
సాక్షి, విజయవాడ: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృష్ణా జిల్లాలోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 35 ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకోవటం తమ కుటుంబ సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించానని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment