injuries
-
రాహుల్ సభలో తొక్కిసలాట
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో సభావేదిక వద్ద తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆదివారం ఫూల్పూర్ నియోజకవర్గం పరిధిలోని పడిలా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారసభ ఈ ఘటనకు వేదికైంది. ప్రచారసభకు రాహుల్, అఖిలేశ్ వస్తున్నారని తెల్సి ఇరుపార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కిక్కిరిసన జనంతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది.ప్రసంగించేందుకు అఖిలేశ్ సభావేదిక మీదకు రాగానే జనం వేదికపైపు హఠాత్తుగా ముందుకొచ్చారు. బారికేడ్లు, అడ్డుగా ఏర్పాటుచేసిన కర్రలను తొలగించి మరీ దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారి తొ క్కిసలాట జరిగింది. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. వెనక్కి వెళ్లండి అని వేదికపై నుంచి అగ్రనేతలు హెచ్చరించినా కార్యకర్తలు ఎవ్వరూ వినిపించుకోలేదు. ఓటర్ల శాంతించాలని విన్నవించినా పట్టించుకోలేదు. చాలా మంది రాహుల్, అఖిలేశ్ దాకా వచ్చి వారితో షేక్హ్యాండ్ కోసం స్టేజీ వద్ద ఎగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో, భారీగా పోగైన కార్యకర్తలను నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు. దాంతో అక్కడ మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీ భద్రతకు ముప్పుందని అక్కడి భద్రతా, పోలీసు సిబ్బంది అగ్రనేతలు రాహుల్, అఖిలేశ్లను అప్రమత్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రసంగించాలా వద్దా అని రాహుల్, అఖిలేశ్ కొద్దిసేపు మాట్లాడు కున్నారు. తర్వాత ప్రసంగించకుండానే ఇద్ద రు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ అర్ధంతరంగా ముగిపోయింది. తర్వాత అక్కడి సమీపంలోని ముంగారీ ర్యాలీలో ప్రసంగించారు. అక్కడ కూడా దాదాపు ఇదే మాదిరిగా కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని ముందుకు రాబోయారు. యూపీలో బీజేపీకి దక్కేది ఒక్కటే సీటు: రాహుల్ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మాత్రమే బీజేపీ గెలుస్తుందని రాహుల్ గాంధీ జోస్యంచెప్పారు. ఆదివారం ఆయన ‘ఇండియా’ అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్ తరఫున రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్తో కలిసి ప్రచారం చేశారు. జపాన్లోని సుందరనగరం క్యోటోలాగా వారణాసిని తీర్చిదిద్దుతానని మోదీ గతంలో ఇచ్చిన హామీని రాహుల్ ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ‘‘ ఉత్తరప్రదేశ్లో బీజేపీ క్యోటో సీటును మాత్రమే మోదీ గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీటు అదొక్కటే. కోవిడ్కాలంలో బీజేపీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని ఇష్టారీతిన మార్చేందుకు తెగబడింది’’ అని అన్నారు. -
IND vs ENG: టీమిండియాకు సంకటం!
హైదరాబాద్: సొంతగడ్డపై ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఎదురైన పరాజయం నుంచి కోలుకోకముందే... భారత్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పటికే తొలి రెండు టెస్టుల నుంచి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు కూడా రెండో టెస్టుకు దూరమవడం జట్టుకు ప్రతికూలంగా పరిణమించనుంది. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న, ఐపీఎల్లో అడపాదడపా మెరిపిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కింది. రెండో టెస్టు కోసం కొత్తగా సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్లను తీసుకోగా... తమిళనాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను కూడా ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు. ఆదివారం నాలుగోరోజు ఆటలో పరుగు తీసే ప్రయత్నంలో జడేజా తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్లో కేవలం పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కుడి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గత ఐపీఎల్లో కూడా రాహుల్ ఇదే విధమైన గాయంతో నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ‘గాయపడిన జడేజా, రాహుల్ ఇద్దరు వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టులో పాల్గొనడం లేదు. బోర్డు మెడికల్ టీమ్ ఇద్దరి పరిస్థితిని సమీక్షిస్తోంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సర్ఫరాజ్ గుర్తున్న క్రికెటరే కానీ..! ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ భారత సీనియర్ జట్టుకు కొత్త ముఖమై ఉండొచ్చు కానీ... క్రికెట్ అభిమానులకు తెలియని పేరేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్లో కోహ్లి సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మెరిపించాడు. అతని మెరుపులకు ఒకానొక సందర్భంలో ఫిదా అయిన కోహ్లి... సర్ఫరాజ్ అవుటై పెవిలియన్కు చేరుతుంటే రెండు చేతులు జోడించి మరీ జేజేలు పలికాడు. సర్ఫరాజ్ రెండు ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ (2014, 2016)లలో ఆడాడు. భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రంజీల్లోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే ఇదంతా కూడా అతని ఆటతీరుకు నిదర్శనమైతే... నోటిదురుసుతో సెలక్షన్ కమిటీ పరిశీలనకు అతని పేరు అదేపనిగా దూరమైంది. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న 30 ఏళ్ల సౌరభ్ ఇప్పటి వరకు 68 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 2061 పరుగులు సాధించడంతోపాటు 290 వికెట్లు పడగొట్టాడు. -
ఇండియాలోనే రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువ? డబ్ల్యూహెచ్ఓ నివేదిక ఏం చెప్పింది?
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2010–2021 మధ్య రోడ్డు ట్రాఫిక్ దుర్ఘటనలు ఏటా 5 శాతం (లక్షా 19 వేలు) తగ్గాయి. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో సభ్యత్వం ఉన్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిపోతుండగా, భారత్లో మాత్రం 15 శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో 2010లో 1.34 లక్షలు సంభవించగా, 2021లో వాటి సంఖ్య 1.54 లక్షలకు పెరిగింది. రోడ్డు భద్రతలో ప్రపంచ పరిస్థితి–2023 అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నార్వే, డెన్మార్క్, జపాన్, రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు 50 శాతం తగ్గించగలిగారు. మరో 35 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 30 నుంచి 50 శాతం వరకూ తగ్గిపోయాయి. 2019 నాటికి ప్రపంచంలో ఐదు నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, యువతీయువకుల మరణాలకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని, అన్ని వయసులవారి హఠాన్మరణాలకు 12వ ప్రధాన కారణం రోడ్డు దుర్ఘటనలేనని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మూడింట రెండు వంతుల మరణాలు పనిచేసే వయసులో ఉన్న వారికే సంభవించాయి. గడచిన దశాబ్దంలో ప్రపంచ జనాభా 140 కోట్లు (13%) పెరగింది. కాని, విశ్వవ్యాప్తంగా రోడ్డు దుర్ఘటనల్లో మొత్తం మరణాలు ఐదు శాతం తగ్గిపోయాయి. పదేళ్ల కాలంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. 2010–2021 సంవత్సరాల మధ్య ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. కాగా, ప్రతి లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు 79 నుంచి 47కు తగ్గింది. అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య 41% తగ్గినట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల మరణాలు 28 శాతం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవించాయి. 25% రోడ్డు చావులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, 19% ఆఫ్రికా ప్రాంతంలో, అమెరికా ఖండాల్లో 12%, తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో 11%, ఐరోపా ప్రాంతంలో కేవలం ఐదు శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. పేద, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువ. మోటారు వాహనాలకు రహదారులపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించేది పేద, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రతి పది మరణాల్లో తొమ్మిది ఈ పేద దేశాల్లోనే జరిగే రోడ్డు దుర్ఘటనల్లో సంభవిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే–పేద, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లో జనం వాడే మోటారు వాహనాలు సంఖ్య తక్కువ. అలాగే, ఈ దేశాల్లో ఉన్న రహదారుల సంఖ్య కూడా బాగా తక్కువ. రోడ్ల నాణ్యత కూడా అభిలషణీయ స్థాయిలో ఉండదు. సరైన మౌలిక సౌకర్యాలు, అవసరమైనన్ని మోటారు వాహనాలు లేని ఈ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశం ధనిక దేశాలతో పోల్చితే బాగా ఎక్కువ. ఈ బడుగు దేశాల్లో మోటారు వాహనాల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోడ్లపై తిరిగే మొత్తం మోటారు వాహనాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలపింది. ఈ నివేదిక వివరాలను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక శుక్రవారం ప్రచురించింది. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, చిన్న పిల్లల మరణాల వల్ల ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. రోడ్లపై మోటారు వాహనాల ప్రమాదాలు అరిక్టడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా, మరణాలకు కారకులైనా పెద్ద శిక్షలు వేయడం ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానం. ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
Italy:ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్ప్రెస్ రైళ్లు
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న ఉగ్రవేట.. మరో సైనికుడి వీరమరణం
కశ్మీర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట గత మూడు రోజులుగా కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సైనికులకు మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఓ పోలీసు అధికారి మరణించారు. ఈ రోజు అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో సైనికుడు తీవ్ర గాయాలతో నెలకూలాడు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అనంతనాగ్ జిల్లాలో అటవీ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులతో 48 గంటలుగా భీకర పోరు నడుస్తోంది. అటవీ ప్రాంతంలో భయంకరమైన బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, పోలీసు అధికారి డీఎస్పీ హుమయూన్ భట్లు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి. ఇదీ చదవండి: Kerala Nipah Virus Updates:కేరళలో మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్.. ఆరుకి చేరిన నిఫా కేసులు -
గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!
గాయాలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్కోసారి అవే ప్రాణాంతకంగా మారవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. దెబ్బల తగిలిన వెంటనే సత్వరమే తగిన చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడొచ్చు అంటున్నారు. దెబ్బల రకాలు, ఎలాంటి చికిత్స తీసుకోవాలి తదితరాలు నవీన్ మాటల్లోనే చూద్దాం!. మనిషికి గాయాలు రెండు రకాలుగా జరుగుతాయి. అవి 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు. మానసిక గాయాలు : మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానుతుంది. అదే మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము మర్చిపోలేం. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియంగా మాట్లాడుట చేతకనివారు మౌనం వహించుట ముఖ్యము. అని మన పెద్దలు చెబుతుంటారు శారీరక గాయము: శరీరానికి బయట వస్తువుల నుంచి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో, వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయం అంటాం. ఒకవేళ గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును. గాయమైనచోట ఇన్ఫెక్షన్కి గురయ్యి 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి. చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్మెంట్, పౌడర్ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. శారీరక గాయాల రకాలు : బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గడ్డకట్టి గీక్కు పోయేలా ఉండే గాయము . గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును . బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము. బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట. ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. అలాంటి సమయంలో ఆయా వ్యక్తులకు ఉపశమనం పొందేలా చికిత్స అందించడం అత్యంత ముఖ్యం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు. కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి. ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి. బెణిగిన లేదా నలిగిన గాయలకు ప్రథమ చికిత్స.. ►నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి. ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి. మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది. ►తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమచికిత్స ►తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి. ►గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి. ►పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు. ►గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి ►గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి. ►ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది. ►గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి. వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి. నొప్పినివారణ మందులు : నొప్పి తగ్గించడానికి అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4 నుంచి 5 రోజులు వాడాలి. యాంటిబయోటిక్స్ : అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు. పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే, పైన పేర్కొన్న మందతుల మీకు తగిలన గాయం తీవ్రత, మీకు అంతకుముందున్న వ్యాధుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్యుని పర్యవేక్షణలోనే ఆయా మందులు వాడాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా? ఐతే దుష్ప్రభావాలు తప్పవు) -
ఐఫోన్ చోరీయత్నం.. కాపాడుకునే ప్రయత్నంలో గాయపడిన టీచర్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న యువతి వద్ద నుంచి ఐఫోన్ చోరీ చేసేందుకు ఇద్దరు కేడీలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన ఫోన్ను కాపాడుకునే క్రమంలో ఆటోలో నుంచి కొందపడి ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యోవికా చౌదరి తన ఐఫోన్ కోసం ప్రాణాలకు తెగించింది. దొంగలనుంచి ఫోన్ను రక్షించుకోవటానికి తీవ్ర యుద్దమే చేసింది. ఈ క్రమంలో గాయాలపాలైంది. అయితే, యోవికా చౌదరి ఢిల్లీలో సాకేత్ గ్యాన్ భారతీ స్కూల్లో టీచర్గా పని చేస్తోంది. గత శుక్రవారం ఆమె ఆటోలో స్కూలుకు వెళ్తోంది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె ఫోన్ను గట్టిగా పట్టుకోవటంతో.. ఆటోలోంచి కిందపడింది. ఇదే సమయంలో దొంగలు కూడా ఆ ఫోన్ను వదలక పోవటంతో ఫోన్తో సహా ఆమెను కూడా లాక్కెళ్లారు. దాదాపు కొన్ని మీటర్ల వరకు ఆమెను అలాగే రోడ్డుపై పడిపోయి దొర్లుకుంటూ వెళ్లింది. ఆమె చేయి జారవిడవడంతో ఫోన్ను ఆ దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో యోవికా తీవ్రంగా గాయపడింది. దీంతో, స్థానికులు, ఇతర వాహనదారులు ఆమెను మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. A woman teacher was left with a fractured nose and injuries to other parts of her body after she fell from an auto-rickshaw while allegedly trying to save her mobile phone from motorcycle-borne snatchers in south Delhi’s Saket on Friday.#delhipolice #friday #delhicrime pic.twitter.com/NarXHUs4DP — NewsNowNation (@NewsNowNation) August 14, 2023 ఇది కూడా చదవండి: విలువైన ప్రాణాలకై.. 'ఈ ఒక్క క్షణం మీకోసం'.. -
దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా..?
దెబ్బ తగిలిందని టీటీ ఇంజెక్షన్ తీసుకుకున్నాను. అయినా నొప్పి తగ్గట్లేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా చీము పట్టింది. ఇనుప రేకు గీసుకుపోయింది..టీటీ ఇంజెక్షన్ ఇవ్వండి". దెబ్బ తగిలింది ఇనుముతో కాదు కదా.. టీటీ ఇంజెక్షన్ ఎందుకు? దెబ్బ తగిలింది.. టీటీ ఇంజెక్షన్ తీసుకొని ఆరు నెలలకు పైనే అయింది. మరో ఇంజెక్షన్ ఇవ్వండి. ప్రజలు నంచి సాధారణంగా వినే మాటలే ఇవీ.. దీన్నిబట్టి చూస్తే.. టీటీ ఇంజెక్షన్ గురించి సామాన్య ప్రజలకు చాలా అపోహలే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అపోహాలకు చెక్పెట్టి..అసలుఎప్పుడెప్పుడూ తీసుకోవాలి? అలసెందుకు తీసుకోవాలో చూద్దా!. ధనుర్వాతం.. టెటనస్.. లాక్ జా.. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్లో ఒకటి. దీని గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే హిప్పోక్రేట్స్ (Hippocrates) రచనల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోజుకీ ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి, చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది. ఈ ఇన్ఫెక్షన్కు కారణం క్లస్ట్రీడియమ్ టెటానీ(Clostridium Tetani) అనే ఒక సూక్ష్మ జీవి (బ్యాక్టీరియా). ఇవి మట్టిలో, నేలలో, దుమ్ములో, ఇలా ప్రతి చోటా ఉంటాయి. అవి శరీరంలోకి చేరుకున్నప్పుడు వ్యాధికి కారణం అవుతాయి. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. టీటీ ఇంజెక్షన్ కేవలం టెటనస్ వ్యాధి నుంచి రక్షణను ఇస్తుంది. అది కూడా దెబ్బ తగిలిన ఒక్క రోజు లోపు దీన్ని తీసుకోవాలి. ఇది శరీరంలోకి ఎలా చేరతుందంటే? శరీరానికి అయిన పుండ్లు, లేక తగిలిన దెబ్బల ద్వారా ఇవి శరీరంలోకి చేరగలవు. మొల, లేక ఏదైనా పదునైన వస్తువులు గుచ్చుకోడం వల్ల, శరీరానికి గాయం అయినప్పుడు చేరవచ్చు. కాలిన గాయాల నుంచి జరగొచ్చు. కాన్పు సమయంలో తల్లికి లేక పుట్టిన శిశువుకి బొడ్డు కోయడానికి వాడిన పరికరం సరిగ్గా లేకపోతే ఆ శిశువుకి ధనుర్వాతం కలిగే అవకాశం ఉంది. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు, తగిలిన గాయాల ద్వారా వ్యాధి కారకాలు శరీరంలోకి చేరగలవు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు, లేక ఏదైనా పట్టీ కట్టినప్పుడు లేదా మార్చినప్పుడు చేరే అవకాశం ఉంటుంది. కుక్క లేక ఇతర జంతువులు కరిచినప్పుడు ఆ గాయాల ద్వారా సంభవించవచ్చు. ఎముకలు విరగడం, లేక దీర్ఘ కాలిక పుండ్లు, గాయాలు ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు.. ►వ్యాప్తి ఎలా జరిగింది అనే దాన్ని బట్టి, ఎన్ని రోజులకు లక్షణాలు కనిపిస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. ►ఎక్కువ శాతం రెండు వారాలలోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన గాయాలలో, లక్షణాలు కొన్ని గంటల నుంచి, ఒకటి రెండు రోజుల్లోనే కనిపిస్తాయి. చిన్న గాయాలతో కొన్ని నెలల తరవాత కూడా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ►ఎక్కువ శాతం కేసుల్లో మొదట నోటి కండరాలు పట్టేస్తుంటాయి. తర్వాత ఒకొక్కటిగా అన్ని కండరాలు బిగుసుకుపోవడంతో, నొప్పి ఎక్కువవుతుంది. క్రమేణా, అన్ని కండరాలు బిగించినట్టు పట్టేస్తాయి. ఆహారం మింగడం కష్టంగా మారుతుంది. ►తీవ్రమైన తలనొప్పి, అదుపు లేకుండా జ్వరం, చెమటలు కూడా కనిపిస్తాయి. అదుపు లేకుండా శరీర భాగాలలో కదలికలతో మూర్ఛ, ఫిట్స్ తరవాత దశలో కనిపిస్తాయి. ►గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్త పోటు పెరిగి క్రమేణా ప్రాణాపాయ స్థితి వస్తుంది. చికిత్స విధానం: ⇒ఈ వ్యాధిని తొలి దశల్లో కచ్చితంగా నిర్ధారించడం కష్టం. లక్షణాల ఆధారంగా, ఎక్కువ శాతం దీనిని గుర్తిస్తారు. ⇒వ్యాధి లక్షణాలు కనిపించిన తరవాత చికిత్స చాలా వేగంగా అందించాలి. వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేరి, గాయం అయిన చోటును పూర్తిగా శుభ్రపరిచి, యాంటీబయోటిక్ ⇒ఇంజెక్షన్లు, కండరాల నొప్పులకు, పట్టేయడాన్ని తగ్గించే (muscle relaxant) మందులు వాడుతూ, ఒంట్లో నీరు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ⇒ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. అవసరాన్ని బట్టి, కృత్రిమ శ్వాస అందిస్తూ, మందుల ప్రభావం కోసం ఎదురు చూడాలి. నివారణ: ధనుర్వాతాన్ని నివారించే సులువైన, ఏకైక మార్గం టీకా తీసుకోవడం. అందుకే చిన్న పిల్లలకు ప్రభుత్వం అందించే టీకాలల్లో డిఫ్తీరియా( కంఠవాతము), కోరింత దగ్గు టీకాలతో పాటు ధనుర్వాతం టీకా కూడా ఉంటుంది. అలాగే అయిదు సంవత్సరాలు, పది సంవత్సరాల వయసులో బూస్టర్ డోస్ ఇస్తారు. ఆ తరవాత పెద్ద వాళ్ళల్లో, ప్రతి పది సంవత్సరాలకు ఒక డోస్ టీకా తీసుకోవాలి. కాన్పు సమయంలో బిడ్డకు వ్యాధి సోకకుండా, గర్భిణులు తప్పకుండా టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఏదైన దెబ్బ తగిలినా, కాలిన గాయాలు, లేక పుండ్లు ఉన్నా, వాటిని శుభ్రం ఉంచుకోవాలి. అవి మానేవరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. టీటీ ఇంజెక్షన్పై కొన్ని అపోహలు/ నిజాలు ఇవే... దెబ్బ వల్ల కలిగే నొప్పిని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. పుండు తగ్గే వరకు జాగ్రత్తగా ఇతర మందులు వాడాలి. ఆ ఇన్ఫెక్షన్ కేవలం తుప్పు పట్టిన వాటి నుంచే కాదు.. ఏ గాయం వల్ల అయినా కలగవచ్చు. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే పది సంవత్సరాల వరకు అది ధనుర్వాతం రాకుండా రక్షణ ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణాంతక వ్యాధి అయిన టెటనస్ రాకుండా ఉండడానికి టీటీ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ నవీన్ రోయ్, ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు (చదవండి: చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట!) -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్కి గాయం ఐదు కేజీల డంబెల్ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
లిగమెంట్ ఇంజురీ అంటే ఏమిటి..?
-
షోల్డర్ డిస్లొకేషన్... భుజం నొప్పికి కారణాలు
-
‘గట్టు’ కోసం గొడ్డళ్లతో దాడి..
అడ్డగూడూరు: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో భూ వివాదం భగ్గుమంది. రెండెకరాల భూమి గట్టు పంచాయితీ సోదరుల మధ్య చిచ్చురేపడంతో ఒకరిపై ఒకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మానాయికుంటకు చెందిన మార్త బుచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు వీరయ్య, సైదులు కుమారులు. గ్రామ శివారులో తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని సోదరులిద్దరూ చెరో ఎకరం పంచుకుని సాగుచేసుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గట్టు పంచాయితీ నడుస్తోంది. అరకతో అచ్చుతోలుతుండగా.. వీరయ్య తన కుమారుడు ప్రభాస్తో కలసి బుధవారం ఉద యం పొలంలో అరకతో అచ్చుతోలుతున్నాడు. విషయం తెలుసుకున్న చిన్నకుమారుడు సైదులు, తన కు మారుడు శేఖర్తో కలసి భూమి వ ద్దకు వెళ్లి వీరయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నలుగురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతుండగా సైదులు కుమారుడు శేఖర్ గొడ్డలితో పెదనాన్న కుమారుడు ప్రభాస్పై దాడి చేశాడు. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో సైదులు ఎడమచెయ్యి తెగిపోవడంతో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు దాడిని అడ్డుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత హైదరాబాద్కు తీసుకెళ్లారు. -
ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.. ఏం చేయాలో అర్థం కాలేదు: జయా బచ్చన్
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్లో బిగ్ బీగా పేరు సంపాదించుకున్నారు. దక్షిణాది సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన భార్య జయా బచ్చన్ తమ జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో వచ్చిన కూలీ సినిమా సెట్స్లో అమితాబ్ గాయపడిన సందర్భాన్ని తలుచుకుని ఎమోషనలయ్యారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన కళ్లముందు కదులుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో దేవున్ని ప్రార్థించడం తప్ప తనకేలాంటి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఇవాళ జయ- అమితాబ్ 50వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) దేవుడిని ప్రార్థించమన్నారు: జయా బచ్చన్ జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను ఆసుపత్రికి వెళ్లగానే మా బావగారు అక్కడే ఉన్నారు. అతను నన్ను ధైర్యంగా ఉండమని చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా చేతిలో హనుమాన్ చాలీసా ఉంది. డాక్టర్ మా దగ్గరకు వచ్చి మీ ప్రార్థనలే ఆయనను కాపాడతాయని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన బొటనవేలు కదలడాన్ని చూశా. డాక్టర్ ఈ విషయాన్ని మాతో చెప్పారు. ఆ తర్వాత మేం కాస్త ఊపిరి పీల్చుకున్నాం.' అని జయా బచ్చన్ ఆనాటి సంఘటనను వివరించారు. కాగా.. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె శ్వేతా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ జన్మించారు. అసలేం జరిగిందంటే... అమితాబ్ బచ్చన్ 1982 ఆగస్టు 2న కూలీ సెట్స్లో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్లో నటుడు పునీత్ ఇస్సార్తో ఫైట్ సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగింది. పొత్తికడుపు ప్రాంతంలో తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినా చికిత్సకు స్పందించలేదు. వెంటిలేటర్పై ఉంచేముందు ఆయన కోసం దేవున్ని ప్రార్థించడమే తప్ప ఏం చేయలేమని డాక్టర్ చెప్పారని ఆ రోజు భయానక పరిస్థితిని జయా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి) -
లైవ్ షోలో సింగర్కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!
ప్రముఖ భోజ్పురి సింగర్ నిషా ఉపాధ్యాయకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బీహార్లోని పాట్నాలో ఓ లైవ్ షోలో బుల్లెట్ తగిలినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బీహార్లోని సరన్లో ఓ కల్చరల్ ప్రోగ్రామ్లో ప్రదర్శన ఇచ్చేందుకు నిషా రాగా.. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష) కాగా.. నిషా ఉపాధ్యాయ్ బీహార్కి చెందిన సింగర్. ఆమెది సరన్ జిల్లాలోని గౌర్ బసంత్ స్వస్థలం కాగా.. పాట్నాలోనే ఉంటున్నారు. నిషా ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆమె పాటల్లో లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్, హసి హసి జాన్ మారెలా లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. (ఇది చదవండి: రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) స్పందించిన పోలీసులు.. నిషా ఉపాధ్యాయ్పై బుల్లెట్ తగలడంపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటన గురించి మాకు సమాచారం అందింది.. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాల్పులు ఎవరు జరిపారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు. -
లేడీ సింగం పోస్టుమార్టంలో సంచలన విషయం
గువాహటి: లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అసోం ఎస్సై జున్మోని రభా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినప్పటికీ.. జున్మోని శరీరంపై వెనకభాగంలో అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడికావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వైపుల అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి,చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది. కుటుంబ సభ్యుల అనుమానం మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రభా.. మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా నాగోన్ జిల్లాలోఈ ఘోరం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్ దాస్ను సీన్ రీ క్రియేట్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గౌహతి నుండి గురువారం సాయంత్రం నాగోన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాదంపై టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అతన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాస్ను నాగాన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు హాజరుపరిచారు. చదవండి: సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య అయితే ఘటన జరిగినప్పుడు తాను గువాహటి నుంచి వస్తున్నట్లు ప్రణబ్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కారు పార్క్ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్లు ఎదురుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు బ్లాక్ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి కారు నుంచి దిగి కిందకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు తాను అక్కడే ఉండగా.. పోలీసులు మాత్రం తనను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపించారు. నిందితుడి లోంగుబాటు ఎస్సై జన్మోని రభా మృతి కేసులో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ అస్సాం పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయాడు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ను సుమిత్ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన సుమిత్ను జఖలబంధ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుమిత్ అదుపులో ఉన్నాడని అతన్ని విచారించిన అనంతరం కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. స్పందించిన సీఎం జన్మోని మరణంపై ఎట్టకేలకు సీఎం హిమాంత బిస్వా శర్మ నోరు విప్పారు. పోలీసు మృతిపై సీఐడీతోపాటు.. మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే కేసును సీబీకి అప్పగించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది సున్నితమైన విషయమని, ఈ ఘటనలో చాలా కోణాలు ఉన్నాయన్నారు. దీనికి మొత్తం పోలీస్ శాఖపై అంటిపెట్టడం సరైనది కాదన్నారు. కాబోయే భర్తను అరెస్ట్ చేయించి ఒకప్పుడు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది రభా. నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆమెను దబాంగ్ కాప్ అని కూడా పిలిచేవారు. అయితే డేరింగ్ పోలీస్ అధికారిగా పేరు సంపాదించిన ఆమెను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో కాబోయే భర్తతోపాటు ఆమె కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మజులీ జిల్లాకోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యేతో వివాదం గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలపై కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు సూచించారు. -
జగిత్యాల: బస్సును ఢీకొన్న లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈ ప్రమాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అయితే, సిద్దిపేట జిల్లాలోని బెజ్గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవలే ఓ వృద్ధురాలు చనిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమె అస్తికలను ధర్మపురి వద్ద గోదావరి నదిలో కలిపేందుకు ఆమె కుటుంబ సభ్యులు దాదాపు 25 మంది శుక్రవారం ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సును కొత్తపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బస్సును లారీ ఎదురుగా ఢీకొనడంతో డ్రైవర్ బస్సులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం.. జేసీబీ సహాయంతో డ్రైవర్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాదంలో త్రీవంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. -
విషాదాంతమైన BRS ఆత్మీయ సమ్మేళనం
-
IPL 2023: ముంబై ఇండియన్స్కు భారీ షాక్!
IPL 2023- Mumbai Indians: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జై రిచర్డ్సన్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే రిచర్డ్సన్ భారత్తో వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు. 2023 సీజన్లో అతను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సింది. కాగా ఇప్పటికే ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండే అంశంపై సందేహం నెలకొనగా.. ఇపుడు రిచర్డ్సన్ రూపంలో మరో పేసర్ సేవలను కోల్పోయింది. దీంతో ఐపీఎల్-2023 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా గతేడాది ఐపీఎల్లో రిచర్డ్సన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. రిచర్డ్సన్ 36 అంతర్జాతీయ మ్యాచ్లలో ఆసీస్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియాతో వన్డే సిరీస్కు దూరమైన రిచర్డ్సన్.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాటికి కూడా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. చదవండి: దక్షిణాఫ్రికా ఘన విజయం -
యజమాని జంట పైశాచిక ఆనందం.. బాలికను చిత్ర హింసలు పెడతూ...
ఇంట్లో పని నిమిత్తం చేరిన ఓ మైనర్ బాలికను దంపతులైన యజమానులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. బాలికకు అన్నం పెట్టకుండా పస్తులుంచి ఆమెను శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. అయితే ఎట్టకేలకు బాధితురాలిని వేధించిన రాక్షస జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. జార్ఖండ్కు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఉద్యోగస్తులైన ఓ దంపతుల ఇంట్లో పని మనిషిగా చేరింది. కాగా బాలికపై దంపతులు గత కొంత కాలంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. సరిగా పనిచేయడం లేదని, ఇంట్లోని వస్తువులను దొంగిలించిందనే నిందలు వేస్తూ కర్రలు, ఇనుప వస్తువులను వేడి చేసి ఆమెపై దాడికి పాల్పడుతున్నారు. ముఖం, చేతులపై కొడుతూ దారుణంగా గాయపరిచారు. రోజులపాటు ఆమెకు అన్నం పెట్టకుండా హింసిస్తూ రాక్షస ఆనందం పొందారు. దీంతో ఆకలికి అలమటించి యజమానులు తిని చెత్తబుట్టలో పడేసిన ఆహారాన్ని బాలిక తినేది. అయితే దీపక్ నారాయణ అనే యాక్టివిస్ట్ బాలిక ఘోర పరిస్థితిని తెలుసుకొని ఆమె ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫోటోలో బాలిక ముఖం, పెదాలు, చెంపలు, చేతులపై కాలిపోయిన గాయాలు హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయి. దీనిపై స్పందించిన గురుగ్రామ్కు చెందిన ఓ స్వంచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పైశాచిక యజమానుల బారి నుంచి మంగళవారం సాయంత్రం బాలికను రక్షించారు. గత కొన్ని నెలలుగా ఆమెను భయంకరంగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను రక్షించే సమయంలో ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఏడాది కిత్రం ఓ ఏజెన్సీ ద్వారా తమ మూడు నెలల పాపను సంరక్షణ కోసం బాలికను నియమించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులైన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై సంబంధింత సెక్షన్ల ప్రకరం కేసు నమోదు చేశారు. అయితే దంపతుల ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారడంతో అరెస్ట్ అయిన మహిళను ఆమె పనిచేస్తున్న సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే ధనంజయ్ ముండేకు కారు ప్రమాదం
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ధనంజయ్ ఛాతీ, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. తన అసెంబ్లీ నియోజక వర్గమైన పర్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ధనంజయ్ ముండే పాల్గొన్నారు. అనంతరం రోజంతా స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పర్లీకి బయలుదేరారు. పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న అజాద్ చౌక్ వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ప్రమాదానికి గురైంది. గాయాలైన ముండేను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులను నమ్మవద్దని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని ముండే ట్వీట్ చేశారు. కాగా, ముందుజాగ్రత్తగా మెరుగైన వైద్య కోసం ఆయన్ని ఎయిర్ అంబులెన్స్లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. -
విమానానికి భారీ కుదుపులు..
హొనొలులు: సెలవుల్లో సరదాగా గడపాలని బయలుదేరిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు లోనై 36 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. అరిజోనా రాష్ట్రం ఫోనిక్స్ నుంచి హవాయిలోని హొనొలులుకు బయల్దేరిన హవాయి ఎయిర్లైన్స్ విమానం అరగంటలో ల్యాండవుతుందనగా భారీ కుదుపులకు లోనైంది. ఆ తాకిడికి ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. పైనున్న లగేజీ క్యాబిన్కు గుద్దుకున్నారు. వాటర్ బాటిళ్లు, సెల్ఫోన్లు చెల్లా చెదురుగా పడిపోయాయి. -
నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు
సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ) -
మృత్యుఘాతం
న్యూయార్క్: గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది. 5 నుంచి 29 ఏళ్ల వయసున్నవారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది. జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రీయెసస్ తెలిపారు. -
పోరాడి ఓడిన సైనిక శునకం.. ఆర్మీ అధికారుల నివాళులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల సర్చ్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన జూమ్ అనే వీర శునకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉగ్రవాదులను చేజ్ చేసే ఆపరేషన్లో రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో వెంటనే అధికారులు జూమ్(కుక్క)ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించారు. ఐతే ఈ ఘటనలో జుమ్కు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి ప్రాణాలతో పోరాడుతూ... గురువారం ఉదయం 11. 50 నిమిషాలకు మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు జూమ్కి శ్రీనగర్లోని చినార్ వార్ మెమోరియల్ బాదామి బాగ్ కంటోన్మెంట్ వద్ద భారత సైన్య ఘనంగా నివాళులర్పించినట్లు పీఆర్ఓ డిఫెన్స్ కల్నల్ ఎమ్రాన్ ముసావి తెలిపారు. అంతేగాదు ఈ కార్యక్రమంలో పలు ఆర్మీ శునకాలు పాల్గొని మృతి చెందిన వీర శునకం జూమ్కి నివాళులర్పించాయి. ఆర్మీ కనైన్ చినార్ వారియర్స్లో అమూల్యమైన సభ్యుడిని కోల్పాయమని కల్నల్ ముసావి అన్నారు. జూమ్ పలు ఉగ్రవాదక నిరోధక కార్యకలాపాల్లో వీరోచితంగా పోరాడి ధైర్యసాహసాలను కనబర్చినట్లు తెలిపారు. #WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog 'Zoom' in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti — ANI (@ANI) October 14, 2022 (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి
టోరంటో: కెనడాలోని అంటారియా ప్రావిన్స్లో కాల్పుల కలకలం జరిగింది. ఈ ఘటనలో 28 ఏళ్ల భారతీయ విద్యార్థి, పోలీస్ కానిస్టేబుల్ తోపాటు మరోక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన భారతీయ విద్యార్థిని సత్వీందర్ సింగ్గా గుర్తించారు. అతను ఈ కాల్పుల సమయంలో ఆటో రిపేర్స్లో పార్ట్టైమ్గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతను కెనడాలోని కోనెస్టాగా కాలేజీ విద్యార్థి అని చెబుతున్నారు. ఈ కాల్పుల్లో టొరంటో పోలీస్ కానిస్టేబుల్ ఆండ్రూ హాంగ్, ఆటో రిపేర్స్ యజమాని, మెకానిక్ షకీల్ అష్రఫ్ అక్కడికక్కడే మరణించారని చెప్పారు. ఐతే సత్వీందర్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 40 ఏళ్ల సీన్ పెట్రీగా గుర్తించి, అతనిపై కాల్పులు జరిపి హతమార్చినట్లు వెల్లడించారు. నిందితుడు ఒక అధికారి కోసం వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: పుట్టిన రోజు నాడే విషాదం.. స్కూల్ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో..) -
గాయాలతోనే ఏడాది గడిచిపోయింది.. జట్టులోకి వచ్చేదెన్నడు?
వాషింగ్టన్ సుందర్.. టీమిండియా క్రికెటర్లలో అత్యంత దురదృష్టవంతుడిగా పేరు పొందాడు. ఈ పదం అతనికి అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. బౌలింగ్ ఆల్రౌండర్గా పేరున్న సుందర్ జట్టులో ఉన్నాడనడం కంటే బయటే ఎక్కువున్నాడని చెప్పొచ్చు. దాదాపు ఒక ఏడాది మొత్తం గాయాలతోనే గడపాల్సి వచ్చింది సుందర్.(2021 ఆగస్టు నుంచి మొదలుకొని 2022 ఆగస్టు వరకు). జట్టులోకి ఎంపికయ్యాడన్న ప్రతీసారి ఏదో ఒక గాయం కారణంగా మళ్లీ దూరమవడం.. ఇదే సుందర్కు తంతుగా మారిపోయింది. గాయాలను వెతుక్కుంటూ తను వెళ్తున్నాడో లేక అవే అతని దగ్గరికి వస్తున్నాయో అర్థం కావడం లేదు. - సాక్షి, వెబ్డెస్క్ తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన రాయల్ లండన్ కప్లో ఒక మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భుజానికి గాయమైంది. ఎక్స్రే తీయగా.. గాయం తీవ్రత ఎక్కువని తేలింది. దీంతో జింబాబ్వే పర్యటనకు దూరం కావాల్సి వచ్చింది. కాగా బీసీసీఐ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా యువజట్టు ప్రస్తుతం జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది. ఇలా 2022 ఏడాది ఆరంభం నుంచి సుందర్కు ఏది కలిసి రావడం రాలేదు. ఒక 2021 ఆగస్టు నుంచి సుందర్ ఏయే గాయాల బారీన పడ్డాడో తెలుసుకుందాం. జూలై 2021.. చేతి వేలికి గాయం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కౌంటీ ఎలెవెన్కు ప్రాతినిధ్యం వహించిన సుందర్ ఇండియాతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో చేతి వేలికి గాయమైంది. దీంతో ఇంగ్లండ్తో నాలుగు టెస్టుల సిరీస్తో పాటు ఐపీఎల్ 2021(రెండో అంచె పోటీలు), ఆ తర్వాత టి20 వరల్డ్కప్ 2021కు దూరమయ్యాడు. జనవరి 2022.. కోవిడ్-19 పాజిటివ్గా చేతివేలి గాయం అనంతరం దేశవాలీ టోర్నీ అయిన విజయ్హజారే ట్రోపీలో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శను సుందర్ను సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యేలా చేసింది. కానీ కోవిడ్-19 రూపంలో సుందర్ను దురదృష్టం వెంటాడింది. ప్రొటిస్ పర్యటనకు బయలుదేరడానికి ముందు జనవరి 11న సుందర్ కరోనా పాజిటివ్గా తేలడంతో సౌతాఫ్రికా సిరీస్కు దూరం కావాల్సి వచ్చింది. ఫిబ్రవరి 2022.. తొడ కండరాల గాయంతో.. స్వదేశంలో విండీస్తో సిరీస్కు ఎంపికయిన సుందర్ ఒకే ఒక్క మ్యాచ్కు పరిమితమయ్యాడు. విండీస్తో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అలా కండరాల గాయంతో విండీస్తో టి20 సిరీస్కు.. అటుపై శ్రీలంకతో టి20 సిరీస్కు సుందర్ దూరమయ్యాడు. ఏప్రిల్ 2022.. చేతికి గాయం.. విండీస్, లంకతో సిరీస్లకు దూరమైన సుందర్ ఆ తర్వాత ఐపీఎల్ 2022లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఏప్రిల్ 11న గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని అందుకునే క్రమంలో చేయికి గాయమైంది. దీంతో మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్ ఆడినప్పటికి.. టీమిండియాలోకి రాలేకపోయాడు. ఆగస్టు 2022.. భుజం గాయంతో.. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియాలో చాన్స్ రాకపోవడంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ లంకాషైర్ తరపున అద్భుత ప్రదర్శన కనబరిచి జింబాబ్వే టూర్కు ఎంపికయ్యాడు. ఈసారి కచ్చితంగా జట్టు తరపున బరిలోకి దిగుతాడని అనుకునేలోపే.. రాయల్ లండన్ కప్లో ఆడుతూ భుజం గాయంతో జింబాబ్వే సిరీస్కు ఆఖరి నిమిషంలో దూరమయ్యాడు. ఇలా ఏడాది మొత్తం గాయాలతోనే సహవాసం చేసిన సుందర్ ఇక జట్టులోకి వచ్చేదెన్నడు అని అభిమానులు కామెంట్స్ చేశారు. మరి రాబోయే రోజుల్లోనైనా సుందర్ ఎటువంటి గాయాల బారీన పడకుండా టీమిండియా జట్టులోకి రావాలని ఆశిద్దాం. చదవండి: సుందర్ను మరిచారా.. కావాలనే పక్కనబెట్టారా! సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్ సుందర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆర్సీబీ ఆల్రౌండర్ -
‘అద్దంలో నా ముఖం చూసి గుర్తుపట్టలేకపోయా’ .. ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసిన నటి
సాధారణంగా సినీ తారలు కొంత మంది తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఫ్రెంచ్ నటి జుడిత్ చెమ్లా గాయాలతో ఉన్న తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసి పలు విషయాలను పంచుకుంది. అయితే ఆ ఫోటోతో పాటు తన కుమార్తె తండ్రే దీనంతటికి కారణమని తెలిపింది కానీ అతని పేరును మాత్రం చెప్పలేదు. ఫ్రెంచ్ సినిమా ‘మెస్ ఫ్రెరెస్ ఎట్ మోయి’ తో మంచి పేరు సంపాదించుకుంది నటి జుడిత్ చెమ్లా. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గృహ హింస ఫలితంగా ఒక సంవత్సరం క్రితం తాను తీవ్రంగా గాయపడ్డ ఫోటోలను చేస్తూ ఇలా రాసింది.. “ఒక సంవత్సరం క్రితం ఒకరి వల్ల నా ముఖం గాయపడింది. ఎంతలా అంటే నన్న నేను గుర్తపట్టలేనంత. ఆ సమయంలో నన్ను నేను అద్దంలో చూసుకుంటే చాలా బాధేసింది. చాలా రోజుల వరకు బయట ప్రపంచంలోకి రాలేకపోయాను. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, ఇకపై నా ముఖాన్ని దాచలేనని తెలుసుకుని, దాని నుంచి బయటపడ్డానని’’ చెప్పుకొచ్చింది. అయితే తన పరిస్థితికి కారణమైన వాడిపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు పెద్దగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే అతనిపై పలుమార్లు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పాంది. కాగా చెమ్లా గతంలో చిత్ర దర్శకుడు యోహన్ మాన్కాతో డేటింగ్లో ఉంది. అతడిని నటిపై గృహ హింస కేసు విషయంలో ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Judith Chemla (@judithhhhhhhhhhhhhh) చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య -
ఉస్మానియాలో కలకలం: డ్యూటీ డాక్టర్ నెత్తిన పడిన ఫ్యాన్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం సంభవించింది. ఓపీలో డెర్మటాలజీ విభాగంలో.. విధులు నిర్వర్తిస్తున్నడాక్టర్ భువనశ్రీపై ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ క్రమంలో భువనశ్రీ తలకి తీవ్ర గాయమైంది. తోటి డాక్టరు వెంటనే ఆమెకు కట్లు కట్టారు. ప్రస్తుతం డాక్టర్ భువనశ్రీకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో పెషేంట్లు, డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’ -
కాలువలోకి దూసుకెళ్లిన కారు..
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరగ్గానే కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే తేరుకుని బయటకు వచ్చేశారు. ప్రయాణికులకు మాత్రం స్వల్పగాయాలు అయ్యాయి. కాలువలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చదవండి: ‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’ -
ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయాల బారిన పడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లేఆఫ్స్కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్లో తగిలిన గాయం తిరగబెట్టడంతో డుప్లెసిస్ ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం బయో బబుల్లోకి వెళ్లిపోనున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ప్రారంభానికి మందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు స్టార్ ఆటగాళ్లు దూరం కానుండడంతో సీఎస్కే టైటిల్ గెలవాలన్న ఆశలు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలకపాత్ర పోషించిన డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ మలిదశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. చదవండి: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్కు పగ్గాలు..? -
షూటింగ్లో గాయపడ్డ ప్రియాంక! ఆందోళనలో ఫ్యాన్స్..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా షూటింగ్లో గాయపడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొహం మీద మట్టి, నుదురు, చెంపలపై ఉన్న రక్తపు గాయాలకు సంబంధంచిన ఫొటోను ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే షూటింగ్లో హీరోలు గాయపడటం సాధారణ విషయమే. ఫైట్స్, స్టంట్స్ సీన్స్ చేసేటప్పుడు వారు తరచూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే హీరోయిన్లు గాయపడటం అనేది చాలా అరుదు. ఒకవేళ ప్రమాదం బారిన పడిన కాలు బెనకడం, చిన్న చిన్న గాయాలు వంటివి అవుతుంటాయి. అయితే ప్రియాంకుకు అయిన ఈ గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీంతో ఏమైంది ఇవి నిజంగా జరిగిన ప్రమాదమా లేక షూటింగ్ భాగంగా పెట్టిన గాయలా అని ఆరా తీయం మొదలు పెట్టారు. చదవండి: టాలీవుడ్లోకి మరో వారసురాలు.. హీరోయిన్గా మేధ శ్రీకాంత్! ఇక ఫ్యాన్స్ ఆందోళన చూసి ప్రియాంక వారి సందేహాలకు ఇలా బదులిచ్చింది. ఒక ఫొటోలు మొత్తం ఆమె ముఖం మట్టితో కొట్టుకుపోయి ఉండగా... మరోవైపు నుదుటి నుంచి రక్తం చెంపలపైకి జారుతుంది. అలాగే కనుబొమ్మపై కూడా గాటు ఉంది. అవి చూపిస్తూ చెంపలపై ఉంది నిజమైన గాయం కాదని, కనుబొమ్మపై ఉంది నిజమైన గాయం అంటూ తన ఇన్స్టా స్టోరీలో ప్రియాంక వెల్లడించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రియాంక సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ షూటింగ్ కోసం ప్రస్తుతం ఆమె లండన్ ఉంది. ఇందులో ప్రియాంక భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని ఇందులో భాగంగానే ఈ గాయాలు అయినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చదవండి: 'పుష్ప' విలన్ వచ్చేశాడు.. భన్వర్ సింగ్ షెకావత్గా ఫహద్.. లుక్ ఇదే -
జూనియర్ ఎన్టీఆర్ భారీ హిట్స్.. అయితే, ఇక్కడో సెంటిమెట్
చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అంటూ అల్లాడిపోతాం. కానీ హీరోలు ఏకంగా కత్తిపోటుకు గురైనా అదరరు, బెదరరు. యాక్షన్ సీన్లలో దెబ్బలు తాకినా, రక్తాలు కారుతున్నా ముందుగా సీన్ కంప్లీట్ చేయడానికే శ్రద్ధ చూపుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెట్స్లో ఇలా గాయాల బారిన పడటం పరిపాటి. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడు. అయితే ఆయన తాతగారు నందమూరి తారక రామారావు ఆశీస్సుల వల్లో, లేక అభిమానుల ప్రేమాభిమానాల వల్లో కానీ ఎటువంటి ప్రాణహాని లేకుండా స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. మరి తారక్ ఏయే సినిమాల షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడో చూసేద్దాం... స్టూడెంట్ నెంబర్ 1: రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే ఎన్టీఆర్ వెండితెరపై హీరోగా పరిచయమవ్వాల్సి ఉంది. కానీ ఓ షెడ్యూల్లో తారక్ గాయపడటంతో చిత్రీకరణ కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ ఎన్టీఆర్కు ఫస్ట్ బాక్సాఫీస్ హిట్ను అందించింది ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రమే. ‘ఆది’ సినిమా టైంలోనూ తారక్ దెబ్బలు తగిలించుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్లు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అందులోని ఓ ముఖ్యమైన ఫైట్ సీన్లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే చేతికి కట్టు ఉండగానే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ అనే సాంగ్ షూటింగ్లోనూ పాల్గొన్నాడు. ఈ పాటతో పాటు సినిమా కూడా ఓ రేంజ్లో హిట్టైన విషయం తెలిసిందే. సింహాద్రి.. సినిమాతో మరింత పాపులర్ అయిన ఎన్టీఆర్కు ఈ మూవీ షూటింగ్లోనూ ఇంజూర్ అయింది. అయినప్పటికీ తన గాయాలను లెక్క చేయకుండా చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆయన కష్టానికి ఫలితంగా సింహాద్రి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తర్వాత ‘యమదొంగ’, ‘బృందావనం’ చిత్రీకరణ సమయంలోనూ తారక్కు దెబ్బలు తాకాయి, కానీ ఈ రెండూ మంచి విజయం సాధించాయి. ‘శక్తి’ సినిమాలో కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు చిత్రీకరించిన సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఇక్కడ విడ్డూరమేంటంటే అంత కష్టపడి చేసిన సీన్లను ఎడిటింగ్లో లేపేయడమేకాక, ఇది అతడి కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచింది. ‘సాంబ, ఊసరవెల్లి’.. సినిమాల షూటింగ్ సమయంలోనూ తారక్ గాయపడగా, ఈ రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ‘అదుర్స్’ సినిమా షూటింగ్ ముగించుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలోనూ ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయింది. గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు తారక్. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైంలోనూ తారక్ గాయపడ్డ విషయం తెలిసిందే! -
కుక్క కాటుకు గురైతే... ఇదీ ప్రథమ చికిత్స
►కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని పై నుంచి పడే శుభ్రమైన నీటి ప్రవాహం (రన్నింగ్ వాటర్) కింద కడగాలి. అంటే... మగ్తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి కింది గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో, వీలైతే డెట్టాల్తో వీలైనంత శుభ్రంగా కడగాలి. ►కుక్క కాటు గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు. దాన్ని ఓపెన్గానే ఉంచాలి. ►కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్ను సంప్రదించి యాంటీరేబీస్ వ్యాక్సిన్ను అవసరాన్ని బట్టి మూడు లేదా ఐదు మోతాదుల్లో ఇప్పించాలి. ►గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ను గాయం అయిన చోట రెండు డోసులు ఇప్పించి, మిగతాది చేతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డాక్టర్ నిర్ణయిస్తారు. ►గాయం అయిన వైపు ఉండే చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇచ్చి... ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ను ఇస్తారు. -
అజింక్య భాయ్ అడిగాడు.. నేను వెంటనే సరేనన్నా!
న్యూఢిల్లీ: సిడ్నీ టెస్టుతో అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ నవదీప్ సైనీ... తన రెండో మ్యాచ్ బ్రిస్బేన్కు వచ్చేసరికి గాయపడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 7.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అనంతరం గజ్జల్లో గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రధాన పేసర్ ఒకరు లేకపోతే సమస్య రావచ్చని భావించిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్లో సైనీ బౌలింగ్ చేస్తే బాగుంటుందని భావించాడు. కెప్టెన్ కోరడంతో వెంటనే సిద్ధమయ్యానని సైనీ చెప్పాడు. ‘నేను బాగానే బౌలింగ్ చేస్తున్న దశలో ఒక్కసారిగా గాయపడ్డాను. ఇంత కాలం తర్వాత అవకాశం వస్తే ఇలా జరిగిందేమిటని అనుకున్నాను. రెండో ఇన్నింగ్స్ సమయంలో గాయంతో బౌలింగ్ చేయగలవా అని అజింక్య భాయ్ అడిగాడు. నేను వెంటనే సరేనని చెప్పేశాను. మళ్లీ బౌలింగ్ చేస్తే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిసినా... అప్పటి పరిస్థితులను బట్టి చూస్తే కెప్టెన్ అడిగితే కాదనగలమా. ఇందులో ఇక ఆలోచించడానికేమీ లేదనిపించింది. పైగా జట్టు కోసం ఆడే ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. అందుకే నొప్పి బాధిస్తున్నా జట్టు కోసం నేను చేయగలిగింది చేద్దామని నిర్ణయించుకున్నా’ అని సైనీ వెల్లడించాడు. -
'నాన్నకు దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ ముద్దిస్తా'
ముంబై: ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో అందరికంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా చతేశ్వర్ పుజారా వరుసగా రెండోసారి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌన్సీ పిచ్లపై అంత సేపు క్రీజులో ఉండటం అంటే మాటలు కాదు. పేసర్ల నుంచి వేగంగా దూసుకొచ్చే బంతులు.. ఎక్కడ గాయాలు చేస్తాయోనన్న ఆందోళన బ్యాట్స్మెన్లలో కనిపిస్తుంది. కానీ పుజారా మాత్రం ఆ గాయాలకు తాను అలవాటు పడ్డట్లుగా కనిపించాడు. ముఖ్యంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. మ్యాచ్ను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో వికెట్ కాపాడుకుంటూ ఒంటికి ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకున్నాడు. కమిన్స్, హాజిల్వుడ్ వేసిన బంతులు ఒళ్లంతా గాయాలు చేస్తున్నా చెక్కు చెదరని ఏకాగ్రతతో బ్యాటింగ్ కొనసాగించాడు. కాగా చివరి రోజు ఆటలో కనీసం12సార్లయినా బంతి పుజారా శరీరాన్ని బలంగా తాకింది. తాజాగా ఆసీస్పై టెస్టు సిరీస్ విజయం తర్వాత టీమిండియాకు స్వదేశంలో ఘనమైన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ఎవరు ఇంటికి వారు వెళ్లిపోయాకా.. ఇంట్లోవారు కూడా వారికి ఘనమైన స్వాగతం పలికారు. చదవండి: సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు అలా పుజారా రెండేళ్ల ముద్దుల కూతురు అతిధి కూడా ఆమె తండ్రికి ఘనస్వాగతం పలికింది. 'మా నాన్నకు అయిన గాయాలు మాన్పించడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఎక్కడ దెబ్బలు తగిలాయో అక్కడ ముద్దిస్తా.. దీంతో మా నాన్నకు గాయాల నొప్పి తగ్గిపోతుంది' అంటూ ముసిముసి మాటలు పలికింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదే విషయమై పుజారా స్పందిస్తూ.. తన కూతురు ఎప్పుడు కింద పడినా తానూ అలాగే చేస్తానని తెలిపాడు. అందుకే ఆసీస్ సిరీస్తో గాయాలతో ఇంటికి వచ్చానని తెలుసుకున్న నా కూతురు నాకు అలాగే చేసింది. ముద్దు ఏ గాయాన్ని అయినా మాన్పుతుందని తన కూతురు అనుకుంటున్నట్లు సంతోషంతో పేర్కొన్నాడు. కాగా పుజారా ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో 8 ఇన్నింగ్స్లు కలిపి 271 పరుగులు చేశాడు. -
రంకెలేసిన ఉత్సాహం..
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు జోష్గా ప్రారంభమయ్యాయి. రంకెలేస్తూ పరుగులు పెడుతున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు జల్లికట్టు వీరులు ఉరకలేసారు. కొందరు విజేతలుగా నిలవగా మరికొందరు తీవ్రగాయాలకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అలాగే శుక్రవారం మాట్టు పొంగల్ను కోలాహలంగా జరుపుకున్నారు. పొంగల్ పండుగలో భాగంగా మదురై జిల్లా అవనియాపురంలో గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జల్లికట్టు పోటీలు జరిగాయి. 922 కోడెగిత్తలతోపాటు, 430 మంది జల్లికట్టు వీరులో టోకెన్లు పొందారు. మంత్రి సెల్లూరురాజా నేతృత్వంలో జిల్లా కలెక్టర్ అన్బళగన్, ఎమ్మెల్యేలు రాజన్సెల్లప్ప, శరవణన్ జెండా ఊపి జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. గంటకు 50 మంది వీరులను జల్లికట్టు చట్రంలోకి అనుమతించారు. విజేతలకు ఖరీదైన గృహోకరణ వస్తువులు, సైకిల్, మొబైల్ఫోన్లను బహూకరించారు. అలాగే మదురై జిల్లా పాలమేడులో శుక్రవారం జల్లికట్టు పోటీలను రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ప్రారంభించారు. ఒక్కో రౌండ్కు 75 మంది చొప్పున 639 మంది వీరులు పాల్గొన్నారు. కరోనా సర్టిఫికెట్ పొందిన వారిని మాత్రమే పోటీలకు అనుమతించారు. మాట్టు పొంగల్లో భాగంగా చెన్నైలో శుక్రవారం 120 పశువులు, గొర్రెలకు పూజలు చేశారు. కానుం పొంగల్ను పురస్కరించుకుని శనివారం కడలి అంచుల్లో ఆటపాటలపై ప్రభుత్వం నిషేధం విధించింది. చెన్నై మెరీనాబీచ్, కోవలం, నీలాంగరై బీచ్లు, మహాబలిపురం పర్యాటక కేంద్రం ప్రాంతాలకు చేరుకోరాదని, ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్శాఖ హెచ్చరించింది. చెన్నై మెరీనాబీచ్లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటూ సందర్శకులకు అనుమతి లేదు. గాయాలు.. కత్తిపోట్లు.. మదురైలో జల్లికట్టు పోటీకి కోడె గిత్తలను తరలించే విషయంలో గొడవ తలెత్తగా అరుణ్కుమార్ (29), దేవేంద్రన్ (25) కత్తిపోట్లకు గురయ్యారు. ఈకేసులో కార్తికేయన్ (18), ప్రకాష్ (18) అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు జిల్లాలో జల్లికట్టు రిహార్సల్స్లో పాల్గొని విజేతగా నిలిచిన కోడె గిత్తలను ఆటో ఢీకొట్టడంతో వాటి వీపు ఎముకలు విరిగిపోయాయి. పశువైద్యులు వాటికి ఏడుగంటలపాటు శస్త్రచికిత్స చేశారు. మదురై జిల్లా పాలమేడు, అవనియాపురంలో గురు, శుక్రవారాల్లో జరిగిన జల్లికట్టు పోటీల్లో కోడెద్దులు కుమ్మడంతో వందమందికి పైగా వీరులు గాయపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్బంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రూ.416 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. గురువారం ఒక్కరోజు రూ.269 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. రూ.56.39 కోట్ల మద్యం అమ్మకంతో తిరుచ్చిరాపల్లి ప్రథమస్థానంలో నిలిచింది. -
ఇటు భువనేశ్వర్...అటు అమిత్ మిశ్రా
దుబాయ్: ఐపీఎల్లో ఇప్పటికే తడబడుతూ ముందుకు సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ ఇక ఐపీఎల్లో ఆడే అవకాశం లేదు. అది గ్రేడ్–2 లేదా గ్రేడ్–3 స్థాయి గాయం కావచ్చు. దీని వల్ల కనీసం 6–8 వారాలు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. అంటే అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లేనట్లే’ అని ఆయన వెల్లడించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 19వ ఓవర్ బౌలింగ్ చేస్తూ భువనేశ్వర్కు గాయమైంది. అతని తొడ కండరాలు పట్టేయడంతో ఒక బంతి మాత్రమే వేసి తప్పుకున్నాడు. ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టిపడేయడంతో పాటు డెత్ ఓవర్లలో కూడా పరుగులు నియంత్రించగల, అనుభవజ్ఞుడైన భువీ దూరం కావడం హైదరాబాద్ టీమ్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఈ సీజన్లో 4 మ్యాచ్లలో 3 వికెట్లే తీసినా... కేవలం 6.8 ఎకానమీతో పరుగులివ్వడం భువీ విలువేమిటో చూపిస్తుంది. ఢిల్లీకి సమస్యే... సీనియర్ లెగ్స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా కూడా చేతి వేలికి గాయంతో లీగ్ నుంచి నిష్క్రమించాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో నితీశ్ రాణా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అందుకునే క్రమంలో మిశ్రాకు గాయమైంది. ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసి కీలకమైన గిల్ వికెట్ తీసిన అతనికి మ్యాచ్ తర్వాత పరీక్షలు నిర్వహించగా వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. తాజా పరిణామం పట్ల తాము తీవ్రంగా నిరాశ చెందుతున్నామని క్యాపిటల్స్ యాజమాన్యం పేర్కొంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ (170) తర్వాత మిశ్రా (160) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్లలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. మిశ్రా దూరమైన నేపథ్యంలో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. -
కెరీర్లో ఇలాంటి గాయాలు సహజమే : హార్దిక్
అబుదాబి : గాయం కారణంగా సుదీర్ఘ కాలంగా ఆటకు దూరమైన భారత జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఐపీఎల్ 2020కి సిద్ధమయ్యానని చెబుతున్నాడు. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా కూడా దృఢంగా తయారైనట్లు అతను వెల్లడించాడు. ‘శారీరకంగా ఫిట్గా ఉన్నాను. ఎలాంటి తడబాటు లేకుండా సాగుతున్న బ్యాటింగ్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మానసికంగా కూడా కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నా. మైదానంలోకి దిగి సంతృప్తికర ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నా. నా సన్నాహాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి మున్ముందు అంత శుభమే జరుగుతుందని ఆశిస్తున్నా. నాకెంతో ఇష్టమైన ఐపీఎల్తో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు. గాయాలు క్రీడాకారుల జీవితంలో భాగమేనని, అయితే వాటి కారణంగా తానెప్పుడూ వెనకడుగు వేయలేదన్న హార్దిక్... లాక్డౌన్ సమయంలోనూ ఇంట్లో ఉన్న జిమ్ కారణంగా తన ఫిట్నెస్లో ఎలాంటి తేడా రాలేదని చెప్పాడు.(చదవండి : 'రోహిత్ ఇది నాది.. వెళ్లి సొంత బ్యాట్ తెచ్చుకో') -
నటుడు సూర్యకు గాయాలు !
సినీ నటుడు సూర్య గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గాయాలయ్యాన్న వార్త సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటోంది. సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక కథానాయకిగా నిర్మించిన పొన్మగళ్ వందాళ్ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది. లాక్డౌన్ కాలంలో సూర్య వర్కవుట్ చేస్తుండగా గాయాలు అయినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయంపై సూర్య అందుబాటులోకి రాకపోగా, ఆయన బంధు వర్గాలను విచారించగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని వివరించారు. ఇటీవల వర్కవుట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు సూర్య చేతి గాయం 90 శాతం నయమమైందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. చదవండి: త్రీఎఫ్ ఉంటే చాలు! -
పేలిన గ్యాస్ సిలిండర్..నలుగురికి గాయాలు
-
గ్యాస్ సిలిండర్ పేలుడు; నలుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్ : మలక్పేటలోని వెంకటాద్రినగర్లో ఒక ఇంట్లో ఆదివారం అర్థరాత్రి సిలిండర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. కాగా సిలిండర్ పేలుడు దాటికి ఇళ్లుతో పాటు పలు వాహనాలు దగ్దమయ్యాయి. సిలిండర్ పేలి ఒక్కసారిగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కాడు.. అంతలోనే
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబ్పేటకు చెందిన కిష్టయ్య భూమి విషయంలో తన సోదరునితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం తనకు న్యాయం చేయాలంటూ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కిష్టయ్యను సముదాయించి కిందికి దించే ప్రయత్నంలో అతను ఒక్కసారిగా అదుపుతప్పి టవర్పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కృష్ణ పేర్కొన్నారు.కాగా కిష్టయ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతన్ని హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం అందింది. -
ప్రాణం తీసిన పంచ్
మాస్కో: రింగ్లో ప్రత్యర్థి పిడిగుద్దులు ఓ యువ బాక్సర్ ఉసురు తీశాయి. ప్రొఫెషనల్ ఆటలో భౌతిక దాడి స్థాయిలో విసిరిన పంచ్లు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాలు... మేరీలాండ్ పరిధి అక్సన్ హిల్లో గత శుక్రవారం రాత్రి మాక్సిమ్ డడ్షెవ్ (రష్యా), సుబ్రియెల్ మటియాస్ (ప్యూర్టోరికో) మధ్య ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) సూపర్ లైట్ వెయిట్ విభాగంలో బౌట్ జరిగింది. ఇందులో మటియాస్ వరుసగా విసిరిన పంచ్ల ధాటికి 28 ఏళ్ల డడ్షెవ్ దిమ్మతిరిగింది. డ్రెస్సింగ్ రూమ్ వరకు సైతం నడవలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని హుటాహుటిన వాషింగ్టన్లోని ఆస్పత్రిలో చేర్చారు. మెదడులో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కావడంతో చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. డడ్షెవ్ తాను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడు. శుక్రవారం నాటి పోరులో మాత్రం మటియాస్ ముందు నిలవలేకపోయాడు. ఆరంభం నుంచే దూకుడు చూపిన మటియాస్... ప్రత్యర్థి తప్పించుకోలేనంతగా బలమైన పంచ్లు విసిరాడు. వీటికి డడ్షెవ్ తాళలేకపోయాడు. 11వ రౌండ్ తర్వాత కుప్పకూలిన అతడు గ్లోవ్స్ చాటున తలదాచుకుంటూ ‘ఇక ఆపదల్చుకున్నాను’ అని సంకేతాలిచ్చాడు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆస్పత్రిలో అత్యవసర వార్డులో చేర్చి చికిత్స చేసినా ప్రాణం దక్కలేదు. దీనిపై కార్నర్మన్ మెక్గ్రిట్ మాట్లాడుతూ... బౌట్ను ఆపేలా డడ్షెవ్ను ఒప్పించలేకపోయానని అంటున్నాడు. మరోవైపు రష్యా బాక్సింగ్ సమాఖ్య ఈ బౌట్పై విచారణ జరుపుతోంది. ఈ బౌట్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉమర్ క్రెమ్లెవ్ ఆరోపించాడు. డడ్షెవ్కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఉమర్ ప్రకటించారు. -
అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా
సాక్షి, నల్గొండ : ప్రైవేటు పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం, డ్రైవర్ మద్యం మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విద్యార్థులతో పాటు స్కూలు ఆయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముదిగొండ గ్రామం నుంచి చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి సుమారు 30 మంది విద్యార్థులతో బయల్దేరింది. మార్గమధ్యలో మల్లారెడ్డి గ్రామ సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న 1వ తరగతి చదువుతున్న జబ్బు సాయి, 3వ తరగతి చదువుతున్న చింతకుంట్ల విఘ్నేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. బస్సులో ఉన్న మరో పది మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ఆయాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తే ప్రమాదానికి కారణం మండలంలోని మల్లారెడ్డిపల్లి సమీపంలో పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన సంఘటనకు బస్సు డ్రైవర్ మద్యం మత్తే ప్రధాన కారణమని తెలుస్తోంది. తాగిన మైకంలో బస్సు డ్రైవర్ పాఠశాల బస్సును ఇష్టానుసారంగా నడపడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడంతోపాటు పాఠశాల యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకుండా గ్రామంలో ఆటో నడిపే ఓ యువకుడిని బస్సు డ్రైవర్గా నియమించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాగిన మైకంలో వాహనం నడుపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తప్పిన పెను ప్రమాదం పాఠశాల బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాద సంఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
షూటింగ్లో సందీప్ కిషన్ స్టంట్
-
తెలుగు హీరోలకు బ్యాడ్టైమ్!
సాక్షి, కర్నూల్: యువ హీరో సందీప్ కిషన్ షూటింగ్లో గాయపడ్డాడు. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా షూటింగ్లో భాగంగా కర్నూల్లో పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా అతడికి గాయాలయ్యాయి. పైట్ మాస్టర్ తప్పిదం వల్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంలో అతడు గాయపడినట్టు సమాచారం. సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. అది పూర్తయిన అనంతరం హైదరాబాద్ అపోలో హాస్పటల్కి తరలిస్తారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్గా నటిస్తోంది. నిన్న వైజాగ్ షూటింగ్లో మరో యువ హీరో నాగశౌర్య కూడా గాయపడ్డాడు. నూతన దర్శకుడు రమణ తేజ తెకెక్కిస్తున్న సినిమాలో ఫైటింగ్ సీన్ తీస్తుండగా అతడి కాలికి గాయమైంది. నాగశౌర్యకు 25 రోజుల విశ్రాంతి అవసరం అని తేల్చడంతో షూటింగ్ను వాయిదా వేశారు. మెగా యువ హీరో వరుణ్ తేజ్ రెండు రోజుల క్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయిణిపేట వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అంతకుముందు రాంచరణ్ కూడా గాయపడటంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నువ్వు తోపురా సినిమాలో హీరోగా నటించిన సుధాకర్ కోమాకుల కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన కారు ప్రమాదంలో గాయాలతో అతడు బయటపడ్డాడు. హీరోలు వరుస ప్రమాదాలకు గురవుతుండడం పట్ల సినిమా పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నుంచి వైదొలిగిన ఫెడరర్
గతవారం మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్... రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్లో వైదొలిగాడు. గ్రీస్ యువతార సిట్సిసాస్తో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన అతను కుడి కాలి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ‘నేను వంద శాతం ఫిట్గా లేకపోవడంతో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను’ అని 2015 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఆడనున్న ఫెడరర్ వ్యాఖ్యానించాడు. -
కశ్మీర్ పాఠశాలలో పేలుడు
శ్రీనగర్: కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పేలుడు సంభవించింది. జిల్లాలోని నర్బల్ గ్రామంలో ఈ ఘటనలో పదో తరగతి చదివే 12 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. గాయపడిన విద్యార్థులందరినీ హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి బాగుందని ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. పోలీసు అధికారులు పాఠశాలలో ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం రాష్ట్రంలోని బుద్గామ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఛాదూరాలోని గోపాల్పురా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే పక్క సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా, వీరిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకుని భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో హిలాల్ అహ్మద్ వనీ, షోయబ్ మొహమ్మద్ లోన్ అనే ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఉగ్రసాహిత్యం, ఆయుధాలు, మందుసామగ్రిని సైన్యం స్వాధీనంచేసుకుంది. -
బ్రిటన్ పార్లమెంటు వద్ద ఉగ్ర కలకలం
లండన్: బ్రిటన్ పార్లమెంటు భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను మంగళవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైకిళ్లపై నిరీక్షిస్తున్న ముగ్గురిని గాయపరిచాడు. దీనిని ఉగ్రచర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నామనీ, లండన్ సహా బ్రిటన్లో తదుపరి ఉగ్రవాదులు దాడులు చేయొచ్చన్న నిఘా సమాచారమేదీ లేదని పోలీసులు తెలిపారు. ‘కారులో ఆ ఉగ్రవాది మినహా మరెవ్వరూ లేరు. ఉగ్రవాది వద్ద, కారులోనూ ఎలాంటి ఆయుధాలు లభించలేదు’ అని పోలీసులు చెప్పారు ఉగ్రవాది వయసు 25–30 మధ్య ఉండగా అతను ఎక్కడివాడో, పేరేంటో తెలియరాలేదన్నారు. లండన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, భారత సంతతి వ్యక్తి నీల్ బసు మాట్లాడుతూ ‘అతని గుర్తింపును, ఈ దాడి వెనుక ఉద్దేశాన్ని కనిపెట్టడమే మా తొలి ప్రాధాన్యం. ప్రఖ్యాత ప్రదేశంలో ఈ ఘటన జరిగినందున దీనిని ఉగ్ర చర్యగా మేం పరిగణిస్తున్నాం’ అని చెప్పారు. పార్లమెంటు భవనం లోపలకు వెళ్లేందుకు ఉగ్రవాది ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని సమాచారం. రోడ్లపై జనాలు బాగా రద్దీగా ఉండే సమయంలో ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని రోడ్లను, వెస్ట్మినిస్టర్ ట్యూబ్ స్టేషన్ను మూసేశారు. -
పార్లమెంటులోకి దూసుకువచ్చిన కారు
-
పెళ్లికి వెళ్తుండగా...
బొబ్బిలి రూరల్: వారంతా ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగబోయే వివాహానికి ఆనందంగా బయలుదేరారు. గ్రామం దాటి కిలోమీటరున్నర దూరం వెళ్లేసరికి ట్రాక్టర్ బోల్తా çపడింది. దీంతో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...బొబ్బిలి మండలం పిరిడి పంచాయతీ పరిధిలో కొల్లివలసకు చెందిన పూతి పైడితల్లి వివాహం ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగనుంది. ముందుగా ఆటోలో పెండ్లి కుమార్తె, కుటుంబ సభ్యులు వెళ్లిపోగా గ్రామానికి చెందిన బంధువులు ట్రాక్టర్లో శనివారం ఉదయం బయలుదేరారు. ట్రాక్టర్ పిరిడి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పూడి అజయ్, పూడి సింహాచలం, పుట్ట రాములమ్మకు చేతులు విరిగిపోయాయి. భోగాది నారాయణమ్మ, పి.తిరుపతి, తియ్యాల అచ్చెమ్మ, తియ్యల సంధ్య, కొల్లి సత్యవతి, వెంకటలక్ష్మి, తియ్యాల లక్ష్మి, దురగాసి పార్వతి, తియ్యాల పద్మ, తదతరులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి పీహెచ్సీకి తరలించారు. కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడంతో పిరిడి పీహెచ్సీలో వైద్యసేవలందించి పంపించివేశారు. బొబ్బిలి పీహెచ్సీ వైద్యాధికారులు శోభారాణి, రామనరేష్ క్షతగాత్రులకు వైద్యం అందించి, మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి సుజయ్కృష్ణ రంగారావు క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన సోదరుడు బేబీనాయన ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. ట్రాక్టర్ తరలింపు... ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ను తరలించేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ట్రాక్టర్ లేదు. దీంతో ఆయన స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బైక్లు ఢీ..∙ఇద్దరికి గాయాలు భోగాపురం: మండలంలోని లింగాలవలస వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన విజయ్, రమేష్ ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. లింగాలవలస వద్దకు వచ్చేసరికి ఒక యువకుడు ద్విచక్రవాహనంతో డివైడర్ పైనుంచి రోడ్డు దాటే ప్రయత్నంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేయడంతో విజయ్ తన ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో విజయ్, రమేష్ గాయపడ్డారు. ఆటో – బైక్ ఢీ.. గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో స్వీట్హోమ్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తవుడు ప్రయాణికులను ఎక్కించుకుని గజపతినగరం వైపు వస్తుండగా, స్వీట్హోమ్ వద్దకు వచ్చేసరికి గజపతినగరం నుంచి మానాపురం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు కొర్లాపు శ్రీనుతోపాటు ఆటోలో ఓ పక్కన కూర్చున్న వ్యక్తి గాయపడ్డారు. పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
పెళ్లింట విషాదం
మహానంది : వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఇడమడక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో 40 మంది గాయపడ్డారు. బాధితుల వివరాల మేరకు.. ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన దూదేకుల చిట్టెమ్మ కుమార్తె లక్ష్మీదేవికి మైదుకూరు మండలం మిట్టమానుపల్లెకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు ప్రొద్దుటూరులోని షాదీఖానాలో ఆదివారం వివాహం ఉండటంతో తిమ్మాపురం నుంచి రాత్రి బంధుమిత్రులంతా సుమారు 65 మంది లారీలో బయలుదేరారు. అయితే దువ్వూరు మండలం ఇడమడకకు చేరుకునే సరికి వారి ముందు వెళుతున్న మరో లారీడ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో మద్యం మత్తులో ఉన్న పెళ్లి బృందం లారీ డ్రైవర్ అదుపుతప్పి మందున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ ముందు, వెనుక భాగంలో ఉన్న వారంతా రోడ్డుపై ఎగిరిపడ్డారు. వధువు మేనమామ దూదేకుల ఉదయ్శంకర్ ఆలియాస్ కరెంట్ శంకర్(42)కు తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో మృతి చెందాడు. అమీర్, ఫక్కీరమ్మ, బీబీ, గూటుపల్లెకు చెందిన హుసేనమ్మ, బండిఆత్మకూరు దస్తగిరమ్మ, గుర్రెడ్డిపాలెం మీరమ్మ, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన షేక్ కోటి, సునీర్, తిరుపాడుకు చెందిన రోషన్న, తిమ్మాపురం లక్ష్మీపతి, గంగవరం మదార్సా, ఫక్కీరమ్మలకు కాళ్లు, తిమ్మాపురం గ్రామానికి చెందిన హుసేనమ్మ , ఫకీరమ్మ, ఏడేళ్ల చిన్నారి నరసింహ, శంకర్, అమీర్, లారీ యజమాని నారాయణ కుమారుడు కళ్యాణ్తో పాటు షరీఫ్, ఖాదర్తోపాటు మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కళ్యాణ్, షరీఫ్, ఖాదర్ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ విద్యాసాగర్ సంఘటనా స్థలంతో పాటు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. బంధువులు వధువును ప్రత్యేక కారులో తీసుకెళ్లి నిఖా జరిపించారు. క్షతగాత్రులకు నరకయాతన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దువ్వూరు పోలీసులు చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాటు వసతులు సక్రమంగా లేక క్షతగాత్రులు నరకయాతన అనుభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు సరస్వతీ, చంద్రమోహన్, శివ తెలిపారు. కాళ్లు, చేతులు విరిగి నరకం చూస్తున్నా పడుకోవడానికి కనీసం బెడ్లు లేవన్నారు. మృత్యువుతో పోరాడి ఓడిన శంకర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న శంకర్ను బతికించుకునేందుకు భార్యాపిల్లలతో పాటు బంధుమిత్రులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదట చాగలమర్రి ఆస్పత్రికి ఆ తర్వాత ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. అయితే చాగలమర్రి, ఆళ్లగడ్డ ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో అతడిని నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య హసీనాబేగం, కుమార్తె మానస ఉన్నారు. -
పంది దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు
విజయనగరం మున్సిపాలిటీ : పందుల నియంత్రణ చర్యల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఓ బాలుడి నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపాలిటీలో ఆదివారం పట్టణ శివారు ప్రాంతమైన సింగపూర్ సిటీ ప్రాంగణంలో జరిగిన సంఘటనతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. అదే ప్రాంతానికి టి.సాయి (9) నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో పిల్లల పంది అనూహ్యంగా దాడి చేసింది. సమీపంలో ఎవ్వరు లేకపోవడంతో సాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో సాయి ముఖంతో పాటు కడుపు, రెండు చేతులు, తొడ భాగంపై తీవ్ర గాయలపాలయ్యాయి. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు, స్థానికులు సాయిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి 40 కుట్లు వేశారు. మెరుగైన శస్త్ర చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఉలిక్కిపడిన సింగపూర్ కాలనీ వాసులు.. బాలుడిపై పంది దాడి చేయడంతో సింగపూర్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా ఉలిక్కిపడ్డారు. నిత్యం వందలాది మంది చిన్నారులు ఈ ప్రాంతంలో పాఠశాలలకు వస్తుంటారు. అయితే ఆదివారం జరిగిన సంఘటనతో పిల్లలను బడికి పంపించేందుకు కూడా భయపడాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై పంది తీవ్ర స్థాయిలో దాడి చేసినా మున్సిపల్ యంత్రాంగం స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం చేశారు. పందులు, కుక్కల దాడిలో నిత్యం ఎవరో ఒకరు గాయపడుతున్నా మున్సిపల్ పాలకవర్గం, యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల దారుణమంటూ పట్టణవాసులు మండిపడుతున్నారు. -
షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి అలియా భట్కు గాయాలయ్యాయి. బ్రహ్మస్త షూటింగ్లో ఆమె గాయపడినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరణ సమయంలో అలియాకు గాయాలైనట్లు సమాచారం. కుడి భుజానికి బలమైన గాయం కావటంతో ఆమెను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు తెలిపారంట. దీంతో ఆమె ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2019లో విడుదల కానుంది. ఇది కాకుండా అలియా భట్ నటించిన మరో చిత్రం రాజీ విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా
కుంటాల(ముథోల్) : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్–కుంటాల రహదారిపై ఆదివారం అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఘటనలో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. భైంసా డీపోకు చెందిన బస్సు ఉదయం భైంసా నుం చి మహారాష్ట్రలోని అప్పారావు పేట్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్స్టేషన్ సమీపంలోని మూల మలుపు వద్ద అదుపుతప్పి బస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న భైంసా మండలం మాలేగాంకు చెందిన కాంతబాయి, దౌనెల్లికి చెందిన లక్ష్మి, శోభ, గంగామణి, మల్లెపువ్వుల సాయిరాంగౌడ్, విజయ, ప్రకాశం జిల్లాకు చెందిన చల్లం పళ్లం రాజు, తానాజీ పవార్, సూర్యవంశీ కేర్భ, ముత్తవ్వ, అడెల్లు, డ్రైవర్ ముంతాజ్అలీలకు తీవ్ర గాయాలయ్యాయి. తప్పిన ప్రమాదం బస్సుడ్రైవర్ నిర్లక్ష్యం, మూలమలుపు వద్ద ఎలాంటి సూచికబోర్డులు ఏర్పాటు చేయని కారణంగా బస్సు బోల్తా పడిందని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల కలూర్–కుంటాల డబుల్రోడ్డు పనులను నిర్మించగా సూచికబోర్డులు ఏర్పాటు చేయడం మరిచారు. కాగా బోల్తా పడిన బస్సుకు చెట్లు అడ్డంకిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన క్షతగాత్రులను 108లో భైంసా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై యూనిస్అహ్మద్ అలీ పేర్కొన్నారు. -
మలయాళ మెగాస్టార్కు గాయాలు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ షూటింగ్లో స్వల్పంగా గాయపడ్డారు. తన రాబోయే చిత్రం మామంగమ్ లోని ఒక ఫైటింగ్ సీన్ చిత్రీకరణ సందర్భంగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని ఫిల్మ్ టీమ్ ఫేస్బుక్లో వెల్లడించింది. ఈ మూవీలో కీలక మైన యుద్ధ సన్నివేశాన్ని తీస్తుండగా గాయపడినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్లో మమ్ముట్టి గాయపడ్డారన్నవార్తతో ఆయన అభిమానులో ఆందోళనలో పడిపోయారు. రూ. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక సినిమాకు సజీవ్ పిళ్లై దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి నాలుగు విభిన్న పాత్రల్లో అలరించనున్నారట. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీషు భాషల్లో రిలీజ్కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. -
ద్విచక్ర వాహనాలు ఢీ
కారేపల్లి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయిన ఘటన కారేపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన బాణోతు సంతోష్ పెట్రోల్ బంక్ పక్కనే భవన నిర్మాణ పనులను సూపర్వైజింగ్ చేస్తున్నాడు. కామేపల్లి గ్రామానికి చెందిన తేజావత్ రాము, దుబ్బతండా గ్రామానికి చెందిన తమ బంధువులు మౌనిక, అచ్చమ్మను ద్విచక్రవాహనంపై తీసుకొని కారేపల్లి వైపు వస్తున్నాడు. ఇదే క్రమంలో ఖమ్మం–కారేపల్లి ప్రధాన రహదారి పెట్రోల్ బంక్ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బాణోతు సంతోష్, తేజావత్ రాములు, మౌనిక, అచ్చమ్మలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్థానిక యువకులు ఆటోలో కారేపల్లి పీహెచ్సీకి తరలించారు. కాగా, వారిలో బాణోతు సంతోష్ తలకు తీవ్రగాయాలు కావటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్కు ఫోన్ చేసినా.. ఎంతకు రాకపోవటంతో స్థానికులు కారులో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్(22) మృతి చెందాడు. -
బస్సు, ట్రాక్టర్ ఢీ: ముగ్గురు మృతి
సాక్షి, అన్నానగర్: బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అరుప్పుకోట సమీపంలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. విరుదునగర్ నుంచి అరుప్పుకోటకు 45మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం ఓ ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఉదయం తొమ్మిది గంటల సమయంలో అరుప్పుకోట సమీపం పులియంపట్టి గుండా వెళుతుండగా ఎదురుగా 20మందితో వచ్చిన ట్రాక్టర్ బస్సును ఢీకొనడంతో బస్సు బోల్తాపడింది. బస్సు ప్రయాణికులలో సెల్వం (53), అరుణ్ (19), మారిశ్వరన్ (19)లు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు డ్రైవర్ చిత్రస్వామి సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను అరుప్పుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వెట్టి బతుకులు!
సాక్షి, నాగర్కర్నూల్/ నాగర్కర్నూల్ క్రైం: నాగర్కర్నూల్ జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లో పనులు చేసేందుకు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి కోటిఆశలతో వలసొచ్చిన కూలీల విషాదాంతమిది. జిల్లాలోని పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–1 వద్ద పలు రకాల పనులు చేసేందుకు చత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా కింజోలి, చిత్తాపూర్, ఒడియాపాల్, దోన్వా గ్రామాలకు చెందిన కార్మికులు ఏడాది క్రితం జిల్లాకు వచ్చారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పలు పనుల్లో వీరు కార్మికులుగా పనిచేస్తూ నెలనెలా తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తున్నారు. శనివారం ఉదయం వీరు ఉంటున్న క్యాంపు నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి టిప్పర్లో వెళ్తుండగా బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. దీంతో అందులోని 16మంది చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో సుమారు 15–20 నిమిషాలపాటు వీరి ఆర్తనాదాలు అడవిపాలయ్యాయి. ఆ తర్వాత అటుగా వెళ్తున్న వారు గమనించి ఒక్కొక్కరిని ముళ్లపొదల నుంచి రక్తమోడిన శరీరాలతో రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు. తహసీల్దార్ల ద్వారా.. అయితే ఒక గ్రామం నుంచి ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలస వెళ్లాలంటే తప్పనిసరిగా అలాంటి వారి పూర్తి వివరాలు నమోదు చేయాలి. వారికి సంబంధించిన పూర్తి వివరాలను తహసీల్దార్ల ద్వారా కార్మిక శాఖ సేకరించాలి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కూలీలను కార్మిక శాఖ అధికారులు నమోదు చేసుకుని వారి రాష్ట్రాన్ని, జిల్లాను, గ్రామాన్ని, వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి ఫొటోలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా అన్న అంశాలపై వాకబు చేయాలి. జిల్లాలోని అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో శనివారం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ, మరణించిన వారి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. ఎవరు ఎక్కడి వారో.. వారు మరణించారన్న వార్త ఎవరికి తెలియజేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ముఖం చాటేసిన కంపెనీ.. నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే నవయుగ ఎన్ఈసీ కంపెనీల ప్రతినిధులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కంపెనీ వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా టిప్పర్ ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని, మరో రూ.10 లక్షల బీమా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటా మన్నారు. గాయపడిన కూలీలకు వైద్యఖర్చులతోపాటు రూ.2 లక్షలు చెల్లించేందుకు కాంట్రాక్ట్ సంస్థ ఆదేశాలు జారీ చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పొట్ట చేతపట్టుకుని వలసలకు పేరుగాంచిన జిల్లాకే వలస వచ్చారు.. అనుకోని సంఘటనతో ముగ్గురు అమాయకుల ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. మరికొందరు రెక్కలు తెగిన పక్షుల మాదిరిగా మారాయి. ఈ ఘటనతో వలస కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు.. కుటుంబ సభ్యులు ఎవరు.. వీరికి బీమా సౌకర్యం ఉందా.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారా.. తదితర వివరాలు సేకరించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
పార్వతీపురం టౌన్: పుట్టూరు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యా యి. పార్వతీపురం ఏరియా ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు... పార్వతీపురం నుంచి పుట్టూ రు వెళ్తున్న ఆటోను పుట్టూరు నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ట్రాక్టర్ శుక్రవారం మధ్యాహ్నం ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ను జ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న చినబొండపల్లి గ్రామానికి చెందిన బి.పద్మ, పుట్టూరు గ్రామానికి చెంది న ఆటో డ్రైవర్ జి.ఆదియ్య, పి.శ్రీహరి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. -
గ్యాస్ పైపు లీకై..మంటలు వ్యాపించి
♦ 13నెలల చిన్నారితో సహా తల్లిదండ్రికి గాయాలు ♦ గ్యాస్బండ పేలక పోవడంతో తప్పిన ప్రమాదం మిర్యాలగూడ అర్బన్ : గ్యాస్పైపు లీకై మంటలు వ్యాపించడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని శాబూనగర్లో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం... శాబూనగర్కు చెందిన వంట మేస్త్రి సన్నిది నగేష్ కుటుంబంతో పాటు తన కుమారుడు సతీష్, సౌజన్యలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాగా మంగళవారం మధ్యాహ్నం వంటచేసుకునేందుకు గ్యాస్ లైటర్తో స్టౌవ్ను వెలిగించేందుకు ప్రయత్నించగా అప్పటికే గ్యాస్ లీకవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. తప్పించుకునే క్రమంలో సతీష్, సౌజన్యలకు స్వల్ప గాయాలు కాగా వారి 13నెలల కుమార్తె తన్వితకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అనంతరం నీటిని చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని 108 వాహనంలో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వుండటంతో నల్లగొండకు తరలించారు. అనంతరం మెరుగైన చిక్తిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించినట్లు వారు తెలిపారు. మంటల ధాటికి ఇంట్లోని వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోగా సిలిండర్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేల సిలిండర్ పేలితే జరిగే ప్రమాదాన్ని ఊహించలేకుండా ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా సంఘటన స్థలానికి వన్టౌన్ పోలీసులు, రెవెన్యూ అధికారులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని వివరాలు సేకరించారు. -
5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ జిల్లా కోర్టులోని లిఫ్ట్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. వజీర్గంజ్ జిల్లా కోర్టులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోని లిఫ్ట్ సడెన్గా కూలిపోవడంతో భయాందోళణ వాతావరణం నెలకొంది. వైర్లు తెగిపడటంతో అయిదవ అంతస్తునుంచి లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 12మందిగాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది. -
డ్రైవర్ల మధ్య వివాదం.. ప్రయాణికుడికి శాపం
ఆర్టీసీ డ్రైవర్పైకి రాయి విసరబోయి ప్రయాణికుడి పైకి తీవ్ర గాయాలైన కారుడ్రైవర్ కన్నీరుమున్నీరవుతున్న భార్యాపిల్లలు గోపాలపట్నం (విశాఖ పశ్చిమ) : బస్ డ్రైవర్కు ఓ ఆటో డ్రైవర్కు వివాదం తలెత్తింది. ఇలా వాగ్వాదం ముదిరాక కొద్ది దూరం వెళ్లి ఆటో డ్రైవరు కాపు కాసి మరీ బస్ డ్రైవర్పై రాయి విసిరేశాడు. ఆ రాయి బస్లో ఉన్న ఓ ప్రయాణికుడికి తగిలి ఏకంగా కన్నే పోయింది. దీంతో ఆ కుటుంబం దుఃఖంతో కుమిలిపోతోంది. పేదరికంతో నలిగిపోతున్న ఆ వ్యక్తికి ఇపుడు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. న్యాయం చేయాలంటూ భార్యాపిల్లలూ పోలీసులను వేడుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. నాయుడుతోట దుర్గానగర్కు చెందిన షేక్ సురాజుద్దీన్ (36) కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 25 సాయంత్రం నగరంలోని పోస్టాఫీస్ నుంచి కొత్తవలస Ððవెళ్తున్న ఆర్టీసీ బస్ (6కె)లో ఆయన ప్రయాణిస్తున్నాడు. పెందుర్తి జంక్షన్ వద్ద ఓ ఆటో డ్రైవర్కు బస్డ్రైవర్కు మధ్య ట్రాఫిక్ విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆటోడ్రైవరు రెచ్చిపోయి ఆటోతో సరిపల్లి వైపు దూసుకెళ్లాడు. ఓ చోట ఆగి బస్డ్రైవర్పైకి పెద్ద రాయి రువ్వాడు. అది దూసుకొచ్చి బస్లో ఉన్న షేక్సురాజుద్దీన్ తలకి, కంటిభాగానికీ తగిలింది. తీవ్ర రక్తస్రావంతో కొట్టిమిట్టాడిన అతడ్ని డ్రైవర్, కండక్టరు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ప్రాణాపాయం లేదని చిన్నకేసుగా పోలీసులు భావించినా, తర్వాత దారుణం జరిగిందని తేలింది. ఏకంగా కన్నే పోయిందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో సురాజుద్దీన్ భార్య, పిల్లలూ కన్నీరుమున్నీరయ్యారు. అగమ్యగోచరం ఆ కుటుంబం సిరాజుద్దీన్ది దీనావస్ధలో ఉన్న కుటుంబం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్ కారు డ్రైవరుగా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని లాక్కెళ్తున్నాడు. ఇంతలో ఇలా ఊహించని ప్రమాద రూపంలో కన్ను పోవడంతో ఇపుడు ఒక కన్నే మిగిలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో బస్ యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రాథేయపడుతున్నాడు. ఎవరా ఆటోడ్రైవర్? బస్డ్రైవర్ని లక్ష్యంగా చేసుకుని రాయి రువ్వి పరారైన ఆటో డ్రైవర్ ఎవరో పోలీసులకు తెలియలేదు. ఆటో డ్రైవరు ఎక్కడి స్టాండ్ వాడు..ఏ గ్రామానికి చెందిన వాడో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ఆటోడ్రైవర్ని బస్ డ్రైవరు గుర్తించే పరిస్థితి ఉన్న తరుణంలో ఆటో డ్రైవర్ల వివరాలు సేకరిస్తున్నారు. బస్డ్రైవర్, ఆటోడ్రైవర్ మధ్య చోటుచేసుకున్న వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
కళ్యాణదుర్గం రూరల్ : మండలంలోని గోళ్ల గ్రామంలో ఎలుగుబంటి దాడిలో కుంట్లో శ్రీనివాసులు అనే రైతు గాయపడ్డారు. తన పొలంలో వేరుశనగ పంట సాగు చేయగా, శుక్రవారం రాత్రి కాపలాగా వెళ్లిన ఆయన శనివారం ఉదయమే ఇంటికి తిరిగొస్తుండగా ఎలుగుబండి దాడి చేసి గాయపరిచింది. -
షూటింగ్లో హీరోకు గాయాలు
ముంబై: బాలీవుడ్ హీరో రణవీర్సింగ్ ‘పద్మావతి’ చిత్ర షూటింగ్లో గాయపడ్డాడు. తలకు గాయాలు కావటంతో చికిత్స అనంతరం తిరిగి షూటింగ్లో పాల్గొన్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. చిత్రీకరణలో భాగంగా రణవీర్ పై ఒక సీన్ తీస్తుండగా తలకు గాయమయింది. అయితే అతడు ఆ గాయన్ని పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత తలకు తగిలిన దెబ్బ కారణంగా రక్తం వస్తోందని చిత్ర యూనిట్ గుర్తించింది. దీంతో రణవీర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించామని, కోలుకున్న అతడు షెడ్యూల్ ప్రకారం తదుపరి షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు తెలిపాయి. చికిత్సలో భాగంగా రణవీర్ తలకు కుట్లు పడ్డాయని చిత్ర వర్గాలు వివరించాయి. సంజయ్ భన్సాలీ దర్శకత్వంలో నిర్మిస్తున్న పద్మావతి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్సింగ్, పద్మావతిగా దీపికా పడుకొనె నటిస్తున్నారు. -
మూడో అంతస్తు నుంచి పడిన బాలుడు
-
వివాదం రేపిన ‘డిష్’.. ఒకరికి తీవ్రగాయాలు
అనంతపురం: కేబుల్ డిష్ విషయంలో జరిగిన ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నగరంలోని రామకృష్ణకాలనీకి చెందిన రాజేశ్కుమార్, రూపాదేవి భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కొన్ని రోజుల నుంచి ఇంట్లోని డిష్ వైర్కు కరెంట్ సరఫరా అవుతోంది. పలుమార్లు షాక్ కూడా కొట్టింది. ఇదే విషయాన్ని డిష్ నిర్వాహకుడు రాజు అలియాస్ చిన్నాకు రాజేశ్కుమార్ తెలియజేశాడు. దీంతో బుధవారం రాత్రి పొద్దుపోయాక అతడు ఇంటి వద్దకు వచ్చిన సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రాజు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. కాసేపటి తర్వాత రాజు అక్కడికి చేరుకుని తలుపు తట్టాడు. కటింగ్ ప్లేయర్ తీసుకు రావడంతో రిపేరు చేస్తాడేమోనని వారు తలుపుతెరిచారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కొడవలిని తీసి రాజేశ్ గొంతుపై నరికాడు. అడ్డు వచ్చిన రూపాదేవిపై దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్ఎస్ వార్డుకు తరలించారు. కాగా దాడికి పాల్పడిన రాజు కూడా తనను కొట్టారంటూ ఆస్పత్రికి వద్దకు చేరుకోవడంతో కాసేపు ఘర్షణ జరిగింది. ఔట్పోస్ట్ పోలీసులు జోక్యం చేసుకుని రాజును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడికి స్వల్ప గాయాలు ఉన్నట్లు గుర్తించి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి డిష్ బిల్లు ఇవ్వలేదని, అడగడానికి వెళితే దాడి చేశారని తెలిపాడు. కాగా ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. రాశేష్కుమార్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం కాగా రాజు టీడీపీ నేత జయరాం నాయుడు వర్గానికి చెందిన వాడుగా తెలిసింది. రాజకీయంగా నేతల మధ్య ఉన్న వైరం కూడా గొడవ ఇంత పెద్దదిగా మారడానికి కారణమని తెలుస్తోంది. -
నేరడ మోడల్ స్కూల్లో గ్యాస్ సిలిండర్ లీక్
చెలరేగిన మంటలు పదో తరగతి విద్యార్థినికి స్వల్ప గాయాలు మంటలను ఆర్పిన విద్యుత్ సబ్స్టేషన్ సిబ్బంది నేరడ(కురవి) : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ఆవరణలోని బాలికల వసతిగృహంలో గురువారం రాత్రి గ్యాస్ సిలిండర్కు ఉన్న పైప్ లీకై మంటలు చెలరేగిన సంఘటన చోటుచేసుకుంది. కురవి ఎస్సై తీగల అశోక్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.... నేరడ మోడల్ స్కూల్ ఆవరణలో బాలికల వసతిగృహం ఉంది. గురువారం రాత్రి బాలికలకు భోజనాల కోసం వంట మనుషులు వంటలను వండుతున్న క్రమంలో సిలిండర్, స్టౌకు ఉన్న పైప్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్కూల్ ఎదురుగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేసే సిబ్బంది పరుగున చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని ఝాన్సీకి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న కురవి ఎస్సై తీగల అశోక్ హుటాహుటిన వసతిగృహం వద్దకు చేరుకుని విద్యార్థులకు మనోధైర్యం చెప్పారు. ఎంఈఓ ఇస్లావత్ లచ్చిరాంనాయక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ పైప్ లీకై మంటలు చెలరేగినప్పటికీ విద్యుత్ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ఇంటిప్స్
పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే చేతులు మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
శుభలేఖలిచ్చి వస్తూ.. పెళ్లికొడుకు దుర్మరణం
మార్టేరు, (పెనుమంట్ర) : శుభలేఖలిచ్చి వస్తూ.. ఓ కొత్త పెళ్లికొడుకు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం రాత్రి మార్టేరు గ్రామ శివారున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..మార్టేరుకు చెందిన చీమకుర్తి నూక రత్నకుమారి పెద్ద కుమారుడు పూర్ణ వెంకట రామరాజు(27) పెళ్లి ఫిబ్రవరి 1న జరగనుంది. దీంతో ఆమె రామరాజుతో కలిసి శుభలేఖలు ఇచ్చేందుకు ద్విచక్రవాహనంపై ఆచంట వెళ్లి తిరిగి వస్తుండగా మార్టేరు శివారున ఎదురుగా వస్తున్న మరో మోటారు సైకిల్ బలంగా ఢీకొట్టింది. దీంతో రామరాజు అక్కడికక్కడే మరణించాడు. రత్నకుమారితోపాటు, మరో మోటార్సైకిల్పై ఉన్న కర్రి ప్రతాప్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రత్నకుమారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రామరాజు తమ్ముడు శివ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు. రామరాజు మోటార్సైకిల్ ఢీకొన్న మరో బైక్పై ముగ్గురు యువకులు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వీరిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరి యువకుల జాడ తెలియాల్సి ఉంది. ప్రతాప్ను కూడా మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం తరలించినట్టు సమాచారం. మృతుడు రాజు కొన్నాళ్లపాటు దుబాయ్లో ఉండి వచ్చాడు. అతని తల్లి రత్నకుమారి మార్టేరులో కిరాణాషాపు నడుపుతున్నారు. -
స్కూటర్ను ఢీకొట్టిన కారు.. యువతి మృతి
దిగమర్రు (పాలకొల్లు అర్బన్) : పాలకొల్లు–నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృత్యువాత పడగా మరో యువతి తీవ్రంగా గాయపడి నరసాపురం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పాలకొల్లు నుంచి ఏపీ31 ఏజీ 0366 నంబరు గల టాటా సఫారీ కారు నరసాపురం వైపు వెళ్తూ అదే మార్గంలో ఏపీ 37 సీకే 2690 నంబరు యాక్టివా హోండాపై వెళుతున్న అక్కాచెళ్లెళ్లు దంగేటి గౌతమి, దంగేటి పావనిలను ఢీకొట్టింది. కారు గౌతమిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకు పోయింది. సఫారీ కారు నరసాపురం పెదకాలువలోకి దూసుకుపోయింది. అలాగే స్కూటర్ దిగమర్రు పంట కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని నరసాపురం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గౌతమికి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. నరసాపురం ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పావని చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యంతాగి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టాటా సఫారీకి సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకు అతుక్కుపోయి ఉంది. బాటిల్ నుజ్జయింది. మద్యం మత్తులో స్కూటర్ను ఢీకొట్టారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులు పారిపోయారని తెలిపారు. పాలకొల్లు పట్టణ సీఐ కోలా రజనీకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఐఏఎస్ కావాలని... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గౌతమి నరసాపురం వైఎన్ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో రాజమండ్రిలో సివిల్స్కు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. మరో రెండు రోజుల్లో ఆమె తిరిగి రాజమండ్రి వెళ్లనుంది. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. గౌతమి తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు. ఆ బెంగ నుంచి కుటుంబ సభ్యులు తేరుకోకముందే గౌతమి మృత్యు వార్త ఆ కుటుంబాన్ని మరింత కృంగదీసింది. -
శబరిమల ఘటనలో క్షతగాత్రులు 31
• ఇద్దరి పరిస్థితి విషమం • పోలీసుల తప్పేంలేదన్న మంత్రి శబరిమల (కేరళ) : శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 31 మంది గాయ పడ్డారని కేరళ దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. సన్నిధానానికి, మాలికాపురం ఆలయానికి మధ్య ఏర్పాటు చేసిన తాడుతో కట్టిన బారికేడ్లు జనాల తాకిడికి తెగిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారే అధికంగా గాయపడ్డారు. తొక్కిసలాట జరిగిన స్థలాన్ని సురేంద్రన్ పరిశీలించారు. ‘తొక్కిసలాటలో 31 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిలో 8 మంది కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో, ముగ్గురు పతనమ్తిట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో, ఇద్దరు పంబ, మిగిలిన 18 మంది సన్నిధానం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో పోలీసుల తప్పేమీ లేదు. సన్నిధానం వద్ద చాలినంత మంది పోలీసులు ఉన్నారు’ అని చెప్పారు. భక్తుల 41 రోజుల దీక్ష సోమవారం జరగ నున్న ‘మండల పూజ’తో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉందన్నారు. ఏపీకి చెందిన గురువమ్మ అనే మహిళ కాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మహిళలను అనుమతించం శబరిమల ఆలయంలోకి మహిళా హక్కుల కార్యకర్తలను అనుమతించమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలయాల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్.. వంద మంది మహిళలతో శబరిమల ఆలయం లోకి ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలోకి ప్రవేశించనీయమని రాష్ట్ర మంత్రి సురేంద్రన్ చెప్పారు. -
మంత్రుల కాన్వాయ్కు ప్రమాదం
జంగారెడ్డిగూడెం / కామవరపుకోట : రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతల కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి వస్తుండగా, కామవరపుకోట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రులిద్దరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్ జంగారెడ్డిగూడెం వస్తుండగా, కామవరపుకోట సమీపంలో రోడ్డుకు అడ్డుగా మేకలు రావడంతో ముందుగా వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీనిని వెనుక వస్తున్న వాహనాల డ్రైవర్లు గమనించలేదు. ఫలితంగా ఎస్కార్ట్ జీపును ఒక కారు ఢీకొంది. వెంటనే దాని వెనుక ఉన్న కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలో ఉన్న ఆరుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రులిద్దరూ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుంచి మరో వాహనం ఢీకొనడంతో వెనుక వైపు ఉన్న డిక్కీ డోరు లోపలికి చొచ్చుకుపోయింది. పలు వాహనాల ముందుభాగాలు దెబ్బతిన్నాయి. -
విహారయాత్రలో అపశ్రుతి
కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా 15 మంది విద్యార్థులు, టీచర్లకు గాయాలు సంఘటన స్థలం నుంచి పరారైన బస్సు డ్రైవర్ ఉద్దేహాళ్ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులు విహారయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలోని బెలుం గుహలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఒప్పించి విహారయాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో ఉరవకొండకు చెందిన ప్రైవేట్ బస్సులో బయల్దేరారు. వీరిలో ఆరుగురు ఉపాధ్యాయులు, 66 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఉద్దేహాళ్ నుంచి బయలు దేరిన బస్సు ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి, బనగానపల్లి , నంద్యాల మీదుగా మీదుగా వెళుతోంది. విద్యార్థులు సరదాగా జోకులు వేసుకుంటూ ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఉదయం 8.30 గంటల సమయంలో కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి వద్దకు రాగానే మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ హఠాత్పరిణామంతో విద్యార్థులు హాహాకారాలు చేశారు. ప్రాణాలు అరచేత పట్టుకుని బస్సు నుంచి ఒకరి తర్వాత ఒకరు బయట పడ్డారు. ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం వల్లనే బస్సు అదుపు తప్పి, ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. సంఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ పరారయ్యాడు. 15 మందికి గాయాలు బస్సు బోల్తాపడడంతో 15 మంది గాయపడ్డారు. వీరిలో విద్యార్థులు సుధ (లింగదహాళ్), సహానా (ఉద్దేహాళ్), ఆశా (లింగదహాళ్), తెలుగు పండిట్ ప్రశాంతి, హిందీ పండిట్ రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక అధికారులు బాధిత విద్యార్థులను సమీపంలోని పాఠశాలకు ఆశ్రయం కల్పించి.. కాసేపటి తర్వాత స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేశారు. పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన ప్రమాద ఘటనను తెలుసుకున్న గౌనూరు, లింగదహాళ్ , ఉద్దేహాళ్ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లకుండా తక్కవ అద్దెకు దొరుకుతుందని, ఇన్సూరెన్స్ కూడా లేని ప్రైవేట్ బస్సులో తీసుకెళ్లడంలో ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విహారయాత్ర వద్దు, ఏమీ వద్దు.. తమ పిల్లలను వెంటనే వెనక్కి పిలుచుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను వెనక్కు తీసుకొస్తాం ‘అనుకోకుండా ప్రమాదం సంభవించింది. కంగారు పడవద్దు. చిన్నపాటి గాయాలు తప్ప ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, విద్యార్థులను వెనక్కి రప్పిస్తాం’ అని ఎంఈఓ భీమప్ప విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. -
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
ఓబుళదేవరచెరువు: మండలంలోని ఎద్దులవాండ్లపల్లికి చెందిన అనితబాయి, సుధాకర్ నాయక్ దంపతుల కుమారుడు రాజేశ్నాయక్(5) వీధి కుక్కల దాడిలో గురువారం గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా మూడు కుక్కలు దాడి చేసి, నోట కరచుకొని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాయన్నారు. బాలుడి కేకలు విన్న అక్కడి పరసర ప్రాంత ప్రజలు వెంటనే బాలుడ్ని కాపాడారన్నారు. లేకపోతే చిన్నారిని చంపేసేవని చెప్పారు. గాయపడ్డ బాలుడ్ని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడ్ని ఎంపీపీ ఇస్మాయిల్ పరామర్శించారు. -
విద్యార్థిని చితకబాదిన టీచర్
తలకు తీవ్ర గాయం ధర్మవరంలోని భాష్యం స్కూల్లో ఘటన ధర్మవరం టౌన్ : తమ పిల్లవాడికి చదువు సక్రమంగా చెప్పలేదని ప్రిన్సిపల్కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని మనసులో పెట్టుకున్న ఓ టీచర్..ఆ విద్యార్థిని చితకబాదింది. బలంగా కొట్టడంతో తలకు రక్తగాయమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని భాష్యం ఇంగ్లిష్ మీడియం స్కూల్లో మంగళవారం చోటు చేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శివానగర్కు చెందిన రాము, శ్రీదేవి దంపతుల కుమారుడు హరి కిశోర్. కాలనీకి సమీపంలోని భాష్యం ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. హిందీ టీచర్ నసీనా పాఠాలు సరిగా చెప్పడం లేదని ఇటీవల జరిగిన పేరెంట్స్మీట్లో హరికోశోర్ తల్లిదండ్రులు ప్రిన్సిపల్ వెంకటరావుకు ఫిర్యాదు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న నసీనా తరచూ పిల్లాడి పట్ల అమానుషంగా ప్రవర్తించేది. చిన్నారిని ఎడాపెడా గిచ్చడం, కొట్టడం, తిట్టడం చేసేది. ఈ క్రమంలోనే మంగళవారం విద్యార్థి క్లాస్రూంలో అల్లరి చేస్తున్నాడనే సాకుతో పలక తీసుకుని తలపై బలంగా మోదింది. తీవ్రగాయమై విద్యార్థి చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది. దీంతో భయపడిపోయిన పాఠశాల ప్రిన్సిపల్ వెంకటరావు తల్లిదండ్రులను పిలిచి తప్పు జరిగిందని చెప్పి బతిమాలారు. పిల్లాడి పరిస్థితిని చూసి తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ చిన్న పిల్లాడిని ఇలా కొడతారా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. పాఠశాల, టీచర్ పేరు చెబితేనే భయపడి పోతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం టీచర్పై చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ వెంకటరావును అడగ్గా.. విద్యార్థి పట్ల టీచర్ ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. సదరు టీచర్పై చర్యలు తీసుకుని.. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. కాగా..ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. -
హైస్కూల్లో విద్యార్థుల ఘర్షణ
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో పదో తరగతి చదివే అనిల్ అనే వేములపాడుకు చెందిన విద్యార్థి, పిన్నేపల్లికి చెందిన రవి అనే విద్యార్థి ఘర్షణ పడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనలో రవి అనే విద్యార్థి రాయితో దాడి చేయడంతో అనిల్ తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. వెంటనే గాయపడ్డ అనిల్ను స్థానిక పీహెచ్సీకి తరలించారు. మూడు కుట్లు పడ్డాయని చెప్పారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ఎస్ఐ కత్తి శ్రీనివాసులు స్పందిస్తూ... తమకు రాతమూలకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
హైస్కూల్లో విద్యార్థుల ఘర్షణ
యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో పదో తరగతి చదివే అనిల్ అనే వేములపాడుకు చెందిన విద్యార్థి, పిన్నేపల్లికి చెందిన రవి అనే విద్యార్థి ఘర్షణ పడ్డారని తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనలో రవి అనే విద్యార్థి రాయితో దాడి చేయడంతో అనిల్ తీవ్రంగా గాయపడినట్లు వివరించారు. వెంటనే గాయపడ్డ అనిల్ను స్థానిక పీహెచ్సీకి తరలించారు. మూడు కుట్లు పడ్డాయని చెప్పారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ఎస్ఐ కత్తి శ్రీనివాసులు స్పందిస్తూ... తమకు రాతమూలకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఆటో బోల్తా–13 మందికి గాయాలు
ఏలూరు అర్బ¯ŒS : వంట పనికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గుడివాడ మండలం నూదెళ్ల, తిమిరిస పల్లెకు చెందిన కొందరు వంట చేసే మహిళా కూలీలు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పెదవేగి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధన వంటకాలు చేసేందుకు ఆదివారం రాత్రి వచ్చారు. వంటల తయారీ అనంతరం సోమవారం కృష్ణాజిల్లా బొమ్ములూరుకు చెందిన ఇరువ తిరుమలరావు ఆటోలో గుడివాడ బయలుదేరారు. పెదవేగి మండలం దుగ్గిరాల వద్ద జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్న ఆటో తిరగబడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 13 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వీరిలో బి.బేబి, షేక్ మస్తా¯ŒSబీ, ఎం. శిరీష తీవ్రంగా గాయపడ్డారు. దాసరి సులోచన, దోనె మరియమ్మ, చేబ్రోలు రాణి, దోనె బేబి, కనకరత్నం, నక్కా మరియమ్మ, ఆంథోనమ్మ, ఎ¯ŒS సరోజిని, కనకరత్నంతోపాటు ఆటో డ్రైవర్ తిరుమలరావు స్పల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు తరలించారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షి సరిగే రంగారావు చెప్పాడు. దీనికితోడు ఆటో కిక్కిరిసి ఉండడంతో ఎక్కువ మందికి గాయాలయ్యాయని పేర్కొన్నాడు. మరో నలుగురికి.. ఏలూరు అర్బ¯ŒS : ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు బైక్లు ఢీకొని దంపతులు గాయపడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. చొదిమళ్ళకు చెందిన లారీ డ్రైవర్ బోట్ల నాగమోహనరావు భార్య సత్యవాణి, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్పై సోమవారం ద్వారకాతిరుమల వెళ్లారు. అనంతరం అదే బైక్పై తిరుగు పయనమయ్యారు. పెదవేగి మండలం వేగివాడ వద్దకు రాగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ వారిని ఢీకొంది. దీంతో రోడ్డుపై పడిపోయిన నాగమోహనరావుకు తలకు గాయాలు కాగా.. భార్యాపిల్లలు స్పల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
తొమ్మిది మందికి గాయాలు
హిందూపురం రూరల్ : తూమకుంట పారిశ్రామికవాడలో గోళాపురం రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. హెడ్కానిస్టేబుల్ అక్బర్ తెలిపిన మేరకు... పారిశ్రామిక వాడలోని టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు లేపాక్షి మండలం పులమతి, హిందూపురం మండలం జూమాకులపల్లికి చెందిన మహిళలు పారిశ్రామిక వాడకు ఆటోలో బయల్దేరారు. గోలాపురం సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మీనా, సుజాత, నందిని, అరుణ, నాగరాజు, అర్చన, పారిజాతా, బేబీ, అరుణ, స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పాల వ్యాన్ బోల్తా
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న పాల వ్యాన్ డివైడర్ను ఢీ కొట్టి అదుపు తప్పి బోల్తా కొట్టింది. నగరంలోని సంతోష్నగర్ చౌరస్తాలో శనివారం తె ల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పాలతో సంతోష్నగర్ వైపుగా వాహనం బోల్తా కొట్టడంతో పాలన్ని నేలపాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి.. వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
యువకుడికి ఏడాది జైలు
కొయ్యలగూడెం: వ్యక్తిపై దాడిచేసి గాయపర్చిన కేసులో యువకుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని ఎస్సై పి.చెన్నారావు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యర్రంపేట గ్రామానికి చెందిన ఓలేటి గంగాధర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అడపా సత్యనారాయణను 2014 జూ¯ŒSలో దాడిచేసి గాయపర్చాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో గంగాధర్కు ఏడాది జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జంగారెడ్డిగూడెం సివిల్ జడ్జి డి.అజయ్కుమార్ తీర్పుచెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తణుకు: తణుకు పట్టణ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా తొట్లవల్లూరు మండలం తోడేలుదిబ్బ గ్రామానికి చెందిన లొక్కా వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు, బంధువులు మరో ఎనిమిది మంది రావులపాలెం మండలం మందపల్లి శనీశ్వరాలయానికి టాటా మేజిక్ వాహనంలో శుక్రవారం రాత్రి బయలుదేరారు. పట్టణ పరిధిలోని పాతటోల్గేటు సమీపంలోకి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తండ్రి లొక్కా పూర్ణచంద్రరావు (60) అక్కడిక్కడే మృతి చెందగా వాహనంలో ప్రయాణిస్తున్న పడమటి కృష్ణారావు, పర్సా వెంకటేశ్వరరావు, పర్సా వరలక్ష్మి, సోలిశెట్టి నాంచాలమ్మ, గంగిశెట్టి అనురాధ, గంగిశెట్టి సాంబశివరా వు, లొక్కా విజయలక్ష్మి గాయపడ్డారు. పూర్ణచంద్రరావు మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. క్షతగాత్రులు తణుకు ప్రభుత్వాసుపత్రితోపాటు ప్రై వేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
తిమ్మాపూర్(కరీంనగర్): వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్కూటీ పై వెళ్తున్న వారిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొరిశెపాడు(ప్రకాశం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం కొంగపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కొంగపాడు నుంచి వెళ్తున్న పాలవ్యాన్ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వ్యాన్లో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ల సాయంతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పిచ్చికుక్క దాడిలో 10మందికి గాయాలు
గుంటూరు: పిచ్చికుక్క దాడిలో పది మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరులోని తమ్మారెడ్డినగర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఇళ్ల వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఇది గుర్తించిన చిన్నారుల కుటుంబ సభ్యులు పిల్లలను చికిత్స నిమిత్తం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మందుగుండు తయారీలో ప్రమాదం
డి.ముప్పవరం (నిడదవోలు) : మండలంలోని డి.ముప్పవరం గ్రామంలో పిల్లలు ఓ ఇంట్లో మందుగుండు సా మగ్రి తయారుచేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నక్కా సామిరాజు ఇంటి వద్ద ఆయన కుమారుడు ధనరాజుతో పాటు పలువురు పిల్లలు తాటాకు టపాకాయలు కడుతున్నారు. ఇదే సమయంలో ధనరాజు స్నేహితుడు ఒకడు సరదాగా కాగితాన్ని అంటించి ఆటపట్టించేందుకు ప్రయత్నించగా అది టపాసులు చేస్తున్న పటాస్పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ధనరాజు శరీరం, మొహానికి గాయాలయ్యాయి. బంధువులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. యథేచ్ఛగా విక్రయాలు పట్టణంలోని పలు దుకాణాల్లో మందుగుండు సామగ్రి ముడిసరుకు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు పటాస్ వంటి సామగ్రిని విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు చిన్న పిల్లలకు కూడా విక్రయించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
మందుగుండు తయారీలో ప్రమాదం
డి.ముప్పవరం (నిడదవోలు) : మండలంలోని డి.ముప్పవరం గ్రామంలో పిల్లలు ఓ ఇంట్లో మందుగుండు సా మగ్రి తయారుచేస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నక్కా సామిరాజు ఇంటి వద్ద ఆయన కుమారుడు ధనరాజుతో పాటు పలువురు పిల్లలు తాటాకు టపాకాయలు కడుతున్నారు. ఇదే సమయంలో ధనరాజు స్నేహితుడు ఒకడు సరదాగా కాగితాన్ని అంటించి ఆటపట్టించేందుకు ప్రయత్నించగా అది టపాసులు చేస్తున్న పటాస్పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ధనరాజు శరీరం, మొహానికి గాయాలయ్యాయి. బంధువులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. యథేచ్ఛగా విక్రయాలు పట్టణంలోని పలు దుకాణాల్లో మందుగుండు సామగ్రి ముడిసరుకు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు పటాస్ వంటి సామగ్రిని విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు చిన్న పిల్లలకు కూడా విక్రయించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
ద్వారకాతిరుమల ఘాట్రోడ్డులో ఆటో బోల్తా
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శేషాచలకొండపైన ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న ఆటో శనివారం బోల్తా కొట్టింది. డ్రైవర్కు తీవ్రగాయాలు కాగా, ఇద్దరు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రావులపాలెం సమీపంలోని కొత్తపేట మండలం పలివెలకు చెందిన ఓ భక్తుని కుటుంబం చిన వెంకన్నను దర్శించేందుకు ఆటోలో ద్వా రకాతిరుమల వచ్చారు. స్వామి దర్శనానంతరం అదే ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా టోల్గేటు వద్దకు వచ్చేసరికి ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. సమీపం లో ఉన్న భక్తులను ఆటోను లేపి ముగ్గురు భక్తులు, ఆటో డ్రైవర్ను బయటకు తీశారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఇద్దరు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో భక్తుడికి ఏమీ కాలేదు. క్షతగాత్రులను దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది స్థానిక పీహెచ్సీకి తరలించారు. -
ఎద్దును ఢీకొన్న కానిస్టేబుళ్లకు గాయాలు
తాడేపల్లిగూడెం రూరల్ : ఎద్దును ఢీకొన్న ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఆరుళ్ల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఎద్దు మరణించింది. పోలీసుల కథనం ప్రకారం.. నిడదవోలు పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మోటార్సైకిల్పై వస్తుండగా, ఎద్దు ను ఢీకొట్టారు. దీంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. ఈ సమయంలో తుని నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వారిని గమనించి అంబులెన్సులో నిడదవోలు తరలించారు. కానిస్టేబుళ్ల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
కారు, లారీ ఢీ..ముగ్గురికి తీవ్రగాయాలు
కంచికర్ల మండలకేంద్రంలోని చెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుఅయింది. ఈ ఘటనపై పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం ఢీకొని తాత, మనవరాలికి గాయాలు
హసన్పర్తి : తవేరా వా హనం ఢీకొని తాత, మ నవరాలికి గాయాలైన సంఘటన హన్మకొండ–కరీంనగర్ ప్రధాన ర హదారిలోని సీతంపేట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మం డలం శంభునిపల్లికి చెందిన ప్రణీతారెడ్డి ఎ ర్రగట్టు క్రాస్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవులు ప్రకటించడంతో ఆమె తాత పెండ్యాల శ్రీనివాస్రెడ్డి పాఠశాలకు వచ్చాడు. తిరి గి ద్విచక్రవాహనంపై ప్రణీతారెడ్డిని తీసుకుని శంభునిపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తవేరా వాహనం వారి ని ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్రెడ్డి కాలి కింది భాగం నుజ్జునుజ్జయింది. ప్రణీతారెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గంట తర్వాత చేరుకున్న 108 వాహనం.. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ గంట తర్వాత సంఘటన స్థలానికి చేరుకుంది. దీంతో స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఓ దశలో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి స్థానికులు ఉపక్రమించారు. -
తండ్రీకూతుళ్లకు తీవ్రగాయాలు
ఏలూరు అర్బన్ : కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి మోటార్ బైక్పై తండ్రి తీసుకువెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తండ్రీకూతుళ్లకు తీవ్రగాయాలయాయి. తండ్రి ఏలూరు ప్రభుత్వాస్పపత్రిలో చికిత్స పొందుతుండగా కుమార్తె పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. మోసూరి వెంకటేశ్వరాచారి, సుమాదేవి దంపతులు కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో నివాసముంటున్నారు. వారి కుమార్తె గీతా వెంకట నర్మద గవరవరంలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం స్కూల్కు వెళ్లిన నర్మద అనారోగ్యానికి గురైందని తండ్రి వెంకటేశ్వరాచారికి పాఠశాల సిబ్బంది ఫోన్ చేశారు. దీంతో పాఠశాలకు వెళ్లి కుమార్తెను జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి బైక్పై తీసుకువెళుతుండగా జంగారెడ్డిగూడెం బైపాస్ సమీపంలో కారు వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ కారు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కొండ్రుప్రోలు కె.ఎస్.ఎస్.కాలనీ సమీపంలో బుధవారం జరిగిన ఈ దుర్ఘటనలో కారు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం నుంచి బెంగళూరు ఆనందపురానికి టైల్స్ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మేడబలిమి నరసింహారావు (30) మృతి చెందగా, కారు యజమాని అచ్యుత రామసుబ్బారావు గాయపడ్డారు. ఆయనను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును యజమాని అచ్యుత రామసుబ్బారావు డ్రైవ్ చేస్తున్నారు. మృతుడు నరసింహారావు గుంటూరు జిల్లా చవల్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు. -
మత్తులో రైఫిల్తో చెలగాటం
♦ పొట్టలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు ♦ తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ దొడ్డబళ్లాపు(బెంగళూరు)రం: పోలీస్ కానిస్టేబుల్ ఒకరు స్టేషన్లోని రైఫిల్తో ఆట్లాడుతుండగా బుల్లెట్లు కడుపులోకి దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన దేవనహళ్లి తాలూకా చెన్నరాయపట్టణ పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. ఇక్కడ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రమేశ్(40) స్టేషన్లో సెంట్రి డ్యూటీకి హాజరయ్యాడు. రైఫిల్ తీసుకుని షూట్ చేసుకుంటున్నట్టు, పైకి ఎక్కిపెట్టినట్లు ఫొజులు ఇస్తుండగా ప్రమాద వశాత్తు మిస్ఫైర్ అయ్యి అతని పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రమేశ్ను బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ అమిత్సింగ్ చెన్నరాయపట్టణ పోలీస్స్టేషన్ను పరిశీలించి సిబ్బంది వద్ద సమాచారం తెలుసుకున్నారు. కాగా రమేష్ డ్యూటీకి హాజరైన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు రైటర్, సిబ్బంది చెబుతున్నారు. -
పిచ్చికుక్కల దాడిలో 15 మందికి గాయాలు
రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఆదివారం చోటుచే సుకుంది. మండల పరిధిలోని మర్రిపాడు, పెద్దబుగ్గ గ్రామాల్లో సంచరిస్తున్న పిచ్చికుక్కలు బాటసారులపై దాడి చేశాయి. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు కుక్కలను హతమార్చడానికి యత్నిస్తున్నారు. -
ఆటలు ఓకే.. మరి గాయాల సంగతి ?
* శిక్షకుల పర్యవేక్షణతోనే భవితకు భరోసా * నిర్లక్ష్యంతో కెరీర్కే ముప్పు గుంటూరు స్పోర్ట్స్: స్పోర్ట్స్ ఆడడం, వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్య పరంగా చాలా లాభాలు ఉన్నాయి. అయితే స్పోర్ట్స్ ఆడే సమయంలో, వ్యాయామాలు చేసేటప్పుడు సరైన ట్రైనింగ్, రక్షణ కవచాలు, వార్మప్ లేకపోవడం వల్ల గాయాలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కొన్ని క్రీడా గాయాలు చిన్నవిగా త్వరగా మానేవి. మరికొన్ని గాయాలు తీవ్రంగా ఉండి, ఆ వ్యక్తి క్రీడలకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. మరికొన్ని ప్రాణాంతకం కూడా అవుతున్నాయి. క్రీడా గాయాలపై క్రీడాకారులకు సరైన అవగాహన లేకపోవడంవ వల్లే చాలా మంది క్రీడాకారులు తమ కెరీర్ను కోల్పోతున్నారు. క్రీడలు, వ్యాయామల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. మూడు రకాల గాయాలు.. క్రీడా గాయాలు డైరెక్ట్ ఇంజురీ, ఇండైరెక్ట్ ఇంజురీ, ఓవర్ యూస్ ఇంజురీ అని మూడు రకాలు. క్రీడల్లో గట్టిగా వుండే ఎముకలు విరగంతో పాటు లిగ్మెంట్, కండరాలు చిట్లే ప్రమాదం వుంది. మన శరీరంలోని ఎముకలు, జాయింట్లు సరిగ్గా కదలటానికి లిగ్మెంట్, కండరాలు సహకరిస్తాయి. లిగ్మెంట్, కండరాలు దెబ్బతింటే జాయింట్స్కు పట్టుత్వం తగ్గుతుంది. డైరెక్ట్ ఇంజురీ : బయట నుంచి బలంగా ఏదైనా తగలడం, మరో ఆటగాడు ఢీకొనడం, బంతి, బ్యాట్ తగలడం వల్లే కలిగే దెబ్బలు. ఇండైరెక్ట్ ఇంజురీ : పరుగెత్తే, దూకిన సమయాల్లో కాళు, చేతులు మెలిక తిరగడం, గూడ జారడం, ఇండైరెక్ట్ ఇంజూరీస్. ఓవర్ యూజ్ ఇంజురీ : ఒక్కసారి గాయామైనప్పుడు తిరిగి ఆడడం వల్ల గాయాం పెద్దది అయి కండరాలు, లిగ్మెంట్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ఓవర్ యూజ్ ఇంజురీ అంటారు. దెబ్బతగిలిన వెంటనే చేయకూడనివి.. వేడి కాపడం పెట్టడం, దెబ్బతిన్న భాగాన్ని మసాజ్ చేయడం, దెబ్బ తగిలిన భాగానికి విశ్రాంతి లేకుండా మళ్లీ వాడడం చేయకూడదు. వైద్యులు పరిశీలించిన తరువాత గాయాలపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. సరైన వైద్యం తరువాత దెబ్బతిన్న ఎముకలు, లిగ్మెంట్, కండరాలు తిరిగి మాములు స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ, వ్యాయామాలు చేయాల్సి వుంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రక్షణ కవచాలు ధరించడం: సరైన, సరిపోయే హెల్మెట్స్, గ్లౌజ్, ప్యాడ్స్, షూ నాణ్యమైనవి ధరించాలి. వార్మప్, స్ట్రచ్చింగ్, ఎక్సైర్సైజ్లు: ఆట మొదలు పెట్టేటప్పుడు, సాధన చేసేటప్పుడు, తరువాత వార్మప్ స్ట్రచ్చింగ్, ఎక్సైర్సైజ్లు తప్పనిసరిగా చేయాలి. దీని వల్ల కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. టెక్నిక్స్ లేకుంటే గాయాలే... మంచి స్పోర్ట్స్ కోచ్ సాయంతో సరైన టెక్నిక్స్ తెలుసుకుని క్రీడలు ఆడాలి. సరైన టెక్నిక్ లేకుండా ఆటలు ఆడితే ఎక్కువ గాయాల పాలయ్యే అవకాశం ఉంది. మధ్యలో బ్రేక్ అవసరం... ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మధ్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. తగినంత వాటర్, జూస్ తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే కండరాలకు హైడ్రేషన్ తగ్గి త్వరగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు
సంతమాగులూరు(ప్రకాశం): కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్థులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. -
రెండు బస్సులు ఢీ: 15 మందికి గాయాలు
నకిరేకల్(నల్లగొండ): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవే ట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న సమయంలో అదే మార్గంలో విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
మధుమేహరోగుల గాయాన్ని తగ్గించే బ్యాండేజీ
చికాగో: మధుమేహంతో బాధపడేవారికి చిన్న గాయమైనా సరే.. అంత తేలిగ్గా మానదు. అది తగ్గే వరకు వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారికోసమే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త బ్యాండేజీని తయారు చేశారు. ఎస్డీఎఫ్–1 ప్రొటీ తో కూడిన ఈ ప్లాస్టిక్ బ్యాండేజీ నుంచి ప్రోటీ నిదానంగా విడుదలవుతుంది. ఈ బ్యాండేజీని గాయమైన చోట అతికిస్తే అక్కడ కొత్త రక్తనాళాలు వేగంగా పెరిగేట్టు చేయడమే కాకుండా గాయాలను తొందరగా మానిపోయేందుకు సహకరించే మూలకణాలను ఆకర్షిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ పెరిగి గాయం త్వరగా మానిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడంవల్ల కొన్ని సార్లు గాయాల నొప్పి కూడా తెలియకపోవడంతో చికిత్స తీసుకోరు. ఫలితంగా ఈ గాయాలైన అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. పైగా రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి గాయం మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి సమస్యలన్నింటినీ ఈ బ్యాండేజీ పరిష్కరిస్తుందని చెబుతున్నారు. -
పాపం ఈ పసివాడికి ఎంతకష్టం..!
-
పాపం ఈ పసివాడికి ఎంతకష్టం..!
అలెప్పో: సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి చిత్రం ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఐదేళ్ల బాలుడు ఒళ్లంతా గాయాలతో అమాయకంగా చూస్తున్న చూపులు సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది. అలెప్పో ప్రాంతంలో తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడుల్లో ఓ భవనం ధ్వంసమైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు, పాత్రికేయులు ఒమ్రాన్ అనే బాలుడి కుటుంబాన్ని రక్షించారు. ఒమ్రాన్ తో పాటు అతని ముగ్గురు సోదరులు, తల్లిదండ్రులు ఈ ఘటనలో గాయపడ్డారు. ఒళ్లంతా తీవ్రగాయాలై రక్తమోడుతున్న బాలుడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ బాలుడి ప్రాణానికి ప్రమాదమేం లేదని వైద్యులు వెల్లడించారు. ఒమ్రాన్ కుటుంబాన్ని భవనం నుంచి బయటకు తీసుకొచ్చిన కొద్ది సేపట్లోనే అది పూర్తిగా కుప్పకూలిందని స్థానికులు వెల్లడించారు. ఒమ్రాన్ అంబులెన్స్ లో కూర్చున్న సమయంలో ఓ పాత్రికేయుడు తీసిన ఫోటో ఇది. ఒమ్రాన్ ఫోటోతో అంతర్జాతీయ సమాజం కదిలిపోయింది. సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ సైతం తక్షణమే అలెప్పోలో వైమానిక దాడులను నిలిపేయండి అని కోరింది. -
ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు
తుని : తూర్పుగోదావరి జిల్లా తుని మండలం దొండవాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆస్తి విషయంలో జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవు దాడిలో 10 మందికి గాయాలు
అర్ధవీడు మండలం మొహిద్దీన్పురంలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. పిచ్చి పట్టిన విధంగా ఆవు కనపడిన జనాలపైకి దూసుకురావడంతో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం..
సూర్యాపేట మండలం రాయనిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వస్తోన్న డీసీఎం వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో డీసీఎంను ప్రైవేటు స్కూలు బస్సు, స్కూలు బస్సును ఆటో వెనక నుంచి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులకు స్వల్పగాయాలు కాగా..ఆటోలో ప్రయాణిస్తోన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఈ రోడ్డులో నడక సాగేదెలా.. ?
వర్షకాలంలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు గాయాలపాలవుతున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు, జుక్కల్ : మండలంలోని లింగంపల్లి, విట్టల్వాడి, విట్టల్వాడి తాండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ నుంచి జిల్లా బార్డరు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు వేసవిలో పనులు చేపట్టాల్సి ఉండగా వర్షాకాలంలో పనులు చేపడుతుండడంతో రోడ్డు అధ్వాన్నంగా మారింది. సావర్గావ్ గ్రామ ప్రాంతంలో కల్వర్టు నిర్మాణానికి అడ్డంగా రోడ్డు తవ్వడంతో రెండు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి వాహనాలు వెళ్లేందుకు సౌకర్యం లేక పొవడంతో ఆయా గ్రామాల ప్రజలు కిలోమీటర్ దూరం నడచి ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డుపై వేసిన నల్లమట్టితో బురదగా మారి వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. బురదతో వాహనాలు అదుపు తప్పి పలువురు గాయాల పాలవుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల వి«ధ్యార్థులు రోడ్డువెంట నడంలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. రోడ్డుకు మరమ్మత్తు చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
ఆర్మీ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు
ఖమ్మం రూరల్ : లారీ బైక్ను ఢీకొనడంతో ఓ ఆర్మీ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నాయుడుపేట జంక్షన్ వద్దమంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటకు చెందిన ఆర్మీ కానిస్టేబుల్ ఎండీ.నయీమ్ ముల్కలపల్లి వైపు నుంచి ఖమ్మం వస్తున్నాడు. ఈ క్రమంలో నాయుడుపేట జంక్షన్ వద్దకు రాగానే ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొంది. దీంతో నయీమ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై టి.గోపి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం నయీమ్ను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్మీ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు
ఖమ్మం రూరల్ : లారీ బైక్ను ఢీకొనడంతో ఓ ఆర్మీ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నాయుడుపేట జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేటకు చెందిన ఆర్మీ కానిస్టేబుల్ ఎండీ.నయీమ్ ముల్కలపల్లి వైపు నుంచి ఖమ్మం వస్తున్నాడు. ఈ క్రమంలో నాయుడుపేట జంక్షన్ వద్దకు రాగానే ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొంది. దీంతో నయీమ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై టి.గోపి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం నయీమ్ను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బొలేరో
– ఆరుగురికి తీవ్రగాయాలు యర్రగొండపాలెం టౌన్ : ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బొలేరో ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పుల్లలచెరువు మండలం నరజాముల తండా సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గిద్దలూరుకు చెందిన కొందరు బొలేరోలో మాచర్ల Ðð ళ్తున్నారు. మాచర్ల నుంచి మార్కాపురం వస్తున్న ఆర్టీసీ బస్సును నరజాముల తండా మలుపు వద్ద బొలేరో ఢీకొంది. ప్రమాదంలో బొలేరోలో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్ గుర్తించలేకపోయాడు. ప్రమాదంలో రంగస్వామి, బాపయ్య, డ్రైవర్ శివ తలలకు తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న నాయబ్ రసూల్, వెంకటయ్య, మహేశ్వరరెడ్డిలూ గాయపడ్డారు. ఆర్టీసీ బస్సులోనే క్షతగాత్రులను యర్రగొండపాలెంలోని రవీంద్ర నర్సింగ్ హోమ్కు తరలించారు. -
కమల్ హాసన్కు గాయాలు
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఆయన తన కార్యాలయంలో మెట్లు దిగుతూ జారి పడ్డారు. దీంతో ఆయన కాలికి గాయం అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కమల్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సర్జరీ చేసిన వైద్యులు ప్రమాదం ఏమి లేదని , రేపు డిస్ చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. కమల్ ఇటీవలే శభాష్ నాయుడు షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని చెన్నై చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. కమల్ తొలిసారిగా తన కూతురు శృతిహాసన్ తో కలిసి నటిస్తున్న శభాష్ నాయుడు చిత్రం ప్రస్తుతం సెట్స్ ఉంది. ఈ చిత్రాన్ని కమల్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది. -
కమల్ హాసన్కు గాయాలు
-
బాంబుపేలి గిరిజనులకు గాయాలు
♦ కూంబింగ్ పార్టీలు.. పోలీసులే లక్ష్యమా? ♦ భయం గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు వెంకటాపురం: ఏజెన్సీలో బాంబు పేలింది. విజయపురి కాలనీ సమీపంలోని కొత్తపల్లి వెళ్లే ఆర్అండ్బీ ప్రధాన రహదారి పక్కన బుధవారం ప్రెషర్బాంబు పేలి ఇద్దరు గిరిజనులకు గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మురుదొండ గ్రామానికి చెందిన తెల్లం రమేష్, తెల్లం సురేష్, పోడియం రాధ రెండు రోజుల క్రితం చర్ల మండలం క్రాంతిపురంలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై కాంతిపురం నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. విజయపురి కాలనీ సమీపంలోని కొత్తపల్లి వెళ్లే రహదారి పక్కన మూత్రం పోసుకునేందుకు ద్విచక్రవాహనాన్ని ఆపారు. మూత్రం పోసుకునేందుకు వెళ్తూ రోడ్డుపక్కన మట్టిలో ఉన్న కర్రను పీకారు. ఒక్కసారిగా బాంబు పేలి తెల్లం రమేష్ తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. పక్కనే ఉన్న పోడియం రాధకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఎదిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. టార్గెట్ ఎవరు? కూంబింగ్ పార్టీలు, పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు రోడ్డు పక్కన బాంబులను ఏర్పాటు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ బలగాలు ఈ రహదారుల మీదుగానే కూంబింగ్ వెళ్తుంటారు. వారిని మట్టుబెట్టేందుకే రహదారికి ఇరువైపులా బాంబులు ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. బాంబుపేలిన ప్రాంతంలోనే ఇటీవల మావోయిస్టులు వాల్పోస్టర్లు సైతం వేశారు. ఏజెన్సీలో భయం..భయం చాలా కాలం తర్వాత మావోలు పోస్టర్లు వేయడం, బాంబులు పేలడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మావోలు, పోలీసుల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. -
స్కూల్ బస్సు బోల్తా..
ఇద్దరు బాలికలకు గాయాలు * సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీటీసీ, ఎస్సై కాపుసోంపురం (శృంగవరపుకోట రూరల్): ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు కాపుసోంపురం గ్రామం వద్ద ఎస్.కోట పట్టణంలోని ఓ స్కూల్కు చెందిన బస్సు శుక్రవారం ఉదయం పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎల్కేజీ చదువుతున్న టి.మౌనిక (రాజీపేట), ఎస్.ప్రణీత (కొత్తపాలెం) విద్యార్థినులు గాయపడగా, మిగిలిన ఎనిమిది మంది సురక్షింతంగా బయటపడ్డారు. గాయపడిన బాలికలను ఎస్.కోట ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ప్రమాదానికి సంబంధించి ఎస్సై కె.రవికుమార్, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదఖండేపల్లిలో శుక్రవారం ఉదయం బయలుదేరిన స్కూల్ బస్సులో పెదఖండేపల్లి, కొత్తపాలెం, కాపుసోంపురం గ్రామాలకు చెందిన పది మంది స్కూల్ విద్యార్థులు ఎక్కారు. చిరుజల్లులు కురవడంతో కాపుసోంపురం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఎస్సై కే. రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యజమానే డ్రైవర్ బస్సు డ్రైవర్ శ్రీను సెలవు పెట్టడంతో స్కూల్ యజమాని రంభ ఈశ్వరరావు బస్సును నడుపుతున్నాడు. అతనికి కేవలం లెర్నింగ్ లెసైన్స్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సంఘటన విషయంలో టీవీల్లో స్క్రోలింగ్ ద్వారా తెలుసుకున్న రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘరావు డీటీసీ భువనగిరి కృష్ణవేణితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీటీసీ కృష్ణవేణి, ఏంఎవీఐ అప్పన్న, ఎస్.కోట ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ, సంబంధిత పాఠశాలకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 22 బస్సులు జిల్లా వ్యాప్తంగా 604 స్కూల్, కళాశాలల బస్సులుండగా ఇప్పటి వరకు 422 బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేసినట్లు రవాణా శాఖ జిల్లా కమిషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి తెలిపారు. కాపుసోంపురంలో ఆమె మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 22 బస్సులకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు హెవీ లెసైన్స్తో ఐదేళ్ల అనుభవం ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, వాహన నిబంధనలపై త్వరలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్రోడ్డులో వేగంగా వెళుతున్న టెంపో వాహనం రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన పలువురు భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో..
ధర్మసాగర్(వరంగల్): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టిన ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా
♦ డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలు ♦ రాయిలాపూర్ గేటు వద్ద ఘటన ♦ డ్రైవర్ నిర్లక్ష్యమేనంటున్న పోలీసులు కౌడిపల్లి: అదుపు తప్పడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్, కండక్టర్ సహా 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కౌడిలిపల్లి మండలం రాయిలాపూర్ గేట్ సమీపంలో మెదక్-నర్సాపూర్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (నం: టీఎస్ 15జెడ్ 0116) గురువారం ఉదయం మెదక్ నుంచి జేబీఎస్కు వెళ్తుంది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయిలాపూర్ గేట్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. రాయిలాపూర్ గేట్ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో ఆగకుండా వెళ్లింది. సమీపంలో రోడ్డుపైబైక్లు ఆపుకుని నలుగురు వ్యక్తులు ఉండటంతో వారిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా అదుపుతప్పిన బస్సు రోడ్డు కుడివైపునకు దూసుకెళ్లింది. అక్కడే గ్రామానికి మంచినీటిని సరఫరాచేసే బోరుమోటార్ను ఢీకొని సమీపంలోని మామిడి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సంగమేశ్వర్ (మెదక్), కండక్టర్ అనిత (గౌతాపూర్)తోపాటు ప్రయాణికులు గూడ లక్ష్మి(మెదక్), కౌ డిపల్లి అంతయ్య (కొడిపాక), సాలె నర్సింలు (దేవులపల్లి), సాదుల లక్ష్మీనర్సమ్మ (కిష్టాపూర్), రమ, బద్రి కావ్య, వీరరాజు (సరూర్నగర్), బానూబీ (మెదక్), సఫబేగం, షేక్అలీ (నర్సాపూర్), జలాల్పూర్ సుధాకర్ (కౌడిపల్లి), ర్యాగ ల్ల శ్రీకాంత్ (కొల్చారం), నరహరి (ధర్మాసాగర్) గాయపడ్డారు. ఎస్ఐ ప్రభాకర్రెడ్డి తనసిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆటోలో నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సహాయక చర్యలు... బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు ఆర్తనాదాలతో మిన్నంటాయి. బస్టాండ్ వద్ద ఉన్న కాజిపేటకు చెందిన జహంగీర్తోపాటు రాయిలాపూర్ వాసులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. వారిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన వారిని వేరు బస్సులో తరలించారు. డ్రైవర్ సంగమేశ్వర్ను నర్సాపూర్లో ప్రథమ చికిత్స అనంతరం బంధువులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్ ఆసుపత్రి వైద్యులు బాధితులకు చికిత్సలు నిర్వహించారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే బస్సు బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్కు తప్పిన ప్రమాదం... బస్ బోల్తా పడటంతో డ్రైవర్ సంగమేశ్వర్గౌడ్కు గాయాలతో తప్పించుకున్నారు. బస్సు బోరు బావిని ఢీకొనడంతో బోల్తా పడ్డ ప్రదేశంలో బోరుబావిలోని పైప్ డ్రైవర్ సీటుకు పక్కనే తేలింది. కొద్దిలో డ్రైవర్ తలకు తగిలే ప్రమాదం ఉండేదని పలువురు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. -
భల్లాలదేవుడికి ఏమైంది?
బాహుబలి-2 షూటింగ్ లో రానా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. మణికట్టుకు బ్యాండేజి వేసున్న ఫొటోను రానా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన మణికట్టుకు గాయమైందని, అందువల్ల ఈ టేప్ వేసుకున్నానని చెప్పాడు. త్వరలోనే మళ్లీ పూర్తిస్థాయి శిక్షణ కోసం ఎదురుచూస్తున్నానన్నాడు. దాంతో త్వరగా కోలుకోండంటూ అభిమానుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. భారీ యాక్షన్ సినిమాల షూటింగుల్లో ఇటువంటి గాయాలు సాధారణమేనంటూ ఇదివరకు గాయాలపాలైనప్పుడు రానా అన్నారు. కాగా బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2017లో బాహుబలి- 2 సినిమా రిలీజ్ కానున్నప్పటికీ.. రాజమౌళి షూటింగ్ పనుల్ని చకచకా చేసేస్తున్నాడు. రానా, అనుష్క షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. మొత్తం షూటింగ్ అక్టోబర్ వరకు పూర్తవుతుందని అంచనా. 2017 వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. Taped up my damaged wrist for full blown training soon!! #Baahubali https://t.co/kUqGbyUGMV — Rana Daggubati (@RanaDaggubati) 25 May 2016 -
విద్యుదాఘాతంతో ఐదుగురికి గాయాలు
శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల్లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. దెబ్బతిన్న తీగలు, స్తంభాలను మార్చే క్రమంలో పై నుంచి వెళుతున్న వేరే విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు
ఎర్రుపాలెం: గొల్కొండ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారి పట్టాలపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం పట్టణానికి చెందిన దర్రు రామారావు(41) గోల్కొండ ఎక్స్ప్రెస్లో విజయవాడ వరకు వెళుతుండగా డోర్ దగ్గర కూర్చోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు కాళ్లు నుజ్జుకావడంతో రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
విజయసాయిరెడ్డిని పరామర్శించిన జగన్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా బుధవారం మధ్యాహ్నం వెళ్లి పరామర్శించారు. జగన్ దంపతులు కొద్దిసేపు సాయిరెడ్డి వద్ద ఉండి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులతో మాట్లాడారు. సాయిరెడ్డి త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో నేత సాగి దుర్గాప్రసాదరాజు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆయన్ను బుధవారం ఉదయమే వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. -
విజయ సాయిరెడ్డికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయ సాయిరెడ్డి సహా పార్టీ నేతలు దుర్గా ప్రసాదరాజు, దశరథ్ రెడ్డి, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరంతా ప్రత్యేక హోదాపై ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్టౌ పేలి భార్యాభర్తలకు గాయాలు
ధర్మవరం: వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిరోసిన్ స్టవ్ పేలి భార్యా భర్తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కోలకత్తాకు చెందిన బబ్లూ, జాస్మీన్ భార్యాభర్తలు స్థానికంగా పట్టుచీరలపై డిజైన్లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు వంట చేయడానికి ప్రయత్నిస్తుండగా.. స్టవ్ పేలింది. దీంతో మంటలు ఎగిసిపడి జాస్మీన్ కు అంటుకున్నాయి. ఇది గుర్తించిన భర్త ఆమెను కాపాడటానికి ప్రయత్నించడంతో.. అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
జీపు బోల్తా: 9 మందికి తీవ్ర గాయాలు
యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాండూరు నుంచి యాలలకు వస్తుండగా ఓ జిపు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు
చివ్వెంల: నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున ఆర్టీసీ ఇంద్రా బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఖమ్మం డిపోకు చెందిన ఇంద్రా బస్సు హైదరాబాద్కు వెళుతూ జేసీబీని తప్పించబోయి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సులోని 25 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
లిఫ్ట్ వైరు తెగడంతో ...
లిఫ్ట్వైర్ తెగి ఇద్దరికి గాయాలు కుత్బుల్లాపూర్ : ఒక హోటల్లో లిఫ్ట్ వైర్ తెగి పడటంతో ఇరువురు తీవ్రగాయాలకు గురి కాగా, మరో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన సుచిత్రలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో శుక్రవారం రాత్రి జరిగింది. బోయినపల్లికి చెందిన ఓ స్కూలు చైర్మన్ కూతురు నిశ్చితార్థం జరిగింది. స్కూల్ టీచర్స్ ఫంక్షన్కు హజరై లిఫ్ట్లో కిందికి దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వైరు తెగడంతో టీచర్ రాణితో పాటు మరో టీచర్ కుమారుడు , అంజన్ తీవ్రగాయాలకు గురికాగా యశోద అసుపత్రికి తరలించారు. మరో నలుగురు వుహిళలు స్వల్పంగా గాయపడ్డారు. -
108.. ఎప్పుడూ లేట్
అక్టోబర్ 30న సుగ్లాంపల్లి క్రాస్రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్కు చెందిన సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 108కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో తరలించారు. చికిత్స పొందుతూ అదే రాత్రి మరణించాడు. కమాన్పూర్ మండలం కన్నాల పరిధి పాతలంబాడి తండాకు చెందిన లావుడ్య బద్యానాయక్(65) నెల రోజుల క్రితం బసంత్నగర్ టోల్గేట్ సమీపంలో రోడ్డుపై పల్సర్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు టోల్గేట్ అంబులెన్స్ను తాత్కాలికంగా పెట్రోలింగ్ వాహనంగా మార్చుకుని సిబ్బంది సుల్తానాబాద్ సమీపంలో ఉన్నారు. బసంత్నగర్ బస్స్టాప్లో ఉండే 108 కూడా అందుబాటులో లేదు. దీంతో ఓ ట్రాలీలో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఇవీ... జిల్లాలో రోడ్డు ప్రమాదాలఅనంతరం పరిణామాలు. క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి గట్టెక్కించే 108 అంబులెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం... అందుబాటులో అత్యవసర వైద్యచికిత్స అందించే ఆసుపత్రులు లేకపోవడం... సకాలంలో వైద్యం అందక ఏటా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. * రహదారులపై రక్తపుటేరులు * అత్యవసరాల్లో ఆదుకోని అంబులెన్సలు * క్షతగాత్రుల తరలింపులో జాప్యం * గాల్లో కలుస్తున్న ప్రాణాలు కరీంనగర్ సిటీ : జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు నాలుగున్నాయి. ఈ రోడ్లపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. శనిగరం నుంచి జిల్లాలోకి ప్రవేశించే రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగితే తప్పనిసరిగా కరీంనగర్కు తీసుకురావాల్సిందే. గంట ప్రయాణం చేస్తే తప్ప క్షతగాత్రుడికి వైద్య సహాయం అందించలేరు. ఈలోగా బాధితుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. హుజూరాబాద్ నుంచి వరంగల్ రూట్లో ప్రమాదాలు జరిగితే, వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుంటారు. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ మార్గమధ్యంలో ప్రమాద బాధితులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించాల్సిందే. కరీంనగర్ నుంచి రాయపట్నం రూట్లో ప్రమాదం జరిగితే కరీంనగర్ ఆసుపత్రే దిక్కు. కోరుట్ల, మెట్పల్లి ఏరియా ఆసుపత్రులున్నా, అత్యవసర వైద్య సేవలు అక్కడ అంతంతమాత్రమే. ఇక కరీంనగర్, జగిత్యాల రహదారిలో ఎక్కడ ప్రమా దం జరిగినా కరీంనగర్కు రావాల్సిందే. అత్యవసర చి కిత్స అందించే వైద్యులు ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండకపోవడంతో తప్పనిసరిగా జిల్లా కేం ద్రానికే తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీం తో అత్యవసర పరిస్థితుల్లో నూ గంటల తరబడి ప్రయాణం చే యాల్సి రావడంతో బాధితుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండాపోతోంది. 108లు కూడా ఎ ప్పుడు అందుబాటులో ఉంటా యో తెలియని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం నుంచి ఐదు నిమిషాల ప్రయాణ దూరం ఉండే ఎల్ఎండీలో రోడ్డు ప్రమాదం జరిగితేనే 108 దిక్కులేక పోవడం, జిల్లా లో ఆంబులెన్స్ సేవల దుస్థితిని తెలియజేస్తోంది. జిల్లాలో రేణికుంట, బసంత్నగర్ వద్ద టోల్గేట్లున్నాయి. ఈ రెండు చోట్ల విధిగా అంబులెన్స్ ఉండాలి. ఉన్నాయి కూడా... కానీ, అవసరానికి మాత్రం అందుబాటులో ఉండవనే విమర్శలున్నాయి. బసంత్నగర్ టోల్గేట్ వద్ద ప్రమాదం జరిగితే అంబులెన్స్ లేకపోవడంతో ఆటోలో తరలిస్తుండగా బద్యానాయక్ అనే క్షతగాత్రుడు మరణించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. 30 కిలోమీటర్లకు ఒక 108 ఉన్నా.. నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ప్రధాన కేంద్రాల్లో 108 అంబులెన్స్లున్నాయి. జిల్లాలో 108 అంబులెన్స్లు 32 ఉండగా, అందులో ఫిట్నెస్లేనివి 25. సకాలంలో మరమ్మతు చేయించక కండీషన్ తప్పుతున్నాయి. గతంలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఒక్క ట్యాబ్లెట్ కూడా పనిచేయడం లేదు. ఆక్సీజన్ లీకేజీలు, వెంటిలేటర్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. చివరకు అంబులెన్స్ డీజిల్ ట్యాంకులకు మూతలు లేకపోవడంతో, మక్కజొన్న, క్లాత్లు చుట్టిపెట్టి నెట్టుకొస్తున్నారు. అర్జంట్ అవసరాల్లో 108కు ఫోన్కాల్స్ వస్తే... అదే సమయంలో చాలా వరకు అంబులెన్స్లు ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి ఐఎఫ్టీ కేసులను ట్రాన్స్పోర్టు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సకాలంలో సేవలందక క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాజీవ్ రహదారి వెంట 108 సర్వీసులు ఉన్నా... ఆపద సమయంలో ఆదుకునేందుకు రావనే భావన ప్రజల్లో ఉంది. 108, హైవే అంబులెన్స్ అందుబాటులో లేక.. సమయానికి ఆసుపత్రులకు చేరక 2015 జనవరి నుంచి ఇప్పటివరకు 18 మంది మరణించినట్లు బాధిత కుటుంబాల సభ్యులు వాపోతున్నారు. 108 సర్వీసులను పెంచడం, ఉన్న అంబులెన్సులను సక్రమంగా వినియోగించడం, అత్యవసర సేవలకు ప్రాధాన్యతనివ్వడం, సరిపడా వైద్యులను నియమించడం, ఏరియా ఆసుపత్రులను మెరుగుపరిస్తే తప్ప క్షతగాత్రులు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. ప్రమాణాలకు విరుద్ధంగా రహదారుల నిర్మాణం జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులున్నా, సరైన ప్రమాణాలతో నిర్మించలేదనే ఆరోపణలున్నాయి. సాధారణంగా నాలుగు లేన్ల, జాతీయ రహదారుల నిర్మాణంలో మూ లమలుపులు (కర్వ్స్) తొలగి స్తారు. కానీ, జిల్లాలో నిర్మించిన రహదారులను ఉన్నది ఉన్నట్లుగా కేవలం విస్తరించారే తప్ప మూలమలుపులు సరిచేసే ప్రయత్నం చేయలేదు. దీంతో మూలమలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మేడిపల్లి వద్ద వాహనాలు గమనించుకోకపోవడంతో తూఫాన్ వాహనం, లారీ ఢీకొట్టిన సంఘటనలో భూపాల్పల్లికి చెందిన తొమ్మిది మంది అసువులు బాశారు. ధర్మపురి మండలం ఖమ్మర్ఖాన్పేట క్రాస్రోడ్ వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ గతంలో ఆటో, లారీ ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు చనిపోయారు. మూలమలుపు వద్ద రోడ్డు కనిపించకపోవడంతో లారీ చెట్టును ఢీకొని డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. కొలిమికుంట మూలమలుపు వద్దా అదే పరిస్థితి. ఇటీవల నవ దంపతులు దుర్మరణం చెందింది అక్కడే. వెదిర వద్ద రెండు బ్రిడ్జీలు ఉండడంతో... ఎటువెళ్లాలో తికమకకు గురై, నేరుగా బ్రిడ్జిని ఢీ కొడుతున్న సంఘటనలు అక్కడ సర్వసాధారణం. 2015లో ప్రమాదాలు 1573 మృతులు 610 క్షతగాత్రులు 1802 2016 (ఇప్పటివరకు) 220 మృతులు 80 జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారుల వివరాలు.. ♦ సికింద్రాబాద్-కరీంనగర్- రామగుండం (ఎస్హెచ్ 1 - రాజీవ్ రహదారి) : జిల్లాలో శనిగరం నుంచి రామగుండం వరకు 115 కిలోమీటర్లు ♦ వరంగల్-కరీంనగర్-రాయపట్నం (ఎస్హెచ్) : ఎల్కతుర్తి మండలం బాహుపేట నుంచి రాయపట్నం వరకు 120 కిలోమీటర్ల మేర ఉంది. ♦ వరంగల్-కరీంనగర్-జగిత్యాల (ఎన్హెచ్) : ఎల్కతుర్తి మండలం బాహుపేట నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకు 120 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. ♦ మెట్పల్లి-జగిత్యాల-రాయపట్నం (ఎస్హెచ్): జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గండిహన్మాన్ నుంచి జగిత్యాల, ధర్మపురి మీదుగా రాయపట్నం వరకు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. డేంజర్ జోన్స్ ⇒ మెట్పల్లి శివారులోని ఆరెపేట, మేడిపల్లి ⇒ చొప్పదండి మండలం ఆర్నకొండ శివారు మూలమలుపు, ఖమ్మర్ఖాన్పేట్ ఎక్స్ రోడ్, కొలిమికుంట శివారులోని మూలమలుపు. ⇒ దేశ్రాజ్పల్లి సమీపంలోని కెనాల్ మలుపు, వెదిర బ్రిడ్జి, కురిక్యాల మలుపు, గంగాధర దాటగానే ఉన్న మలుపు, నమిలికొండ, కొం డగట్టు నుంచి మల్యాల క్రాస్రోడ్ వరకు. ⇒ సుగ్లాంపల్లి, నారాయణపూర్ క్రాస్రోడ్, అందుగులపల్లి, రామగుండం క్రాస్రోడ్. ⇒ మానకొండూరు మండలం సదాశివపల్లి, గట్టుదుద్దెనపల్లి, ఈదులగట్టెపల్లి బ్రిడ్జి, కొత్తగట్టు. 108 అందుబాటులో ఉండే ప్రాంతాలు రాజీవ్ రహదారి : బెజ్జెంకి, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్నగర్, రామగుండం. వరంగల్-రాయపట్నం రహదారి : హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి, ధర్మారం, వెల్గటూరు. కరీంనగర్-జగిత్యాల రహదారి : కరీంనగర్, గంగాధర, మల్యాల, జగిత్యాల. మెట్పల్లి నుంచి రాయపట్నం : మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి. -
కార్మికుల దాడిలో మేనేజర్కు తీవ్రగాయాలు
నార్కట్పల్లి: మేనేజర్ తమపై ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడని భావించిన కార్మికులు అతడిపై దాడికి దిగిన సంఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కట్ పల్లి సమీపంలోని ఓసీటీఎల్ సంస్థలో జరిగిన ఈ ఘటనలో మేనేజర్కు తీవ్ర గాయాలయ్యాయి. టూల్ జెంట్ విభాగంలో పరికరం పాడు చేశారని కొంతమంది కార్మికుల పేర్లను మేనేజర్ యాజమాన్యానికి పంపాడు. దీంతో ఆగ్రహించిన కార్మికులు మధ్యాహ్నం విధులకు వచ్చిన సమయంలో మేనేజర్పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మేనేజర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పాపం పసివాళ్లు..
♦ తాండూరు బస్టాండ్లో దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ♦ పిల్లల ఒంటిపై గాయాలు, పోలీసులకు అప్పగింత ♦ తండ్రే మెహిదీపట్నంలో బస్సు ఎక్కించాడంటున్న వైనం తాండూరు: తల్లిదండ్రులకు పిల్లల పోషణ భారమైందో.. లేక కుటుంబ కలహాలతో కావాలనే వదిలించుకున్నారో తెలియదు గానీ.. ఇద్దరు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. ఓ అక్కాతమ్ముడు ఒంటి మీద గాయాలతో రంగారెడ్డి జిల్లా తాండూరుకు చేరారు. ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడుస్తుండడం స్థానికుల హృదయాలను కదలించింది. తాండూరు బస్స్టేషన్లో ఈ ఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. తాండూరు డిపో మేనేజర్ కృష్ణమూర్తి, అర్బన్ ఎస్ఐ నాగార్జున కథనం ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యాదరిగుట్ట నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని మోహదీపట్నం బస్టాండ్కు చేరుకుంది. అక్కడ ఓ వ్యక్తి ఓ బాలిక, బాలుడిని బస్సులో ఎక్కించి తాండూరులో చిన్నారులను దించాలని కండక్టర్ లక్ష్మికి టికెట్ డబ్బులు ఇచ్చి వెళ్లిపోయాడు. ఎవరూ తోడులేకుండా చిన్నారులను తీసుకెళ్లేందుకు కండక్టర్ అంగీకరించలేదు. తాండూరులో పిల్లల అమ్మమ్మ ఉంటుందని.. గతంలో కూడా ఇలాగే పంపించామని సదరు వ్యక్తి కండక్టర్కు నచ్చజెప్పాడు. రాత్రి 9 గంటలకు బస్సు తాండూరు బస్టాండ్కు చేరుకుంది. చిన్నారులను కండక్టర్ కిందికి దించింది. అరగంటైనా చిన్నారుల గురించి ఎవరూ రాలేదు. వారిని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా ఏమీ చెప్పలేని పరిస్థితి. వారి అమ్మమ్మ గురించి ప్రశ్నించగా సమాధానం లేదు. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వారి ఒంటిపై గాయాలు న్నాయి. డిపో మేనేజర్ కృష్ణమూర్తి తాండూరు అర్బన్ పోలీసులతోపాటు 1098 చైల్డ్లైన్ నంబర్కు సమాచారం ఇచ్చారు. చైల్డ్లైన్ ప్రతినిధులు పిల్లలను తీసుకొని ఠాణాకు తీసుకెళ్లారు. పోలీసులు వివరాలు అడుగ్గా తన పేరు అనూష(5), తమ్ముడి పేరు అయ్యప్ప(3) అని బాలిక తెలిపింది. తమ తండ్రే చేతులు, కాళ్లపై కాల్చినట్టు వివరించింది. తల్లిదండ్రులు టింకూ, మైసమ్మ అని పిల్లలు వివరించారు. తమ తండ్రే బస్సు ఎక్కించి వెళ్లిపోయాడని చెప్పారు. ఆ సమయంలో తమ తల్లి కూడా ఉందన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగానే పిల్లలను వదిలించుకున్నారా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అనంతరం చైల్డ్లైన్ ప్రతినిధులు పిల్లలను తమ కేంద్రానికి తీసుకువెళ్లారు. -
దొంగను పట్టుకుందామని..
భోపాల్: దొంగను ఎలాగైనా పట్టుకోవాలనే ఆవేశంతో ఓ తల్లీ కూతుళ్లు కదులుతున్న రైలు నుంచి దూకేసిన వైనం కలకలం రేపింది. భోపాల్, భైరాంఘర్ రైల్వే స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చత్తీస్గఢ్ కుచెందిన అశ్వా తివారి, అంజన బిలాస్ పూర్ నుంచి ఇండోర్ వెళ్లేందుకు నర్మద ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. అదనుకోసం కాపు కాసిన దొంగ సమయం చూసి తల్లి ఆశా పర్సు లాక్కుపోయాడు. దీంతో తల్లీ కూతుళ్లిద్దరూ వాడిని దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆ దొంగ రైల్లోంచి దూకేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కూడా రైల్లోంచి కిందకు దూకేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇంత చేసినా పర్సు దొంగ మాత్రం తప్పించుకు పారిపోయాడు. కాగా బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితునికోసం గాలిస్తున్నారు. -
కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు
చింతపల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు చింతపల్లి సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తవ్రగాయాలు కాగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి
వేములవాడ: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామ శివారులో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముంటున్న ఎల్కపల్లి మల్లేష్(46) నాలుగు రోజుల క్రితమే సౌదీ నుంచి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఉదయం బైక్పై బంధువుల ఇంటికి వెళ్తుండగా.. గ్రామ శివారులోకి వెళ్లగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
వినుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం
వినుకొండ పట్టణంలో ఓ పిచ్చికుక్క ఆదివారం ఉదయం స్వైరవిహారం చేసింది. మెయిన్ బజార్లో, మసీదు మాన్యం దగ్గర మొత్తం 15 మందిని కండ లూడేలా కరిచింది. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్క పట్టుకునేందుకు మున్సిపాలిటీవారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
అదుపు తప్పిన బొలెరో..
శ్రీకాకుళం: అతివేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ బొలెరో వాహనం స్థానికుల్ని భయాందోళనకు గురిచేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి వైజాగ్ వైపు వెళుతున్న ఓ బొలెరో వాహనం లావేరు మండలం బుదుమూరు వద్ద అదుపుతప్పింది. దీంతో బొలెరో ఓ మహిళతో పాటు, పశువులను ఢీకొట్టింది. వాహనం మీదకు వస్తుండడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఆ మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఓ ఆవు మృత్యువాత పడింది. మరో మూడు ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బొలెరోలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్రగాయాలు
కరీంనగర్: వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన రేణిగుంట టోల్ ప్రాజా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తేనెటీగల దాడిలో 20 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం నర్వ గ్రామంలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా భక్తులపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 10 మంది చిన్నారులతోపాటు 20 మందికి గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా వాగు దగ్గరకు తీసుకెళ్లగా... సమీపంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా భక్తులపై దాడి చేసి కుట్టాయి. గాయపడిన వారికి ప్రైవేటు డాక్టర్ను పిలిపించి గ్రామంలోనే వైద్య సేవలు అందించారు. -
టిప్పర్ బోల్తా .. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం యమ్నంపేట ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఘట్కేసర్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళుతున్న టిప్పర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనక ట్రక్ పైకి లేచింది. అది బ్రిడ్జిని తాకడంతో బోల్తాపడింది. టిప్పర్ డ్రైవర్తోపాటు అందులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
వేగంగా దూసుకువచ్చిన కారు ఎదురుగా వచ్చిన బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ మండలం డీ పోచంపల్లి సాయిపూజ కాలనీకి బానోతు తుల్జా, సికిందర్లు కూలి పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం వీరు బైక్పై సాయి పూజ కాలనీకి వెళ్తుండగా దుండిగల్ పోలీస్స్టేషన్ ఎదురుగా మేడ్చల్ నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తుల్జా, సికిందర్లకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా కారు నడుపుతున్న వ్యక్తి పరారు కాగా... కారులో బీరు సీసాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో పందికొక్కులు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల ఘటన మరవక ముందే.. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళను పందికొక్కులు కరిచి గాయపరిచాయి. వివరాల్లోకి వెళితే.. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే లక్ష్మికి సహాయకురాలుగా వచ్చిన తల్లి ఎర్రమ్మ (55) ను ఆదివారం రాత్రి పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడిన ఎర్రమ్మ నిద్ర నుంచి మేల్కొని చూస్తే.. వార్డులో పందికొక్కులు కనిపించాయి. గాయపడిన ఎర్రమ్మకు నర్సులు చికిత్స చేశారు. ఆస్పత్రిలో పరిశుభ్రత లోపించడం వల్ల పందికొక్కులు, ఎలుకలు ఎక్కువయ్యాయని.. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తే.. ప్రాణాలే పోయే పరిస్థితి ఎదురైతోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురికి గాయాలు
అదుపుతప్పిన ఓ లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో శనివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి అద్దంకి వైపు వెళుతున్న లారీ మార్కెట్ యార్డ్ ప్రాంతంలో మూలమలుపు వద్ద అదుపుతప్పడంతో పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి బయట పడుకున్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇల్లు ధ్వంసం అయింది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. -
బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా యలమంచిలిలోని పెద్దపల్లి హైవే జంక్షన్ వద్ద బుధవారం జరిగింది. అమలాపురం నుంచి టెక్కలి వెళ్తున్న బస్సు హైవే జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో రెండు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాల య్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం - ఐదుగురికి గాయలు
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తొరగల్ గ్రామంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి కనిపించినవారినల్లా కరిచింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో విజయలక్ష్మి(1), శివాని (5), యాదయ్య, పార్వతమ్మ, లింగమ్మ ఉన్నారు. చికిత్స కోసం వీరు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా రేబిస్ ఇంజెక్షన్లు లేవంటూ వైద్యులు హైదరాబాద్లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి పంపించారు. -
కుక్క కాటుతో బాలుడికి తీవ్ర గాయాలు
ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిని పిచ్చి కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఇచ్చాపురం పట్టణం ఉప్పాడ వీధికి చెందిన లక్ష్మీనారాయణ అనే రిక్షా కార్మికుని కుమారుడు ఈశ్వరరావు(6) సోమవారం ఉదయం తమ ఇంటి వద్ద ఇసుకలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క అతని వీపుపైన, దవడపైన కండ ఊడేలా కరిచింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పిచ్చి కుక్కల స్వైర విహారం
నిజామాబాద్ పట్టణంలో పిచ్చిక్కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఉదయం ఒక్క సారిగా పిచ్చి కుక్కలు జనాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో ఐదుగురు గాపయడ్డారు. నిజామాబాద్ పట్టణం గౌతమ్ నగర్ లోని ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘనట జరిగింది. తీవ్రగాయాలైన రోషన్, పాతిమా, గంగాధర్, బస్వన్, లక్ష్మయ్యలను స్థానికులు కాపాడి.. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాలనీలో 60కి పైగా కుక్కలు సంచరిస్తున్నాయని.. మూన్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో కుక్కలు ఉండటంతో.. కాలనీలో జనం భయందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నుంచి తమను కపాడాలని కోరుతున్నారు. -
ట్రాక్టర్ ఢీకొని ఏడుగురికి గాయాలు
అనంతపురం జిల్లా గోరంట్ల సమీపంలో బుధవారం ఉదయం ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. గోరంట్ల సమీపంలోని పులేరు రోడ్డులో ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తి ఎదురుగా వస్తున్న ఆటోను, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు, ద్విచక్రవాహనంపై వస్తున్న ఒక వ్యక్తి గాయపడ్డారు. వీరిలో కర్ణాటకకు చెందిన పెద్దరంగప్ప(60), జయప్ప (55), లక్ష్మమ్మ(45)ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను గోరంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అరగంట వేచి ఉన్నా.. వైద్య సిబ్బంది ఎవరూ రాకపోవడంతో క్షతగాత్రుల బంధువులు ఆందోళనకు దిగారు. గోరంట్ల పోలీసులు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తిని అరెస్ట్చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం ఆంకోల్ క్యాంపు వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టిన ఘనటలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని భైరాపూర్ గ్రామానికి చెందిన శైలు (25), సందాని (26) బైక్పై వెళుతుండగా... బోధన్ వైపు నుంచి బాన్స్వాడ వైపు వస్తున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో శైలు, నందానికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని బాన్స్వాడ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం దబ్బేపల్లి వద్ద జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో... క్షతగాత్రులు చాలా సేపు ఘటనా స్థలంలోనే ఉండి పోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
దిల్సుఖ్ నగర్లో బస్సు బీభత్సం
హైదరాబాద్: హైదరాబాద్లోని దిల్సుక్ నగర్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి సమయంలో అదుపుతప్పి రెండు బైక్లను ఢీకొట్టడంతొ ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. -
ఐసీయూలో 'నెక్ట్స్ సీఎం'
బెంగళూరు : 'నానే నెక్ట్స్ సీఎం' (తదుపరి ముఖ్యమంత్రి నేనే) అనే కన్నడ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి రాగిణి ద్వివేది తలకు తీవ్ర గాయమై ఐసీయూలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మైసూరు వద్ద ఆమెపై ఓ ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ నుంచి తప్పించుకునే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో అది బలంగా రాగిణి తలకు తాకింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆమెను స్థానికంగా ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రాగిణి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా ప్రీమియర్ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతున్న నానే నెక్ట్స్ సీఎం చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. -
దంపతులపై దాడి: నగలు, నగదు చోరీ
గుంటూరు: తాడేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో నివసిస్తున్న రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చెన్నకేశ్వర్ ఇంట్లో బుధవారం వేకువజామున దొంగలుపడి ఇంట్లోనివారిని చితకబాది చోరీ చేశారు. పెరటివైపు నుంచి ఇంట్లోకి వచ్చిన నలుగురు దొంగలు చెన్నకేశ్వర్ దంపతులపై దాడిచేసి కొట్టి ఇంట్లో ఉన్న 20 సవర్ల బంగారు నగలు, 50 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. వృద్ధులు కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వెళ్లి విచారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మూగ యువకుడికి కరెంట్ షాక్లు
ఒళ్లంతా గాయాలు.. దుండగుల దుశ్చర్య మెదక్ రూరల్: పుట్టకతోనే మాటలు రాని ఓ యువకుడిపై దుండగులు కరెంట్ షాక్లతో చిత్రహింసలకు గురిచేశారు. వివరాలు.. మెదక్ మండలంలో రాయినిపల్లి పంచాయతీ పరిధిలోని మల్కాపూర్ గిరిజన తండాకు చెందిన మేఘావత్ సౌమ్య, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు మేఘావత్ బాబు పుట్టుకతో మూగవాడు. ఈనెల 12న బాబు తన తండ్రి సౌమ్యతో కలసి రాత్రి బోరుబావి వద్దకు కాపలాగా వెళ్లాడు. బోరు నడిపించి అర్ధరాత్రి వేళ బాబు తిరిగి ఇంటికి వెళ్లాడని తండ్రి సౌమ్య పేర్కొన్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటి సమీపం నుంచి బాబును మోటార్సైకిల్పై, ఓ పొలం వద్దకు తీసుకెళ్లి కరెంట్ షాక్లు పెట్టినట్లు, దీంతో బాబు స్పృహ కోల్పోయి చనిపోయినట్లు భావించి అతణ్ని మల్కాపూర్ తండా సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు వారు చెప్పారు. మర్నాడు తెల్లవారుజామున బాబు రక్తం బట్టలతో ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు వారు తెలిపారు. తమకు అవగాహన లేక ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, అయితే, న్యాయం చేస్తారని గ్రామ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడంలేద న్నారు.