అనంతవరం, నిడమర్రులో పారిశ్రామిక జోన్లు | industrial zones in ananthavaram, nidamarru | Sakshi
Sakshi News home page

అనంతవరం, నిడమర్రులో పారిశ్రామిక జోన్లు

Published Sun, Jul 5 2015 12:46 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

అనంతవరం, నిడమర్రులో పారిశ్రామిక జోన్లు

అనంతవరం, నిడమర్రులో పారిశ్రామిక జోన్లు

సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రతిపాదిత ఏపీ రాజధాని నగరంలో రెండు పారిశ్రామిక జోన్లు ఏర్పాటు కానున్నాయి. రాజధాని నగరానికి సమీపంలో గుంటూరు జిల్లాలో ఉన్న అనంతవరం, నిడమర్రు ప్రాంతాల్లో ఇందుకోసం అనువైన భూములు కూడా సిద్ధమయ్యాయి. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో ఈ భూములను పారిశ్రామిక జోన్ల కింద పేర్కొంటూ మార్కింగ్ చేశారు.

దీని ప్రకారం తుళ్లూరు మండలం అనంతవరం పరిధిలో రెండు వేల ఎకరాలు, మంగళగిరి మండలం నిడమర్రు ప్రాంతంలో 1,200 ఎకరాల స్థలాలను రిజర్వు చేసిన సీఆర్‌డీఏ అధికారులు అక్కడ ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందనే విషయాలపై అధ్యయనం చేస్తున్నారు.
 

సింగపూర్, జపాన్, చైనాతోపాటు స్వదేశీ కార్పొరేట్ కంపెనీలను ఈ జోన్లలో పారిశ్రామిక టౌన్‌షిప్‌లు నిర్మించేందుకు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం చైనాకు చెందిన డాలియన్ వాండా గ్రూపునకు ఈ రెండు ప్రదేశాలను చూపించి భవిష్యత్తులో ఇవి ఆకర్షణీయమైన పారిశ్రామిక కేంద్రాలుగా మారతాయని వివరించారు. గతంలో సింగపూర్, జపాన్‌కు చెందిన పలు కంపెనీలు కూడా ఈ స్థలాలను పరిశీలించాయి.

టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తే ఈ జోన్లలో వారికి భూమిని లీజుకివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ జోన్లలో కాలుష్య రహిత ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.  రాజధాని నగరం కాలుష్యం బారిన పడుతుందనే ఉద్దేశంతో కేవలం గ్రీన్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement