.