జాతీయ పండుగగా గుర్తించండి | Telangana Lawmakers Invite Minister Arjun Munda For Medaram Jatara | Sakshi
Sakshi News home page

జాతీయ పండుగగా గుర్తించండి

Published Fri, Aug 2 2019 7:19 AM | Last Updated on Fri, Aug 2 2019 7:19 AM

Telangana Lawmakers Invite Minister Arjun Munda For Medaram Jatara - Sakshi

కేంద్రమంత్రికి ఆహ్వానపత్రం అందిస్తున్న నామా నాగేశ్వర్‌రావు, చిత్రంలో కొప్పుల

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి అర్జున్‌ముండాను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆహ్వానించారు. ఈమేరకు గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్కండ్‌ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారని మంత్రి వివరించారు. దక్షిణ కుంభమేళాగా భావిస్తున్న మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతర జరుగుతుందన్నారు. దీని నిర్వహణకు దాదాపు రూ.110 కోట్లు అవసరమవుతాయని, రాష్ట్ర గిరిజన శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి అందజేశారు. ఈ జాతర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ముందుకొచ్చి నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వసతి గృహ నిర్మాణాలకు నిధులివ్వండి 
ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వసతి గృహాల నిర్మాణాలు, సౌకర్యాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలసి కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలేకు వినతిపత్రం సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement