విషాదం: కన్నబిడ్డలు పట్టించుకోవడం లేదని... | man commits suicide in west godavari district | Sakshi
Sakshi News home page

విషాదం: కన్నబిడ్డలు పట్టించుకోవడం లేదని..

Published Wed, Jan 24 2018 11:44 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

man commits suicide in west godavari district - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది.

సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కన్న బిడ్డలు చూసుకోవడంలేదని మనస్థాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం శివారు గునుపూడిలో తటవర్తి సత్యనారాయణ(70) నివాసం ఉంటున్నాడు. అతని భార్య పదేళ్ల క్రితం అతని భార్య మృతిచెందడంతో అతను ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

కొడుకు, ఓ కుమార్తె హైదరాబాద్‌లో ఉంటుండగా, మరో కుమార్తె అత్లిలిలో ఉంటోంది. అయితే ముగ్గురు పిల్లలున్నా తన బాగోగులు పట్టించుకోవడం లేదని సత్యనారాయణ కొంతకాలంగా భాదపడుతున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఇంటిలోనే కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్ధానికలు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement