దుర్గమ్మ సన్నిధిలో మంత్రి కొప్పుల | Koppula Eshwar Visits Kanaka Durga Temple In Vijayawada | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొప్పుల

Published Wed, Aug 28 2019 2:05 PM | Last Updated on Wed, Aug 28 2019 2:23 PM

Koppula Eshwar Visits Kanaka Durga Temple In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కృష్ణా జిల్లాలోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 35 ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకోవటం తమ కుటుంబ సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నానని అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించానని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement