-
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి : కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓదెల, ఎలిగేడు మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రసాధనలో ముందుండి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని అద్భుత పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దే అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ గ్రామాల్లో ప్రజలకు తెలియజేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అభ్యర్థుల ఖరారు పూర్తితో.. వ్యూహాలకు కసరత్తు! -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..?
కరీంనగర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించా రు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడ్పల్లి గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను ఆదివారం పరిశీలించా రు. ఎస్సారెస్పీ పంప్హౌజ్ ద్వారా సాగునీరు వ స్తుందనే ఆశతో రెండు గ్రామాల రైతులు సుమారు 1800 ఎకరాల్లో వరి సాగుచేశారని, పొట్టదశలో సా గునీరు అందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. సుందిల్ల, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల నుంచి లక్ష ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి ఉన్నా.. ప్ర భుత్వం పట్టించుకోకుండా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అక్కసుతోనే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు. కోపముంటే బీఆర్ఎస్ నాయకులపై తీర్చుకోవాలేగానీ రైతులపై కాదన్నారు. ప దేళ్లలో ఎన్నడూ గుంట భూమి కూడా ఎండిపోలేద ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 1800 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరవై ఏళ్లుగా తాను ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతంలో ఏ రోజూ ఇలాంటి పరి స్థితి రాలేదన్నారు. వేంనూర్ పంప్హౌజ్ నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా రైతులకు నీరందించి పంటలను కాపాడామని గుర్తు చేశారు. వెంటనే వేంనూర్ పంపులను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ఆయన వెంట జె డ్పీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్, ఎంపీటీసీ మల్లేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పాత.. కొత్త.. ‘కారు’ అభ్యర్థులు ఖరారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రారంభించింది. మొదటి జాబితాలోనే ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల క్యాండిడేట్ల జాబితా విడుదల చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు గులాబీ దళపతి మరోసారి అవకాశం కల్పించారు. పెద్దపల్లి నుంచి కొత్తగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అవకాశం కల్పించారు. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో బీఆర్ఎస్ సైతం తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల హీట్ను పెంచింది. మరోవారం పదిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం తొలిజాబితాను విడుదల చేసేందుకు కసరుత్తు చేస్తోంది. బోయినపల్లి వినోద్కుమార్ పుట్టిన తేదీ: 1959 జూలై 22 విద్యార్హతలు: ఎల్ఎల్బీ (కేయూ) అనుభవం: టీఆర్ఎస్ పోలిట్బ్యూరో సభ్యులు, లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అదనపు సమాచారం: సీపీఐలో వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభంతో టీఆర్ఎస్లో చేరి 2004–09 మధ్యలో వరంగల్ ఎంపీగా, 2014–19లో కరీంనగర్ ఎంపీగా పని చేశారు. 2019లో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. సామాజిక వర్గం: వెలమ (ఓసీ) కొప్పుల ఈశ్వర్ పుట్టిన తేదీ: 1959 ఏప్రిల్ 20 విద్యార్హతలు: బీఏ అనుభవం: సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. అదనపు సమాచారం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో మేడారం నుంచి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004, 08లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2009, 10, 14, 18లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. 2014–18 వరకు ప్రభుత్వ చీఫ్ విప్గా పని చేశారు. 2019 నుంచి మంత్రిగా పని చేశారు. సామాజిక వర్గం: ఎస్సీ (మాల) ఇవి చదవండి: నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన -
TS:మాజీ మంత్రికి పెద్దపల్లి ఎంపీ టికెట్!
సాక్షి, పెద్దపల్లి: ఆ మాజీ మంత్రి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఏడోసారి ఓడిపోయారు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ సీటుపై కన్నేశారట ఆ మాజీ మంత్రి. మరి గులాబీ బాస్ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చేశారా? మాజీ మంత్రికి కాదంటే పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అసలు అక్కడ నుంచి పోటీ చేయడానికి పోటీ పడుతున్న నేతలెవరు? పెద్దపెల్లి ఎంపీ సీటుకు గులాబీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకొస్తోంది. సౌమ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పేరున్న ఈశ్వర్ అయితేనే పెద్దపల్లి సీటు కచ్చితంగా గులాబీ పార్టీకి దక్కుతుందని పార్టీ అధినేత ఆలోచిస్తున్నాట్లు చెబుతున్నారు. ధర్మపురి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటమిపాలైన ఈశ్వర్ ను ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేశ్ నేతకాని ఉండగా.. చెన్నూరు అసెంబ్లీ బరిలో ఓటమిపాలైన బాల్కసుమన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, వీరిద్దరి కంటే కూడా బెస్ట్ ఛాయిస్ గా గులాబీ బాస్ మాత్రం కొప్పుల ఈశ్వర్ అయితేనే బెటరని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దపెల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్దఎత్తున సింగరేణి కార్మికుల ఓట్లుండటం... ఆయా ప్రాంతాలన్నింటా ఈశ్వర్ కు పట్టుండటంతో పాటు.. ధర్మపురి నుంచి ఆరుసార్లు గెలిచి ఏడోసారి ఓటమిపాలైన కొప్పులను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని పార్టీ అగ్ర నాయకులంతా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈశ్వర్ను పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్ఠానం యోచిస్తుంటే... యవనేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు.. వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ నుంచి ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే, బీజేపీ నుంచి ఈసారి కొత్త ముఖాన్ని పెద్దపెల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలూ లేకపోలేదని..ఇప్పటికే ఎస్. కుమార్ను ధర్మపురి అసెంబ్లీ బరిలో నిలిపినందున ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు కాశిపేట లింగయ్య వంటివారు కూడా ప్రయత్నాలు చేస్తుండగా.. ఆయన్ను కమలం పార్టీ అధిష్ఠానం యాక్సెప్ట్ చేస్తుందో, లేదోనన్న భావన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరైనా బలమైన నేత వస్తే తప్ప.. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి యువకుడైన వంశీ గనుక బరిలోకి దిగితే.. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కు తెర లేవనుంది. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో.. అప్పుడే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. పొల్టీషియన్స్ అంతా ఎవరి ప్లాన్లల్లో వారు పడ్డారు. అలాగే పార్టీలు కూడా ఏ అభ్యర్థైతే బెటర్.. ఎవరైతే ప్లస్.. ఎవరైతే మైనస్ అనే లెక్కలు వేసుకుంటున్నాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత విధించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఎమ్మెల్యేగా ఆయనపై వేటు వేయాలని పిటిషన్లు వేశారు. ధర్మపురి ఎన్నికపై రీకౌంటింగ్ జరపాలని కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కాంగ్రెస్నేత పిటిషన్ను కొట్టివేసింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కరీంనగర్ జల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసి కేవలం 441 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్పై గెలిచారు. దీంతో వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించకముందే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని, అధికారులు ఆయనకు మద్దతిచ్చారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ధర్మపురి నియోజవకవర్గం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ ఈ ఇద్దరు నేతలే తలపడుతున్నారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఈసారి గెలుపెవరిదో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తోడేళ్ళను తరిమే రోజు!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
తప్పక చదవండి
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement