అదుపుతప్పిన ఓ లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో శనివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి అద్దంకి వైపు వెళుతున్న లారీ మార్కెట్ యార్డ్ ప్రాంతంలో మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి బయట పడుకున్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇల్లు ధ్వంసం అయింది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు.
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురికి గాయాలు
Published Sat, Sep 26 2015 9:23 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement