సర్కారు ఉల్లి కిలో రూ. 30 | India's onion crisis a 'gold mine' | Sakshi
Sakshi News home page

సర్కారు ఉల్లి కిలో రూ. 30

Aug 28 2013 3:04 AM | Updated on Sep 1 2017 10:10 PM

సామాన్యులకు ఉల్లిని అందుబాటు ధరలో అందించడానికి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ తెలిపా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రైతు బజారులో ప్రభుత్వం

కలెక్టరేట్ : సామాన్యులకు ఉల్లిని అందుబాటు ధరలో అందించడానికి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ తెలిపా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రైతు బజారులో ప్రభుత్వం తరపున ఉల్లిగడ్డ విక్రయ కేంద్నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో ఉల్లిని కిలో రూ. 50 వరకు విక్రయిస్తున్నారన్నారు. 
 
 ఈ కేంద్రాల ద్వారా 30 రూపాయలకే కిలో ఉల్లి అందిస్తున్నామని పేర్కొన్నారు. పులాంగ్ చౌరస్తాలోని రైతు బజారులో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. డిమాండ్‌ను బట్టి కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌లలో కూడా ఉల్లి విక్రయ కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ కొండల్‌రావు, డీఎంసీఎస్ దివాకర్, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement